గీత కార్మికుడు మృతి.

గీత కార్మికుడు మృతి.

నాగర్ కర్నూల్/ నేటిదాత్రి :

 

నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలంలో సిర్సవాడ గ్రామంలో తాడిచెట్టు పైనుండి కిందపడి గీత కార్మికుడు మల్లేష్ (40) మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం తాటి కల్లు దింపడానికి పైకి వెళ్లి కళ్ళు దింపే ప్రయత్నంలో.. మొకు తాడు తెగి.. భూమిపైకి జారిపడి అక్కడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతిడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తాటి చెట్టు పైనుంచి పడి కార్మికుడు మృతి.

తాటి చెట్టు పైనుంచి పడి యువ గీతా కార్మికుడు మృతి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేమనపల్లి మండలం దస్నాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాకేష్ గౌడ్ (28) రోజు మాదిరిగానే తాటి చెట్టు ఎక్కి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో త్రీవ గాయాలు కాగా గమనించిన స్థానికులు దగ్గర్లో ఉన్న చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇంటికి దిక్కు అయినటువంటి కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంతో నిండిపోయింది.మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలు నాయకులు కోరారు.

వృక్షో రక్షతి రక్షితః.

వృక్షో రక్షతి రక్షితః

 

నడికూడ,నేటిధాత్రి:

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థుల చేత నాటకీకరణ చేయించడం అందరినీ ఆకట్టుకున్నది అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ మనం ఈనాడు ఎంతో అందమైన నగరాలలో నివసిస్తున్నప్పటికీ,మానవుని తొలి నివాసాలు మాత్రం అడవులే.అలాంటి అడవులపై ఈనాటికి కూడా మానవుడు ఎంతగానో ఆధారపడి జీవిస్తున్నాడు.
అడవులు మనకు మేఘాలను చల్లబరచి వర్షాన్ని ఇస్తున్నాయని, గృహోపకరణాలకు, వంటచెరకుకు అవసరమైన కలపను అందిస్తున్నాయని,అనేక రకాలైన జంతువులకు, పక్షులకు నివాసప్రాంతాలుగా ఉంటున్నాయని,అనేక రకాలైన మూలికలు, ఔషదాలు అడవులనుండి లభిస్తున్నాయని,కాలుష్యాన్ని నివారించి,పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్నాయని, వరదలు సంభవించినపుడు, నేలకోతకు గురికాకుండా అడ్డుకుంటున్నాయని
కాని,నేడు మానవుడు వివిధ అవసరాల కోసం అడవులను నరికివేయడం వలన వర్షపాతానికి,ఆహారానికి లోటు ఏర్పడడమే కాకుండా, వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని,కాబట్టి మనం మన ఇళ్ళలోను, పాఠశాలలోను,ఖాళీ ప్రదేశాలలోను చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడుదాం.అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

చెట్టుపై నుండి కిందపడి.. గీత కార్మికుడు మృతి.

నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ మండలం నాగనూలు గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ (58) రోజు మాదిరిగానే.. శనివారం తమ కుల వృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తన వ్యవసాయ పొలానికి వెళ్ళాడు. ఈత చెట్టు పైకి ఎక్కి కల్లు తీస్తున్న సమయంలో ఒక్కసారిగా చెట్టుపై నుండి కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో శ్రీనివాస్ గౌడ్ ను హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస్ గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాస్ గౌడ్ కి భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version