ముదిరాజ్ లను ఓటు బ్యాంక్ గా చూస్తున్న ప్రభుత్వాలు.

ముదిరాజ్ లను ఓటు బ్యాంక్ గా చూస్తున్న ప్రభుత్వాలు..

ముదిరాజ్ ల రిజర్వేషన్ హామీని మరిచిన ప్రభుత్వం.

మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్

నర్సంపేట నేటిధాత్రి:

ప్రభుత్వాలు ఎన్ని మారిన ముదిరాజ్ లను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ ఆరోపించారు.
ముదిరాజ్ లకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని ప్రభుత్వం మరిచిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు.గురువారం నాడు దుగ్గొండి మండల కేంద్రంలో మండల మెపా స్వామి ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య హాజరైనారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో ముదిరాజుల రిజర్వేషన్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మెపా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ మండల ఉపాధ్యక్షులు సంకెళ్ళ స్వామి,దండు తిరుపతి, జెట్టబోయిన రాజేందర్, గ్రామ పెద్దలు ముత్యం భూమయ్య ముదిరాజ్, పోన్నం కుమార్ ముదిరాజ్, పొన్నం సదానందం, ముదిరాజ్ అడ్వకేట్ ముత్యం కిషోర్ ముదిరాజ్,డా.చింతకాయల శంకర్ ముదిరాజ్, పొన్నం వేణు ముదిరాజ్, పొన్నం అశోక్ ముదిరాజ్, గేళ్ళ రాజు ముదిరాజ్ సానబోయిన శివ ముదిరాజ్ పొన్నం నాగరాజు ముదిరాజ్, బుస మల్లయ్య ముదిరాజ్ లు పాల్గొన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట..

ఓటు హక్కు వినియోగించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట

కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి:
నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు మరియు బాధ్యత అనీ అలాగే మన ఓటు ద్వారా మన భవిష్యత్తును మనం రూపొందించుకోవచ్చు. కాబట్టి, అందరూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న.!

ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న యువనాయకుడు తెలుగుపాండు ముదిరాజ్.

జహీరాబాద్. నేటి. ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝరాసంగం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వారు ఓటు వేశారు. అనంతరం తెలుగు పాండు ముదిరాజ్ మాట్లాడుతూ.. “ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం” అని తెలిపారు. విద్యార్థులు రవి మహేష్ రెడ్డి,కుమార్,చంద్రశేఖర్ శ్రీశైలం యాదయ్య శ్యామ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నరు.

బహుజన్ సమాజ్ పార్టీ బొమ్మ సురేందర్ గౌడ్ ఎన్నిక.

బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులుగా బొమ్మ సురేందర్ గౌడ్ ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కేంద్రంలో లో మంగళవారం రోజున బహుజన సమాజ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులు బహుజనులదే అని అగ్రవర్ణ రాజకీయ పార్టీలను బొందపెట్టాలని మన ఓటు బీఎస్పీకే అని భూపాలపల్లి జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో చేపడుతున్నామని పార్టీ నిర్మాణంలో భాగంగా చిట్యాల మండల అధ్యక్షుడిగా బొమ్మ సురేందర్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version