16,వ తేదీన జరిగే భవణ నిర్మాణ.!

ఈనెల 16,వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో జరిగే భవణ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయండి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

 

ములుగు జిల్లాలో ఈరోజు వెంకటాపూర్ మండల కేంద్రములో భవణ నిర్మాణ కార్మిక సంఘం కార్యకర్తల సమావేశం బండి నర్సయ్య అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ భవణ నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు, అనేక పోరాటాల ఫలితంగా భవనిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు జరిగినది అన్నారు, కానీ దాని ద్వారా కార్మికులకు లభిస్తున్న ఫలితాలు నామమాత్రంగా ఉన్నాయి అన్నారు, ప్రసూతికి,రూ,,30000/-పెళ్ళికి రూ,30000/-ఇస్తున్నారు దానిని రూ,,100000/-కు పెంచాలని అలాగే సహజ మరణానికి రూ,,1,30000/- ప్రమాధ మరణానికి రూ,,6,30000/- ఇస్తున్నారు,మరణం అనేది ఎలా జరిగినా మరణమే కాబట్టి రూ, 10,00000/- అందించాలని డిమాండ్ చేశారు కనుక ఈ సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం అన్నారు, అందులో భాగంగా ఈనెల 16 వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్ధ్యోగుల భవణములో జరిగే తెలంగాణ భవణ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, సంఘం జిల్లా కోశాధికారి కొక్కుల రాజేందర్, ఏఐటియుసి మండల నాయకులు తోట సంపత్, దేవేందర్, సురేష్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version