వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.

వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.

మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్
వనపర్తి నేటిదాత్రి :

రాష్ట్రంలో
రైతులు పండిచి న వడ్లు కొనుగోలులో
రాష్ట్ర ప్రభుత్వ రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ సాగునీళ్ళు రావడం లేదని రాకున్నా రైతులు కష్టపడి పండించుకున్న వడ్లు వెంటనే కొనుగోలు జరగక రైతులు ఐ.కే.పి,పి.ఏ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని నిరంజన్ అన్నారు యాసంగి పంటలో ఎటువంటి తేమగాని,తరుగుకాని ఉండదు అధికారులు తేమ ఉందని కొన్నిరోజులు,తాలు ఉందని గన్ని బ్యాగులు లేవని ,లారీలు రాలేదని రైతులను ఇబ్బందిపెట్ట డమూ పై మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం కొత్త గన్ని బ్యాగులు కొనుగోలు చేశామని చెబుతున్న క్షేత్రస్థాయిలో నాసిరకం బ్యాగుల వాడకం వల్ల అక్కడ కూడా రైతులు తరుగు కోల్పోవడం తో పాటు తేమ,తాళ్ళు అంటూ తరుగు కోల్పోవడంతో రైతులు తీవ్ర నష్టం ఎదురుకుంటున్నారని అన్నారు. రైతులు తూకం అయిపోగానే వాళ్ల పని అయిపోతలేదని బ్యాగులు నింపి ట్రాన్స్పోర్ట్ వరకు ఆగాలివస్తుందని వారికి సరిఅయిన సమయం అధికారులు చెప్పకపోవడం వల్ల రైతులు అన్ని పనులు వదులుకొని అక్కడ ఉండాల్సి వస్తుందని అన్నారు
మంత్రులు,అధికారులు వెంటనే స్పందించి మద్దతు ధరతో వడ్లను కొనుగోలు చేయాలని మాజి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.రైతులకు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను రైతులు వదులు కొని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసా పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు.
జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ఇమ్రాన్,నారాయణ నాయక్, మాజీద్,శ్రీనివాసులు ,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version