సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్ నోరెత్తకుండా చేశాడు…

 సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్ నోరెత్తకుండా చేశాడు…

 

యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన విలువ ఏంటో మరోమారు చూపించాడు. సంచలన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. వాళ్లు నోరెత్తకుండా చేశాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చెలరేగిపోయాడు. ఇండియా ఏ-ఇండియా మధ్య జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. 76 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 15 బౌండరీలు, 2 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 72 పరుగులు చేశాడు సర్ఫరాజ్. సెంచరీ తర్వాత కూడా అతడు ఔట్ కాలేదు. ఇతర బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ నాక్‌తో విమర్శకులతో పాటు సెలెక్టర్లకు సర్ఫరాజ్ ఇచ్చిపడేశాడని నెటిజన్స్ అంటున్నారు.

 

నోళ్లు మూయించాడు..

ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన టెస్టులో 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్ ఖాన్. ఇప్పుడు టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. దీంతో విమర్శకుల నోళ్లు మూయించాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 10 కిలోల బరువు తగ్గడమే గాక బ్యాట్‌తోనూ విధ్వంసం సృష్టిస్తున్నాడు.. ఇలాంటోడ్ని ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేయకుండా తప్పు చేశారని అంటున్నారు. దీనిపై సెలెక్టర్లు పునరాలోచించుకోవాలని చెబుతున్నారు.

అగార్కర్ ముందే..

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. సర్ఫరాజ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా హాజరయ్యాడు. అగార్కర్ ముందే బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయాడు సర్ఫరాజ్. దీంతో అతడ్ని భారత జట్టులోకి తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌కు మీడియా, అభిమానులను అనుమతించలేదు.

అనుమతులు లేకుండా నడిపిస్తున్న.!

అనుమతులు లేకుండా నడిపిస్తున్న జూనియర్ కళాశాలలను మూసివేయాలి

డి ఐ ఈ ఓ గోపాల్ కి వినతిపత్రం అందజేత

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు
ఎల్తూరి సాయికుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

సాయికుమార్ మాట్లాడుతూ హనుమకొండ నగరంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జూనియర్ కళాశాలను నడిపిస్తున్న చైర్మన్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు అదేవిధంగా విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను ఇటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ,కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కాలేజ్ స్ట్రక్చర్ లేకుండా నడిపించడమే కాకుండా జేఈఈ,మెయిన్స్ పేరిట లక్షల రూపాయలు విద్యార్థుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్న కళాశాలల చైర్మన్లు, పర్మిషన్ ఉన్న బ్రాంచ్ వద్ద అడ్మిషన్ చేర్చుకొని అక్కడ క్లాసులు చెప్పకుండా విచ్చలవిడిగా అద్దె భవనాలు తీసుకొని అక్కడ కళాశాలలను నడిపించడం జరుగుతుంది ప్రమాదవశాత్తు అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే విద్యార్థులకు బాధ్యత ఎవరు అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డి ఐ ఈ ఓ స్పందించి తక్షణమే అనుమతులు లేని కాలేజీలను మూసివేయాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి శివకుమార్, సిద్ధార్థ , విక్రం, సాత్విక్ ,శ్రావణ్, జస్వంత్ ,సాయి ,ముఖేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరించాలి.

రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రెండు లారీలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని,
కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 241 కొనుగోలు కేంద్రాలకు గాను 239 కేంద్రాల ప్రారంభం చేసి 198 కొనుగోలు కేంద్రాల నుంచి 16 వేల 22 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నారు.
మిల్లు అలాట్మెంట్ కాని కోనుగోలు కేంద్రాలకు సమీపంలో గల అపెరల్ పార్క్ లో ఇంటర్మీడియట్ గోదాము నందు ధాన్యం భద్రత కోసం బుక్ చేయాలని అన్నారు. రైస్ మిల్లుల సమస్య కారణంగా ఎక్కడా ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి వీలు లేదని అన్నారు. కోనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.
సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అన్నారు.ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను అందుబాటులో పెట్టాలని, ధాన్యం రవాణా ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దనిపేర్కొన్నారు.ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డిఏఓ అఫ్జలి బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు రజిత, వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా .!

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు

దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

శృంగేరి పీఠం అనుమతులు తీసుకుని జూన్ నుంచి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభిస్తాం

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని పత్రిక సమావేశం నిర్వహించిన దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ

వేములవాడ నేటిధాత్రి

 

భక్తులకు ఇబ్బందులు కల్గకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు.గురువారం వేములవాడ లో పర్యటించిన దేవాదయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా, ఈఓ వినోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం పాత్రికేయులతో దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధి కోసం 38 కోట్ల ప్రకటించారని అన్నారు. ఆగమ శాస్త్రం, వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆలయం పునః నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తిర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్ల , అన్నదాన సూత్రానికి 35 కోట్ల మంజూరు చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరగాలని లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు.

అన్నదానం సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేసామని అన్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి, ఆశీర్వాదం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపడ్తున్నామని అన్నారు. రాబోయే నెలలో రొడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా స్వామివారికి జరిగే పూజలు ఎక్కడ ఆటంకం కలగదని, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు, భక్తులకు స్వామి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

శృంగేరి పీఠం అనుమతులు తీసుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలలో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

రాజన్న భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు…

ఈ సందర్భంగా భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనం కల్పించే స్థలాలను పరిశీలించారు. ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం, అభిషేకం మండపం, కోడె కట్టుట, క్యూ లైన్ తదితరు ఆర్జిత సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ సత్యనారాయణ, ఈఓ వినోద్, ఈఈ రాజేశ్, డీఈ రఘు నందన్, ఆర్అండ్ బీ సీఈ బిల్డింగ్స్ రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బీ సీఈ ఎలక్ట్రికల్ లింగారెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ బీ లక్ష్మణ్, జిల్లా ఈఈ వెంకట రమణయ్య, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ, శరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version