కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్

 కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్

 

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌తో (KTR) గ్యాప్‌పై మాట్లాడటానికి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు. బీఆర్ఎస్‌పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఇవాళ(ఆదివారం) బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా.. బీజేపీ హై కమాండ్ ఎందుకు చర్చించలేదని నిలదీశారు. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాననని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత.

సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు కార్మికుల‌ సమస్యలపై HMSతో కలసి అలయన్స్‌గా పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత.

 మా అన్న ఇంత బాగా చేస్తాడనుకోలేదు.

 మా అన్న ఇంత బాగా చేస్తాడనుకోలేదు…

మనోజ్‌ తన సోదరుడు విష్ణును పొగడడం మంచు అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం విడుదలైంది.మనోజ్‌ తన సోదరుడు విష్ణును పొగడడం మంచు అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం శుక్రవారం విడుదలైంది. మనోజ్‌ ఈ సినిమాను థియేటర్‌లో చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చింది. చివరి 20 నిమిషాలు అదిరిపోయింది. ప్రభాస్‌ యాక్టింగ్‌ అదిరింది. మా అన్న కూడా ఇంత బాగాచేస్తాడనుకోలేదు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న కలహాలు తెలిసిందే. ఈ క్రమంలో సినిమా విడుదలకు ఒక రోజు ముందు ‘కన్నప్ప’ చిత్రబృందానికి ఆల్‌ ద బెస్ట్‌ చెబుతూ మనోజ్‌ ట్వీట్‌ చేశారు. ఇందులో విష్ణు పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే సినిమా చూసిన తర్వాత తన అన్న విష్ణును మనోజ్‌ మెచ్చుకోవడంతో ఫ్యామిలీ అంతా మళ్లీ ఒక్కటయ్యే సమయం ఆసన్నమవుతోంది అంటూ మంచు అభిమానులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version