కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.

కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

శాంతి చర్చలు జరిపేం దుకు చొరవ తీసుకోండి

ప్రజా సంఘాల డిమాండ్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

కేంద్ర ప్రభుత్వము మావోయి స్టులతో శాంతి చర్చలు జరప డానికి ముందుకు రావాలని ప్రజాసంఘాల నాయకులు
వంగర సాంబయ్య. చింతల భాస్కర్. అంకేశ్వరపు ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయ కులు మాట్లాడుతూనక్సలైట్ల సమస్యను శాంతి భద్రత సమ స్యగా చూడకుండా ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రభు త్వాన్ని కోరారుమావోయిస్టుల పేరుతో ఈ దేశము ఆదివా సీలను అడవి నుండి బయ టకు పంపే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారని మండి పడ్డారు.గత ప్రభుత్వాలు ఆది వాసీల సంక్షేమం కోసం ఎన్నో రకాలైన అడవి హక్కుల చట్టా లను తెచ్చినప్పటికీ వాటిని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి ఆదివాసులపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావో యిస్టులో జాడ లేకుండా చేస్తా నని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి సంపన్నులకు ఊడేగం చేసే విధానాలను ప్రోత్సహిస్తుందని వారన్నారు.రాజ్యాంగ హక్కు లను పేద ప్రజలకు పూర్తిగా అందించిన ప్పుడు సామాజిక అసమా నతలు లేకుండా ప్రభు త్వాలు రాజ్యాంగ ఫలాలను ప్రజల చెంతకు చేర్చినప్పుడు మావోయిస్టు సమస్య ఉండ దని అన్నారు.ప్రభుత్వాలు పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమా లను అమలు జరపకుండా వారిని ఆకలితో మాడే విధంగా చేస్తున్నంతకాలము ప్రజల మనసులలో ప్రభుత్వాల పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వారు తెలిపారు
మావోయిస్టులను అణిచివే యాలని పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు
కేంద్ర ప్రభుత్వం గానీ,రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ప్రజా సంక్షే మమే పరమపదిగా పనిచేసి నప్పుడు ప్రజల్లో సామాజిక అసమానతలు అంతరించి పోతాయని అప్పుడు సమా జంలో అందరూ సమానమైన భావన గుర్తిస్తారని, ప్రభుత్వా లు ప్రజా సంక్షేమానికి ఉప యోగపడే కార్యక్రమాలను నిర్వహించకుండా ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించకుండా చేయడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రజలను భయభ్రాం తులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వము మావోయిస్టులు సౌమ్య మానాన్ని పాటించి కాల్పుల విరమణను పూనుకోవాలని అన్నారు ఆదివాసీలు నివసి స్తున్న ప్రాంతాలలో పోలీసులు వికృతి చర్యలకు పాల్పడుతు న్నారని అటవీ భూములను అక్కడి ఖనిజ సంపదను సంపన్నులకు దోచి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మావోయిస్టు సమస్యను సామాజికపరమైన సమస్యగా గుర్తించి అసమానతలు తగ్గించి ప్రజలంతా ఒక్కటి అనే భావనను తీసుకు వచ్చిన ప్పుడు ఆ సమస్యకు నిజమైన పరిష్కారం చూపి నట్టు అవుతుందని ప్రభుత్వము మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని కోరారు

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన( డిడియు-జి కే వై ) కార్యక్రమంలో భాగంగా గ్రామీణ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉపాధి వైపు మళ్ళించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు ఆదేశానుసారం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వ ర్యంలో ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని 18-30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువకులు కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని సూచించారు. హైదరాబాద్ లో నాలుగు నెలలు వివిధ రంగాలలో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ జ్ఞానాన్ని పెంచి భవి ష్యత్తులో ఎంతో ఉపయోగక రంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకు లకు ఉపాధి కల్పించడం ప్రధానంగా తీసుకున్నారని, ఇలాంటి కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాబోవు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందన్నారు. శిక్షణలో భాగంగా మండల పరిధిలో సుమారు 50 మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకు న్నట్లు డిడియు- జీకే వైఅధికారులు సునీల్, శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చల్లా చక్రపాణి,మారేపల్లి రవీందర్ చిందంరవి,దుబాసి కృష్ణమూర్తి భాస్కర్, మారేపల్లి రాజు, కట్టయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రెస్ మీట్.

సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు సిరిసిల్ల
జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కులగణన చేయలేదని, 1931 లో బ్రిటిష్ ప్రభుత్వం కులగణన తర్వాత, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కులగణన పై సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీసీ సంఘాల కులగణనను సొంత పార్టీ కార్యకర్తలే చించేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వ్యతిరేకించిన ఆర్టికల్ 370 రద్దు, వక్ఫ్ బిల్లును బీజేపీ ఆమోదించిందని, ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే శక్తి బీజేపీకే ఉందని అన్నారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేకపోతోందని, కులగణన బిల్లు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. రైతులకు ధాన్యం డబ్బులు వారంలో చెల్లించకపోతే, రైతుల తరఫున సంఘర్షణ చేస్తామని హెచ్చరించారు.

పరిరక్షణను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి.!

భారత రాజ్యాంగ పరిరక్షణను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి
-రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
-పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు (డివిజన్)నేటి ధాత్రి

 

 

భారత రాజ్యాంగ పరిరక్షణను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్, జై బాబు జై భీమ్ జై సంవిధన్ కార్యక్రమం పాలకుర్తి ఇంచార్జ్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లు అన్నారు.ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని హరిపిరాల గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా వారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. అహింస శాంతి సిద్ధాంతాలను కాపాడుకునేందుకే ఏఐసీసీ ఉద్యమ కార్యక్రమమును రూపొందించింది అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఏకం కావాలని పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా “జై బాపు, జై భీమ్” కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగమని,రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్,పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి,డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు,చిత్తలూరి శ్రీనివాస్,అశోక్ రెడ్డి,చెవిటి సధాకర్, ప్రశాంతి,కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు తోట అశోక్, యూత్ అధ్యక్షుడు గద్దల మధు, మహిళా అధ్యక్షురాలు చెవిటి లింగమ్మ, స్థానిక నాయకులు వల్లపు మల్లయ్య,వల్లపు నారాయణ, రావుల కిషన్ రెడ్డి, రణధీర్ రెడ్డి,పరశురాములు, రాఘవులు,గద్దల సుజాత తదితరులు పాల్గొన్నారు.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

 

ఈనెల మే 20వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసును వివిధ సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా బిఆర్టియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా చేసి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ వ్యవస్థకు వత్తసు పలుకుతూ కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో లక్షలాదిమంది ఉపాధి పొందుతున్న వివిధ పరిశ్రమల మీద అనేక ఆంక్షలు.నిబంధనలు పెట్టి కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటు అన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటు లేకుండా కార్మికుల హక్కుల కోసం ఎటువంటి సమ్మెలు చేయకుండా ఎనిమిది గంటల పని దినాన్ని తుంగలో తొక్కి చట్టాల సవరణ చేయడం బాధాకరమన్నారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత
పని భద్రత మరియు కనీస వేతనాల అమలు లాంటివి లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసేదాకా కార్మికులంతా ఐక్య పోరాటం చేయవలసిన అవసరము ఉందని అన్నారు.
ఈ సమ్మె అంతం కాదని ఆరంభం మాత్రమే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు ఆలంబిస్తే రాబోయే ఎన్నికల్లో కార్మికులు మీకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కడారి రాములు. సిఐటియు నాయకులు
అన్నల్ దాసు గణేష్. ఐఎన్టీయూసీ నాయకురాలు గొట్టే రుక్మిణి. కార్మిక నాయకులు చిట్యాల మధు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్.!

విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు నరేష్ గౌడ్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు. జహీరాబాద్ నియోజకవర్గ రంజోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినిలు వినాయక,ఎం. భవాని, ఫర్హిన్ లకు యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ శాలువాలతో సన్మానం చేసి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు. భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామస్తులంతా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వైజ్య నాథ్, రవీందర్ రెడ్డి, బాబు, మాజీ ఎంపిటిసి ఖలీల్, నాయకులు చంద్రన్న, గుండారెడ్డి, రాజు, మల్లేష్, రవి, శశి, షబ్బీర్, మస్తాన్, సర్దార్, ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, దత్తు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నానో సింగ్ రాథోడ్, ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, నిజాముద్దీన్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం పది వేల పెన్షన్ అమలు గురించి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో ప్రస్తావించాడని, కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో రిటైర్డ్ కార్మికుల పెన్షన్ కు ముందడుగు పడడంతో శనివారం రామకృష్ణాపూర్ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం పట్టణ అధ్యక్షులు కుమ్మరి మల్లయ్య ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఎంపీ గడ్డ వంశీకృష్ణ చిత్ర పటానికి ఫలాభిషేకం చేశారు. చాలీచాలని పెన్షన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నికలకు ముందు రిటైర్డ్ కార్మికులంతా గడ్డం వంశీకృష్ణ దృష్టికి సమస్యను తీసుకు వెళ్లడంతో ఎంపీగా ఎన్నికైన సందర్భంగా సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకున్నందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని కుమ్మరి మల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మికులు సాతి శంకరయ్య, మెరుగు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని

బీ ఆర్ ఎస్ అధ్యర్యములో రైతులు రాస్తా రోకో

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యర్యములో రైతులు వనపర్తి లో రాస్తా రోకో చేశారు రైతులకు అండగా ఉంటామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతులకు అండగా ఉంటామని చెప్పారు.
రాత్రి వనపర్తి జిల్లా లో కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను మార్కెట్ యార్డ్ లో పరిశీలించి ప్రభుత్వం ధాన్యాని కొనుగోలు చేసేవరకు పోరాడుతామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతుల కు ధైర్యం చెప్పారు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు వెంకట్రావ్,రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల క్రితం వచ్చిన వడ్లను సంచులు లేవని,ట్రాస్ఫోర్ట్ లేదని కొనుగోళ్లు చేయకపోవడం వడ్లు వర్షాల వల్ల నీటి పాలు అయినాయని ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు
ఈ యాసంగిలో 75లక్షల బస్తాలు మార్కెట్ యార్డ్ కు వస్తాయని అంచనా ఉన్నా పర్యవేక్షణ లేక రైతులను ప్రభుత్వం నట్టేట మంచిదని విమర్శించారు.
రైతులతో కలసి దాదాపు గంటసేపు రాస్తారోకో చేసి వాహనాలను స్తంభింపజేసి నిరసన తెలిపారు.రాస్తా రోకో దగ్గిరి కి వచ్చిన తహసీల్దార్ తడసిన వడ్లను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,భానుప్రకాష్ రావు,మహేశ్వర్ రెడ్డి,ధర్మా నాయక్,నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్, గులాం ఖాదర్ ఖాన్, సూర్యవంశం.గిరి,ఇమ్రాన్, జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి,చిట్యాల రాము బాబు నాయక్,పాషా,నారాయణ నాయక్,రైతులు పాల్గొన్నారు.

రోడ్డుకు మోక్షం ఎప్పుడో !

రోడ్డుకు మోక్షం ఎప్పుడో!

కంకర వేశారు గాని రోడ్డు వేయడం మరచారు

సూర్య నాయక్ తండా నుండి పిఆర్ కొప్పుల వరకు బీటీ నిర్మాణం

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూర్య నాయక్ తండా నుండి పిఆర్ కొప్పుల వరకు బీటీ నిర్మాణ ము అసంపూర్తిగా నిలిచి పోయింది. పనులు పూర్తి చేసే విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు కంకర పోసి వదిలి వేసిన రోడ్డుపై రాకపో కలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు పనులు చేపట్టా లని పలుమార్లు అధికా రులకు చెప్పిన స్పందన లేదు రెండేళ్ల క్రితం సూర్య నాయక్ తండా నుండి కొప్పుల గ్రామా నికి నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 262. 50 లక్షల రూపాయలను మంజూరు చేసింది రెండు ఏండ్లు క్రితం రోడ్డు పనులు ప్రారంభించారు సూర్య నాయక్ తండా నుండి కొప్పుల వెళ్లే రోడ్డుపై కంకర పోశారు కాగా మంజూరైన నిధులకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశారు.

BT construction Surya Nayak Thanda.

చాలా కాలంగా సూర్య నాయక్ తండా నుండి కొప్పుల ప్రజలు వాహనదారులు ప్రయాణానికి అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని అసంపూర్తిగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నూతన ఎస్సై ను మార్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్.!

నూతన ఎస్సై ను మార్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల మండల నూతన ఎస్సై సైదా రాహుఫ్ కు సన్మానం చేసిన మండల పిఎస్ఆర్,పివిఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్,ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ముత్తాపురం ఉప సర్పంచ్ మోకాళ్ళ శంకర్, సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య, యువజన నాయకులు ఎస్కె వాజీద్ పాషా, నాయకులు ఎస్కె ఖాసీం, దుర్గం బాలకృష్ణ, సోషల్ మీడియా సభ్యులు మండలోజు కిరణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్.

ఎన్నికల హామీల అమలుకోసం పోరాడాలి-సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ఎన్నికల హామీల అమలు కోసం గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పోరాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ రామడుగు గ్రామశాఖ మహాసభ జరిగింది. ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అర్హులైన వారికీ ఇండ్లు ఇవ్వకుండా సొంత పార్టీ కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పేదలకు ఇండ్లు ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందని, ప్రజల సమస్యలను పట్టించుకొనే నాదుడులేరని వెంటనే స్తానిక ఎన్నికలు పెట్టాలన్నారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్ష్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేరవేర్చాలని లేకుంటే, ప్రజా ఉద్యమాలు తప్పవని సృజన్ కుమార్ హేచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, మండల నాయకులు కీర్తి కుమార్, దాము భూమయ్య, యోగి బీరయ్య, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో ఆరుగురు.!

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో ఆరుగురు గంజాయి అమ్మకం దారుల పట్టివేత…

గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠిన చర్యలు తప్పవు – డీసీపీ కరుణాకర్

ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :

 

 

 

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో విలేఖరుల
సమావేశంలో డిసీపీ పి కరుణాకర్ కేసు వివరాలను వెల్లడించారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు గా అమ్ముచున్న గంజాయి ముఠాను పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మరియు సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.. పోత్కపల్లి రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుచున్న వ్యక్తులను పట్టుకొని ని విచారించగా గంజాయి అమ్మడానికి వచ్చినట్టు తెలియ చేయగా నిందితుల వద్ద ఉన్న గంజాయిని
చూపించగా అది 9.664 కిలోల ఎండు గంజాయి గా ఉంది, అట్టి గంజాయిని మరియు ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు డిసిపి పి.
కరుణాకర్ అన్నారు ఈ సందర్భంగా పట్టుబడిన కిరణ్
వివరాలు:-ఎ 1.
గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం.
ఎ 2. జాడి ప్రకాష్ గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. ఎ) 3. గుజ్జుల సాయి తేజ, గ్రామం.
ద్వారకా నగర్, గోదావరిఖని.
ఎ 4. కొమురవెల్లి పవన్, గ్రామం. రామగుండం. ఎ 5. ఇందిబెల్లి సందీప్ గ్రామం. అంతార్గాం. ఎ 6. లింగన్నపేట విష్ణువర్ధన్ గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. మరియు
పరారీలో ఉన్న నిందితులు ఎ 7. ఖేల కుమార్, గ్రామం. ఉరుమనూర్, కలిమేల, ఒడిస్స రాష్ట్రము. స్వాధీనం చేసుకున్న గంజాయి దాదాపు 9.664 కిలోల పట్టుకున్న గంజాయి విలువ రు. 4,80,000/-
ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పట్టుకున్న గంజాయిని డిప్యూటీ తాసిల్దార్ బాలసాని శ్రీనివాస్.
రెవిన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ ఇరుకుల వీరేశం ఏఎస్ఐ రత్నాకర్ హెచ్ సి జి కిషన్ పిసి రాజేందర్ సతీష్ ల సమక్షంలో పంచనామ నియమించారని అన్నారు
యువకులు ఈజీ మనీ కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటం వాడుతున్నారని గంజాయి మహమ్మారి బారినపడి ఎంతో విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మత్తు కు అలవాటు పడి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వ్యక్తులు
4698
ఎక్కడ కనబడ్డ విక్రయించిన పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు అదేవిధంగా ఆర్థిక నేరాలకు చేస్తున్న పలువురిని చకచక్యంగా పట్టుకున్నందుకు ఎస్సై దీకొండ రమేష్ మరియు పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డు అందజేశారు ఈ కార్యక్రమంలో డిసిపి పి కరుణాకర్ ఏసిపి గజ్జి కృష్ణ యాదవ్ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్సై దీకొండ రమేష్ ఏఎస్ఐ రత్నాకర్ జి కిషన్ పిసి రాజేందర్ సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

తక్షణమే ఆపరేషన్ కగార్ ఆపాలి.

తక్షణమే ఆపరేషన్ కగార్ ఆపాలి.

బేషరతుగా చర్చలు ప్రారంభించాలి.

మారుపాక అనిల్ కుమార్
డి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

వరంగల్ నేటిధాత్రి.

 

 

 

ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నరమేధాన్ని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు శివనగర్, తమ్మెర భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతు, నక్సలిజాన్ని అంతం చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం, పేదరికాన్ని ఎందుకు అంతం చేయలేకపోతుంది అని ప్రశ్నించారు. మావోయిస్టులతో బేషరతుగా చర్చలు జరిపి, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. 2025లో ఇప్పటివరకు మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీలు కలిపి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయారు అని, దేశ చట్టాలు, సాయుధ ఘర్షణలకు సంబంధించిన నియమాలను పక్కన పెట్టి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మావోయిస్టులను భౌతికంగా నిర్మూలించేందుకు సాయుధ బలగాలను వినియోగిస్తోంది అని అన్నారు. కర్రెగుట్ట కొండలను పారా మిలిటరీ బలగాలతో చుట్టివేయటం, ఆదివాసీల హక్కులను పూర్తిగా పట్టించుకోకపోవటం అభీష్టకరమైంది కాదన్నారు.

శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం నిర్లక్ష్యం.

సి.పి.ఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తమ శాంతియుత చర్చల సన్నద్ధతను ఇప్పటికే ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇకపోతే, మావోయిస్టులు ఒకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాస్వామిక శక్తులు ఐక్యం కావాలి అని,
మావోయిస్టుల ప్రతిపాదనకు బదులుగా ప్రభుత్వం షరతులు విధించడం శాంతి లక్ష్యాలకే వ్యతిరేకమని అన్నారు. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే శాంతిని సాధించాలి. అందుకే అన్ని ప్రజాస్వామిక సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి తక్షణ కాల్పుల విరమణ, బేషరతు చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. భౌతిక నిర్మూలన కాదు, రాజ్యాంగబద్ధ పరిష్కారం కావాలి అని డి హెచ్ పి ఎస్ స్పష్టం చేస్తోంది అని అన్నారు.

పెహాల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నాం….

పెహాల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నాం….

రాజుపేట జామియా మజ్జిద్ అధ్యకుడు ఎం డి ఇషాక్….

మంగపేట నేటిధాత్రి

 

 

మంగపేట మండలం రాజుపేట గ్రామంలో గల జామియా మజీద్ యిమామియా లో ఈరోజు శుక్రవారం నమాజ్ అనంతరం జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు అందరు కలిసి ముక్తకంఠంతో పెహల్గామ్ దాడిని ఖండించారు. గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించి ఫ్లకార్టులతో నిరసనను తెలియజేసినారు అనంతరం ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన ఎండి ఇషాక్ మాట్లాడుతూ అమాయక ప్రజలైన పర్యటకుల ను అతి కిరాతకంగా కాల్చి చంపడం దారుణమని ఇటువంటి చర్య చేసిన వ్యక్తులు ఎటువంటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని ముస్లిం మతస్తులు ఎవరు ఎదుటి వ్యక్తిని చంపడానికి కానీ గాయపరచడానికి కానీ ఒప్పుకోరు అటువంటి హత్యలు చేసిన వారు ముస్లిం మతస్తులు కారు వారు కాఫిర్లు భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలందరూ కులమతాలకి అనుకూలంగా అన్నదమ్ముల సేవా భావంతో కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నాం ఇటువంటి చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా వారికి కఠిన చర్య తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇకపై ఇటువంటి చర్యలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి కులమత బేధాలు లేకుండా ప్రజలందరినీ క్షేమంగా చూసుకోవాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇస్మాయిల్ జి క్రియా, దావూద్ కౌషల్ జాంగిర్ హుస్సేన్ అక్బర్ రఫీ, ముస్లిం పెద్దలు పిల్లలు అందరూ హాజరైనారు.

మాజీ మంత్రి హరీశ్ రావు రేపే నాగిరెడ్డి పల్లి రాక…

మాజీ మంత్రి హరీశ్ రావు రేపే నాగిరెడ్డి పల్లి రాక…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,సిద్దిపేట శాసన సభ్యులు టి హరీష్ రావు మేమాసం 4 వతారీకు ఆదివారం ఉదయం జహిరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించతలపెట్టిన
దుర్గా భవాని ఆలయజాతర కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన పత్రికా ప్రకటన లో తెలిపారు.

న్యాల్కల్, డప్పూరు మీదుగా ఆర్టీసీ బస్సులు.

న్యాల్కల్, డప్పూరు మీదుగా ఆర్టీసీ బస్సులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు న్యాల్కల్, డప్పు ర్ మీదుగా జహీరారాబాద్ వరకు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ బస్సును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 10 సంవత్సరాలకు పైగా నిలిచిపోయిన ఈ రూట్ లో బస్సులు ఏర్పాటు చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర జనగణన, కులగణన చారిత్రాత్మక నిర్ణయం.

కేంద్ర జనగణన, కులగణన చారిత్రాత్మక నిర్ణయం

బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనగణన, కులగణన చేపడతామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని, కులగణనతో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్రం నిర్ణయానికి ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఈ విజయం తమదే అంటూ గొప్పులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.60 యేండ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కులగణన ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణన, జనగణనలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉండే భారతీయులందరూ భాగస్వాములు కావాలని సందీప్ పేర్కొన్నారు.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో రెండవ దశ ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్ష విజేతలకు కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎనబై మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఫలితాలను పెంపోందించెందుకు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి అవకాశాలను విద్యార్థులకు అందేలా ప్రోత్సహించాలని, ఈకార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వసతులు కల్పిస్తూ, ప్రోత్సాహన్ని అందిస్తున్న ఆల్పోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు. ప్రస్తుతం యాభై ఏడు మంది నుండి మూడవ బ్యాచ్ డెబ్బై ఐదు మందిగా తిరిగివచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కోరారు. ఈకార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, రామడుగు తాహశీల్దార్ రాజేశ్వరి, విఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం.

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం

◆ సందర్భంగా పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ
శుభాభినందనలు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ సందర్భంగా జహీరాబాద్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ సోదర, సోదరీమణులందరికీ శుభాభినందనలు తెలియజేశారు. “పత్రికా స్వేచ్చ ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభం. సత్యాన్ని వెలికి తీసే కర్తవ్య నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాత్రికేయులు చూపే నిబద్ధత, ధైర్యం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. సమాజంలో వారి సేవ అమూల్యం” అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం.. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించటం మీడియా కర్తవ్యం.. నిష్పక్షపాతంగా వృత్తి నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులకు వందనం..ఒక సందేశంలో పేర్కొన్నారు.

నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

పహల్గామ్ దాడికి నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతంగా కొసాగింది. ఈ బందులో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం ప్రకటించారు. అమాయకులైన పర్యాటకులను ముష్కరులు లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడడం హేయనీయమైన చర్య అని అందుకే స్వచ్ఛందంగా బందు పాటిస్తున్నామని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version