ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి.

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి.

సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో ఇరాన్ పై అమెరికా దాడులను ఆపాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ అమెరికా దేశాలు ఇరాన్ దేశంపై యుద్ధం వెంటనే ఆపాలని కోరారు.ప్రపంచ దేశాలు శాంతి నెలకు కొలపాలని వారన్నారు. యుద్ధం సరైన పద్ధతి కాదన్నారు.అమెరికా సామ్రాజ్య వాదాన్ని నెలకొల్పాలని పచ్చిమ ఆసియాపై ఆదిపత్యం చేసుకోవాలని దురుద్దేశంతో ఇరాన్ పై దాడులు చేపించడం జరుగుతుందన్నారు.ఇరాన్ ఆణుఅయుధాలను తయారు చేస్తుందని ప్రపంచానికి తప్పుడు సంకేతాలు తీసుకవచ్చి యుద్ధం చేస్తున్నారని అన్నారు. యుద్దాల వల్ల వేలాదిమంది ప్రజలు అన్యాయంగా చనిపోతున్నారని, పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరుగుతుందని తెలిపార.
యుద్ధం వద్దు శాంతి ముద్దు అని ట్రంపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ సుధాకర్ రెడ్డి మాతంగి రాంచందర్ క్యాతరాజు సతీష్ నెరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ పీక రవికాంత్ గోనెల తిరుపతి రమేష్ చారి గోలి లావణ్య శ్రావణి పల్లెర్ల రజిత శ్రీలత వాసం రజిత రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

పాలస్తీనా ఇరాన్లపై యుద్దదాడులు అమెరికా కుట్రలో భాగమే.

పాలస్తీనా ఇరాన్లపై యుద్దదాడులు అమెరికా కుట్రలో భాగమే

ప్రజా సమస్యలపై పోరాటాలను ఉదృతం చేయాలి

యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట నేటిధాత్రి:

యుద్దోన్మాదంతో సామాన్య ప్రజలను బలికొంటూ ఆర్థిక వ్యవస్థను చిన్నబిన్నం చేస్తు ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. అమెరికా ట్రంప్ విధానాలకు వత్తాసు పలికే బిజెపి మోడీ పద్ధతులను మార్చుకోవాలని లేకపోతే ప్రజా వ్యతిరేకతను చెవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
యంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం నర్సంపేట పార్టీ ఆఫీస్ లో కామ్రేడ్ కుసుంబ బాబురావుఅధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ విధానం సంక్షోభం లో చిక్కు కొని ఆ విధానం అనుసరిస్తున్న అమెరికా అనేక ఆర్థిక సమస్యలతో అంతరంగిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాల పై ఆర్థిక సుంకాలు, ట్యాక్సీలు విధిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆంతరంగిక సమస్యలను ఎగదోసి, సరిహద్దు దేశాలతో సమస్యలను ఎగదోసి సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు యుద్ధ వాతావరణం కల్పించి యుద్దాలు చేస్తున్న
తీరు భారత దేశం – పాకిస్తాన్ సమస్య, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం
ఇజ్రాయిల్ – పాలస్తీనా గాజా యుద్ధ సమస్య, నేడు ఇజ్రాయెల్ ఇరాన్ పై సాగిస్తున్న యుద్ధ దాడులు యావత్ సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు పేద, వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలలో దోపిడీ ని పెంచి పోషిస్తున్న తీరు అంతర్గత సమస్యలను పోషించి నేడు పతనం చెందుతున్న తీరు తో యుద్ధాలను ఎగదోయటం జరుగుతుంది అని ఆ క్రమంలోనే నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు దెబ్బ తింటున్న సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ వ్యవస్థ ను తేటతెల్లం చేస్తుంది అని దీనికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్తె తప్ప ఈ పెట్టుబడి దారీ, సామ్రాజ్య వాద వ్యవస్థ కాదని అందుకు అనుగుణంగా ప్రపంచ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి అని, ప్రజలు ప్రజా ఉద్యమాల ద్వారా ఈ దోపిడీ పెట్టుబడి దారీ వ్యవస్థ ను కూల్చాలని పిలుపు నిచ్చారు.దేశంలో బిజెపి గత పదకొండు సంవత్సరాల పాలనలో దేశాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పని చేయకుండా విద్వేష రాజకీయాలను, మతోన్మాద రాజకీయాలను చేస్తున్న తీరు తో ప్రపంచం ముందు తలవంపుల పాలు కావడం జరుగుతుంది అని దీనికి వ్యతిరేకంగా పీడిత ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాలలో బాగంగా జూన్ 20 నుంచి జిల్లా వ్యాప్తంగా పౌరహక్కుల పరిరక్షణ – ఓంకార్ పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలు నిర్వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై అనుసరిస్తున్న సాచివేత విధానాలకు వ్యతిరేకంగా గ్రామ, వార్డు స్తాయి లో ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కన్నం వెంకన్న, వంగల రాగసుధ, కనకం సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి.

ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి…

వామపక్ష పార్టీల డిమాండ్

నేటి ధాత్ర:

మహబూబాబాద్ :గత 20 నెలలుగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతర బాంబు,వైమానిక దాడులకు పాల్పడుతూ,మారణహోమాన్ని సృష్టిస్తూ యుద్ధానికి పూనుకున్నదని,ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం ప్రకటించి జనావాసాలపై రాకెట్ దాడులతో విద్వంసం సృష్టిస్తున్నదని వామపక్ష పార్టీల జిల్లా కార్యదర్శులు గౌని ఐలయ్య, విజయసారధి, సాదుల శ్రీనివాస్, పాయం చంద్రన్నలు అన్నారు.10వామపక్ష పార్టీల పిలుపు మేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈధర్నా నుద్దేశించి సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య,సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారధి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్,సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పాయం చంద్రన్నలు ప్రసంగిస్తూ,ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి లస్తీనాలో ఇప్పటికే దాదాపు 50వేల మంది మరణించారని, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, మహిళలు, పిల్లలు మరియు శరణార్థుల ఆశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ వేలాదిమందిని పొట్టన పెట్టుకుంటున్నదని విమర్శించారు.పాలస్తీనాలో పుట్టిన పసిపిల్లలను కూడా చంపుతామని ఇజ్రాయిల్ మంత్రి ప్రకటించటం ఆ దేశం యొక్క అమానవీయ యుద్ధ పిపాసతకు నిదర్శనమని పేర్కొన్నారు. కనీసం ఆహారాన్ని అందించడానికి కూడా ఆటంకాలు కల్పిస్తున్నదని, ఐక్యరాజ్య సమితితో పాటు, ప్రపంచవ్యాపితంగా ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తున్నా, అమెరికా దాని కొన్ని మిత్రదేశాల మద్దతుతో ఇజ్రాయిల్ ఈదాడులు కొనసాగిస్తున్నదని అన్నారు.

ఇటీవల ఇరాన్ పై కూడా యుద్ధాన్ని ప్రకటించి భీభత్సం సృష్టిస్తున్నదని,అంతర్జాతీయ చట్టాలను, మానవహక్కులను కాలరాస్తున్నదని ఈదురహంకార మారణ హెూమ యుద్ధాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాలన్నారు.మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ అనుకూల విధానాలను విడనాడాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని, ఇజ్రాయిల్తో అన్ని రకాల సైనిక మరియు భద్రతా సహకారాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఇజ్రాయిల్ దాష్టీకానికి బలౌతున్న పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడాలని వారు కోరారు.అనంతరం దురాక్రమణవాది,యుద్దోన్మాది ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈకార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా, డివిజన్ నాయకులు అజయ్ సారథి, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట వెంకన్న, ఎండీ ఫాతిమా, లింగ్యా నాయక్,చిరంజీవి, గునిగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, హేమా నాయక్, ముస్తఫా,రషీద్, నందగిరి వెంకటేశ్వర్లు, గుజ్జు దేవేందర్, హలావత్ లింగ్యా, యస్కే బాబు,తుడుం వీరభద్రం, బోనగిరి మధు,బట్టు చైతన్య,కొత్తపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు…

Donald Trump: ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మిస్సైల్స్, డ్రోన్లతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగానే ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో.. ‘అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు ఉదయం నాకు ఫోన్ చేశారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాని కంటే ముఖ్యంగా ఇరాన్ దేశం గురించి మాట్లాడుకున్నాం. దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం. నేను అనుకుంటున్నట్లే ఆయన కూడా అనుకుంటున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం గురించి కొంచెంసేపు మాత్రమే మాట్లాడుకున్నాం.

 ఇరాన్‌లో భారీ విధ్వంసం.

 ఇరాన్‌లో భారీ విధ్వంసం…

ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌లో భారీ విధ్వంసం జరుగుతోంది. శనివారం తెల్లవారుజాము వరకు ఇరాన్‌ క్షిపణి కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌..

తొలిసారి ఆర్థిక మూలాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌

బుషెహర్‌, సౌత్‌పార్స్‌ చమురు క్షేత్రాలపై దాడి

ఇరాన్‌ చుట్టూ 78 ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు

150 టార్గెట్లపై దాడులు 78 మంది మృతి

ఆర్మీ, ఎమర్జెన్సీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ల దుర్మరణం

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతిదాడిలో ముగ్గురి మృతి

టెల్‌అవీవ్‌/న్యూఢిల్లీ, జూన్‌ 14:
ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌లో భారీ విధ్వంసం జరుగుతోంది. శనివారం తెల్లవారుజాము వరకు ఇరాన్‌ క్షిపణి కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌.
సాయంత్రం తొలిసారి ఆర్థిక మూలాలపై విరుచుకుపడింది. బుషెహర్‌ చమురు క్షేత్రాలు (ఇక్కడే అణు విద్యుత్తు కేంద్రం ఉంది), సౌత్‌ పార్స్‌ న్యాచురల్‌ గ్యాస్‌ క్షేత్రాలపై దాడులు చేసింది.
ఆ ప్రాంతాల్లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ తస్నీమ్‌ న్యూస్‌ పేర్కొంది.
ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ ఇంటికి సమీపంలోనూ క్షిపణులు పడ్డాయని వెల్లడించింది.
ఐక్య రాజ్య సమితి(ఐరాస) అణు విభాగం చీఫ్‌ రాఫెల్‌ గ్రోసీ కూడా ఓ ప్రకటన ద్వారా ఇరాన్‌లోని నటాంజ్‌(షాహిద్‌ అహ్మదీ రోషన్‌) అణు కేంద్రం ధ్వంసమైనట్లు నిర్ధారించారు.
ఇరాన్‌ మొత్తం తమ టార్గెట్‌లో ఉందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించగా..
ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 9 మంది కీలక సైంటిస్టులు, 16 మంది మిలటరీ జనరళ్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) వెల్లడించింది.
వీరిలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ముఖ్య సలహాదారు షంఖానీ, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఆఫ్‌ ఇరానియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మహమ్మద్‌ బఘేరీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ చీఫ్‌ గులామ్‌ అలీ రషీద్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గులామ్‌-అల్‌-మర్హాబ్‌, ఇస్లామిక్‌ రివొల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ) కమాండర్‌ హుస్సేన్‌ సలామీ, ఐఆర్‌జీసీ ఎయిర్‌ కమాండర్‌ ఆమిర్‌ అలీ హాజీజాదే,డ్రోన్ల విభాగం కమాండర్‌ తాహెర్‌ పుర్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ కమాండర్‌ దావూద్‌ షిహ్యాన్‌, క్షిపణి విభాగం కమాండర్‌ మహమ్మద్‌ బఘేరీ ఉన్నారు.
దీంతో ఇరాన్‌ త్రివిధ దళాలు పెద్దదిక్కులను కోల్పోయినట్లయింది.
ఆర్మీ కమాండర్‌ ఆమిర్‌ మౌసావీ, ఐఆర్‌జీసీ గ్రౌండ్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ మహమ్మద్‌ పాక్‌పౌర్‌, ఖుద్స్‌ ఫోర్స్‌ కమాండర్‌ ఇస్మాయిల్‌ ఖ్వానీ, ఐఆర్‌జీసీ నేవీ కమాండర్‌ అలీరెజా తంగ్సీరి మాత్రమే ఇరాన్‌ సెక్యూరిటీ చైన్‌లో సజీవ కమాండర్లుగా ఉన్నట్లు తెలిపింది.
శనివారం సాయంత్రం నెతన్యాహు మాట్లాడుతూ.
మరో 90 నిమిషాల్లో ఇరాన్‌కు పెద్ద దెబ్బ తగులుతుందని ప్రకటించారు.
ఆయన ప్రకటన వెలువడిన 90వ నిమిషం నుంచి ఇజ్రాయెల్‌ వైమానిక దళం క్షిపణులతో ఇరాన్‌పై విరుచుకుపడడం గమనార్హం..! 150 టార్గెట్లను ఛేదించామని పేర్కొంటూ.
అందుకు సంబంధించిన ఫుటేజీని ఐడీఎఫ్‌ తన అధికారిక టెలిగ్రామ్‌ చానల్‌లో విడుదల చేసింది. శుక్ర, శనివారాల్లో జరిపిన దాడుల్లో చనిపోయిన ఇరాన్‌ శాస్త్రవేత్తల వివరాలను ప్రకటించింది.
ఆ జాబితాలో న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు ఫ్రెదోన్‌ అబ్బాసీ, అహ్మద్‌ రజా దరియానీ, ఫిజిక్స్‌ నిపుణులు మహమ్మద్‌ మెహ్దీ తెహ్రాన్షీ, ఆమిర్‌ హసన్‌ ఫఖీ, అబ్దుల్లామిద్‌ మినుష్షర్‌, మన్సూర్‌ అస్ఘరీ, మెకానిక్స్‌ నిపుణుడు అలీ బౌఖాయ్‌ ఖత్రిమీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు అక్బర్‌ మతాలిజాదా, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు సయీద్‌ బార్జీ ఉన్నట్లు తెలిపింది.
ఇరాన్‌ మీడియా కూడా ఇజ్రాయెల్‌ దాడుల్లో 78 మంది మరణించారని, 320 మంది గాయపడ్డారని పేర్కొంది.

ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులతో ఇరాన్‌లోని ప్రముఖులు రష్యాకు పారిపోతున్నట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా స్పష్టం చేస్తోంది. సుప్రీం లీడర్‌ ఖమేనీ ఇంటి సమీపంలోనూ క్షిపణి దాడులు జరగడం.

ఆయన ముఖ్య సలహాదారు సహా, ఆర్మీ అధికారులు చనిపోవడంతో వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ జెట్లు పెద్ద సంఖ్యలో రష్యాకు చేరుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ వార్తాసంస్థ ‘వైనెట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇందులో ఓ విమానం ట్రాకింగ్‌ మధ్యలో కనుమరుగైందని, అందులో ఖమేనీలాంటి ప్రముఖ వ్యక్తి ఉండి ఉంటాడని పేర్కొంది.

రష్యా-ఇరాన్‌ ద్వంద్వ పౌరసత్వం ఉన్న ప్రముఖులు కూడా ప్రైవేట్‌ జెట్లలో దేశాన్ని వీడుతున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు, ఇజ్రాయెల్‌ దాడుల పట్ల ఇరాన్‌లోనే పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘‘ప్రతీ 47 ఏళ్లకు ఇరాన్‌కు స్వాతంత్య్రం వస్తుందనుకుంటా. ఇప్పుడు కూడా సుప్రీంలీడర్‌ పాలన నుంచి విముక్తి దొరుకుతుందని భావిస్తున్నా’’ అంటూ ఓయువతి పేర్కొంది.

ఎస్‌సీవో ప్రకటనకు భారత్‌ దూరం:

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడులను షాంఘై సహకార సంస్థ(ఎ్‌ససీవో) తీవ్రంగా ఖండించింది. అయితే.. ఎస్‌సీవో ప్రకటనకు భారత్‌ దూరంగా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) స్పష్టం చేసింది.

ఈ అంశంపై ఎస్‌ఈఏ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ భారత్‌ పాల్గొనలేదని వివరించింది.

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తాము ఇరు దేశాలను కోరుతున్నట్లు తెలిపింది.

కాగా… పాలస్తీనాలో నివసించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని బయట తిరగొద్దని సూచించింది.

ఇక అమెరికాతో చర్చలు అర్థరహితం:

ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణుచర్చలు జరపడం అర్థరహితమని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికారి అబ్బాస్‌ అరగ్చి అంతర్జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.

అమెరికా-ఇరాన్‌ మధ్య ఆదివారం ఒమన్‌లో అణు చర్చలు జరగాల్సి ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

 ఇదే విషయాన్ని ఆయన ఐరోపా సమాఖ్య రాయబారి ఖాజా కల్లా్‌సకు తెలిపానని వెల్లడించారు.

ఇజ్రాయెల్‌కు అమెరికా ప్రత్యక్ష మద్దతు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

నెతన్యాహు కుమారుడి పెళ్లి వాయిదా:

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కుమారుడు అవ్నర్‌ నెతన్యాహు వివాహం వాయిదా పడింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెతన్యాహు కుటుంబం ప్రకటించింది.

అవ్నర్‌ పెళ్లి సోమవారం అమిత్‌ యార్డెనీతో జరగాల్సి ఉంది. వాయిదా పడ్డ పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తారని సమాచారం.

ఇజ్రాయెల్‌లో ముగ్గురి మృతి:

శుక్రవారం రాత్రి ఇరాన్‌ జరిపిన బాలిస్టిక్‌ క్షిపణి దాడుల్లో టెల్‌అవీవ్‌ శివార్లలోని రామత్‌గన్‌లో కోహెన్‌ ఏంజెల్‌(87), రిషోన్‌యెజిలోన్‌లో ఇజ్రాయెల్‌ అలోనీ(67), ఎట్టీ అనే మహిళలు చనిపోయారని, ఏడుగురు సైనికులు సహా 80 మందికి గాయాలైనట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది.

క్షతగాత్రుల్లో 34 మంది పారామెడికల్‌ బృందాలకు చెందినవారని తెలిపింది.

టెల్‌అవీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం బెన్‌ గురియన్‌ వద్ద పేలుడు సంభవించినట్లు ఇరాన్‌ వార్తాసంస్థలు చెబుతుండగా.

యుద్ధం ప్రారంభానికి ముందు నుంచి ముందుజాగ్రత్త చర్యగా విమానాల రాకపోకలను నిషేధించామని ఐడీఎఫ్‌ పేర్కొంది.

ఇరాన్‌ దాడుల్లో రామత్‌గన్‌, రిషోన్‌యెజిలోన్‌ నగరాల్లో నివాస గృహాలు, వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. అయితే.. పౌరులను ముందుగానే బంకర్లకు తరలించడం వల్ల ప్రాణనష్టం తప్పిందని ఐడీఎఫ్‌ చెబుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version