సాతారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సన్మానించిన విద్యాసాగర్ రావు

సాతారం సర్పంచ్ ఉప సర్పంచ్ లను సన్మానించిన బిఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
మెట్ పల్లి డిసెంబర్ 30 నేటి ధాత్రి

 

 

మెట్‌పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లాపూర్ మండలం సాతరం గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కిషన్ గౌడ్ ఉప సర్పంచ్ జగన్
విద్యాసాగర్ రావు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు
గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని తెలిపారు.

గణపురం మండలంలో సర్పంచ్ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం..

గణపురం మండలంలో సర్పంచ్ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలోఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా గణపురం గ్రామ పంచాయతీలో పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.ఈ సందర్బంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూగ్రామ ప్రజలు మీపై నమ్మకంతో గ్రామాభివృద్ధికి కష్టపడే వారిగ మిమల్ని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీ తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ
గ్రామ ప్రజలు ఇచ్చిన ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతూ తన మన బేధం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్నారు.ఈ సందర్బంగా సర్పంచ్,ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేశారు.గణపురం మండలంలోనిగ్రామపంచాయతీ సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా మొదట పూజ కార్యక్రమం ప్రత్యేక పూజ నిర్వహించి సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు నెంబర్లు దేవుని ఆశీస్సులతో తమ పదవి బాధ్యతలను నిర్వహించాలని దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరారు.ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గణపురం ఎంపీడీవో ఆధ్వర్యంలో గణపురం బుద్ధారం గాంధీనగర్ బురకాయల గూడెం మైలారం కర్కపల్లి లక్ష్మిరెడ్డిపల్లి చెల్పూరు గొల్లపల్లి వెంకటేశ్వర పల్లి పరశురాంపల్లి ధర్మారావుపేట్ బ స్వ రాజు పల్లి నగరంపల్లి సీతారాంపూర్ కొండాపూర్ అప్పయ్యపల్లి సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకారంచేశారు.

పిఆర్సీని వెంటనే ప్రకటిస్తూ ఐదు డి ఏ లు చెల్లించాలి..

పిఆర్సీని వెంటనే ప్రకటిస్తూ ఐదు డి ఏ లు చెల్లించాలి

నూతి మల్లన్న స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పి.ఎస్.హెచ్.ఎం.ఏ

ఇబ్రహీంపట్నం. నేటిదాత్రి

 

ఉద్యోగులకు పి ఆర్సీ ని వెంటనే ప్రకటించి పెండింగ్ లో ఉన్న ఐదు డి.ఏ లను విడుదల చేయాలనీ ప్రైమరి స్కూల్ హెడ్ మాస్టర్స్ అసోషియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ నూతి మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో సోమవారం రాత్రి నిర్వహించిన సంఘం యొక్క సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయ సమస్యలగురించి విపులంగా చర్చించారు.
ఈ సర్వసభ్య సమావేశంలో నూతన జిల్లా కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించటం జరిగింది. ఈ ఎన్నికలో జిల్లా కమిటీ అధ్యక్షులుగా అచ్చ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శిగా చల్లా లక్ష్మారెడ్డి , గౌరవ అధ్యక్షులుగా జంగా గంగాధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసోసియేట్ ప్రెసిడెంట్ గా జరుపుల సుధాకర్,కె. లక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఎం. గంగాధర్,ఆర్. శ్రీనివాస్,జి. రవీందర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఆర్. కనకతార,సి. హెచ్. వాణి, ఏ. సుజాత మరియు ఆర్థిక కార్యదర్శిగా ఇ. రవీందర్, మీడియా సెక్రెటరీగా డి. భీమయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె. లక్ష్మీనారాయణ, సెక్రెటరీలుగా ఎల్. రాజు, టి. వేణుగోపాల్, కె. తిరుపతి, కె. నాగరాజ్, బి.రెడ్డి, ఎల్. కిష్టయ్య,వి. రవీందర్, మహిళా కార్యదర్సులు గా పి. స్వరూప, ఎం. హేమలత,ఎల్ ధర్మవ్వ స్టేట్ కౌన్సిలర్లు గా ఎస్. నరసయ్య, జె. సుదర్శన్,పి. రమేష్,డి. వెంకటరమణ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికైన నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించుట జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘటన కార్యదర్శి నూతి మల్లన్న మాట్లాడుతూ పిఆర్సిని ప్రకటించకుండా బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆర్ధికంగా ఇబ్బంది కలిగించటం ప్రభుత్వానికి సరికాదని ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు ప్రభుత్వం తక్షణం స్పందించి పి ఆర్సీ మరియు ఐదు డి ఏ లు, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలనీ కోరారు. అలాగే మహిళలకు చైల్డ్ కేర్ సెలవులు మొత్తం సర్వీస్ కాలంలో వాడుకునే విధంగా వెసులుబాటు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు సాతల నరసయ్య,డి. శంకర్,నూతన కార్యవర్గ సభ్యులు,జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

రాష్ట్ర కరాటే పోటీలలో మెట్పల్లి విద్యార్థుల మెరుపు

రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో పథకాలు సాధించిన మెట్పల్లి కరాటే విద్యార్థులు.
మెట్ పల్లి డిసెంబర్ 8 నేటి ధాత్రి

 

ఆదివారం రోజున పొన్నాల గార్డెన్ జగిత్యాల జిల్లా లో పవన్ కరాటే అకాడెమీ ఆర్గనైజర్ పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో జె.కె.ఏ ఇండియా షోటోకాన్ కరాటే అసోసియేషన్ జగిత్యాల జిల్లా నుండి 53 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మెట్ పల్లి కి చెందిన 23 మంది కరాటే విద్యార్థులు వివిధ విభాగాల్లో 9 బంగారు పథకాలు, 5 వెండి పథకాలు, 9 కాంస్య పథకాలు గెలుపొందారు. అలాగే అత్యధిక బంగారు పథకాలు సాధించినా వంశినాయుడు మాస్టర్ కరాటే అసోసియేషన్ కు ఓవరాల్ ఛాంపియన్ షిప్ కప్ కైవసం చేసుకున్నారు.అనంతరం టోర్నమెంట్ ప్రధాన జడ్జ్ రచ్చ శ్రీనివాస్ మాస్టర్,ఆర్గనైజర్ పవన్, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ చేతులమీదుగా విద్యార్థులకు పథకాలు, ప్రశంసా పత్రాలు అందజేసారు. వివిధ జిల్లాల నుండి 500 మంది కరాటే విద్యార్థులు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారని జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
జగిత్యాల జిల్లా ఎం.ఎల్.ఏ సంజయ్ కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్ పవన్, శ్రీనివాస్, లింగయ్య, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్, కరాటే మాస్టర్లు నవీన్, వంశీనాయుడు, విశ్వ తేజ కరాటే విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మెట్ పల్లి ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ జన్మదిన వేడుక…

ఘనంగా మెట్ పల్లి ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ జన్మదిన వేడుక
మెట్ పల్లి అక్టోబర్ 30 నేటి ధాత్రి

 

టీయూడబ్ల్యూజే(ఐజేయు) మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ జన్మదిన వేడుక గురువారం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు ఘనంగా నిర్వహించారు కేక్ ను సురేష్ తో కట్ చేయించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ‘గౌరవ సలహాదారులు దాసం కిషన్ ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ సమీయోద్దీన్, ఐ జే యు జగిత్యాల జిల్లా ఈసీ మెంబర్ షేక్ సాజిత్, కార్యవర్గ సభ్యులు పొనగని మహేందర్, పింజారి శివ కుమార్,ఎస్పీ రమణ, యానం రాకేష్  తదితరులు పాల్గొన్నారు.

యాదవ హక్కుల సాధనే అంతిమ లక్ష్యం…

యాదవ హక్కుల సాధనే అంతిమ లక్ష్యం
యాదవ సంఘం (a) జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్

రాయికల్, అక్టోబర్ 15, నేటి ధాత్రి:

రాజ్యాంగ పరంగా యాదవులకు దక్కాల్సిన హక్కులు సాదించుకోవడమే అంతిమ లక్ష్యం అని అందులో భాగంగానే గ్రామ గ్రామాన యాదవ సంఘ సమావేశాలు నిర్వహించి యాదవులను చేతన్య పరుస్తున్నామని యాదవ సంఘం (a) జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు
గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..
:- రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యుల సమావేశాన్ని యాదవ సంఘ భవనలో నిర్వహించారు..
ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, ముఖ్య సలహాదారులు తొట్ల చిన్నయ్య యాదవ్,అలిశెట్టి బుచ్చి రాములు యాదవ్,తొట్ల మహిపాల్ యాదవ్,గజనవేణి మహేష్ యాదవ్, మండల నాయకులు ఉష గంగ మల్లయ్య యాదవ్,గంగుల శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం,న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు..
అనంతరం మైతాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం “86 మంది,” సభ్యత్వం తీసుకోగ వారికి జిల్లా ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులందించిన జిల్లా అధ్యక్షుడు
గనవేని మల్లేష్ యాదవ్ ..
ఈ కార్యక్రమంలో..
మైతాపూర్ గ్రామ యాదవ సంఘ పెద్దమనుషులు, వంగ మల్లయ్య, దుగ్గిళ్ల ఎల్లయ్య, నాగుల గంగయ్య, నాగుల రాజేందర్, నక్క రాజారెడ్డి, గంగుల గంగారాం వంగ ప్రశాంత్ పంచతి గంగన్న గంగుల రాజన్న నక్క అభి కడుముంత రాజన్న బుస గంగారాం నాగుల రెడ్డి పంచతి గంగన్న,సంతోష్ గంగుల మల్లయ్య పంచతి మహేష్, నాగుల గంగారాం, మహిళలు తదితరులు పాల్గొన్నారు..

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గ్రీన్ వుడ్ విద్యార్థులు…

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గ్రీన్ వుడ్ విద్యార్థులు

కృషి,పట్టుదలతోనే, అవకాశాలు అందుతాయి

కరస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి

రాయికల్ అక్టోబర్ 15 , నేటి దాత్రి:

మండల కేంద్రంలోని గ్రీన్ వుడ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినిలు పోతరాజు అద్విత 8వ తరగతి మరియు పంచతి మధుప్రియ లను గ్రీనువుడ్ పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా స్థాయి కరీంనగర్ అండర్ 14 కబడ్డీ గర్ల్స్ విభాగం పెద్దపల్లిలో పోటీలు జరిగాయి అందులో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది దీనిలో అత్యధిక ప్రతిభ కనబరిచిన అద్విత, మధుప్రియలు సంగారెడ్డి పటాన్చెరువులో జరిగే క్రీడలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాకర శ్రీనివాస్ రెడ్డి హెడ్మాస్టర్ రాజేష్ ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయవకాశాలు అందుకోవాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version