నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న కోటపల్లి పోలీసులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీన పరుచుకున్నట్లు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలు చేరవేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో కోటపల్లి పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారితో కలిసి అంతరాష్ట్ర బ్రిడ్జి రాపనపల్లి వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టగా టాటా టియాగో కారులో తరలిస్తున్న1,45,800 రూపాయల విలువ గల 46.6 కిలోల నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోటపల్లి ఎస్సై రాజేందర్,పోలీస్ సిబ్బంది పిల్లి శ్రీనివాస్,శ్యాంసుందర్, హోంగార్డ్స్ శ్యామ్,తిరుపతి రెడ్డిలను జైపూర్ ఎసిపి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వర్లు,చెన్నూరు సిఐ దేవేందర్రావు,శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్,కోటపల్లి ఎస్సై రాజేందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంపేట మండల పరిధిలోని బచ్చిరాజుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు గాజులపల్లి స్వామి పై దాడి జరిగిన కేసు నమోదు చేసి డిఎస్పి ఇన్విస్టిగేషన్ చేసిన నిందితుని ఇంతవరకు అరెస్టు చేయలేదని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. నిధులను వెంటనే అరెస్టు చేయాలని కమిషన్ చైర్మన్ డి.ఎస్.పి కి కీరవాణి ద్వారా తెలపడం జరిగింది చట్టాన్ని పరిరక్షించుకోవడం మన హక్కుగా ఆయన తెలపడం జరిగింది. నిందితులను అరెస్టు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మాల పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు బొమ్మల మైసయ్య, బాధితులు స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 6 నుండి 19వ తేదీ వరకు కొనసాగిందని చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం ముగింపు సన్మాన కార్యక్రమం లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్ బహుకరించిన శ్రీకాంత్, మినరల్ వాటర్ అందిస్తున్న అంజా గౌడ్ లను ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, అర్జున్, సుకన్య, నరేష్, చంద్రకాంత్, కుమారస్వామి లు ఉన్నారు.
గురువారం రోజున పరకాల ఎక్సయిస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద రూట్ వాచ్ నిర్వహించి నందిగామ రేలకుంట నుండి ఆత్మకూరు మండలంలోనికి ఆటోలో గుడుంబా రవాణా చేస్తున్న భూక్యా సుజాత, భూక్యా జగన్ అనే ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.వారిని అరెస్ట్ చేసి వారివద్దనుండి ఆటో (15)లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.ఈ రూట్ వాచ్ లో పాల్గొన్న వారు ఎస్ఐ సులోచన కానిస్టేబుల్ లు శ్రీనివాస్, విజయ్ కుమార్,దిలీప్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ భవన్/హనుమకొండ పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత,ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం రోజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.యువజన కాంగ్రెస్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దానం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర మీడియా,కమ్యూనికేషన్ చైర్మన్ శ్రీ సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రాహుల్ గాంధీ జన్మదినం ఓ మంచి కార్యక్రమం కావాలని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.దాతలకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర దేశం నుంచి నేటి వరకు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న ఏకైక కుటుంబమని,రాహుల్ గాంధీ అట్టడుగు వర్గాలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేపట్టిన రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రేషన్ కార్డులు,ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి ఎన్నో పథకాలతో నేడు పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శాయంపేట మండలం మైలా రం గ్రామంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం యొక్క అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ నాగపూరి రాజమౌళి గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భం గామాట్లాడుతూ గత 11 సంవత్సరాలలో సేవా సుపరి పాలన మరియు పేదలసంక్షేమ మార్గంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొంది మన సైనికుల సాహసంతో సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి ప్రపంచంఅనిచ్చిత్త పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదుగు ఎదుగుతుందని సబ్కాసాత్, సబ్కావికాస్, సబ్కా ప్రయత్న్ సబ్కావిశ్వాస్ అనే మంత్రంతో ప్రతి పౌరుడిని అభివృద్ధి బాటలోకితీసుకొచ్చా రని దేశం మొత్తం వికసిక్ భారత్ లక్ష్యం వైపు చేరుకునే దిశగా ఏకతాటిపై ముందుకు వెళుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత రక్షణ ఎగుమతులు 34 రెట్లు పెరిగి రూపాయలు 23.622 కోట్లకు చేరాయి ప్రచండ హెలికాప్టర్, ఆకాష్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ వంటి స్వదేశీ తయారుచేసిన ఆయు ధాలను సైనికులు విజయవం తంగా వినియోగించారు ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైనిక దళాలు ఆక్రమిక కాశ్మీర్ (పిఓకే) మరియు పాకిస్తాన్ ప్రాంతంలో 9 ఉగ్రవాద శిబిరాలు 11 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేయడం జరిగిందని గత 11 సంవత్స రాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా లను,పేదల కోసం అమలవు తున్న సంక్షేమ పథకాలను, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉపాధి, ఆరోగ్యం, విద్య, రోడ్డులు తదితర రంగాలలో సాధించిన పురోగతిని,దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్గా మార్చే దిశగా మోదీ గారి దృఢ సంకల్పాన్ని వివరించారు.
Rajamouli Goud,
ప్రజల మద్దతుతో నూతన భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాముల వ్వాలని, గ్రామీణ ప్రాంతాలలో అవగాహన పెంచేందుకు ఈ సభలు ముఖ్యపాత్ర వహిస్తా యని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు తాటికొండ రవికిరణ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కాను గుల నాగరాజు యువ మోర్చా జిల్లా కార్యదర్శి లడే శివ, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, ఉపాధ్య క్షులు కోమటి రాజశేఖర్, పోల్ మహేందర్, మంద సురేష్ మండల కోశాధికారి కుక్కల మహేష్, బూత్ అధ్యక్షులు, కన్నెబోయిన రమేష్, నూనె వెంకటేష్ కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, బత్తుల రాజేష్, ఎర్ర తిరుపతిరెడ్డి, కుక్కల సతీష్, మూడేడ్ల పైడి, మందమదు, చెక్క దినేష్, రాజు,కుక్కల రమేష్, ఆకుతోట భాను, మూడేళ్ల రాంప్రసాద్ మోతె విక్రం, జక్కుల ఓదెలు, సిరిపురం కొమురయ్య, కౌటాం శివ, శ్రీరాముల తిరుపతి, సిరిపురం మహేందర్ మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
#కుటుంబానికి భారం కాకుండా తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలి.
#కంపెనీలు రాకతో ములుగు జిల్లా అభివృద్ధి.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా, నేటిధాత్రి:
యువతి, యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు పొందాలని, యువత కుటుంబాలకు భారం కాకుండా తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ పొందిన 100 మంది నిరుద్యోగులలో పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన 51 మంది యువతకు నియామక పత్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పలు కంపెనీల ద్వారా శిక్షణ పొంది ప్రతిభ పెంపొందించుకుంటే సాధించనది ఏమీ లేదని అన్నారు. ఎక్కువ వేతనం రావడం లేదని నిరాశ చెందకుండా వచ్చిన ఉద్యోగ అవకాశాలను చేస్తూనే ఎక్కువ వేతనం వచ్చే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పలు కంపెనీలను కాపాడుకుంటూనే ఇతర కంపెనీలు రావడానికి ప్రయత్నించాలని, కంపెనీలు రాకతో ములుగు నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతిభ పెంపొందించుకోవడానికి టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో ఆరు నెలల క్రితం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇప్పటికీ శిక్షణ పొందిన వంద మందిలో 51 మంది యువతక ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు. టాస్క్ సెంటర్ ఆవరణంలో శ్రీయ ఇన్ఫోసియస్ కంపెనీ ఏర్పాట్లు చేసి అందులో ముగ్గురికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. నేడు యువత నిరక్షరాస్యత నుండి అక్షరాస్యతకు ఎదిగి ఉద్యోగ అవకాశాలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 40 కంపెనీలకు చెందిన యజమానులు ములుగు జిల్లాలో పర్యటించారని, 10 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఈ రోజున 16 కంపెనీ లు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి సీతక్క ఒక శక్తి లాగా పనిచేస్తూ ఇప్పటికే పలు కంపెనీలు రావడానికి కృషి చేయడంతో పాటు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారని, కంపెనీలు ఎదగడానికి ఉద్యోగులు కృషి చేస్తే వేతనాలు పెరుగుతాయని అన్నారు. ఎదుగుదలకు హద్దులేదని, చిన్న ఉద్యోగమని చులకన చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సిన్హా – టాస్క్ సిఇఒ ప్రదీప్ రెడ్డి – టాస్క్ ప్లేస్మెంట్ డైరెక్టర్ సేవ్న్ రెడ్డి – టాస్క్ రీజినల్ సెంటర్స్ హెడ్ సుధీర్ – టాస్క్ క్లస్టర్ మేనేజర్ రవి – సిఇఒ, శ్రీయా ఇన్ఫోటెక్ వినోడ్ – సిఎస్ఆర్ ఇన్ఛార్జి బాలా – కాగ్నిజెంట్ సిఎస్ఆర్ బృందం, డొమైన్: ఐటి, ఐటిఇఎస్, ఫార్మా, బ్యాంకింగ్, మార్కెటింగ్, అమ్మకాలు, వ్యవసాయం, ఫైనాన్స్ మరియు నాన్ బ్యాంకింగ్, కంపెనీలకు చెందిన యాజమాన్యాలు టాస్క్ రీజినల్ సెంటర్ లో శిక్షణ పొందిన 100 మంది యువత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సామాన్యులు,పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీ దేశానికి దిక్సూచి అని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ అన్నారు.
గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ అని పేర్కొన్నారు.రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర,న్యాయ్ యాత్ర దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిందని తెలిపారు.గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. తనదైన మార్క్తో దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించారన్నారు.లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అత్యంత బలీయ శక్తిగా ఉన్న బీజేపీని సమర్థంగా నిలువరించడంలో రాహుల్ చాలా వరకు సక్సెస్ అయ్యారని అభిప్రాయపడ్డారు. ఆయన నాయకత్వం భవిష్యత్తులో దేశానికి అత్యంత అవసరమని తెలిపారు. దేశ భవిష్యత్తు ఆశాకిరణం రాహుల్ గాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కంచర్ల వెంకటాచారి,మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షరాలు పింగిలి ఉష,కాంగ్రెస్ నాయకులు చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్,కందాడి అశోక్ రెడ్డి,దీకొండ మధు,వెన్నెం సోమిరెడ్డి,అజ్మీరా రమేష్ నాయక్, వెలుగు మహేశ్వరి, జె.రమేష్ నాయక్, జాటోత్ అమల, మెరుగు కర్ణాకర్,జనగామ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి అభిరాం నాయక్,యూత్ పట్టణ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,యూత్ నాయకులు పరశురాములు, నడిగడ్డ మధు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
⏩పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో కాంగ్రెస్ పార్టీ.
⏩మచ్చ లేని నాయకుడు రేవూరి.
దుపాకీ సంతోష్ కుమార్ 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
కాశిబుగ్గ నేటిధాత్రి
వరంగల్ నగరంలోని 16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ బుధవారం రోజున బిఆర్ఎస్ నేతలకు స్థానిక కార్పొరేటర్ బిఆర్ఎస్ నాయకులు చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ స్థానిక మహిళా వికలాంగురాలు లింగంపల్లి నిర్మల ఇంటిని సందర్శించి వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించడం జరిగింది.
16వ డివిజన్ గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ దాసారాపు సారన్న ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 16 డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఆలస్యం అవుతున్నాయని తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు అదే అదునుగా చూసుకొని అమాయకురాలైన మహిళలను అడ్డుపెట్టుకొని వారి రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తు బిఆర్ఎస్ నేతలు విఫలమయ్యారని అన్నారు.
గత బి ఆర్ యస్ పాలనలో చేసిన కమీషన్లకు, అక్రమాలకు పాల్పడిన వారు ప్రజా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాలకు, అరాచకాలకు తావు లేకుండా, అభివృధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక,గరీబ్ నగర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు అమాయకపు దళిత మహిళ వికలాంగురాలను చూపిస్తూ బి ఆర్ యస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ నేతల మాటలను ఖండించారు.
ఇలాంటి ఉదంతాలను,అసత్య ప్రచారాలను గరీబ్ నగర్ ప్రజలు నమ్మద్దు అని,టోపీ పెట్టుకున్న నాయకులు వస్తున్నారు,మనకు టోపీ పెడుతారు జాగ్రత్త అని తెలిపారు.
గత బి ఆర్ యస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వకపోగా కనీసం ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపానపోలేదు అని ఎద్దేవ చేశారు.
ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం.
గరీబ్ నగర్ ప్రజలకు మాయమాటలు చెప్పి సుమారు 18 మంది ఇండ్లను కూలగొట్టి ఇల్లు ఇస్తాము అని, ఓట్ల కోసం రాజకీయం చేసిన పార్టీ బి ఆర్ యస్ పార్టీ అని,ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పై మాట్లాడే నైతిక హక్కు లేదు అని అన్నారు.
ఇందిరమ్మ ఇల్లు నియమ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే దిశగా మన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి చేస్తున్నారని వారు తెలిపారు.
అంతేకాకుండా గరీబ్ నగర్ ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ, పది సంవత్సరాలు కాలయాపన చేసిన బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల బాధలు, వారి గోడు వినకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరించి భూ కబ్జాలకు,అక్రమాలకు పాల్పడి, ఇప్పుడు గరీబ్ నగర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి మతిభ్రమించిన టిఆర్ఎస్ నాయకులు ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఏ ఆధారంలేక అమాయక ప్రజలను మోసపరుస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరగడం వారికి అలవాటైపోయిందని ఈ సందర్భంగా తెలియజేశారు.
వరంగల్ జిల్లాలోనే మచ్చలేని నాయకుడిగా సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న నేత పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు అని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలిపారు.
బి ఆర్ యస్ నాయకులు ఆకాశం పై ఉమ్మితే అది వారి మొఖం పై పడుతుందని వారు గ్రహించాలి అని అన్నారు.
ప్రజల శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా, చిత్తశుద్ధితో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు.
ఏ ఒక్క లబ్ధిదారుల దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సలహాలు,సూచనలు తీసుకోని పనిచేస్తుందని తెలిపారు.
కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన,కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బిఆర్ఎస్ నాయకులు బురద చల్లుతున్నారు.ఏ ఒక్క లబ్ధిదారుడు దగ్గరైన డబ్బులు వసూలు చేసినట్టు రుజువు చేయిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని వారు అన్నారు. బిఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకు సిద్దామా అని హెచ్చరించారు.
పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు పంపిణీ జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా ఇండ్లు వచ్చే విధంగా శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకుంటారని తెలిపారు.
గతంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 93,95 సర్వే నెంబర్ల లో భూ అక్రమాలకు పాల్పడి గరీబ్ నగర్ లోని పేద ప్రజలకు వచ్చే స్థలాని వారి సహచరులకు,బినామీలకు కట్టబెట్టి గరీబ్ నగర్ ప్రజలకు సొంత ఇంటి స్థలము లేకుండా చేశారని గుర్తుచేశారు.
గరీబ్ నగర్ లోని సొంత ఇంటి లేని వారికి సర్వేనెంబర్ 93,95లో ఇల్లు ఇప్పిండం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కొండేటి కొమరారెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్,గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసారపు సారన్న,ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెక్క లక్ష్మి, రమేష్, అఫ్రీన్,అంకేశ్వరపు రాజు,పిట్టల అనిల్, గ్రామ పార్టీ అధ్యక్షులు జానీ,హుజూర్,కీర్తి నగర్ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్ పోతునూరీ మౌనిక, జన్ను రాజు,మార్త రాజశేఖర్, గుర్రం వెంకటేశ్వర్లు, పరకాల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లెం సాయి కుమార్, గొట్టిముక్కుల పరిపూర్ణ చారి గుర్రపు వెంకటేశ్వర్లు శివరాత్రి పెద్ద వెంకన్న. కృష్ణ, పోలేబోయిన శివ, బిర్రు ప్రసాద్, కె.మోహన్, జన్ను రాజు తక్కల్లపల్లి రాజశేఖర్,నూరుజహాన్,గొర్రె కరుణాకర్,ఐత అశోక్, జన్ను కళ్యాణ్, భరద్వాజ్. శివరాత్రి చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రైతుల ప్రభుత్వమని పేదల కోసం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టిన ప్రభుత్వం అని అన్నారు అలాగే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం లోని చిట్యాల టేకుమట్ల మండలాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు దాదాపు 25 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి టేకుమట్ల మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ కాంగ్రెస్ జిల్లా నాయకులు చిలుకల రాయకు ఉండు లక్ష్మణ్ గౌడ్, చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్నాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలువాల కార్తిక్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ వారి యొక్క జన్మదిన సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం వల్ల చాలామంది ప్రమాదాల్లో గాయపడిన వారికి బ్లడ్ లేక చ చాలా సందర్భాల్లో చనిపోయిన సంఘటన ఎన్నో ఉండడం జరిగింది.
రాకుండా ఉండడానికి దేశం రాహుల్ గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ
ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ఒకటి ధనిక దేశం మరొకటి పేదరిక దేశాన్ని
రెండు విభజించి పాలిస్తున్నారు రెండు దేశాలు ఉండొద్దు కేవలం భారతదేశం ఒక్కటే అనే ఉద్దేశంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రతి పేద వాడిని మీకు అండగా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
ఈ దేశంలో పేదరిక కుటుంబాలు లేకుండా చేస్తామని మహా పాదయాత్ర చేసిన నాయకులు రాహుల్ గాంధీ అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు అత్యధిక రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన
మాటకు కట్టుబడి తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదం చేయటంలో క్రియాశీలక పాత్ర పోషించింది నాయకులు రాహుల్ గాంధీ అంతేకాకుండా
ఈ భారత దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణాల జరగాలని పెద్ద ఎత్తున పోరాటంలో చేస్తున్న క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తలవంచి ఈరోజు దేశవ్యాప్తంగా కులగనలు చేయడానికి ముందుకు వచ్చిందంటే మీ యొక్క మహోన్నతమైనటువంటి నాయకుడు వలన
ఈ దేశ ప్రజలకు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పటికప్పుడు తన వంతు పోరాటాలు చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ నాయకుడి కోసం రాబోయే రోజులలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యేవరకు మా యువజన కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకొని ఒక సైనికుల పనిచేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ ముందుకు వెళ్లాలని వారు మాట్లాడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ రాజు, రాహుల్ తరుణ్ ఆర్తి సురేష్ ప్రేమ్ మధుకర్ అశోక్ ప్రమోద్ నది అక్షిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు
శాయంపేట మండలం మైలారo గ్రామంలో భూపాల పల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాలమేరకు శాయంపేట మండలం మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికిళ్ల ప్రసాద్ సోదరుడు కీ!!|శే అరికిళ్ల ప్రవీ ణ్(ఆర్మీ)నిన్న మరణించగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి నేడు వారి స్వగృహానికి వెళ్లి ప్రవీణ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థిస్తూ వారి కుటుం బానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేసారు.ఈ కార్యక్రమంలో రామ్ శెట్టి లక్ష్మారెడ్డి, దాసి శ్రావణ్ కుమార్, సౌల్ల కిష్ట య్య, నర్ర రాజు, అర్జల సాంబ రెడ్డి, కొమ్ముల శివ,కుతాటి రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…
నున్నా నాగేశ్వరరావుసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…
నేటి ధాత్రి-గార్ల:-
సీతంపేట సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో శిఖం భూములు కబ్జాకు గురి కాకుండ శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరావు డిమాండ్ చేశారు.గార్ల మండల కేంద్రం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ,766 సర్వే నెంబరు లో ఉన్న వందలాది ఎకరాల భూమిని కొందరు కబ్జా దారులు ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్ధంగా బావులు తీసి,విద్యుత్ మోటార్ లు ఏర్పాటు చేసుకొని చెరువు నీటిని వాడుకోవడం వలన ఆయకట్టు రైతుల భూములకు సాగునీరు అందని దుస్థితి దాపురించిందని అన్నారు.గార్ల పెద్దచెరువు శిఖం భూముల విషయంలో ఉన్నతాధికారుల కు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న నామ మాత్రపు సర్వే లు చేసి చేతులు దులుపుకుంటున్నారని అందోళన వ్యక్తం చేశారు.స్దానిక ఎంపి బలరాం నాయక్,ఎమ్మెల్యే కోరం కనకయ్య లు ప్రత్యేక చొరవ తీసుకుని శిఖం భూములను కబ్జా నుండి కాపాడి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి, రైతులు జి.వీరభద్రం, ఎ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…
నున్నా నాగేశ్వరరావుసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…
నేటి ధాత్రి గార్ల:
సీతంపేట సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో శిఖం భూములు కబ్జాకు గురి కాకుండ శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరావు డిమాండ్ చేశారు.గార్ల మండల కేంద్రం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ,766 సర్వే నెంబరు లో ఉన్న వందలాది ఎకరాల భూమిని కొందరు కబ్జా దారులు ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్ధంగా బావులు తీసి,విద్యుత్ మోటార్ లు ఏర్పాటు చేసుకొని చెరువు నీటిని వాడుకోవడం వలన ఆయకట్టు రైతుల భూములకు సాగునీరు అందని దుస్థితి దాపురించిందని అన్నారు.గార్ల పెద్దచెరువు శిఖం భూముల విషయంలో ఉన్నతాధికారుల కు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న నామ మాత్రపు సర్వే లు చేసి చేతులు దులుపుకుంటున్నారని అందోళన వ్యక్తం చేశారు.స్దానిక ఎంపి బలరాం నాయక్,ఎమ్మెల్యే కోరం కనకయ్య లు ప్రత్యేక చొరవ తీసుకుని శిఖం భూములను కబ్జా నుండి కాపాడి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి, రైతులు జి.వీరభద్రం, ఎ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమని ఎంఈఓ జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం పోటీలు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం గురువారం క్రీడా పోటీలు నిర్వహించినట్లు ఎంఈవో లింగాల కుమారస్వామి తెలిపారు. మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా పలు గ్రామాలకు చెందిన 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనగా వివిధ పోటీలు నిర్వహించి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం మండల స్థాయిలో పోటీలు నిర్వహించమన్నారు. మండల స్థాయిలో అత్యంత ప్రతిభ చూపిన పదిమంది విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సందీప్, సంతోష్. సుదర్శన్, అజయ్, శ్రావణి, ఉపాధ్యాయులు అంకుష్, మహేష్, ఎమ్మార్సీ సిబ్బంది వేణు, వసంత, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పుట్టిన రోజు వేడుకలు కరీమాబాద్ సుభాష్ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా నాయకులు పూదరి అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రదీప్ రావు అభిమానులు, బీజేపీ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు.
మొదటగా ఎర్రబెల్లి వినీత్ రావు తో కలిసి పూదరి అజయ్ గౌడ్ భారీ కేకు కట్ చేసి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు 500 మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం స్కూల్ చిన్నారులకు వందమందికి పైగా నోట్ బుక్స్, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా పూదరి అజయ్ గౌడ్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు ప్రజలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని అన్నారు.కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రదీప్ రావు అఖండ విజయాన్ని సాధించి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో మంద శీను, రాజశేఖర్, కార్తీక్ గౌడ్, మహేష్, రాజు, చిన్న, నాగరాజు, దయాళ్, సతీష్ బాబు, కోమల్ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి గడువుపెంచా లని డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత
బహుజన సంక్షేమ సంఘం (బి ఎస్ ఎస్)నాయకులు
శాయంపేట నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పథకం గడువు పెంచాలని బహుజన సంక్షేమ సంఘం బి ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శాయంపేట డిప్యూటీ తహసిల్దార్ వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి దరఖాస్తు గడువు పెంచాలని చాలామంది పేద రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక దరఖాస్తు చేసుకోలేదని ఇంకో వారం రోజులు గడువు పెంచాలని డిప్యూటీ తహసి ల్దార్ కి బహుజన సంక్షేమ సంఘం బి ఎస్ ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపేల్లి క్రాంతి కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సుమన్, హనుమకొండ జిల్లా ఉపాధ్య క్షులు మారేపల్లి విజయ్ కు మార్ కిరణ్ బాను తదిత రులు పాల్గొన్నారు.
ప్రజలకోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి. :-గరీభ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
బి.ఆర్.యస్. అసత్య ప్రచారాలు నమ్మదు. రాజకీయ స్వలాభం కోసం అమాయకులను బలిచేయద్దు.
అర్హులైన వారికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు. పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో కాంగ్రెస్ పార్టీ.
గొర్రెకుంట నేటిధాత్రి:
వరంగల్ నగరంలోని, 16వ డివిజన్ పరిధిలో గరీబ్ నగర్ నందు, నిన్న కొందరు బిఆర్ఎస్ నేతలు, స్థానిక కార్పొరేటర్ చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ స్థానిక మహిళా వికలాంగురాలు లింగంపల్లి నిర్మల ఇంటిని సందర్శించి, వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాని అందించిన 16వ డివిజన్, గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు. దాసారపు సారన్న ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 16 డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఆలస్యం అవుతున్నాయని తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులు అదే అదునుగా చూసుకొని అమాయకురాలైన మహిళలను ముందు పెట్టి వారి రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తు టిఆర్ఎస్ నేతలు విఫలమయ్యారు అని అన్నారు. గత బి.ఆర్.యస్ పాలనలో తీసుకున్న కమిషన్లకు, అక్రమాలకు పాల్పడిన వారు ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాలకు, అరాచకాలకు తావు లేకుండా అభివృధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక గరీబ్ నగర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు అమాయకపు దళిత మహిళ వికలాంగురాలను చూపిస్తూ బి ఆర్ యస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ నేతల మాటలను ఖండించారు. ఇలాంటి ఉదంతాలను అసత్య ప్రచారాలను గరీబ్ నగర్ ప్రజలు నమ్మదు, టోపీ నాయకులు వస్తున్నారు మనకు టోపీ పెడుతారు జాగ్రత్త అని తెలిపారు. గత బి.ఆర్.యస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వకపోగా కనీసం ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపనపోలేదు. ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం. గరీబ్ నగర్ ప్రజలకు మాయమాటలు చెప్పి సుమారు 18 మంది ఇండ్లను కూలగొట్టి ఇల్లు ఇస్తాము అని ఓట్ల కోసం రాజకీయం చేసిన పార్టీ బి ఆర్ యస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఈ రోజు ప్రజాప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నియమ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే దిశగా మన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి చేస్తారని వారు తెలిపారు. అంతేకాకుండా గరీబ్ నగర్ ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ పది సంవత్సరాలు కాలయాపన చేసిన బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల బాధలు వారి గోడు వినకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరించి భూకబ్జాలకు, అక్రమాలకు పాల్పడి ఇప్పుడు గరీబ్ నగర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి మతిభ్రమించిన టిఆర్ఎస్ నాయకులు ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఏ ఆధారం లేక, అమాయక ప్రజలను మోసపరుస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరగడం వారికి అలవాటైపోయింది అని అన్నారు. వరంగల్ జిల్లాలోనే మచ్చలేని నాయకుడిగా సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న నేత పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు అని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలిపారు. బి ఆర్ యస్ నాయకులు ఆకాశంపై ఉమ్మితే అది వారి మొఖంపై పడుతుంది అని వారు గ్రహించాలి అని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా చిత్తశుద్ధితో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు, ఏ ఒక్క లబ్ధిదారుల దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకోని పనిచేస్తుందని తెలిపారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బి.ఆర్ఎస్ నాయకులు బురద చల్లుతున్నారు. ఏ ఒక్క లబ్ధిదారుడు దగ్గరైన డబ్బులు వసూలు చేసినట్టు రుజువు చేయిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని వారు అన్నారు. బి. ఆర్. యస్ నాయకులు మీరు బహిరంగ చర్చకు సిద్దామా అని అన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు పంపిణీ జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా ఇండ్లు వచ్చే విధంగా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకుంటారని తెలిపారు. గతంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 93, 95 సర్వే నెంబర్ల లో భూ అక్రమాలకు పాల్పడి గరీబ్ నగర్ లోని పేద ప్రజలకు వచ్చే స్థలాని వారి సహచరులకు, బినామీలకు కట్టబెట్టి గరీబ్ నగర్ ప్రజలకు సొంత ఇంటి స్థలము లేకుండా చేసారు. గరీబ్ నగర్ లోని సొంత ఇంటి లేని వారికి సర్వేనెంబర్ 93 95లో ఇల్లు ఇప్పిండం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కొండేటి కొమర రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్, గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసారపు సారన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెక్కలక్ష్మి రమేష్, అఫ్రీన్, అంకేశ్వరపు రాజు, పిట్టల అనిల్, గ్రామ పార్టీ అధ్యక్షులు జానీ, హుజూర్, జన్ను రాజు, మార్త రాజశేఖర్, గుర్రం వెంకటేశ్వర్లు, పరకాల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లెం సాయి కుమార్, గొట్టిముక్కుల పరిపూర్ణ చారి, గుర్రపు వెంకటేశ్వర్లు, శివరాత్రి పెద్ద వెంకన్న, కృష్ణ, పోలేబోయిన శివ, బిర్రు ప్రసాద్, కె.మోహన్, జన్ను రాజు, తక్కల్లపల్లి రాజశేఖర్, నూరూజహాన్, గొర్రె కరుణాకర్, ఐత అశోక్, జన్ను కళ్యాణ్, భరద్వాజ్. శివరాత్రి చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ ను ఘనంగా సన్మానించిన మంత్రి సురేఖ
హైదరాబాద్ నేటిధాత్రి:
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా చేరిన సరిత, ఈ దేశంలోని ఎంతోమంది మహిళలకు ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గురువారం డ్రైవర్ సరిత, మంత్రి సురేఖను వారి జూబ్లీహిల్స్ నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మరింత రాణించాలని మంత్రి అభిలాషించారు. ఈ నేపథ్యంలో సరిత తన కుటుంబ సమస్యలు మంత్రి సురేఖకు నివేదించగా, ఎటువంటి సమస్యలున్నా తనను సంప్రదించాలని సూచించగా, ఆమె మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.