చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ..

చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కార్గిల్ దివాస్ విజయోత్సవ సభను ఘనంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కార్గిల్లో వీరమరణం పొందిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
భారత్ పాకిస్తాన్ మధ్య మే 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగిందనీ ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు,కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం అని,యుద్ధ ప్రారంభదశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యిందనీ, నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుందనీ,అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగిందనీ,ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ అని, ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయనీ అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది అని అన్నారు.దివాస్ ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారనీ, 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారనీ,ఈ సందర్భంగా,భారత సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను స్మరించుకుంటారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకవత్ దేవా,కంచ రాజు కుమార్ అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ నందిపాటి సంధ్య,నిడిగొండ అక్షయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

కోరపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో సైకిళ్ల పంపిణీ..

కోరపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో సైకిళ్ల పంపిణీ
జమ్మికుంట (నేటిధాత్రి)
ఈరోజు జమ్మికుంట మండలంలోని కోరపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని లకు కేంద్రమంత్రి బండి సంజయ్ సంకల్పంగా తీసుకున్నటువంటి నిజోయకవర్గ పదో తరగతి విద్యార్థినిలకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి కరీంనగర్ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఎర్రవెల్లి సంపత్ రావు సంపెల్లి సంపత్ రావు, పుల్లూరు ఈశ్వర్, పుల్లూరి రవి, ఈ కార్యక్రమంలో పాల్గొని సైకిల్లు పంపిణీ చేయడం జరిగింది.

ఢిల్లీ యూనివర్సిటీలోకి గ్రామీణ విద్యార్థి ఎంపిక.

ఢిల్లీ యూనివర్సిటీలోకి గ్రామీణ విద్యార్థి ఎంపిక,

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T124034.400.wav?_=1

ఝరాసంగం మండల కమాల్పల్లికి చెందిన బి.నరేశ్ సీయూసెట్-2025లో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. ప్రత్యేక కోచింగ్ లేకుండా కేవలం ఇంటి వద్దనే చదువుకొని ఈ విజయాన్ని సాధించాడు. ప్రాథమిక విద్యను ఝరాసంగం ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ను కొండాపూర్ గురుకులంలో పూర్తి చేశాడు. నరేశ్ను గ్రామస్థులు, ఉపాధ్యా యులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

రాంపూర్ ఉన్నత పాఠశాలలో సైబర్ , డ్రగ్స్ పైన అవగాహన..

రాంపూర్ ఉన్నత పాఠశాలలో సైబర్ , డ్రగ్స్ పైన అవగాహన

నిజాంపేట్, నేటి ధాత్రి

రాంపూర్ ఉన్నత పాఠశాలలో నిజాంపేట ఎస్సై రాజేష్ గారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ మరియు డ్రగ్స్ పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి డ్రగ్స్ పైన అవగాహన కలిగి ఉండాలని కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలి అని ఎలాంటి సమస్యలు సందేహాలు ఉన్న 112 నెంబర్ కు డయల్ చేసినచో కావలసిన సహాయం అందుతుంది అని తెలిపారు. ముఖ్యంగా అమ్మాయిలు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు , స్నేహితులకు చెప్పి పరిష్కరించుకోవాలి అని అలా సమస్య పరిష్కారం కాని సమక్షంలో 112 కు డయల్ చేసి సహాయం పొందొచ్చు అని సూచించారు. పాఠశాల హెచ్ఎం పద్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ సోషల్ మీడియా, చుట్టు జరుగుతున్న విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ కోఆప్షన్ మెంబర్ గౌస్, ఏఏపిసి చైర్మన్ ఇందిర, గ్రామ కార్యదర్శి చంద్రహాస్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పరశురాములు, ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, అర్జున్, సుకన్య, నరేష్, కుమారస్వామి, పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కానిస్టేబుళ్లు విజయ్, రమేష్ గ్రామస్తులు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

మా టీచర్లు మాకే కావాలి..

మా టీచర్లు మాకే కావాలి
• డిప్టెషన ను నిలిపివేయాలి
• గేటు ముందు గ్రామస్తుల నిరసన

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-25T123542.285.wav?_=2

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రభుత్వ పాఠశాలలను నమ్మి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలోకి పంపిస్తే డిప్టేషన్ పేరిట ఉపాధ్యాయులను బదిలీ చేయడం సరికాదని నిరసిస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 55 మంది విద్యార్థులకు గాను 4 టీచర్లు ఉండగా డిప్టేషన్పై ఇద్దరూ ఉపాధ్యాయులను వేరొక ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఇప్పుడు ఉపాధ్యాయులను తీసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను బదిలీ చేస్తే విద్యార్థుల చదువులు నాశనం చేసినట్లు అవుతుందన్నారు. ఈ విషయమై నిరసిస్తూ గంటపాటు గేటు ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. డిప్టేషన్ నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చూస్తామన్నారు. కార్యక్రమంలో బుర్ర సంతోష్ గౌడ్, అందే సిద్ధ రాములు, మ్యాదరి కుమార్, భూపతి రెడ్డి, బురాని నర్సాగౌడ్, నాగభూషణం తదితరులు ఉన్నారు.

విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) ఆధ్వర్యంలో మూడు దశల పోరాటం.

మొదటి దశలో భాగంగా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మండల స్థాయిలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పణ

విద్యారంగంలో పేరుకుపోయిన 51 సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపం.

ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలి. సిపిఎస్ ను రద్దు చేయాలి.

317 బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలి.

టి పి టీ ఎఫ్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రాం నర్సయ్య, కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యుటిఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్యల డిమాండ్ .

కేసముద్రం/ నేటి దాత్రి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రభుత్వం ముందుంచిన దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పిఆర్సి, డిఏ, ఏకీకృత సర్వీస్ రూల్స్ మొదలగు 51 అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టిపిటిఎఫ్ మహబూబాద్ జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి( యు.ఎస్.పి.సి ) చేపట్టిన మూడు దశల పోరాటం లో, మొదటగా మండల కేంద్రంలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించాలన్న పిలుపు మేరకు గురువారం మండలంలోని యు. ఎస్. పి. సి. భాగస్వామ్య సంఘాలైన టీ.పి.టీ. ఎఫ్, డి. టీ. ఎఫ్. సంఘాల నేతృత్వంలో కేసముద్రం మండల తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యు.టి. ఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలను పెండింగ్లో ఉంచిన గత ప్రభుత్వాన్ని గద్దె దించామని అన్నారు. కానీ ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వం కూడా ఆ సమస్యలను అలాగే కొనసాగించి ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇచ్చిన ఉచితాల హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పరుగులు తీస్తుందని విమర్శించారు. కానీ ఉద్యోగస్తులకు మాత్రం హక్కుగా రావాల్సిన వాటిని పెండింగ్లో పెడుతుందని వాపోయారు. విద్యారంగంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ,డి ఏ లు ప్రకటించాలని,,ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలని, కస్తూరిబాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, గురుకుల వ్యవస్థను తొలగించి గ్రామాలలో ఉండే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆ రోజె అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ప్రధాన కార్యదర్శి నన్నపురాజు నరసింహరాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊట్కూరి ప్రణయ్ కు మార్, జి. శ్రీనివాస్, తండా సదానందం ,జిల్లా కౌన్సిలర్ సదయ్య, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి లావుడ్యా భద్రాసింగ్, కార్యదర్శి భట్టు భద్రు, డి టి ఎఫ్ జిల్లా కౌన్సిలర్ గంగుల శ్రీనివాస్, కార్యదర్శి సుంకరి రవి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీల షెడ్యూల్ ను..

ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలి

నడికూడ,నేటిధాత్రి:
యూఎస్ పిసి స్టీరింగ్ కమిటీ రాష్ట్ర నాయకులు నన్నెబోయిన తిరుపతి డిమాండ్
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు.ఎస్.పి.సి) ఆధ్వర్యంలో నడికూడ మండలంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నడికూడ మండల తహసిల్దార్ రాణి కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.ఈ వినతి పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కి పంపాలని కోరనైనది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నందున సమస్యల పరిష్కారానికి యూఎస్ పిసి మూడు దశలలో పోరాటానికి సిద్దమైనదన్నారు.మొదటి దశ పోరాటంలో బాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల ద్వారా వినతిపత్రాలు ఇస్తున్నామన్నారు.వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యారంగానికి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేసి ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ప్రాథమిక పాఠశాలకు ప్రతి తరగతికొక టీచర్ ను నియమించాలని,టీచర్ల క్రమబద్ధీకరణ జీవో 25ను సవరించాలని, ఉపాధ్యాయుల వివిధ రకాల పెండింగ్ బిల్లులు,డీఏలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ఉద్యోగులకు పిఆర్సి ని అమలు చేయాలని కోరారు.సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
యూఎస్ పిసి నాయకులు టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేష్ మాట్లాడుతూ 2008 డీఎస్సీ కాంట్రాక్టు టీచర్లకు 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని,సమగ్ర శిక్షలో కొనసాగుతున్న వెట్టిచాకిరి శ్రమదోపిడి విధానాన్ని రద్దుచేసి,ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,ఎస్ ఎస్ ఎ ఉద్యోగుల సమ్మెకాలపు వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆగష్టు ఒకటిన జిల్లాలల్లో, ఆగష్టు 23న హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
వినతి పత్రం అందించినవారిలో యుఎస్ పిసి మండల నాయకులు శ్రీనివాస్,సుభాని, రవిందర్,కృష్ణంరాజు,విక్రమ్ గౌడ్,సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి యూత్ కాంగ్రెస్‌ మద్దతు..

విద్యాభివృద్ధికి యూత్ కాంగ్రెస్‌ మద్దతు — విద్యార్థులకు పుస్తకాల పంపిణి

*వర్దన్నపేట్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కెఅర్ నాగారాజు మరియు *వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కె.అర్ దిలీప్ రాజ్ ఆదేశాలమేరకు

వర్దన్నపేట (నేటిధాత్రి):

ఉప్పరపల్లి గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలను పర్యావెక్షించిన *వర్ధన్నపేట మండల్ యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్రి భానుప్రసాద్
ఇటీవల వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో అంగన్వాడీ,హై స్కూల్ లో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోని అనేక వస్తువులు ధ్వంసం చెయ్యడం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకున్న వర్దన్నపేట యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు పత్రి భానుప్రసాద్ ఉప్పరపల్లి హై స్కూల్ కి వెళ్లి స్టాప్ తో మాట్లాడి ధ్వంసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది అలాగే విద్యార్థులకు పుస్తకాల పంపిణి చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి, దామెర ప్రశాంత్, ఎండీ మాక్సూద్, దాడి రాజు, రసీద్ ,గ్రామ మరియు యూత్ నాయకులు పాల్గొనడం జరిగింది…….

మండలంలోని విద్యాసంస్థలు సంపూర్ణంగా బందు..

మండలంలోని విద్యాసంస్థలు సంపూర్ణంగా బందు

యస్ ఎఫ్ ఐ మంగపేట మండల అధ్యక్షుడు చెట్టుపల్లి చందు

మంగపేట నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం 2025_ 26 విద్యా సంవత్సరంప్రారంభమై రెండు నెలలుగడుస్తున్నా ప్రభుత్వపాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అన్ని పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మంగపేట మండల అధ్యక్షుడు చెట్టు పల్లి . చందు ప్రభుత్వాన్ని ఖండించడం జరిగింది….
మండల కేంద్రంలో చందు మాట్లాడుతూ.. ఈ రెండు నెలల్లో మండలంలో ఉన్న ప్రతి ప్రాథమిక , ప్రాథమికోన్నత, ఉన్నత, ఆశ్రమ పాఠశాలలో సందర్శించడం జరిగింది.. ఇందులో భాగంగా ప్రతిపాఠశాలలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు సరిపడే విధంగా ఉన్నందున అడ్మిషన్లు సంఖ్య పెరిగింది… కానీ ప్రతి పాఠశాలలో బాల, బాలికలకు కనీస టాయిలెట్స్ లేవు. ముఖ్యంగా బాలికలు టాయిలెట్ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రతి విద్యార్థిని విద్యార్థులకు రెండు యూనిఫామ్ ఇవ్వకుండా ఓకే యూనిఫామ్ ఇచ్చారు.. టెక్స్ట్, నోట్ బుక్స్ కూడా అన్ని టైటిల్స్ పంపిణీ రాలేదు సీఎం బ్రేక్ఫాస్ట్ నిలుపుదల చేశారు, మధ్యాహ్న భోజనంలో అనేక లోపాలు ఉన్నాయి ఏజెన్సీ వాళ్ళని అడిగితే మాకు డబ్బులు గత ఆరు నెలల నుండి రావడం లేదు అంటున్నారు ప్రతి పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు… కావున పై విషయాన్ని పూర్తిగా పరిశీలింప చేసి ప్రభుత్వం కామా ప్రభుత్వాధికారులు ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సరైన విద్యను అందించి మన జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచాలని ఎస్ఎఫ్ఐ మండల శాఖ ప్రభుత్వాన్ని కోరారు…. ఇందులో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులు….

విద్య సంస్థల బంద్ విజయవంతం.

విద్య సంస్థల బంద్ విజయవంతం.

ధనిక రాష్ట్రం అంటూనే మరో వైపు ఖజానా ఖాళీ

వామపక్ష విద్యార్థి సంఘాలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-85.wav?_=3

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో అధిక పీజులు వసూల్ చేస్తూ విద్య హక్కు చట్టాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపిస్తూ అలాగే ప్రభుత్వ పాఠశాలలు,గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు బుదవారం చేపట్టిన విద్య సంస్థల బంద్ నర్సంపేటలో విజయవంతం అయ్యింది.ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించి విజయవంతం చేశారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్,జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు,ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయింది.కేసీఆర్ ను గద్దేదించే పోరాటాల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయాన్నారు.పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తామని,విద్య రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని,నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పారు.
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పెండింగ్ బకాయిలు పెట్టకుండా,విద్య రంగంలో ఉన్నా అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ,ఫీజు నియంత్రనా చట్టం తీసుకోస్తు, విద్యార్థులందరికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని కోరారు.

జాతీయ నూతన విద్య విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23 న తలపెట్టిన విద్య సంస్థల బంద్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని బంద్ ను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పైస గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పవన్ వరుణ్, బానోత్ స్టాలిన్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కిరణ్, క్రాంతి ప్రవళిక కళ్యాణి శ్వేత రజిని నాగేంద్ర,గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్య సంస్థల బంద్ విజయవంతం..

విద్య సంస్థల బంద్ విజయవంతం

విద్యా శాఖ మంత్రిని వెంటనే నియమించాలి

వాపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-84.wav?_=4

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో వామ పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంధు జయప్రదం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా వామ పక్ష విద్యార్థి సంఘ నాయకులు అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు.ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు లు మాట్లాడుతూ విద్యరంగ సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాల అవుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం చాలా సిగ్గుచేటు అని అన్నారు.
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో ఫీజులను తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్,ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్ వ్యాన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో వామ పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని తెలిపారు. విద్యాసంస్థలబంద్ ను జయప్రదం చేసిన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల జూనియర్ డిగ్రీ యాజమాన్యాలకు, విద్యార్థులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు మేడి శేఖర్ మణికంఠ వరుణ్ వికాస్ పొంగంటి రాజేష్ అజయ్ పవన్ ముద్దమల్ల విష్ణు హర్షవర్ధన్ నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలు జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలు ,జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం

విద్యా శాఖ మంత్రిని వెంటనే కేటాయించాలి

పెండింగ్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్,మల్లారపు ప్రశాంత్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-82.wav?_=5

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో విద్యా రంగంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతం అయ్యిందని తెలిపారు.

Education Minister

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలనీ,ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకుని రావాలనీ,ఖాళీగా ఉన్న టీచర్, ఎంఇఓ, డిఇఓ, మరియు లెక్చరర్స్,ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ చేయాలనీ,అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల, హస్టల్స్ భవనాలుకు స్వంత భవనాలు నిర్మించాలి.గురుకులాల సమయాన్ని శాస్ర్తీయంగా మార్చాలనీ,NEP -2020 రద్దు చేసి, తెలంగాణ అసెంబ్లీలో అమలు చేయకుండా తీర్మానం చేయాలనీ,పెండింగ్ స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలనీ,పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలనీ,బడ్జెట్, చిన్న ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.ఆర్ధిక సహాకారం అందించాలనీ విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా అన్ని గ్రామాల నుండి బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలనీ అన్నారు.జిల్లాలో నిర్వహించిన బంద్ లో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జశ్వంత్, ఉస్మాన్, షాహిద్, యశ్వంత్, సిద్దు, సాయి, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.

వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం..

వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం

పరకాలలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంధు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-78-1.wav?_=6

పరకాల నేటిధాత్రి
రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం పరిష్కారించాలని విద్యార్ధి సంఘాలు చేప్పట్టిన బందు పరకాల పట్టణంలో ప్రశాంతంగా కొనసాగిందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు.ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్,మండల అధ్యక్షుడు మడికొండ మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ పట్టణంలో ప్రైవేట్ స్కూలు మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైతం బందుకు మద్దతు తెలిపారని అన్నారు.ఖాళీగా ఉన్న టీచర్,ఎంఈఓ,డిఈఓ పోస్టులు భర్తీ చేయాలని,ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి,పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిదులు,అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌళిక సదుపాయాలు కల్పించాలని,పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని,అద్దె భవననాలలో నడుస్తున్న వసతి గృహలకు స్వంత భవనాలు నిర్మించాలని,గురుకులాలలో అశాస్త్రీయంగా తీసుకు వచ్చిన సమయపాలనను మార్చాలని బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని,ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధులు ఇవ్వాలని,విద్యార్థులకు ఆర్టీసిలో ఉచిత బస్పాసులు ఇవ్వాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్,లెక్చరర్ పోస్తులు భర్తీ చేయాలని ఎన్ఈపి-2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని బందుకు పిలుపునిచ్చామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ,మహేష్,రంజిత్,కృష్ణ,సురేష్,శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యాశాఖ మంత్రిని నియమించాలి…

విద్యాశాఖ మంత్రిని నియమించాలి…

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి…

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలి…

అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల,వసతి గృహాల భవనాలకు సొంత భవనాల నిర్మించాలి…

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్,లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి…

విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు ఇవ్వాలి…

వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-75.wav?_=7

నేటి ధాత్రి -గార్ల :-

రాష్ట్రంలో పాలకులు లిక్కర్ పై చూపెడుతున్న శ్రద్ధను విద్యారంగం వైపు చూపెట్టని పరిస్థితి దాపురించిందని ఏఐ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాగం లోకేష్, పీడీఎస్ యు జిల్లా కోశాధికారి మునగాల మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ లో భాగంగా బుధవారం గార్ల మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నప్పటికీ నేటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని వారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈవో, ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల పైచిలుకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్, బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్, కిరణ్, ఉదయ్, పృధ్విరాజ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

విద్యాసంస్థల బందుకు బిఎస్యు ఆర్గనైజేషన్ సంపూర్ణ మద్దతు..

విద్యాసంస్థల బందుకు బిఎస్యు ఆర్గనైజేషన్ సంపూర్ణ మద్దతు

బిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మందసురేష్

పరకాల నేటిధాత్రి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కాలేజీల్లో నేలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రేపు విద్యార్థి సంఘల నాయకుల ఆధ్వర్యంలో బంధు ప్రకటించడం జరిగింది.ఈ బందుకు బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మందసురేష్ సంపూర్ణ తెలుపుతున్నామని అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని అనేక ఏళ్లుగా విద్యార్థి సంఘాలు పోరాటాలు చేశామని,ఎంత చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదని పేర్కొన్నారు.రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లే విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయని,పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వ విద్య సంస్థల్లో మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా నిధులను కేటాయించాలని,బెస్ట్ అవైలబుల్ నిధులను విదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

పుస్తక పటనం చాలా మంచిది.

పుస్తక పటనం చాలా మంచిది.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నవతెలంగాణ పత్రిక వారు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన షాపును సిఐ నాగార్జున, ఎస్. ఐ మాధవ రెడ్డి తో కలిసి సందర్శించారు. సీఐ నాగార్జున మాట్లాడుతూ..పుస్తకాలు చదవడం వల్ల వ్యక్తిత్వ వికాసం, మెరుగైన భాషా నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత మెరుగుపడతాయని అలాగే, ఒత్తిడి తగ్గి, జ్ఞానం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి పరశురాములు, పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శివ తదితరులు ఉన్నారు.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ అస్లం ఫర్ కి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బాటనీ జువాలజీ, కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. 24వ తేదీన సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు.

విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలి.

విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలి

* పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్.*

హైదారాబాద్/వికారాబాద్,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని,రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23 న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు.ఈ సందర్భంగా పిడిఎస్యు రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తామని చెప్పి తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందనీ అన్నారు.ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి దిక్కులేడని తక్షణమే నియమించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చెయ్యాలనీ డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనీ, పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలని కోరారు.బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలన్నారు.సంక్షేమ హాస్టల్ తో పాటు గురుకులాలకు సొంతభవనాలు నిర్మాణం చేయాలని అలాగే ప్రతి మండలంలో గురుకులాలు,మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలని,నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ 23న వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలల, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ లో భాగస్వామ్యం కావాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యు వికారాబాద్ ఇంచార్జ్ కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్,ఎస్ఎఫ్ఐ నాయకులు శేఖర్,సంగమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

జులై 23న విద్యాసంస్థలు బంద్ ను జయప్రదం చేయండి

 

జులై 23న విద్యాసంస్థలు బంద్ ను జయప్రదం చేయండి

 

మండల ఉపాధ్యక్షులు చెట్టుపల్లి చందు

మంగపేట: – నేటి ధాత్రి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కమిటీ తరపున రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు కళాశాలలు విజయవంతం చేయండి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు శెట్టిపల్లి చందు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు న్యాయం చేయలేదని విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసి ప్రభుత్వానికి సరైన జవాబు చెప్పిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మారినా గాని రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థులకు ప్రాముఖ్యంగా విద్యా శాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయాలని విద్యార్థులకు బస్సు సౌకర్యాలు బస్సు చార్జింగ్ తగ్గించాలని పూర్తిస్థాయిలో విద్యార్థులకు హాస్టల్లో స్కూల్లలో మౌలిక సదుపాయాలు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం చేస్తుంది విద్యార్థులు తలచుకుంటే ఏదైనా చేస్తారని ఎస్ఎఫ్ఐగా వారు హెచ్చరించారు అదేవిధంగా విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలని జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అమలు చేయాలని ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ పోస్ట్లు ఎంఈఓ డీఈవోలు పోస్టింగులు అమలు చేయాలని అదేవిధంగా ప్రవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని మరియు ప్రైవేటు యూనివర్సిటీలపై పూర్తిగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు బాధ్యత ప్రభుత్వ వహించాలని ఇప్పటికే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్ విడుదల కాక ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యులు సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంది హాస్టల్లో టైం టేబుల్ ప్రకారంగా విద్యార్థులకు మెస్ పాటించాలని అన్నారు రాష్ట్రంలో మాటల్లో తెలియజేశారు గాని చేతుల్లో లేదని ప్రజా పాలన చేస్తామని ప్రజలకు ఎటువంటి న్యాయం లేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది దీనిపై ప్రభుత్వం చెయ్యాలని అన్నారు లేని ఎడల గత ప్రభుత్వం లెక్కే ఈ ప్రభుత్వానికి కూడా విద్యార్థులను ఏకమై సమాధానం చెప్తామని సూచన తెలియజేశారు
లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులం వారి తల్లిదండ్రులతో పాటు ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు

 

శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ..

*శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా
బోనాల పండుగ*

నర్సంపేట,నేటిధాత్రి:

బోనాల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.వేడుకలలో భాగంగా అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక బోనాలు తయారు చేసి సంబరాలకు ముస్తాబు చేశారు.అలాగే విద్యార్థులు పోతురాజుల వేషధారణ నృత్యాలతో బ్యాండ్ మేళాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, డైరెక్టర్ బత్తిని బిక్షపతి బోనాల విశిష్టత గూర్చి తెలియజేశారు. చైర్మన్ రవి మాట్లాడుతూ వర్షాకాలంలో చేసుకునే గొప్ప పండుగ బోనాల పండుగ అని, ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ బోనాల పండుగ పట్ల సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేయాలని కోరారు.ప్రిన్సిపల్ స్రవంతి మాట్లాడుతూ ఆడపడుచులు అమ్మవారికి ఉపవాసం ఉండి భక్తితో బోనం ఎత్తుకొని ఆడంబరంగా బోనాన్ని సమర్పిస్తారని అన్నారు. అందరూ ఆయురారోగ్యాలు, పాడిపంటలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు పాటలతో ఎంతగానో అలరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version