నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ “టెక్ బ్రిక్స్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్”(TekBrix IT Pvt.Ltd) ఆధ్వర్యంలో డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు,ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగానికి సెలెక్ట్ కావడానికి అర్హతలుఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలని, టైపింగ్ లో మంచి నైపుణ్యం ఉండాలని తెలిపారు. అంతేకాకుండా 25 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలని తెలిపారు. విద్యార్థులను టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందనీ తెలిపారు. జీతం నెలకు 20000 నుండి 25000 వరకు ఇవ్వబడుననీ తెలిపారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్.ఇంటర్వ్యూ కోసం విద్యార్థులు తేదీ: 06/06/2025 అనగా శుక్రవారం రోజున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు హజారు కాగలరు. వచ్చేటప్పుడు 2 బయోడేటా ఫామ్ లు తీసుకొని నేతాజీ డిగ్రీ కళాశాల, ఆటోనగర్ సిరిసిల్ల లో సంప్రందించగలరని కళాశాల యాజమాన్యం తెలిపారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో నమాజ్.

మాజీ కోఆప్షన్ సభ్యులు
ఎండి రాజ్ మహమ్మద్.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

ఈనెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పైల పహిలగామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు వారి మృతికి సంతాప సూచకంగా శుక్రవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని మరియు మండలంలో ఉన్నటువంటి మసీదు లలో శుక్రవారం నమాజులో ముస్లిం సోదరులు అందరూ నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలను చేసేవారిని తరిమికొట్టాలని ముఖ్యంగా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన సమయంలో కాశ్మీరు వస్త్ర వ్యాపారి నాజా కతలి మరియు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ వీరోచితంగా పోరాడి చాలామంది టూరిస్టుల ప్రాణాలు కాపాడారు కావున ముస్లింలు ఎప్పుడు కూడా భారతదేశానికి స్వాతంత్ర సమరంలో ప్రాణాలర్పించి ముందు వరుసలో ఉన్నారు కావున అందరం కలిసి టెర్రరిస్టుల చర్యను ఖండించాలని చిట్యాల మండలం

మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు

గణపురం ఎస్ ఐ రేఖ అశోక్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలంలో మధ్యాహ్నం సేవించి వాహనాల వాహనాలు నడిపితే చర్యలు తప్పవని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు అతిగా మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ వాహనాల తనిఖీలు పట్టుబడిన గణపురం మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన పోలు రమేష్ కు భూపాలపల్లి జ్యుడిషినల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎన్ రామచందర్ రావు ఐదు రోజుల జైలు శిక్ష విధించారు అని మద్యం సేవించి వాహనాలు నడిపితే వారికి అదే విధంగా త్రిబుల్ రైడింగ్ మైనర్లు డ్రైవింగ్ చేసినట్లయితే వారికి పై శిక్షలు వర్తిస్తాయని హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version