ఇల్లందకుంట బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం…చలివేంద్ర ప్రారంభం
1983-84 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో
ఇల్లందకుంట:నేటి ధాత్రి
.. అపర భద్రాద్రిగా పేరుందిన ఇల్లంద కుంట శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం లో నిర్వహించే రథోత్సవాలు,నాగబెల్లి ఉత్సవాల కోసం జమ్మికుంట జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల పదో తరగతి 1983- 84 బ్యాచ్ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జెడ్పి మాజీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, దేవాలయ కమిటీ చైర్మన్ ఇంగ్లె రామారావు ప్రారంభించారు. జెడ్పి మాజీ చైర్పర్సన్ కనుమల విజయ మాట్లాడుతూ 1983- 84 10వ తరగతి జెడ్పి హెచ్ఎస్ బాలుర పాఠశాల జమ్మికుంట బాల్యమిత్రులు కరోనా సమయం నుంచి సామాజిక సేవలో పాల్గొం టున్నారని గత ఐదు సంవత్సరాలుగా ఇల్లంతకుంట సీతారాముల బ్రహ్మోత్సవాలకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సేవలు చేయడం అభినందనీయమన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ రామారావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు నాలుగు రోజులపాటు భక్తులకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్న బాల్య మిత్రుల సేవా సమితి చేయూ తను అభినందించారు. బాల్య మిత్రుల సేవా సమితి అధ్యక్షులు మొకిరాల సంపత్ రావు మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం పదవ తరగతి చదువుకున్న మిత్రులమంతా బాల్య మిత్రుల సేవాసమితి ఏర్పాటు చేసుకొని గత ఐదు సంవత్సరాలుగా సామాజిక సేవలో పాల్గొంటున్నామని ఈ క్రమంలో ఇల్లంద కుంట రామాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేలాది భక్తులకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. బాల్య మిత్రుల చేతతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, తమకు మొదటి నుంచి సహకరిస్తున్న జెడ్పి మాజీ చైర్పర్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు. నిర్వహిస్తున్న చలివేదిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవస్థాన ఈవో కే సుధాకర్, ఆలయ కమిటీ డైరెక్టర్లు బాల్య మిత్రుల సేవాసమితి అధ్యక్షులు మొకిరాల సంపత్ రావు,o ప్రధాన కార్యదర్శి మంద వెంక రెడ్డి కోశాధికారి డి. సంపత్, బాల్యమితుల సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Category: తాజా వార్తలు
చలివేంద్రం ప్రారంభోత్సవం
చలివేంద్రం ప్రారంభోత్సవం
మాజీ కౌన్సిలర్ కొమురెల్లి అనిత సుధాకర్ రెడ్డి
నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం మున్సిపాలిటీ ఎస్వి నగర్ ప్రధాన రహదారి రోడ్ నెంబర్ – 1 వద్ద శ్రీ సాయి గ్రాండ్ మినీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అధినేత శ్రీ ఎనిశెట్టి చంద్రమౌళి గుప్తా గారు ఏర్పాటు చేసిన చలివేంద్రం (వాటర్ ఫ్రీజర్)ను స్థానిక మాజీ కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించినారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి వేసవి కాలంలో క్రమం తప్పకుండ బాటసారుల దాహర్తిని దృష్టిలో పెట్టుకొని కుల మతాలకు అతీతంగా చల్లని తాగునీటిని అందించాలని చల్లని ఫ్రీజ్ వాటర్ ఏర్పాటు చేసిన ఎనిశెట్టి చంద్రమౌళి గుప్తా గారి సేవలు ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు కార్యక్రమంలో కోమిరెల్లి సుధాకర్ రెడ్డి,మోకు జగన్ మోహన్ రెడ్డి,కొత్త గోపాల్ రెడ్డి,మామిడి నవీన్ రెడ్డి,పైళ్ల మల్లా రెడ్డి,సారా బాల్ రాజ్, కోమిరెల్లి వీరారెడ్డి,ఉచిడి అంజన్ రెడ్డి,ఏనుగు రమణ రెడ్డి, పండగ నర్సింహా,మర్రి లక్ష్మా రెడ్డి,మోడల నర్సింహా,ఈశ్వర్,గుమ్మడి వేణు,భాష తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ సభా వేదికసిద్ధం….
వరంగల్ సభా వేదికసిద్ధం….
ప్రతి పల్లె కదలి రావాలి కదం తొక్కుతూ…!
కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తరుణ్ నాయక్
కేసముద్రం/ నేటి ధాత్రి
వరంగల్ ను గమ్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తం గా బిఆర్ఎస్ కార్యకర్త లు, ప్రజలు ఉత్సాహం తో కదలికలోకి వస్తున్నారని. కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వాంకుడోత్ తరుణ్ నాయక్ తెలిపారు.
“పల్లె పల్లె కదలి రావాలని నినాదంతో ప్రతి ఊర్లో నూ చైతన్యం వెల్లి విరుస్తోందని.
25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) మరోసారి ప్రజల మద్దతుతో ముందుకు సాగేందుకు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమవుతుందని. ఈ సభ కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని. ఇది ఒక విశాల సంకల్పానికి సంకేతమని. ఉద్యమాన్ని గుర్తు చే సుకుంటూ, భవిష్యత్తు దిశగా ప్రజలను నడిపించే ప్రయ త్నం. ఉద్యమ కాలం నుంచీ సాధన వరకూ మార్గనిర్దేశ కుడిగా నిలిచిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఇప్పుడు భవిష్యత్తు తలుపులు తట్టేందుకు సిద్ధమవు ఉన్నారని తెలిపారు. గ్రామాలన్నీ ఒక్కటై, బండి మీద బండి, పాదా లపై పాదాలు వేసుకుంటూ, ఒకే నినాదంతో ముందుకు సాగుతున్నాయని “మన తెలంగాణ కోసం మళ్లీ కసితో ముందుకు సాగుతోందని ప్రతి వాడలోనూ, ప్రతి గూడెం లోనూ ఉద్యమాత్మక జోష్ చల్లరాని ఉత్సాహాన్ని నింపు తోందని. ఈనేపథ్యంలో, కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వాంకుడొత్ తరుణ్ నాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు.. వెనుకంజ లేదు వెనక్కి తిరిగే అవసరం లేదు. అన్నదమ్ములారా అక్కచెల్లెళ్ళారా బండి ఎక్కండి, కెసిఆర్ సభకు రండి వరంగల్ రజతోత్సవ సభను ఘనవిజయం చేద్దాం అని పిలుపునిచ్చారు.
గుత్తేదారు గుడిసెలో గుడుపుటాని.!
గుత్తేదారు గుడిసెలో గుడుపుటాని.!
ఆ అధికారి ఎవరు ,ఎందుకు వచ్చినట్లు పొంతన లేని సమాధానం.
గుత్తె దార్ తో గుసగుసలు, “క్యాజువల్ విజిట్ అని వెళ్ళిపోయిన అధికారి.
ఆ అధికారి ఎవరు ,ఎందుకు వచ్చినట్లు పొంతన లేని సమాధానం.
పెరుగుతున్న ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారం, పెరుగుతున్న లారీల సంఖ్య.
మైనింగ్, టీఎస్ ఎండి శాఖల, చీకటి ఒప్పందమే అక్రమ వసూళ్లు.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల పర్వం, హద్దు అదుపు లేకుండా పోయింది, ప్రధానంగా బొమ్మపూర్, ఎలికేశ్వరం, మహాదేవపూర్ పుసుపుపల్లి వన్, ఇసుక క్వారీల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు, అక్రమ వసూళ్ల వ్యవహారం వారం రోజులుగా బట్టబయలు కావడం జరిగింది, కానీ మైనింగ్, మినీరల్, శాఖలు మాత్రం నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. తాజాగా శనివారం రోజు, నేటి ధాత్రి, పైసా వసూల్’ పేరుతో కథనాన్ని ప్రచురించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు బొమ్మపూర్ ఎలికేశ్వరం క్వారీల విచారణకు ఓ అధికారి రావడం జరిగింది. వచ్చిన అధికారి విధి నిర్వహణ క్రమంలో, లారీ డ్రైవర్ల లోడింగ్ వ్యవహారం ఎలా సాగుతుంది, ఇలాంటి విషయాలను అడిగి తెలుసుకోవాలి కానీ, గుత్తి గుడిసెలో వెళ్లి, ఎక్కువసేపు గుడిసెలోనే కేటాయించి, లోడింగ్ వద్ద సుమారు పది నిమిషాలు, ఆ అధికారి వాహనంలో గుత్తేదార్ వ్యక్తులు కూర్చుని వెళ్లడం, అనంతరం మరో ఐదు నిమిషాలు వివిల్ క్యాబిన్లో ఉండి వెళ్లిపోవడం తో ఆ అధికారి ఎందుకు వచ్చినట్లు, ఆ అధికారి చేసిన విచారణ ఏమిటి, గుడిసెలు గుడుపుటాని చేసి వెళ్లిపోవడం జరిగిందని అక్కడ డ్రైవర్లు చెప్పుకోవడం జరుగుతుంది.
గుత్తేదారు గుడిసెలో గుడుపు పుటాని !
పెద్ద వాహనంలో బొమ్మ పూర్ ఇసుక రీచుల వద్ద అందరూ చూస్తుండగానే, గుత్తి దారి గుడిసెలో వెళ్లడం జరిగింది. సుమారు 30 నిమిషాలు గుడిసెలో, గుసగుసలు చేసిన ఆ అధికారి, గుత్తేదార్ ను తన వాహనంలో ఎక్కించుకొని లోడింగ్ పాయింట్ వద్దకు వెళ్లి అక్కడ పదో నిమిషాలు కేటాయించి తిరిగి వెళ్లిపోవడం జరిగింది. గుడిసెలో అంతా గుడుపుటాని జరిగిందని, ఆ అధికారి ఎలాంటి విచారణ, అక్రమ వసూళ్ల వ్యవహారం పై వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరా, లారీ డ్రైవర్ల తో అక్రమ వసూళ్లపై అడిగి తెలుసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకుండా, అధికారి సుడిగాలి పర్యటన వచ్చి వెళ్లిపోవడంతో, గుడిసెలో గుడుపుటాని జరిగిందని, అందుకే అధికారి సాఫీగా వెళ్లిపోవడం జరిగిందని, అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు చెపుతున్నారు.
ఆ అధికారి ఎవరు ,ఎందుకు వచ్చినట్లు పొంతన లేని సమాధానం.
బొమ్మపూర్ ఇసుక క్వారీలో, విజిలెన్స్ మైనింగ్ అధికారులు వచ్చాయన్న సమాచారంతో, నేటి ధాత్రి బొమ్మ పూర్ ఇసుక క్వారీ కు వెళ్లగా, ఓ భారీ వాహనంలో అధికారి లోడింగ్ పాయింట్ వద్దకు నుండి వచ్చి గుత్తేదారు గుడిసె వద్ద ఆగడంతో, కాంట్రాక్టర్ సిబ్బంది ఒకరు దిగిన అనంతరం ఆ అధికారి కూడా, అక్కడినుండి టీఎస్ఎండిసి కాంటెండర్ లోకి వెళ్లి కూర్చోవడం జరిగింది, అనంతరం నేటి ధాత్రి ఆ అధికారికి తన పరిచయం చేసుకుంటూ, అక్రమ వసూళ్ల వ్యవహారం ఝాట్కా బకేట్ సాక్షాలను ప్రచురించడం జరిగింది అని వివరించడంతో, ఆ అధికారి, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇకనుండి పైసలు తీసుకోరు, ఎండి గారి దృష్టికి తీసుకు వెళ్తాం, అని చెప్పి కంతేరు నుండి బయటికి వచ్చి వాహనం వైపు వెళ్తున్న క్రమంలో నేటి ధాత్రి, మీరు ఏ శాఖ నుండి వచ్చారు, మీ డిజిగ్నేషన్ హోదా ఏమిటి అని అడిగిన, నేను కూడా జీఎం అంటూ చిరునవ్వు చిందించి వాహనం ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇది అధికారుల తీరు, అధికారి ఎవరు ఏ శాఖకు చెందినవారు కనీసం అక్రమాలపై విచారణ, వివరాలు సేకరించడం లాంటి ఏమన్నా చేశారా అలాంటి ఏమీ లేకుండా, గుంతలు దీనికి సమాధానాలు చెప్పి వెళ్లిపోయిన పద్ధతి ఇసుక క్వారీల అక్రమ ఇసుక రవాణా అక్రమ వసూళ్లకు శాఖల అధికారులు ప్రోత్సహిస్తున్నారని చెప్పడానికి ఇదే సాక్ష్యం.
పెరుగుతున్న ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారం, పెరుగుతున్న లారీల సంఖ్య.
మండలంలో నిర్వహించబడుతున్న 9 ఇసుక క్వారీలో సుమారు ఏడు ఇసుక క్వారీలు, అక్రమ వసూళ్ల వ్యవహారం ఆపడం లేదు, సీరియల్ పేరుతో 700 ,900, మరికొన్ని క్వారీలు 1000 రూపాయలు అదనంగా లోడింగ్ చార్జీలు 200, ఫోక్లైన్ మెయింటెనెన్స్ పేరుతో మరో 200, ఇలా సుమారు ప్రతి క్వారీ 900 నుండి 1100 వరకు అక్రమ వసూళ్ల వ్యవహారం కొనసాగించడం జరుగుతుంది. ప్రస్తుతం మండలంలో అక్రమ వసూళ్ల వ్యవహారంలో సాక్షాలతో తెరపైకి వచ్చిన, బొమ్మపూర్, ఎలికేశ్వరం, మహాదేవపూర్ పుసుపుపల్లి, ఈ క్వారీలతోపాటు మరికొన్ని క్వారీలు కూడా, అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని కొనసాగించడం జరుగుతుంది. అక్రమ వసూళ్ల వ్యవహారంతో ఈ మూడు క్వారీలే కాకుండా మిగతా క్వారీలో కూడా లారీల సంఖ్య, దినదినం పెరుగుతూ పోతుంది, మతుక ఇసుక అయినప్పటికీ వందల సంఖ్యలో లారీలు, ఇసుక లోడింగ్ కొరకు కొన్ని ఇసుక రీచ్ ల వద్ద పెద్ద మొత్తంలో రావడం, అక్రమ వసూళ్ల వ్యవహారం, అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని స్పష్టం కావడం జరిగింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము, కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్ల తో ఖజానాకు గండి కొట్టడం జరుగుతుంది. ప్రతి క్వారీ సుమారు 150 నుండి 200 లారీలను ఇసుకను క్వారీల నుండి రవాణా చేయడం జరుగుతుంది వాటికి ఒక్కొక్క క్వారీ, లక్షా నలభై ఐదు వేల నుండి రెండు లక్షల 25 వేల రూపాయల వరకు, ప్రతిరోజు అక్రమ వసూళ్లు చేసుకొని సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.
మైనింగ్, టీఎస్ ఎండి శాఖల, ప్రోత్సాహమే అక్రమ వసూళ్లు.
మండలంలో ఇసుక క్వారీల అక్రమ వసూళ్ల వ్యవహారం వైనింగ్ టిఎస్ఎండిసి చీకటి ఒప్పందమే అని చెప్పక తప్పదు, దానికి గత వారం రోజులుగా నేటి ధాత్రి సాక్షాల తో వరుస కథనాలు, శనివారం ఓ అధికారి బొమ్మ పూర్ ఇసుక క్వారీ కు వచ్చి విచారణ పేరుతో, గుత్తి దారి గుడిసెలో గుడిపుఠాణి చేయడం, పొంతనలేని సమాధానాలు చెప్పి వెళ్లిపోవడం, ఉన్నత అధికారులకు దీని కంటే పెద్ద సాక్షం మరొకటి ఉండదు. సాక్షాలతో కథనాలు ప్రచురించిన, మైనింగ్ టీఎస్ ఎంబీసీ ఉన్నత అధికారులు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారంటే, ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారం, చీకటి ఒప్పందం అని చెప్పడంలో సందేహం లేదు, ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందిస్తారా, లేక చీకటి ఒప్పందాన్ని’, ఇలాగే సాగిస్తారా అన్నది వేసి చూడాల్సిందే.
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని జమస్థాపురం, రూప తండా లో జరిగింది. రైతు భూక్య రవి గురువారం తన పొలం వద్ద ఎద్దులను మేత మేపుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు ఒక ఎద్దు వెళ్లగానే షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. వ్యవసాయ పనులకు ప్రధాన ఆధారమైన ఎద్దు మృతి తో కుటుంబం ఆర్ధికంగా నష్టపోయింది.. వారు కన్నేరుమున్నీరు గా విలపించారు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఎద్దులు మృతి చెందాయని బాధిత రైతులు ఆరోపించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేషి కుటుంబాన్ని ఆదుకోవాలని తొర్రూరు ప్యాక్స్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ రావు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
గర్భిణీలు,బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
గర్భిణీలు,బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి
Pregnant women
గర్భిణీలు బాలింతలు పిల్లలు అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అమర్ సింగ్ తండా, కర్రె బిక్యా తండా, చౌల తండా అంగన్వాడి సెంటర్లలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వల్లే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, చిరుధాన్యాలతో లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం, పుట్నాలు, వేరుశనగ పల్లీల పొడి, మునగాకు కారం పొడి మొదలగు పదార్థాలు,పోషక విలువలు గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మడిపల్లి హెల్త్ సూపర్వైజర్ జిఎల్. మేరీ, అంగన్వాడి టీచర్లు జె కమలాదేవి, వి.భారతి, చంద్రకళ, సీత, ఏఎన్ఎం ఉమా,శారద, ఆశా కార్యకర్తలు స్వరూప,కరుణ, ఆయా శారద, స్థానికులు పాల్గొన్నారు.
తాటి చెట్టు పైనుంచి పడి కార్మికుడు మృతి.
తాటి చెట్టు పైనుంచి పడి యువ గీతా కార్మికుడు మృతి
జైపూర్,నేటి ధాత్రి:
ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేమనపల్లి మండలం దస్నాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాకేష్ గౌడ్ (28) రోజు మాదిరిగానే తాటి చెట్టు ఎక్కి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో త్రీవ గాయాలు కాగా గమనించిన స్థానికులు దగ్గర్లో ఉన్న చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇంటికి దిక్కు అయినటువంటి కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంతో నిండిపోయింది.మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలు నాయకులు కోరారు.
బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలి
బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలి
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు
తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి
ఈనెల 27న ఎల్కతుర్తి
వరంగల్ జిల్లాలో జరుగు బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని తొర్రూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతానములు గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం నేడు కొమ్మనపల్లి, చింతలపల్లి టీక్య తండా, పెద్దమంగ్య తండా, వెలికట్టే, భోజ్య తండా ఈదులకుంట తండా నాంచారి మడూర్ ,గుడి బండ తండా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశా నిర్దేశం చేశారు కార్యక్రమంలో మాజీ తొర్రూరు మండలం ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ మాజీ కో ఆప్షన్ ఎస్కే అంకుష్ ,కాలు నాయక్, ఈనపెళ్లి శ్రీనివాస్ ,పాపిరెడ్డి , పులి వెంకన్న ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఉపసర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు రజితోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు
గణపురం ఎస్ ఐ రేఖ అశోక్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో మధ్యాహ్నం సేవించి వాహనాల వాహనాలు నడిపితే చర్యలు తప్పవని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు అతిగా మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ వాహనాల తనిఖీలు పట్టుబడిన గణపురం మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన పోలు రమేష్ కు భూపాలపల్లి జ్యుడిషినల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎన్ రామచందర్ రావు ఐదు రోజుల జైలు శిక్ష విధించారు అని మద్యం సేవించి వాహనాలు నడిపితే వారికి అదే విధంగా త్రిబుల్ రైడింగ్ మైనర్లు డ్రైవింగ్ చేసినట్లయితే వారికి పై శిక్షలు వర్తిస్తాయని హెచ్చరించారు
ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఏర్పాటు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ ఏర్పాటు
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి
ఏఎస్ రావు నగర్ నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లానేటిధాత్రి:
ఎఎస్ రావు నగర్ డివిజన్ లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ తల్లి గారి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు వారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ
ఆరోగ్య కేంద్రంలో వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేయడంతో రోగులకు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి వేసవిలో దాహార్తిని తీర్చేందుకుఉపయోగపడుతుందని అన్నారు
వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసినందుకు కేశెట్టి ప్రసాద్ ను ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రాజేంద్రన్, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, సీనియర్ నాయకులు అజిజ్, సుంకు శ్రీకాంత్ రెడ్డి, పెద్ది నాగరాజు, పెద్ది శ్రీను, తాడూరి అనిల్ కుమార్, భద్రగామ నరసింహ, మామిడి శ్రీనివాస్, పూర్ణ యాదవ్, మల్లారెడ్డి,శ్రీహరి, సత్యనారాయణ, తాడూరి ఉష రాణి,భవాని, సునీత, సంధ్య, మాదవి, మీనా, రాణి,మరియ తదితరులు పాల్గొన్నారు.
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.
#మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి
ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని శనిగరం, ఆర్వయ పల్లె, కన్నారావుపేట గ్రామాలలో పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీని స్థాపించి 25 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎలుకతుర్తి లో ఏర్పాటు చేయడం జరిగిందని. తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన పార్టీ బిఆర్ఎస్ అని కొనియాడారు. కావున నర్సంపేట నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సభను విజయవంతం చేయడం కోసం మండలంలోని పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి బానోతు హరినాథ్ సింగ్, క్లస్టర్ బాధ్యులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, మాజీ సర్పంచ్ నాన్న బోయిన రాజారాం యాదవ్, నాయకులు మంద రాజిరెడ్డి, తిప్పని రవీందర్ గౌడ్, ఊట్కూరి అశోక్ గౌడ్, భూక్య బాలరాజు, మాడిశెట్టి రవి, తంగెళ్ల రవీందర్ రెడ్డి, పూజారి రాజు గౌడ్, మాజీ వార్డ్ మెంబర్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి పాఠశాల మరో జలియన్వాలాబాగ్.
చర్లపల్లి పాఠశాల మరో జలియన్వాలాబాగ్
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో జలియన్వాలా బాగ్ సంఘటనను పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ఆ సంఘటనను కనులకు కట్టినట్లుగా విద్యార్థుల ద్వారా నాటకీకరణ చేయించడం విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రజలను ఆకట్టుకున్నది. జలియన్వాలా బాగ్ ప్రదేశంలో మరణించిన భారతీయుల స్తూపానికి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ నివాళులర్పించారు.అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ 1919 ఏప్రిల్ 13 న భారత నేల రక్తంతో తడిసిన రోజు అని, దుర్మార్గపు చట్టాన్ని వ్యతిరేకించినందుకు బ్రిటీష్ వారు ఆడిన రక్తపు క్రీడ అని, బ్రిటీషు ప్రభుత్వం ఆమోదించిన “రౌలత్ చట్టం” ప్రకారం పోలీసులు ప్రజలను అనుమానితుల పేరుతో ఎటువంటి విచారణ లేకుండా, రెండు సంవత్సరాలపాటు నిర్భందించవచ్చఅని, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సైపుద్దిన్ క్లిచ్, సత్యపాల్ సింగ్లను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీరి అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రజలు అమృత్సర్ లోని జలియన్ వాలాబాగ్ లో సమావేశం అయ్యారు అని
ఈ సమావేశంలో హన్స్ రాజ్ అనేవ్యక్తి ప్రసంగిస్తున్నప్పుడు, అప్పటి సైనిక అధికారి జనరల్ డయ్యర్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే, నిరాయుధులైన ప్రజలపై 1650 రౌండ్ల కాల్పులు పది నిమిషాల పాటు,379 మరణాలు, రెండువేల మందిని గాయపరిచారు,అనేక మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకొనుటకు అక్కడి బావిలో దూకారనీ,తుటాలు తగలి చాలామంది చనిపోయారు అని అన్నారు.ఈ సంఘటనలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనయే భారతదేశ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురాగతంగా నిలిచిపోయిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మేకల సత్యపాల్,
ఐ ఈ ఆర్ టి రమేష్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
16,వ తేదీన జరిగే భవణ నిర్మాణ.!
ఈనెల 16,వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో జరిగే భవణ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయండి
ములుగు టౌన్ నేటి దాత్రి
ములుగు జిల్లాలో ఈరోజు వెంకటాపూర్ మండల కేంద్రములో భవణ నిర్మాణ కార్మిక సంఘం కార్యకర్తల సమావేశం బండి నర్సయ్య అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ భవణ నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు, అనేక పోరాటాల ఫలితంగా భవనిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు జరిగినది అన్నారు, కానీ దాని ద్వారా కార్మికులకు లభిస్తున్న ఫలితాలు నామమాత్రంగా ఉన్నాయి అన్నారు, ప్రసూతికి,రూ,,30000/-పెళ్ళికి రూ,30000/-ఇస్తున్నారు దానిని రూ,,100000/-కు పెంచాలని అలాగే సహజ మరణానికి రూ,,1,30000/- ప్రమాధ మరణానికి రూ,,6,30000/- ఇస్తున్నారు,మరణం అనేది ఎలా జరిగినా మరణమే కాబట్టి రూ, 10,00000/- అందించాలని డిమాండ్ చేశారు కనుక ఈ సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం అన్నారు, అందులో భాగంగా ఈనెల 16 వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్ధ్యోగుల భవణములో జరిగే తెలంగాణ భవణ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, సంఘం జిల్లా కోశాధికారి కొక్కుల రాజేందర్, ఏఐటియుసి మండల నాయకులు తోట సంపత్, దేవేందర్, సురేష్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు చింతల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ఆవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు
గోకారం రాజు కటకం శ్రీధర్ చిదేరే వెంకటేష్. నూకల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.
జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.
వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నీలం కుమారస్వామి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి యువతీ యువకులు నిరుద్యోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న మన నాయకుడు గౌరవ శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు ఆదేశాల మేరకు ఈనెల 26 తారీఖున జరగబోయే మేఘా జాబ్ మేళా కు గోపాలపురం మూర్తి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్, పంచాయతి కార్యదర్శి రమాదేవి ఎ ఎస్ ఐ సమ్మిరెడ్డి అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, జ్యోతి, నీలవర్ణ ఆశ వర్కర్స్ మహిళా సమైక్య CA కోడూరు ఓంకార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవిందుల భద్రయ్య హెడ్ కానిస్టేబుల్ యాకయ్య పిసి నాగరాజ్ యూత్ నాయకులు పనస రాకేష్, సునీల్ కుంచాల, కత్తి మహేష్ శ్రీకాంత్ మూల నాగరాజ్, గ్రామంలోని యువతీ యువకులు మెగా జాబ్ మేళా లో అధికసంఖ్యలో పాల్గొని 70 మంది యువతి యువకులు, పేర్లు నమోదు చేసుకున్నారు.
ఉపాధి హామీ పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్.
ఉపాధి హామీ పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు పరిశీలన,కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్, అంగన్వాడి సెంటర్ తనిఖీ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని పెద్ద ఎత్తున లేబర్ ను మొబలైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన అడవిలోకి వెళ్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు చేస్తున్న ట్రాం చ్ పనులను పరిశీలించారు.
అలాగే కూలీల సమస్యలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కూలీల కుటుంబ వివరాలు, ఉపాధి హామీ కూలీ డబ్బులు,పని వేళలు,తదితరాల విషయాలను అడుగుతూ, వారితో హాయిగా ముచ్చటిస్తూ, స్ఫూర్తిని కలిగించారు.ఈ సందర్భంగా ఎంత మంది ఇక్కడ ఈ కూలీ పనులు చేస్తున్నారు? వారి పని వేళలు ఎప్పటివరకు? రోజుకు ఎంత మేర కొలతతో పనులు చేస్తున్నారు? వంటి వివరాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని ఉపాధి హామీ పథకం పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు లేబర్ ను మొబలైజ్ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.ఈ మూడు నెలలు అత్యంత కీలకమని చెప్పారు.ఈ మేరకు అధికారులు స్పందిస్తూ పర్వతాపూర్ గ్రామంలో 160 మంది ఈ కూలీ పనులు చేస్తున్నారన్నారు.ఎండాకాలం దృష్ట్యా వారి పని వేళలు ఉదయం 7 నుంచి 11 వరకు అని అన్నారు. 5 మీటర్స్ పొడవు 1 మీటర్ వెడల్పు , 0.5 మీటర్ లోతు పనులు చేస్తున్నారని వారు కలెక్టర్ కు వివరించారు.అలాగే ఉపాధి హామీ పనులకు సంబంధించిన కొలతల పుస్తకాన్ని, జాబ్ కార్డులను, మాస్టర్ రోల్ ను అన్ని రిజిస్టర్ లను స్పష్టంగా నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని, పనుల పురోగతికి సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు.కొలతల్లో వ్యత్యాసం రావొద్దని, సామాజిక తనిఖీల్లో ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు.స్వయంగ అక్కడ తీసిన ట్రెంచ్ ల కొలతలు టేప్ తో కొలచి సంతృప్తి వ్యక్తం చేశారు.వేజ్ పెరిగితే మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని అన్నారు.
వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని అదే విధంగా తాగునీరు,నీడ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి ప్రభావం ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.శరీరం నిర్జలీకరణ డీ హైడ్రేషన్ కు గురికాకుండా సరిపడా స్వచ్ఛమైన తాగునీరు, ఉత్తేజితులయ్యేందుకు గాను ఓఆర్ఎస్ నీటిని క్రమం తప్పకుండా తాగాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూలీలకు సూచించారు.కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు, అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు, అంగన్వాడి సెంటర్లో చిన్నారుల మేధస్సును పాటలు పద్యల రూపంలో పరీక్షించి అంగన్వాడీ పనితీరు పట్ల ఆదర్శంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాజుద్దీన్, పంచాయతీ సెక్రెటరీ వరలక్ష్మి, ఏపీవో శంకరయ్య, టెక్ని టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి.
‘అందరిపై.. ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి’
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
అందరిపైనా ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా.. మహబూబ్ నగర్ పట్టణంలోని అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆకాంక్షించారు. ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు గుండా మనోహర్, శివశంకర్, రామాంజనేయులు , హరిబాబు , రామకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్
వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చాము
– బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత
– కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్
సిరిసిల్ల, ఏప్రిల్
ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్, పేషంట్లతో డాక్టర్లు సరిగా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుందన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ
2019 బ్యాచ్ ఎంబిబిఎస్ స్టూడెంట్స్ కు డాక్టర్లుగా మారబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.
నా చిన్నతనంలో మా అమ్మ కూడా నేను డాక్టర్ కావాలని కోరుకుందని అన్నారు.
వ్యక్తిగత జీవితం, ప్రాధాన్యతలను కూడా పక్కన పెట్టి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని కెసిఆర్ నాకు చెప్పారు.
డాక్టర్లు పేషంట్లతో సరిగా మాట్లాడితే 50 శాతం జబ్బు నయమవుతుంది. ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రూపంలో డాక్టర్లకు రాబోయే రోజుల్లో పెద్ద చాలెంజ్ ఎదురు కాబోతుందని అన్నారు.
చాట్ జిపిటి , గ్రోక్ లు ప్రిస్కిప్షన్ లు కూడా రాస్తున్నాయని అన్నారు.
ఏఐ ఇచ్చే సమాచారం ఆధారంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్ల దగ్గరకు వస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఇలాంటి పేషెంట్లను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అన్నారు.
కరుణ, సానుభూతితో రోగులకు డాక్టర్లు సేవ చేయాలని అన్నారు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు.
ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు.
హెల్త్ కేర్ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చామని అన్నారు.
వైద్యరంగంలో తెలంగాణ సాధించబోయే ప్రగతిలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు.
అందరిపై ఉంది కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర.
రాజ్యాంగమును కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో నగరంపల్లి కొండంపల్లి కొండాపూర్ రంగారావుపల్లి బిక్కోనిపల్లి బంగ్లాపల్లి సీతారాంపురం అప్పయ్య పల్లి, భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు,జై భీం,జై సంవిధాను లో బాగంగా ఈ రోజు గణపురం మండలం గ్రామంల లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,రాజ్యాంగ పిటికలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్,కార్యక్రమ మండల ఇన్చార్జి పంతకాని సమ్మయ్య మాజీ ఎంపిటిసి కాటారం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమారస్వామి, మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుందని అన్నారు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ,అణగారిన వర్గాల హక్కులు కాలరాస్తున బీజేపీ వైఖరి నశించాలని నినదించారుభారత రాజ్యాంగమును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆద్వర్యంలో నెల రోజులు మండల వ్యాప్తంగా జరిగే యాత్రలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు,విద్యావంతులు పాల్గొని విజయంతం చేయాలని కోరారు. నగరంపల్లి మాజీ సర్పంచ్ ఆలూరి కుమారస్వామి, పరశురాంపల్లి మాజీ సర్పంచ్ తాళ్ల పెళ్లి భాస్కర్ రావు, మాధవ్ సత్యనారాయణ రెడ్డి, గొర్రె బాలరాజు, గొర్రె రవి, వెల్గం రాజయ్య, మల్లికార్జున, ఆవుల రవి, తదితరులు పాల్గొన్నారు.కొండంపల్లి దాసర రవి,చిట్యాల నాగరాజు, దాసరి లక్ష్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజబాబు , మాజీ సర్పంచ్ మామిడి రవి, మామిడి సర్వేశం, మాజీ ఎంపిటిసి పెద్దల్ల సారయ్య, మామిడి చిరంజీవి, రవి తదితరులు పాల్గొన్నారు. రంగారావు పల్లి మాజీ ఎంపీపీ రామేశ్వరరావు, కందుకూరు బ్రహ్మచారి, రవి, ఎర్రబెల్లి మలల్ రావు,భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. బంగ్లాపల్లి సీనియర్ నాయకులు ఉపేందర్ రావ్, గొట్టేముక్కల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. సీతారాంపురం గ్రామ శాఖ అధ్యక్షులు పీట్ల రంజిత్, మాజీ ఎంపిటిసి బొల్లం జంపయ్య, మాజీ ఎంపిటిసి పెద్దోళ్ల సారయ్య, ఉపేందర్ రావ్, గొట్టేముక్కుల సుధాకర్ రావు, దూడ దేవేందర్ రెడ్డి, గంధం రాజు, మంద రగు, మేకల పున్నo, తదితరులు పాల్గొన్నారు. అప్పయ్య పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు కొడాలరి రవి, దోమల రాజయ్య, దోమల సమ్మయ్య, ఎలుక పెళ్లి రమేష్, దోబ్బాల సాంబయ్య, మాజీ సర్పంచ్ దోమల రవీందర్, తదితరులు పాల్గొన్నారు
శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.
అంగరంగ వైభవంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి
భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతూ దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న చిల్పూర్ గుట్ట చిల్పూర్ మండల కేంద్రంలోని కొలువైన శ్రీ ముగ్గులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణ మహోత్సవం శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారిని లక్ష్మీ ప్రసన్న ,ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు,కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకుల శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలలో భాగంగా హారతులు, అభిషేకాలు,అర్చనలు నిర్వహించారు.ఇందులో భాగంగా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు అయ్యారు.దీంతో ఆలయ పరిసరాలు ఓం నమో వెంకటేశాయ నామస్మరణలతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.