విద్యాభివృద్ధికి యూత్ కాంగ్రెస్‌ మద్దతు..

విద్యాభివృద్ధికి యూత్ కాంగ్రెస్‌ మద్దతు — విద్యార్థులకు పుస్తకాల పంపిణి

*వర్దన్నపేట్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కెఅర్ నాగారాజు మరియు *వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కె.అర్ దిలీప్ రాజ్ ఆదేశాలమేరకు

వర్దన్నపేట (నేటిధాత్రి):

ఉప్పరపల్లి గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలను పర్యావెక్షించిన *వర్ధన్నపేట మండల్ యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్రి భానుప్రసాద్
ఇటీవల వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో అంగన్వాడీ,హై స్కూల్ లో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోని అనేక వస్తువులు ధ్వంసం చెయ్యడం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకున్న వర్దన్నపేట యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు పత్రి భానుప్రసాద్ ఉప్పరపల్లి హై స్కూల్ కి వెళ్లి స్టాప్ తో మాట్లాడి ధ్వంసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది అలాగే విద్యార్థులకు పుస్తకాల పంపిణి చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి, దామెర ప్రశాంత్, ఎండీ మాక్సూద్, దాడి రాజు, రసీద్ ,గ్రామ మరియు యూత్ నాయకులు పాల్గొనడం జరిగింది…….

విద్యాసంస్థల బందుకు బిఎస్యు ఆర్గనైజేషన్ సంపూర్ణ మద్దతు..

విద్యాసంస్థల బందుకు బిఎస్యు ఆర్గనైజేషన్ సంపూర్ణ మద్దతు

బిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మందసురేష్

పరకాల నేటిధాత్రి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కాలేజీల్లో నేలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రేపు విద్యార్థి సంఘల నాయకుల ఆధ్వర్యంలో బంధు ప్రకటించడం జరిగింది.ఈ బందుకు బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మందసురేష్ సంపూర్ణ తెలుపుతున్నామని అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని అనేక ఏళ్లుగా విద్యార్థి సంఘాలు పోరాటాలు చేశామని,ఎంత చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదని పేర్కొన్నారు.రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లే విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయని,పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వ విద్య సంస్థల్లో మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా నిధులను కేటాయించాలని,బెస్ట్ అవైలబుల్ నిధులను విదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గాలివానకు దెబ్బతిన్న వరి,మామిడి,మిర్చి ఇతర నేలకొరిగిన పంటలను సర్వే చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అలాగే రైతుల పక్షపతి కాంగ్రెస్ ప్రభుత్వం అని,ప్రజలు అధైర్య పడొద్దని,ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.

జర్నలిస్టుల దీక్షలకు “కుమ్మర సంఘం” మద్దతు

జర్నలిస్టుల దీక్షలకు “కుమ్మర సంఘం” మద్దతు

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

 

తూర్పు జర్నలిస్టులకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూములు ఇవ్వకపోవడంతో “ఐదవ రోజుకు” చేరుకున్న దీక్షలు. వారికి సంఘీభావంగా వెళ్ళి దీక్ష శిబిరం వద్ద మద్దతు తెలిపిన తెలంగాణ రాష్ట్ర “కుమ్మర సంఘం” అధ్యక్షుడు ఆకారపు మోహన్. ఈ సందర్భంగా ఆకారపు మోహన్ మాట్లాడుతూ తూర్పు జర్నలిస్టుల కొరకు నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లులను త్వరగా వాటికి కేటాయించాలని కోరుతూ, తెలంగాణ కుమ్మర సంఘం తూర్పు జర్నలిస్టులకు మద్దతు ప్రకటిస్తు, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ స్పందించి వీరికి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆర్.ఎం.పి నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఆర్ఎంపీ,పీఎంపి వ్యవస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిన సమయంలో మద్దతుగా శాసనసభ మండలి కౌన్సిల్ లో గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 45 వేల ఆర్ఎంపీల సేవలు ఎంత అవసరమో వివరించి ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అంటూ ఖరాఖండిగా మాట్లాడారని ఆర్ఎంపీ,పిఎంపి అసోసియేషన్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్ పేర్కొన్నారు.ఆర్.ఎం.పి ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆర్ఎంపీల సేవలను కొనియాడుతూ కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేసిన సేవలను ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవాలని తెలపడం అభినందనీయమని అన్నారు. ఇదేవిధంగా ఆర్ఎంపీల గుర్తింపు పట్ల అన్ని వేదికల మీద మొదటి నుంచి ఆర్ఎంపీ,పిఎంపి లకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఈ సమస్యను కౌన్సిల్లో లేవనెత్తడానికి ముఖ్య కారకులైన సందర్భం ఉందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతిపక్ష నాయకులందరూ ఆర్ఎంపీలకు మద్దతుగా నిలవాలని స్వామినాథ్ కోరారు.
ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, కోదండరాం సార్ లకు నర్సంపేట డివిజన్ ఆర్ఎంపి,పిఎంపి అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version