బీజేపీకి ఓటు షేర్ పెరుగుతోంది: రామ్చందర్ రావు
తెలంగాణలో బీజేపీకి ఓటు షేర్ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు అన్నారు. బీజేపీకి సున్నా అని గతంలో విమర్శించిన బీఆర్ఎస్ పనే ప్రస్తుతం సున్నా అయ్యిందని ఎద్దేవా చేశారు. గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన సందర్భంగా రామ్చందర్ రావు మాట్లాడారు. ‘ఓట్ల గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదు. ఓడిపోతారని తెలిసే ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.