ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఏనుమాముల నేటిధాత్రి:

 

నగరంలోని 14 వ డివిజన్ ఎనుమాముల ముసలమ్మ కుంట పేస్ వన్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం రోజున సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దేశానికి విశ్వసనీయత కలిగిన వారని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే నిజమైన ప్రజా నాయకులు ఆయన నాయకత్వంలో దేశంలో సామాజిక న్యాయం సమనత్వం ప్రజాస్వామ్యం బలపడుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్. ఎస్టీ సెల్ హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పులి చేరి రాధాకృష్ణ.డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పస్తం శంకర్ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని సుందరయ్య నగర్ గ్రామ అధ్యక్షుడు త్రికోవేల శ్రీను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఏకామ్రాచారి దస్రు నాయక్ పార్టీ సీనియర్ నాయకులు ఖల్నాయక్ సౌరం ప్రభాకర్ సౌరం మాణిక్యం సౌరం జయకర్ సంగారబోఎన రాజు సంగార బోయిన రాజేష్ కన్నా ఇందిరమ్మ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి బండ్ల సురేందర్ తోట శీను పల్లకొండ చందు ముక్తార్ మహేష్. మహిళలు మొద్ధసాని మాధవి. గుగులోతు మంగ కార్యకర్తలు  పాల్గున్నారు

వికసించకుండానే వాడిపోతున్న రాజీవ్ యువ వికాస్ పథకం.

వికసించకుండానే వాడిపోతున్న రాజీవ్ యువ వికాస్ పథకం

◆ లబ్ధిదారులకు మొండి చేయి చూపిస్తున్న కాంగ్రెస్ సర్కార్

◆ జహీరాబాద్ బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,,ఎమ్మెల్యే కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది.. నాయకులు మాట్లాడుతూ
‘రాజీవ్‌ యువ వికాసం పథకం, కాంగ్రెస్‌ ఇచ్చిన అన్ని హామీల వలె విజయవంతంగా చెత్త బుట్టలోకి చేరిపోయిందని ఈ పథకం అమలు విధానంపై పునరాలోచన చేస్తాం’ అని రాష్ట్ర క్యాబినెట్‌ తెలంగాణ యువతపై ఓ పిడుగును పడేసిందన్నారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 తారీకున రెండు లక్షల మంది అబ్ధిదారులను ప్రకటించి, పథకం మంజూరు పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వట్టి మాటలు అయ్యాయి అన్నారు.. రేవంత్ చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మిన తెలంగాణ యువత సుమారు 16 లక్షల మంది ఈ పథకానికి నమోదు చేసుకున్నారని, రకంలో నమోదు చేసుకోవడానికి ప్రతి ఒక్క యువకుడికి సుమారు 200 నుంచి 300 రూపాయల వరకు ఖర్చు అయిందని అన్నారు .. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఆదాయం కలిగిందని అన్నారు.. నమ్మిన యువకులకు కాంగ్రెస్‌ తన హామీలను పక్కనబెట్టడం ఇదే తొలిసారి కాదు.,బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు చేయించిన కాంగ్రెస్‌, తాను అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. గత కేసీఆర్‌ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెలువరించిన ఉద్యోగాలకు రేవంత్‌ ప్రభుత్వం జాయినింగ్‌ లెటర్లు ఇచ్చి తొలి ఏడాదిలోనే 58 వేల ఉద్యోగాలిచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని కాంగ్రెస్‌ చేస్తున్న ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రజలు, నిరుద్యోగులు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎంతో అర్భాటంతో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేదు. ఉద్యోగాల కల్పన అంటుంచితే కనీసం స్వయం ఉపాధికి కార్పొరేషన్‌ రుణాలు తీసుకుందామన్నా యువతను మోసగాళ్లుగా చిత్రించి కాంగ్రెస్‌ ఆ పథకాన్ని కూడా ఆపేయడం ఆక్షేపణీయం అన్నారు.. ఎంతో తెలివితో ఆలోచించే తెలంగాణ యువత ఇప్పటికైనా కాంగ్రెస్‌ కపట నాటకాలను గుర్తించాలని. ‘ఒడ్డెక్కే దాన్క ఓడ మల్లన్న ఒడ్డు దాటినాక బోడ మల్లన్న’ అనే రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,యువ నాయకులు దీపక్ ,బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్ ,బి ఆర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు ఓంకార్, ఫయాజ్,రోహిత్, శ్రీనాథ్ ,ప్రవీణ్ మెస్సీ,
తదితరులు .పాలుగోన్నారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

 

పరకాల నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలంలోని వివిధ గ్రామలలోని ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ పరకాల మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,ఏఎంసీ చైర్మెన్ చందుపట్ల రాజిరెడ్డి,బొమ్మకంటి చంద్రమౌళి,బొచ్చు జెమిని,అలీ,దార్నా వేణు,ఒంటెరు శ్రవణ్,మచ్చ సుమన్,యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీరామ్,పరకాల మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిలివేరు రాఘవ,వెంకటేశ్,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రాయికల్ నేటి ధాత్రి:

 

జూన్ 19.రాహుల్‌గాంధీ జన్మదిన సందర్భంగా  రాయికల్ పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్‌ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శనం చేయగలిన యువ తేజం రాహుల్ గాంధీ అని ఆయన దెబ్బకు బిజెపి ఇతర పార్టీలతో జట్టు కట్ట వలసి దుస్థితి వచ్చిందని అన్నారు.దేశ స్వతంత్ర అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వలు రక్షణ రంగంలో భారత్ ను ఓక అజేయశక్తి గా నిలిపాయన్నారు.యువతకు ఉద్యోగాలు కల్పించల్సిన కేంద్ర ప్రభుత్వం యువతను నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు.నిరుద్యోగ సమస్యను గుర్తిచడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైందన్నారు.
దేశంలో సుస్థిరమైన ప్రజా పాలన అందించగల ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని మత చాందస వాదులు మతాల పేరు చెప్పి ఎంత గెలిచే ప్రయత్నం చేసిన బడుగు బలహీనవర్గాల సంక్షేమం పట్ల ఆలోచన గలిగిన రాహుల్ గాంధీ దేశంలోనే అత్యున్నతమైన నాయకుడిగా పేరుపొందిరని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ,మండల అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షాకీర్,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్, యూత్ కాంగ్రెస్ మండల,పట్టణ అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి,బత్తిని నాగరాజు,నాయకులు ఎద్దండి భూమారెడ్డి,కొయ్యేడి మహిపాల్ రెడ్డి,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,వాసం దిలీప్,కొమ్ముల ఆదిరెడ్డి,కడకుంట్ల నరేష్,అశోక్,మోబిన్,మండ రమేష్, రాకేష్ నాయక్,తలారి రాజేష్,బాపురపు రాజీవ్,జక్కుల సాగర్,రాజేష్,నరసింహారెడ్డి,ఆనంద్,పాసం భూమయ్య,పల్లికొండ రమేష్,కాటి పెల్లి రాజశేఖర్, రాజేందర్,రవీందర్,తదితరులు పాల్గొన్నారు.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ ఎన్నిక.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బీసీ హక్కుల సాధన సమితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండో మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు టి వెంకట్ రాములు తెలిపారు అధ్యక్షులుగా భీమనాథుని సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా క్యాతరాజు సతీష్ అస్లాం
జిల్లా ఉపాధ్యక్షులుగా మేరుగు రమేష్ గోలి లావణ్య.
జిల్లా కోశాధికారిగా కట్టెగొల్ల భారతి…

 

Election

 

జిల్లా కార్యవర్గ సభ్యులుగా
రమేష్ చారి,మహేష్,పుప్పాల వనిత, సుధాకర్, శేఖర్, అజయ్, భగత్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు

కోహీర్ మండల ఫొటో వీడియో గ్రఫీ నూతన కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నిక.

కోహీర్ మండల ఫొటో వీడియో గ్రఫీ నూతన కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నిక…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో ని జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం ఫొటో వీడియో గ్రఫీ నూతన కమిటీ ఏర్పాటు చేసారు.. మండలం లోని ఆయా గ్రామ ల ఫొటో వీడియో గ్రాఫర్లు గురువారం నాడు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్ను కున్న కమిటీ ని అందరు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు కోహీర్ మండల ఫొటో వీడియో సంక్షేమ కార్యవర్గ వ్యవస్థాపకులుగ శ్యామ్ రావు, అధ్యక్షులు రచన్న,ప్రధాన కార్యదర్శి రాజు,కోశాధికారి పరమేష్,సoయక్త సహాయ కార్యదర్శులు సంజువు, ప్రవీణ్ కుమార్, సంయుక్త కోశాధికారి కృష్ణ,ఉపాధ్యక్షలు ప్రకాష్, రాజు జనార్దన్ ఆర్గానేజర్ సెక్రటరీ శేఖర్, నవీన్ కుమార్, లక్ష్మాన్, నాగరాజు, మీడియా ఇంచార్జి కె.అశోక్, కార్యవర్గ సభ్యులు రవి, జకీర్, నందు, కాశినాథ్, వినోద్,ఎన్నుకొన్నారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం
తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి పటేల్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

జయశం కర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ టీం సభ్యుల ఆహ్వానం మీద పర్యటించడం జరిగింది
గ్రామంలో పలువురు ఆరోగ్య సమస్యలపై రవి పటేల్ వారి కుటుంబాలను కలిసి మాట్లాడడం జరిగింది గ్రామంలో కొడారీ స్వరూప కొడుకు అనిరుద్ యూరినరీ ట్రాక్ సర్జరీ అవసరం ఉంది అని చెప్పారు
హాజర హాస్పిటల్ dr ఉషిక కిరణ్ యూరలజిస్ట్ తో ఫోన్లో మాట్లాడి సర్జరీకి సహకరించని విజ్ఞప్తి చేశారు
పైడిమల్ల ఐలయ్య గీత కార్మికుడు తడిచేట్టు మీదనుండి పడితే కాలు విరిగింది వారిని చూసి మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తేలుకోవడం జరిగింది టీం సభ్యుడు నాగరాజు కూతురు లాస్య వికలాంగురాలు కావున పెన్షన్ రావడంలేదని చెప్పారు కలెక్టర్ గారితో కలిసి మాట్లాడి తప్పకుండా పెన్షన్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది
మెదరమెట్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి అక్కడి పరిసరాలు పరిశీలించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ స్కూలుకు విద్యార్థులు వచ్చే విధంగా ఉపాధ్యాయులకు కృషి చేయాలని అలాగే గ్రామ ప్రజలు గవర్నమెంట్ స్కూలుకు పిల్లలను పంపించాలని పవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఇందులో పాల్గొన్నవారు గునీకంటి విష్ణు కొడారి రాజు గజ్జి కుమారస్వామి కొడారి రమేష్ కొణికటి దీక్షిత్ పెంతల రాజు p రాజేందర్ ఎడకుల సురేష్ పైడిమల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చిట్యాల నేటిధాత్రి :

 

జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు రాయితీపై మంజూరుైన డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన రైతులందరూ డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సమావేశంలో, ప్రతి అర్హ రైతుకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ పథకాలను అందించాలని ఆదేశించారని తెలిపారు.అలాగే, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పద్ధతుల వినియోగం వలన తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధ్యపడతాయని, ఇది సమర్థవంతమైన నీటి వినియోగానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాజీ సర్పంచ్ ముకిరాల మధు వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, సిగ్నెట్ కంపెనీ ఏరియా మేనేజర్ రాజు, జైన్ కంపెనీ ప్రతినిధి శ్యామ్ సుందర్ గారు, తదితరులు మరియు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

గంగాధర నేటిధాత్రి:

 

 

 

 

ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ జన్మ దిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగాధర మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని మధురానగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ పేరు రాసి ఉన్న కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీని భావి భారత ప్రధానమంత్రిని కొనియాడారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, నాయకులు జాగీరపు శ్రీనివాస్ రెడ్డి,దుబ్బాసి బుచ్చన్న,సత్తు కనుకయ్య, మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్,పడితపల్లి కిషన్,కొలిపాక స్వామి,వేముల అంజి,వేముల భాస్కర్,గుజ్జుల బాపురెడ్డి, కర్ర బాపురెడ్డి,కోలపురం లక్ష్మణ్,రుద్ర మల్లేశం,గరిగంటి కరుణాకర్,బెజ్జంకి కళ్యాణ్,మంత్రి మహేందర్,పానుగంటి సత్యం, గంగాధర సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

నిజాంపేట నేటి ధాత్రి:

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ సమక్షంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు పట్టణ అధ్యక్షుడు కొమ్మాట బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని ఆయన కొనియాడారు రాహుల్ గాంధీ త్వరలో దేశ ప్రధానిగా అవుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో గరుగుల శ్రీనివాస్, ప్రసాద్ ,శ్రీనివాస్, కుమ్మట నాగరాజు, గరుగుల భాను, నరేష్ ,రాజు, బాబు తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ పార్టీ అక్రమ అరెస్టులలో కోర్టుకు హాజరైన

బిఆర్ఎస్ పార్టీ అక్రమ అరెస్టులలో కోర్టుకు హాజరైన ఎమ్మార్పీఎస్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా కో ఇన్ఛార్జ్
నోముల శ్రీనివాస్ మాదిగ కోర్టుకు హాజరవడం జరిగింది గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎమ్మార్పీఎస్ నాయకులను ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు
చిరుపంగా చంటి మాదిగ ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి మండల అధ్యక్షులు
వంతడుపుల చందర్ మాదిగ
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
పురుషోత్తం నారాయణ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
మేకల రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
బట్టు విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
చిలపాక హరీష్ మాదిగ ఎమ్మార్పీ సీనియర్ నాయకులు
ఒంటెరి బిక్షపతి మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ

చర్ల నేటిదాత్రి:

రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు వేడుకలు చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నల్లపూ దుర్గాప్రసాద్ ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్వీట్లు పంచి కార్యకర్తలు నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు భద్రాచలం అసెంబ్లీ యూత్ ఉపాధ్యక్షులు బోరా పెద్దిరెడ్డి సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి వందే నరసింహమూర్తి గుండపూడి భాస్కరరావు విజయ నాయుడు ఆలం ఈశ్వర్ పటేల్ వెంకటేశ్వర్లు బోళ్ల వినోద్ మునిగల వెంకన్న సాగర్ పవన్ సిద్ది సురేష్ కర్రీ సంతోషం మేడి రమేష్ తడికల ఏసుబాబు జోగారావు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నరు

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

-ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సూచన మేరకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్ ల ఆదేశాల మేరకు వరంగల్ ఎంజిఎంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నాయకులతో రక్తదానాన్ని చేయించిన నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ తన కర్తవ్యంగా రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రవణ్ కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొదిల నరేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, నెక్కొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సింగం ప్రశాంత్, చెన్నారావుపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండి హరీష్, నర్సంపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోంత రంజిత్, యువజన కాంగ్రెస్ నాయకులు ఇజ్జగిరి దిలీప్, చెన్నబోయిన సాయి శ్రావణ్ కుమార్, కోలుగురి కర్ణాకర్, జెట్టి ప్రశాంత్, జెట్టి రాజేంద్రప్రసాద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

రైతుల ఖాతాల్లో రూ. 99.5 కోట్ల రైతు భరోసా నిధులు జమ.

రైతుల ఖాతాల్లో రూ. 99.5 కోట్ల రైతు భరోసా నిధులు జమ

1,10,322 మంది జిల్లా రైతులకు లబ్ది

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలోని అన్నదాతలకు రైతు భరోసా కింద మూడు రోజుల్లో రూ. 99.5 కోట్లకు పైగా డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖరీఫ్ వర్ష కాలం సీజన్ సాగు కోసం రైతులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ రోజు వరకు జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 1,10,322 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.99,52,19,906= 00 డబ్బులు జమ అయ్యాయని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు.

జమ్మికుంట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు
జమ్మికుంట నేటిధాత్రి:

 

యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా, జమ్మికుంట యూత్ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు

అనంతరం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ; దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు, 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగవ తరం వారసులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 యేళ్లలో దాదాపు 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిందని అన్నారు. రాహుల్ గాంధీ 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచి, ఆ తదుపరి ఎఐసిసి అధ్యక్షులుగా యువ నాయకత్వాన్ని వహించారన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, అదే విధంగా న్యాయ యాత్ర ద్వారా పేద అట్టడుగు మరియు వెనుకబడిన ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందడానికి జై భీమ్, జై బాపు, జై సంవిదాన్ అనే కార్యక్రమంతో ప్రజలకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తేలవాల్సిన అవసరం ఉందని, దాని కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, పింగిలి చైతన్య రమేష్, అసెంబ్లీ కార్యదర్శి పాతకాల రమేష్, రోమాల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేబుషి అజయ్, పైడిపల్లి వెంకటేష్, నాయకులు జావిద్, సూర్య రెడ్డి, ఇల్లందుల శివ, బండి పవన్, అష్రఫ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

రామకృష్ణాపూర్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తా వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతను కల్పిస్తూ కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకుని రానున్న రోజుల్లో తిరుగులేని శక్తివంతమైన పార్టీగా కీర్తించడంలో అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహాలు ప్రణాళికలు అమలు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కళ సీనియర్ నాయకులు సమ్మయ్య, లాడెన్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కుర్మ సురేందర్, బత్తుల వేణు, నగేష్ రాజేష్ నాగులు ప్రేమ్ సాగర్ మహిళా నాయకురాళ్ళు పుష్ప, సునీత,శారద, దీప తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం.

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం.

భూపాలపల్లి నేటిధాత్రి:

 

భూపాలపల్లి పట్టణంలో నీ సుభాష్ కాలనీకి చెందిన పులిగంటి రమేష్ గత వారం క్రితం గుండెపోటుతో మృతి చెందాడు గురువారం భూపాలపల్లి పట్టణానికి చెందిన పూర్వ పాఠశాల రాహుల్ విద్యానికేతన్ కు చెందిన తోటి మిత్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లట్ట రాజబాబు ,ఉపాధ్యాయులు. లట్ట వెంకటేష్, మేడ వెంకటస్వామి. మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిత్రులు మొదటి కుటుంబ సభ్యులకు రూ. 25 వేల తో పాటు 50 కిలోల బియ్యం ఇతర నిత్యవసర సరుకులు అందించారు.. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మిత్రులు తెలిపారు
ఈ కార్యక్రమంలో మిత్రులు దుండ్రా.కుమార్ యాదవ్, గాదం రాజు, అల్లెపు సతీష్, చెక్క గోపి. నాన్డ్రి కమలాకర్ ,. బి కొండ నరేందర్ , ఏలుగుల సురేష్ , బొల్లం నరేష్, పూల్యాల తిరుపతి, ఎలాకంటి విజయ్, కాలనీ వాసులు కొడపాక శంకర్, రఘుపతి తదితరులుపాల్గొన్నారు

హైకోర్టు ఆర్డర్ ను ధిక్కరించిన ఎన్పీడీసీఎల్?

హైకోర్టు ఆర్డర్ ను ధిక్కరించిన ఎన్పీడీసీఎల్?

దళితుల భూమిలో సబ్ స్టేషన్ అక్రమ నిర్మాణం.

ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో బోర్ వేస్తుండగా ఆపివేసిన దళితులు..

100 కు దయల్ చేసిన దళితులు.. బోర్ వెల్ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలింపు.

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

 

 

 

 

గీసుకొండ మండలంలోని గొర్రెకుంట దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 భూమిలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్తు సబ్ స్టేషన్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టే క్రమంలో వెంటనే గ్రహించిన (ఎస్సి – సి) మాల దళిత కులస్తులు హైకోర్టును ఆశ్రయించారు.కాగా పిర్యాదులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దళితులకు కాకుండా మరే ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని స్టే ఆర్డర్
జారీచేసింది.ఐనప్పటికీ హైకోర్టు ఆర్థర్ ను ధిక్కరిస్తూ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సదరు కాంట్రాక్టర్ గురువారం పనులను ప్రారంభించేందుకు గాను ముందుగా రెండు బోర్ వెల్ వాహనాలతో బోర్లు వేయడం ప్రారంభించారు. వెంటనే గమనించిన దళిత మాల కులస్తులు పోలీస్ 100 కు సమాచారం ఇచ్చి పనులను ఆపే ప్రయత్నం చేశారు. దళితుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు

Dalit land.

 

బోర్ వెల్ వాహనాలను సీజ్ చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గొర్రెకుంట దళిత మాల కులస్తులు బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్ లు మాట్లాడుతూ గీసుకొండ మండలంలోని గొర్రెకుంట గ్రామంలో గల సర్వే నెంబర్ 55 భూమిలో గత డెబ్బై ఏండ్ల క్రితం నుండి మా దళితులు వ్యవసాయం సాగుచేసుకునేవారని అన్నారు.కాల క్రమేణా మూడు దశాబ్దాలకు నిరుపేదలమైన మా దళితమాల కులస్తులకు పునరావాసం లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో అదే సర్వే నెంబర్ 55 భూమిలో దళితుల అవాసాల కోసం ఇండ్ల నిర్మాణాలు చేపట్టుకోవడానికి ఆనాటి అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని వారు పేర్కొన్నారు.మాల దళితులకు కేటాయించిన భూమిలో నిర్మాణాలు చెప్పటాలని కొందరు వ్యక్తులు పన్నాగాలు పన్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే భూమిని అక్రమంగా స్వాదీనం చేసుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం నిర్మాణాలు చేపట్టారని అవేదన వ్యక్తం చేశారు.మాల దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలను సంబంధిత విద్యుత్ సంస్థకు,అధికారులకు అందించామని ఐనప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ టీఎస్ 08 ఇ.పి 1974 , టీఎస్ 16 ఇపి 7413 గల బోర్ వెల్ వాహనాలతో అక్రమంగా బోర్లు వేస్తున్నారని ఆరోపించారు.వెంటనే పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 100 కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బోర్ వెల్ పనులను ఆపివేసి వాహనాలను సీజ్ చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారని బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్ తెలిపారు.కాగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎంపీడీసీఎల్ ఎస్ఈ లకు పిర్యాదులు చేయనున్నట్లు అలాగే గీసుకొండ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దళితులకు కేటాయించిన సర్వే నంబర్ 55 గల ప్రభుత్వ భూమిని దళితులకే కేటాయించాలని

Dalit land.

 

ఈ సందర్భంగా బందెల మల్లికార్జున్,బందెల శ్రీధర్,మద్దెల క్రాంతి కుమార్,బందెల రణధీర్,బందెల అరుణ్,బందెల రాజశేఖర్,బందెల వంశీ,బందెల రమేష్,సిరిమిల్ల శరత్ చంద్ర,
కొత్త శివశంకర్ పలువురు దళితులు కోరారు.

ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి.

ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి…

వామపక్ష పార్టీల డిమాండ్

నేటి ధాత్ర:

మహబూబాబాద్ :గత 20 నెలలుగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతర బాంబు,వైమానిక దాడులకు పాల్పడుతూ,మారణహోమాన్ని సృష్టిస్తూ యుద్ధానికి పూనుకున్నదని,ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం ప్రకటించి జనావాసాలపై రాకెట్ దాడులతో విద్వంసం సృష్టిస్తున్నదని వామపక్ష పార్టీల జిల్లా కార్యదర్శులు గౌని ఐలయ్య, విజయసారధి, సాదుల శ్రీనివాస్, పాయం చంద్రన్నలు అన్నారు.10వామపక్ష పార్టీల పిలుపు మేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈధర్నా నుద్దేశించి సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య,సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారధి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్,సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పాయం చంద్రన్నలు ప్రసంగిస్తూ,ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి లస్తీనాలో ఇప్పటికే దాదాపు 50వేల మంది మరణించారని, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, మహిళలు, పిల్లలు మరియు శరణార్థుల ఆశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ వేలాదిమందిని పొట్టన పెట్టుకుంటున్నదని విమర్శించారు.పాలస్తీనాలో పుట్టిన పసిపిల్లలను కూడా చంపుతామని ఇజ్రాయిల్ మంత్రి ప్రకటించటం ఆ దేశం యొక్క అమానవీయ యుద్ధ పిపాసతకు నిదర్శనమని పేర్కొన్నారు. కనీసం ఆహారాన్ని అందించడానికి కూడా ఆటంకాలు కల్పిస్తున్నదని, ఐక్యరాజ్య సమితితో పాటు, ప్రపంచవ్యాపితంగా ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తున్నా, అమెరికా దాని కొన్ని మిత్రదేశాల మద్దతుతో ఇజ్రాయిల్ ఈదాడులు కొనసాగిస్తున్నదని అన్నారు.

ఇటీవల ఇరాన్ పై కూడా యుద్ధాన్ని ప్రకటించి భీభత్సం సృష్టిస్తున్నదని,అంతర్జాతీయ చట్టాలను, మానవహక్కులను కాలరాస్తున్నదని ఈదురహంకార మారణ హెూమ యుద్ధాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాలన్నారు.మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ అనుకూల విధానాలను విడనాడాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని, ఇజ్రాయిల్తో అన్ని రకాల సైనిక మరియు భద్రతా సహకారాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఇజ్రాయిల్ దాష్టీకానికి బలౌతున్న పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడాలని వారు కోరారు.అనంతరం దురాక్రమణవాది,యుద్దోన్మాది ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈకార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా, డివిజన్ నాయకులు అజయ్ సారథి, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట వెంకన్న, ఎండీ ఫాతిమా, లింగ్యా నాయక్,చిరంజీవి, గునిగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, హేమా నాయక్, ముస్తఫా,రషీద్, నందగిరి వెంకటేశ్వర్లు, గుజ్జు దేవేందర్, హలావత్ లింగ్యా, యస్కే బాబు,తుడుం వీరభద్రం, బోనగిరి మధు,బట్టు చైతన్య,కొత్తపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

నేటిధాత్రి, ఏనుమాముల.

 

 

 

 

 

 

నగరంలోని 14వ డివిజన్ ఎనుమాముల ముసలమ్మ కుంట పేస్ వన్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం రోజున సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని, దేశానికి విశ్వసనీయత కలిగి, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే నిజమైన ప్రజా నాయకులు ఆయన నాయకత్వంలో దేశంలో సామాజిక న్యాయం సమనత్వం ప్రజాస్వామ్యం బలపడుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్. ఎస్టీ సెల్ హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పులి చేరి రాధాకృష్ణ.డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు శంకర్ ఎస్టీ సెల్ అధ్యక్షులు పులి చేరి రాధాకృష్ణ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని సుందరయ్య నగర్ గ్రామ అధ్యక్షుడు వడ్లకొండ తిరుపతి. తోట శ్రీను. ఏకామ్రాచారి దస్రు నాయక్ పార్టీ సీనియర్ నాయకులు ఖల్నాయక్ సౌరం ప్రభాకర్ సౌరం మాణిక్యం సౌరం జయకర్ సంగారబోఎన రాజు సంగార బోయిన రాజేష్ కన్నా ఇందిరమ్మ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి బండ్ల సురేందర్ పల్లకొండ చందు ముక్తార్ మహేష్. మహిళలు మొద్ధసాని మాధవి. గుగులోతు మంగ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version