ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి .

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి..

సిపిఐ,సిపిఎం జిల్లా కార్యదర్శిలు కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ధర్నా, నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి :

 

దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, బందు సాయిలు డిమాండ్ చేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆపరేష న్ కగార్ ను నిలిపివేయాలని కోరుతూ సిపిఐ, సిపిఎం లిబరేషన్ పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన ప్రభుత్వం అసమానతల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను అతి కిరాతకంగా ఎన్కౌంటర్ లో చంపడం దుర్మార్గం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని మావోయిస్టుల తో శాంతి చర్చలు జరిపి జనజీవన స్రవంతిలో కలిసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే అందుకే మావోయిస్టులను అంతం చేయాలని చూస్తుందని అన్నారు. 2026 లో ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టు లను అంతం చేయాలనే దురుద్దేశంతో బిజెపి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడుతుందని ఆరోపించారు. మావోయిస్టులు ఈ దేశ పౌరులేనని భారత రాజ్యాంగంలో జీవించే హక్కు ప్రతి మనిషికి కల్పించిందని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మనిషిని మనిషి చంపుకోవడం ఏంటని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో వామపక్ష నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, క్యాతరాజు సతీష్,వెలిశెట్టి రాజయ్య కన్నూరి దానియల్ నేరెళ్ల జోసెఫ్ మాతంగి రామచందర్,శేఖర్, పొన్నగంటి లావణ్య,గోమాత,శ్రావణి,స్వరూప ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

సీఐ లోడిగా రవీందర్,ఎస్సై సైదా రహూఫ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల ఎస్సై రహుఫ్ తమ సిబ్బందితో కలిసి సోమవారం పెట్రోలింగ్ కు వెళుతుండగా తురుబాక గ్రామం నందు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు
పాయం రాజేందర్ నడిమిగూడెం,ఆళ్లపల్లి మండలం కల్తీ పాపయ్య (అలియాస్ సర్పంచ్) ఘణపురం గ్రామం,గుండాల మండలం అను ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేశారు.
కల్తీ పాపయ్య 2010 సంవత్సరంలో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చాడు.పాయం రాజేందర్ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేసి ఆళ్లపల్లి పోలీస్ ఎదుట లొంగిపోయాడు వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పార్టీ పేరు చెప్పి గుండాల,ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులను గత రెండు,మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారు.సోమవారం వీరిద్దరిని గుండాల పోలీస్లు అరెస్ట్ చేశారు.వీరి ఇరువురి నుండి 5000 రూపాయలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని ఇల్లందు డిఎస్పి చంద్రభాను తెలిపారు.ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వారికి పిర్యాదు చేయవలసిందిగా కోరారు.వీరిని పట్టుకోవటం లో కృషి చేసిన గుండాల సిఐ లోడిగ రవీందర్,ఎస్ఐ సైదా రహుఫ్, పిసి వెంకటేశ్వర్లు ను డిఎస్పి అభినందించారు.

కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.

కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

శాంతి చర్చలు జరిపేం దుకు చొరవ తీసుకోండి

ప్రజా సంఘాల డిమాండ్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

కేంద్ర ప్రభుత్వము మావోయి స్టులతో శాంతి చర్చలు జరప డానికి ముందుకు రావాలని ప్రజాసంఘాల నాయకులు
వంగర సాంబయ్య. చింతల భాస్కర్. అంకేశ్వరపు ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయ కులు మాట్లాడుతూనక్సలైట్ల సమస్యను శాంతి భద్రత సమ స్యగా చూడకుండా ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రభు త్వాన్ని కోరారుమావోయిస్టుల పేరుతో ఈ దేశము ఆదివా సీలను అడవి నుండి బయ టకు పంపే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారని మండి పడ్డారు.గత ప్రభుత్వాలు ఆది వాసీల సంక్షేమం కోసం ఎన్నో రకాలైన అడవి హక్కుల చట్టా లను తెచ్చినప్పటికీ వాటిని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి ఆదివాసులపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావో యిస్టులో జాడ లేకుండా చేస్తా నని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి సంపన్నులకు ఊడేగం చేసే విధానాలను ప్రోత్సహిస్తుందని వారన్నారు.రాజ్యాంగ హక్కు లను పేద ప్రజలకు పూర్తిగా అందించిన ప్పుడు సామాజిక అసమా నతలు లేకుండా ప్రభు త్వాలు రాజ్యాంగ ఫలాలను ప్రజల చెంతకు చేర్చినప్పుడు మావోయిస్టు సమస్య ఉండ దని అన్నారు.ప్రభుత్వాలు పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమా లను అమలు జరపకుండా వారిని ఆకలితో మాడే విధంగా చేస్తున్నంతకాలము ప్రజల మనసులలో ప్రభుత్వాల పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వారు తెలిపారు
మావోయిస్టులను అణిచివే యాలని పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు
కేంద్ర ప్రభుత్వం గానీ,రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ప్రజా సంక్షే మమే పరమపదిగా పనిచేసి నప్పుడు ప్రజల్లో సామాజిక అసమానతలు అంతరించి పోతాయని అప్పుడు సమా జంలో అందరూ సమానమైన భావన గుర్తిస్తారని, ప్రభుత్వా లు ప్రజా సంక్షేమానికి ఉప యోగపడే కార్యక్రమాలను నిర్వహించకుండా ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించకుండా చేయడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రజలను భయభ్రాం తులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వము మావోయిస్టులు సౌమ్య మానాన్ని పాటించి కాల్పుల విరమణను పూనుకోవాలని అన్నారు ఆదివాసీలు నివసి స్తున్న ప్రాంతాలలో పోలీసులు వికృతి చర్యలకు పాల్పడుతు న్నారని అటవీ భూములను అక్కడి ఖనిజ సంపదను సంపన్నులకు దోచి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మావోయిస్టు సమస్యను సామాజికపరమైన సమస్యగా గుర్తించి అసమానతలు తగ్గించి ప్రజలంతా ఒక్కటి అనే భావనను తీసుకు వచ్చిన ప్పుడు ఆ సమస్యకు నిజమైన పరిష్కారం చూపి నట్టు అవుతుందని ప్రభుత్వము మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని కోరారు

ఆదివాసీల,మావోయిస్టులపై సైనికుల.!

ఆదివాసీల,మావోయిస్టులపై సైనికుల దాడులు ఆపాలనీ డిమాండ్

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నిరసన

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా) నేటిధాత్రి:

 

కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని,ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలనీ
కర్రెగుట్ట ను చుట్టుముట్టిన సైనిక బలగాలు వెనక్కి రావాలి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గుండాల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనిమేధావులు నుండి పెద్ద ఎత్తున డిమాండ్ ముందుకు వస్తున్న బిజెపి నరేంద్ర మోడీ,అమిత్ షా ప్రభుత్వాలు స్పందించకపోవడం సరికాదని అన్నారు.
గత జనవరి నుండి ఇప్పటివరకు మావోయిస్టుల పేరుతో అనేకమంది ఆదివాసీలను చంపివేశారని అన్నారు.
దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన మిలటరీ సాయుధ బలగాలు మధ్య భారత దేశంలో ఆదివాసీలపై దాడులు చేస్తున్నాయని విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపి ఆదివాసీల మారనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం( ఏఐటిఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, రాష్ట్ర నాయకులు ఈసం కృష్ణన్న,న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు అరెం నరేష్, పర్శక రవి, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, పెండకట్ల పెంటన్న, ఈసం మంగయ్య,మానాల ఉపేందర్, బానోతు లాలు, భూఖ్య వెంకన్న, పాయం ఎల్లన్న, గోగ్గల శ్రీను, మోకాళ్ళ సూర్యనారాయణ , దుగ్గి శేఖర్, వాగబోయిన బుచ్చయ్య,అరెం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version