ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

 

బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ప్రాజెక్టలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

 

ఖమ్మం, ఆగస్ట్ 10: గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు మధ్యలో పనులను అర్ధాంతరంగా ముగించేసిందని విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో రూ. 630 కోట్లతో నిర్మించ తలపెట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ అంటేనే పేదల ప్రభుత్వమని ఆయన ఆభివర్ణించారు.

10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఇల్లు అయినా నిర్మించాడా? అని ప్రజలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సన్న బియ్యం పంపిణి చేశాడా? అంటూ ప్రజలను అడిగారు. రూ. 12 వేల కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లు నిర్మాణం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రజా సంక్షేమంపై మాత్రమే ఉంటుందని.. అంతే కానీ ఓట్లపై ఉండదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. అపర భగీరథుడని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు రైతులకు తొలిసారి నీరు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కంకణం కట్టుకున్నారని తెలిపారు. దశబ్ద కాలంగా జవహార్ ఎత్తిపోతల పథకాన్ని నిర్విరం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతోందని మండిపడ్డారు. నాగార్జునసాగర్ నీరు పాలేరు రిజర్వాయర్ ద్వారా వైరాకు అక్కడి నుంచి మధిర, ఎర్రిపాలెం మండలాలకు సాగునీరు.. తాగునీరు అందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి ప్రణాళికలు రచించారని వివరించారు. అందుకు రూ.630. 30 కోట్లతో ఈ రోజు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ పరుగులు పెట్టిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. మాట ఇచ్చాం ఇల్లు పూర్తి చేస్తున్నాం.. అర్హులైన పేద ప్రజలు ఎవరూ కూడా ఇందిరమ్మ ఇళ్లు రాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. తమ ప్రభుత్వంలో రైతులకు టింగు టింగు మంటూ వారి ఖాతాలో రైతు భరోసా పథకం కింద నగదు పంపిణీ జరిగిందన్నారు. భూ భారతితో రైతులకు అనుకూలమైన చట్టం చేశామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవానికి సేవ చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఇచ్చారు.

పథకాల గెలుపులో రికార్డు సృష్టించిన సిఐఎస్ఎఫ్.

పథకాల గెలుపులో రికార్డు సృష్టించిన సిఐఎస్ఎఫ్

చంచల్ సర్కార్ కమాండంట్

హైదరాబాద్,నేటి ధాత్రి:

 

సిఐఎస్ఎఫ్ 2024 -2025 సంవత్సరంకు గాను పథకాల గెలుపులో రికార్డ్ సృష్టించింది.ఒలంపిక్ ఆశయాలను ఆవిష్కరించింది.ఇప్పటివరకు అతిపెద్ద క్రీడా నియామక డ్రైవ్ ను ప్రారంభించి భారీ స్పందనను పొందింది.భారత ప్రభుత్వం యొక్క ఖేలో భారత్ నీటితో అనుసంధానించబడిన ఒక ముఖ్యమైన చొరవలో కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సిఐఎస్ఎఫ్ దేశంలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి,పెంపొందించడానికి ముందుకు సాగుతుంది.2024.25 సంవత్సరంలో సీఐఎస్ఎఫ్ ఒలంపిక్ అథ్లెట్లు రికార్డ్ స్థాయిలో 159 పథకాలు సాధించారు.ఇది దళం చరిత్రలో అత్యధిక పథకాల సంఖ్య అంతర్జాతీయ,జాతీయ అఖిల భారత పోలీస్ క్రీడ పోటీలలో అద్భుతమైన ప్రదర్శన ఫలితంగా ఈ పథకాలు వచ్చాయన్నారు.ఇటీవల యూఎస్ఏ లోని బర్మింగ్ హమ్ లో ముగిసిన ప్రపంచ పోలీస్,అగ్నిమాపక క్రీడలు 2025 లో సిఐఎస్ఎఫ్ అథ్లెట్లు రికార్డు స్థాయిలో 66 పథకాలు గెలుచుకున్నారు.తద్వారా జాతీయస్థాయికి గణనీయంగా దోహదపడ్డారు.వారి అద్భుతమైన విజయాన్ని గుర్తించడానికి డిజీ సిఐఎస్ఎఫ్ 14 జులై న న్యూఢిల్లీలోని లోది రోడ్ లోని సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో వారిని సత్కరించారు.ఈ రికార్డు ప్రదర్శన పెరుగుదలకు అనేక కీలక కార్యక్రమాలు కారణమయ్యాయి.వాటిలో క్రీడ నిధులతో ఆరు రేట్లు పెరుగుదల (రూ.06 కోట్లకు) సంవత్సరానికి 300 రోజుల ప్రత్యేక ఆహార భత్యం (200 రోజుల నుండి) శిబిరాలు కోట్ల సమయంలో అథ్లెట్లు మెరుగైన ప్రయాణ డియర్ నెస్ అలవెన్స్ లు (టిఏ/డిఏ) కొత్త జిమ్ముల సౌకర్యాల ఏర్పాటు వార్షిక టోర్నమెంట్ క్యాలెండర్ల జారీ గాయాల నిర్వహణ కోసం సౌకర్యాలు మొదలైనవి ఉన్నాయి.రోజువారి పర్యవేక్షణ,పురోగతి పర్యవక్షణ కోసం మొదటిసారిగా ప్రధాన కార్యాలయంలో ఏఐజి స్థాయి అధికారిని నియమించారు.2026 నాటికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించే పూర్తి స్థాయి పర్వతరోహణ బృందాన్ని కూడా మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నారు.ఈ ఫోర్స్ ఇప్పటివరకు అతిపెద్ద స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను కూడా ప్రారంభించింది.దీని ద్వారా 433 మంది ప్రతిభవంతులను నియమించుకున్నారు.వీరిలో 229 మంది మహిళలు ఉన్నారు.ఈ డ్రైవ్ 7 జులై 2025న ప్రారంభమైంది.దేశవ్యాప్తంగా 14 ఎంపిక కేంద్రాలలో 29 జులై 2025 వరకు కొనసాగుతుందని అన్నారు.దీని ద్వారా లాన్ టెన్నిస్,బ్యాడ్మింటన్,కరాటే,సైక్లింగ్,అర్చరీ,ఫెన్సింగ్,కయాకింగ్,రోయింగ్,వుష్,పెన్ కాక్ సిలాట్ వంటి క్రీడలలో 13 కొత్త జట్లను ఏర్పాటు చేస్తారు.ఈ చొరవకు 12,868 మంది దరఖాస్తుదారుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు.వీరిలో 350 మంది అంతర్జాతీయ మరియు 3968 మంది జాతీయ పతాక విజేతలు ఉన్నారు.ఈ డ్రైవ్ అండమాన్,నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్ లోని గిరిజన భూములు ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశంలోని అన్ని మూలల నుండి గణనీయమైన ఆసక్తిని ఆకర్షించింది.ఇది కేవలం సిఐఎస్ఎఫ్ యొక్క సమ్మిళిత విధానం అట్టడుగు స్థాయి పరిధిపై దృష్టిని పునరుద్గాటిస్తుంది.ఒలంపిక్ పోడియంను దృష్టిలో ఉంచుకొని యువ ప్రతిభవంతులైన, ఆశాజనకమైన క్రీడాకారులను పోడియం స్థాయి ముగింపు సాధించగల హై పెర్ఫార్మన్స్ అథ్లెట్లు గా గుర్తించాలి.ఈ అథ్లెట్లు విదేశాలలో శిక్షణ శిబిరాలకు స్పాన్సర్షిప్ పొందుతారు.వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.ఇంకా నిపుణులైన కోచ్ లు ఫిజియోథెరపిస్టులు, డైటీషియన్లు,స్ట్రాంగ్ కండిషనింగ్ కోచ్ లతో సహా ప్రత్యేక సహాయక సిబ్బంది బృందం వారి అవసరాలను తీర్చడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయత్నాల ద్వారా సంస్థ దేశంలోని అన్ని శక్తులు,రాష్ట్రాలలో అగ్రగామిగా ఎదగాలని క్రీడ నైపుణ్యానికి ముందంజ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version