మహిళల గోరింటాకు సంబరాలు..

మహిళల గోరింటాకు సంబరాలు..

నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ)
ఆర్యవైశ్య మహాసభ హనుమకొండ జిల్లా కమిటీ, జిల్లా మహిళా కమిటీ,వాసవి క్లబ్ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద గల టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన “ఆషాఢ గోరింటాకు సంబరాలు”కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వైశ్య సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమమూలో పాల్గొన్న
మహిళా సోదరమణులు సామూహికంగా ఒకరి చేతికి ఒకరు మైదాకు పెట్టుకుని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమ ప్రారంభ సూచకంగా మహిళలు వైశ్యుల కులదేవత, ఆరాధ్య దైవం, వాసవి మాత చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళలు తంబోలా తదితర కాలక్షేప కార్యక్రమాలు నిర్వహించుకుని, గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి హన్మకొండ జిల్లా ఆర్యవైశ్య మహసభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట సురేష్, దొడ్డ మోహన్ రావు మాట్లాడుతూ భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లాలోని మహిళా సోదరీమణులు ఆషాడ మాస గోరింటాకు కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయడం పట్ల సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకు వచ్చిన జిల్లా మహిళా కమిటీనీ వారు ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తులో జిల్లా మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా అధ్యక్షులు తోట సురేష్, ప్రధాన కార్యదర్శి దొడ్డ మోహన్ రావు, కార్య నిర్వాహక అధ్యక్షుడు వెనిశెట్టి రఘు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుకొనీశెట్టి మునిందర్,చకిలం రాజేశ్వర్ రావు,పబ్బతి నాగభూషణం, ఆవోప హన్మకొండ జిల్లా కోశాధికారి గంప సతీష్ వెలగందుల శ్రీధర్, శ్రీనివాస్,లక్ష్మణ్ కాంత్, జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు పడకండి జ్యోతి, ఉపాధ్యక్షురాలు దొడ్డ దేవి, కోశాధికారి అయిత పద్మజ, దోమకుంట్ల వాణి,తోట సంధ్య ,పబ్బతి సునీత,శ్రీరామ్ జయలక్ష్మి,భారతి,అన్నపూర్ణ లతో పాటు సుమారు నూట యాభై మంది మహిళలు పాల్గొన్నారు.

విద్యుత్ సబ్ స్టేష‌న్ లు పెంచండిః.

విద్యుత్ సబ్ స్టేష‌న్ లు పెంచండిః

మంత్రి గొట్టిపాటికి ఎమ్మెల్యే విన‌తి

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 12:

పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా తిరుప‌తిలో నూత‌నంగా ప‌ది విద్యుత్ స‌బ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ‌నివారం ఉద‌యం కోరారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తిరుప‌తికి వ‌చ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటికి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు విన‌తి ప‌త్రం ఇచ్చారు. జ‌న‌భా పెరుగుద‌ల‌తో విద్యుత్ విన‌యోగం పెరిగింద‌ని భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ఠ్యా విద్యుత్ స‌ర‌ఫ‌రా మెరుగుద‌ల‌కు 33 / 11 కేవి స‌బ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆ విన‌తి ప‌త్రంలో ఎమ్మెల్యే కోరారు. మ‌హిళా యూనివ‌ర్శిటీ, ఆర్సీ రోడ్డు, కొర‌మేణుగుంట‌, తుడా ట‌వ‌ర్స్ వ‌ద్ద త‌క్షిణం స‌బ్ స్టేష‌న్ లు ఏర్పాటుకు మంత్రి అంగీక‌రించారు.అలాగే బైరాగిప‌ట్టెడ‌,జీవ‌కోన‌, రామ‌చంద్ర‌పుష్క‌రిణి, శెట్టిప‌ల్లి, క‌పిల‌తీర్థం, అర్బ‌న్ త‌హ‌శిల్దార్ కార్యాల‌య స‌మీపంలో కూడా స‌బ్ స్టేష‌న్ లు ఏర్పాటు చేయాల‌ని కోర‌గా త్వ‌ర‌లోనే వీటి నిర్మాణానికి ఏపిఈఆర్సీ అనుమ‌తి ఇస్తుంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులుకు మంత్రి స్ప‌ష్టం చేశారు.

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నీలం కుమారస్వామి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి యువతీ యువకులు నిరుద్యోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న మన నాయకుడు గౌరవ శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు ఆదేశాల మేరకు ఈనెల 26 తారీఖున జరగబోయే మేఘా జాబ్ మేళా కు గోపాలపురం మూర్తి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్, పంచాయతి కార్యదర్శి రమాదేవి ఎ ఎస్ ఐ సమ్మిరెడ్డి అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, జ్యోతి, నీలవర్ణ ఆశ వర్కర్స్ మహిళా సమైక్య CA కోడూరు ఓంకార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవిందుల భద్రయ్య హెడ్ కానిస్టేబుల్ యాకయ్య పిసి నాగరాజ్ యూత్ నాయకులు పనస రాకేష్, సునీల్ కుంచాల, కత్తి మహేష్ శ్రీకాంత్ మూల నాగరాజ్, గ్రామంలోని యువతీ యువకులు మెగా జాబ్ మేళా లో అధికసంఖ్యలో పాల్గొని 70 మంది యువతి యువకులు, పేర్లు నమోదు చేసుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version