ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు
మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండలంలో శ్రీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో శివాలయం లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కస్తూరిబాయి వృద్ధాశ్రయంలో కేక్ కట్ చేసి పండ్లు స్వీట్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ,జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణ, పి ఎ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ ,మండల సీనియర్ నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య,వాలీబాబా, తడూరి రఘు ,మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, మేడారం మాజీ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్, పి ఎ సి ఎస్ డైరెక్టర్ సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు ,జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, మండల నాయకురాలు పార్వతి, అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ,
నర్సంపేట పట్టణ నూతన సీఐగా పదవి బాధ్యతలను చేపట్టిన లేతాకుల రఘుపతి రెడ్డిని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.అనంతరం పుష్పగుచ్చం అందించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు మెరుగు సాంబయ్య, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ అయూబ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు దూదేల సాంబయ్య, వేముల సారంగం, నర్సంపేట పట్టణ ఓబీసీ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నాంపల్లి వెంకటేశ్వర్లు,నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజ్ మురళీ, మాజీ వార్డు సభ్యులు గాజుల రమేష్, గండి గిరి, నాగుర్లపల్లి మాజీ సర్పంచ్ రాజహంస, 1వ వార్డు అధ్యక్షులు లాక్కార్స్ రమేష్, 5వ వార్డు అధ్యక్షులు పున్నం నరసింహారెడ్డి, 8వ వార్డు అధ్యక్షులు గిరగని రమేష్, 20వ వార్డు అధ్యక్షులు రామగొని శ్రీనివాస్, 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, ఎరుకల రమేష్, హిందు రాజు, దేశి సాయి పటేల్, తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని ఐఎన్టియుసి కార్యాలయంలో ఐఎన్టియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంఘం సభ్యులు జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. కనీస వేతనాల బోర్డు చైర్మన్, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ రాంబాబు, ఐఎన్టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘ బుచ్చయ్య, ఏరియా సెక్రెటరీ బత్తుల వేణు, సిహెచ్పి ఫిట్ సెక్రటరీ రాములు, సివిల్ ఫిట్ సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, కాసర్ల ప్రకాష్ ఐ ఎన్ టి యు సి నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆ ర్ సి
వనపర్తి నేటిదాత్రి :
మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వరలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులో రాష్ట్ర రాజకీయ మాజీ కార్యదర్శి శ్రీశైలంమల్లికార్జున నిత్య అన్నదాన సత్రం డైరెక్టర్ కలకొండ రమేష్ చంద్ర ఆధ్వర్యంలోగుర్రం జగదీశ్వరయ్య మల్లికార్జున్ లోటస్ సెలూన్ రామకృష్ణ కలిసిపూలబోకె ఇచ్చి శాలువతో రావులను ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు
ఝరాసంగం మండల తహసిల్దార్ కార్యాలయంలో నయబ్ తహసిల్దార్ బదిలీ అయి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు మాత్రం పాతదాన్నే కొనసాగిస్తోన్నారు. ఈ బోర్డులో సమాచారాన్ని అం దించే అధికారుల పేర్లు లేకపోవడంతో ప్రజలు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలనే అయోమయంలో ఉన్నారు. ఇందులో సీనియర్ సహాయకులు ఎవరన్నది ఇప్పటి వరకు బోర్డులోను, కార్యాలయంలోను లేకపోవడం గమనార్హం. కొత్త అధికారుల వివరాలతో బోర్డును నవీకరిం చకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, వెంటనే బోర్డు మార్చాలని వివిధ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా మే 6వ తేదీ మంగళవారం జహీరాబాద్లో జరిగే మహిళల నిరసన సమావేశంలో పాల్గొనమని విజ్ఞప్తి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రారంభించిన దేశవ్యాప్త నిరసన ఉద్యమం “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్”లో భాగంగా, “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్” అనే పేరుతో మహిళల చారిత్రాత్మక కేంద్ర సర్వసభ్య నిరసన సమావేశం 2025 మే 6 మంగళవారం ఉదయం 10:01 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు స్థానిక ప్రచారకర్త హజ్రత్ మౌలానా అతిక్ అహ్మద్ కాస్మి అధ్యక్షతన జరుగుతుందని ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మి కానో మరియు ఎండోమెంట్స్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ జహీరాబాద్ తెలియజేశారు. ఈ సమావేశానికి హజ్రత్ మౌలానా ఘియాస్ అహ్మద్ రషాది, కన్వేజ్, వక్ఫ్ బచా క్యాంపెయిన్, తెలంగాణ, శ్రీమతి న్యాయవాది జలీసా యాస్మిన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా విభాగం ఇంచార్జి, వీరితో పాటు జామియా గుల్షాన్ గర్ల్ టీచర్స్ డిపార్ట్మెంట్ హెడ్, జామియా గుల్షన్ హనీస్ ఖైరీ- జమాతే ఇస్లామీ మహిళా విభాగం అధిపతి బుష్రా అఫ్రోజ్, సున్నీ దావత్-ఏ-ఇస్లామీ మహిళా విభాగం ఇన్చార్జి జహీర్ అబా, మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ – ముఫ్తీ నజీర్ అహ్మద్ హస్సామీ, మిస్టర్ ముహమ్మద్ నజీముద్దీన్ ఘోరీ, స్థానిక జమాత్ ఘోరీ ఈ సమావేశానికి సయ్యద్ జియావుద్దీన్ మౌలానా మసూమ్ ఆలం కూడా హాజరుకానున్నారు. జహీరాబాద్ నగరం మరియు హదీసు పరిసర ప్రాంతాల మహిళలు మరియు బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ జాతీయ ఐక్యత మరియు ఇస్లామిక్ మద్దతును ప్రదర్శించాలని జమియత్ ఉలేమా, జమాతే-ఇ-ఇస్లామి, సఫా బైతుల్ మల్, సున్నీ దావత్-ఇ-ఇస్లామి, జమియత్ అహ్లే యాత్ ముస్లిం యాక్షన్ కమిటీ మరియు అన్ని ఇతర సంస్థల నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఎంజీఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా సయ్యద్ మోసిన్
వరంగల్ తూర్పు నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద హాస్పిటల్ అయిన, ఎంజీఎం హాస్పిటల్ నూతన డెవలప్మెంట్ కమిటీ శుక్రవారం హాస్పిటల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంజీఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా వరంగల్ నగరం 25వ డివిజన్ కు చెందిన సయ్యద్ మోసిన్ నియామకం అయ్యారు. శుక్రవారం రోజు ఎంజిఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా మోసిన్ ఎంజీఎం ఆస్పత్రి లో ప్రమాణ స్వీకారం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గోపాల్ నవీన్ రాజ్, స్థానిక కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఎం డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సయ్యద్ మోసిన్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరి సస్పెండ్. మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గొండి మండలం పొనకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన బోరగాని రమేష్,బోరగాని మణికంఠ వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అసభ్య పదజాలంతో దూషించినందుకు గాను అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో గతంలో పలుమార్లు హెచ్చరించినట్లు తెలిపారు.అయినా వారి ప్రవర్తనలో మార్పు జగగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పొనకల్ గ్రామ కమిటీ తీర్మానం చేయగా దానిని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయసినట్లు ఎర్రల్ల బాబు పేర్కొన్నారు.సస్పెండ్ ఐనా వారిద్దరికీ ఇక నుండి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి.
పంట నష్టపరిహారంపై స్పందించని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు…
బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులకు అండగా నిలబడాలి..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, గాలి బీభత్సానికి కోతకు వచ్చిన వరి,ఇతర పంటలు నేలమట్టం కావడంతో రైతులకు తీవ్రనష్టం జరిగిందని మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు.పంట కోత సమయంలో జరిగిన నష్టం రైతును మానసికంగా కృంగదీసిందని ఆయన పేర్కొన్నారు.గాలి బీభత్సం,అకాల వర్షం వలన నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా పలు రకాల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో కొన్నిచోట్ల కోతలు పూర్తి చేసుకుని అమ్మకానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్న రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దైందన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని,పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు చెల్లించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఖానాపురం మండలంలో గత పది రోజుల క్రితం కురిసిన వర్షానికి పంట నష్టపోయిన రైతులను క్షేత్రస్థాయిలో స్థానిక రైతులుబిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తాను పరిశీలించి అధికారులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు,అధికారులు రైతులను పట్టించుకునే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తుండగా పోలీసులతో అరెస్టు చేయించారే తప్ప రైతులకు మాత్రం భరోసా ఇవ్వలేకపోయారని ఆరోపించారు.నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.
60 ఏళ్ల పాలనలో ఏనాడు కాంగ్రెస్ దేశంలో కుల గణన చేపట్టలేదు. బీసీల హక్కులను కాలరాయడం, బీసీల రిజర్వేషన్లను అణచివేయడమే కాంగ్రెస్ చరిత్రన్నారు. జన గణననలో కుల గణనను చేర్చడం ద్వారా ప్రధాని మోదీ ఈ దేశానికి అభినవ అంబేద్కర్గా నిలిచారన్నారన్నారు. ఒడ్డెక్కేదాకా ఓడ మల్లప్ప, ఒడ్డెక్కినంక బోడ మల్లప్ప అన్నట్టుంది కాంగ్రెస్ వైఖరన్నారు. శాస్త్రీయ పద్ధతిలో అన్ని కులాల వివరాలు సేకరించి, వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించాలన్న ఉద్దేశంతో కులగణన చేపట్టనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి ప్రభుత్వం కులగణనకు ఎప్పుడూ సానుకూలంగానే ఉందన్నారు. శాస్త్రీయమైన కులగణన జరిగితే వెనకబడిన వర్గాలకు ఆర్ధిక – సామాజిక లాభాలు అందుతాయని మా నమ్మకమన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారి విజయమని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, 6 దశాబ్దాలుగా కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.
Abhinav Ambedkar.
దేశ జనగణనలో భాగంగా కులగణనను చేపట్టి, దాని ఆధారంగా వెనకబడిన వర్గాలకి ఆర్ధిక – సామజిక – సంక్షేమ లాభాలు చేకూర్చాలని ప్రధాని మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, అక్కల రమాదేవి,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, జిల్లా ఓబీసి మోర్చా అధ్యక్షుడు జిల్లా మైనార్టీ మోర్చ అధ్యక్షుడు మాలిమ్ ఇసాక్,ఐటి సెల్ కన్వీనర్ చిత్తారి కిరణ్,బిజెపి నాయకులు ఢిల్లీవాల కృష్ణ,మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శ్రీనివాసులు ,బిజెపి నాయకులు బాలేశ్వర్ రెడ్డి,మోహన్ రెడ్డి, రమేష్,వెంకటేష్, నరసింహ తదితరులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సెట్విన్ శిక్షణ కేంద్రాల ఇంచార్జీల సమీక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ప్రధాన కార్యాలయంలో సంస్థకు చెందిన శిక్షణ కేంద్రాల ఇంచార్జీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జహీరాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాలరావు పాల్గొన్నారు.ఈసమావేశంలో సెట్విన్ సంస్థ ఇంచార్జీలు,అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ ఆదర్శవాణి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
డివిజన్ టాపర్ గా కొత్త కార్తీక్..
నర్సంపేట,నేటిధాత్రి:
గత నెల 30న విడుదలైన పదవ తరగతి ఫలితాలలో శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు ప్రతిభ కనబరిచి డివిజన్ టాపర్ లుగా నిలిచారు.అలాగే ఇదే పాఠశాలకు చెందిన కొత్త కార్తీక్ అనే డివిజన్ టాపర్ గా రికార్డు సృష్టించాడు.కాగా డివిజన్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పూల మాలలతో అభినందించారు. 2025 -2026 సంవత్సరంలో 10/10 జీబీఏ 600 మార్కులకు 563 మార్కులు సాధించి డివిజన్ టాపర్ గా నిలిచిన కొత్త కార్తీక్,అలాగే 558 మార్కులు సాధించిన బూర సాత్విక్, 557 మార్కులు సాధించిన మూలా అవినాష్ లను పూల బొకేలతో అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉండాలని విద్యార్థులను ఆశీర్వదించారు.
students
ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గౌరవంగా ఉందని తెలియజేశారు.అలాగే గత సంవత్సరం ముగ్గురు విద్యార్థులు 10/10 లు సాధించి జిల్లాలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారని ఈ సంవత్సరం నర్సంపేట డివిజన్ టాపర్ లు గా నిలవడం గౌరవంగా ఉందన్నారు. 62 మంది విద్యార్థులకు 30 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించగా ఆ విద్యార్థులను అభినందించారు.పట్టుదలతో చదివి ఉన్నత మార్కులు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకొచ్చినందుకు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ కవిత, బిక్షపతి, మణికంఠ, శశిధర చారి, ప్రిన్సిపల్స్ స్రవంతి, సుధాకర్, స్వప్న చారి,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ధైర్యం అంటేనే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటే హంగు ఆర్భాటం లేని ప్రజానాయకుడు
నిజాన్ని నమ్ముకున్న మహా నేత మొగుళ్ళపల్లి నేటి దాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాథరాజు రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశంలో జోడో యాత్ర ద్వారా కార్మిక , కర్షక, సబ్బండ వర్గాల స్థితిగతులపై ఏం అంశం తీసుకున్న ఆ అంశం పట్ల హుటాహుటిన చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని అధికార యంత్రాంగం..నాడు అధికారుల వంతైతే.. నేడు ప్రతిష్టాత్మకంగా జన గణన తో పాటు కులగణన అంశాన్ని లేవనెత్తి ప్రధాని మోడీ అంతటి నేతనే ఒప్పించిన ఘనత ముమ్మాటికి రాహుల్ గాంధీకే సాధ్యమైంది.. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన నిర్వచించడం చరిత్రలో మిగిలిపోయే నిర్ణయం భారతదేశ వ్యాప్తంగా కులగల చేయడం శుభపరిణామమని బీసీలు ఇంకనైనా ఆర్థికంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని యావత్ దేశం హర్షించదగ్గ విషయం.. అన్నారు
ఎన్. పి.డి. సి.ఎల్ పరిధిలో మే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ శ్రీ జి. మధుసూదన్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున నాంచారి మడూర్ గ్రామంలోని రైతు వేదికలో విద్యుత్ భద్రత వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ & సేఫ్టీ ఆఫీసర్ శ్రీ పెద్ది రాజం మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రైతులు మరియు వినియోగదారులు తీసుకోవలసిన అన్ని రకాల జాగ్రత్తలు మరియు సూచనలు విపులంగా తెలియజేశారు. తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ శ్రీ జి. మధుసూదన్ గారు మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో తొర్రూరు డివిజన్ పరిధిలో జరిగిన విద్యుత్ ప్రమాదాల వల్ల 16 గురు మనుషులు మరియు 30 జంతువులు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదాలకు కారణం రైతులు మరియు వినియోగదారులు విద్యుత్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే జరుగుతున్నాయని కావున నిత్యావసరమైన విద్యుత్ వినియోగించుకుంటున్నప్పుడు అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఇళ్లలో బట్టలు ఆరేసుకోవటానికి బిగించుకునే జి.ఐ. వైర్లు పై కప్పుగా వేసుకునే ఇనుప రేకులకి షార్ట్ సర్క్యూట్ అయ్యి కొన్ని ప్రమాదాలు జరిగాయని అలాగే ఆకేరు వాగు వెంట ఉన్న గ్రామాల్లోని చాలామంది యువకులు చేపలు పట్టడానికి కరెంటును వినియోగించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రైతులు తమ పొలం చుట్టూ జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి బిగించుకునే విద్యుత్ కంచె వలన కూడా ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారని ఈ విధంగా చేయటం చట్ట ప్రకారం నేరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ శ్రీ సి.ఎస్. చలపతిరావు, చిన్న వంగర మరియు తొర్రూరు అసిస్టెంట్ ఇంజనీర్లు , విద్యుత్ సిబ్బంది, రైతులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు.
పేదప్రజలను ఇండ్ల పేరిట దోచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు
పరకాల నేటిధాత్రి:
మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హతకలిగిన లబ్ధిదారులకు చెందకుండా నిరుపేదలను మోసం చేస్తున్నారని వారి పార్టీ కార్యకర్తలకు మరియు కమిటీ సభ్యులకు మాత్రమే ఇల్లు కేటాయించుకోవడం జరుగుతుందని గ్రామంలో ఇల్లు కావాలనే వారి దగ్గర 30 వేల నుండి 50 వేల వరకు డబ్బులు తీసుకుని ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి పేర్లు లేకుండా చేసి అనర్హుల పేర్లను పెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు వాళ్లు ఇష్టానుసారం చేస్తున్నారన్నారని భారతీయ జనతా పార్టీ పరకాల రూరల్ మండలం మాజీ అధ్యక్షులు ముష్కే దేవేందర్ అన్నారు.పేదప్రజలను రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతుందని హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాలని కోరారు.
ఘనంగా ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ జన్మదిన వేడుకలు
మెట్ పల్లి: మే 2 నేటిదాత్రి
టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా మెట్ పల్లి ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ పుట్టినరోజు వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ అజీమ్ పుట్టినరోజు సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) ప్రింట్ మీడియా అధ్యక్షులు బూరం సంజీవ్, గౌరవ అధ్యక్షుడు ఆగ సురేష్,ఉపాధ్యక్షులు జంగo విజయ్, సాజిద్ పాషా, కోశాధికారి ఎస్.కె మక్సుద్ సహాయ కార్యదర్శి పింజరి శివ,ఆర్గనైజింగ్ సెక్రటరీ ,ఎం.డి సమియోద్దీన్ , కార్యవర్గ సభ్యులు,మహమ్మద్ అఫ్రోజ్ ,పానిగంటి మహేందర్, కుర్ర రాజేందర్ , కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు కుతుబుద్దీన్ పాష, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు నేతృత్వంలో పురుమళ్ల శ్రీనివాస్పై పీసీసీ అధ్యక్షునికి-కాంగ్రెస్ ముఖ్యనేతల ఫిర్యాదు
పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్ నేటిధాత్రి:
పీసీసీ అధ్యక్షునితో గాంధీభవన్లో భేటి, శ్రీనివాస్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ గత నెల 28 వతేదీ నాటి ఘటనపై నివేదిక తెప్పించుకొని శ్రీనివాస్పై చర్యలు తీసుకుంటామని నేతలకు పీసీసీ అధ్యక్షుని హామీ. సానుకూలంగా స్పందించిన మహేశ్కుమార్ గౌడ్. గత నెల 28వ తేదీన కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిర్వహించిన సన్నాహాక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్పై కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమళ్ల శ్రీనివాస్ పరోక్షంగా దూషణలకు దిగిన అంశంపై ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, పార్టీ పరిశీలకులు, ముఖ్యనేతల నుంచి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు హామీ ఇచ్చారు. పార్టీ పరువు తీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, బీజేపీ, బీఆర్ఎస్తో లోపాయికార ఒప్పందం చేసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్పై దూషణలకు దిగుతూ, పార్టీ పరువు తీస్తున్న పురుమళ్లను శ్రీనివాస్ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు నేతృత్వంలో కరీంనగర్ జిల్లాకు రెండు వందల మంది కాంగ్రెస్ ముఖ్యనేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు రెండు వందల మంది స్వచ్ఛందంగా మూకుమ్మడిగా సంతకాలు సేకరించి హైదరాబాద్ లోని గాంధీభవన్కు తరలివెళ్లారు. వెలిచాల రాజేందర్ రావు అధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్ను కలిశారు. మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పురుమళ్ల శ్రీనివాస్ను వెంటనే బహిష్కరించాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని విన్నవించారు. ఈసందర్భంగా పురుమళ్ల వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడితో సుదీర్ఘంగా చర్చించారు. గత నెల 28వ తేదీన జరిగిన సమావేశంలో పురుమళ్ల మంత్రి పొన్నంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలు, మంత్రిపై అక్కసు వెళ్లగక్కుతున్న వైనం, ఆయనతో పార్టీకి జరుగుతున్న నష్టం, తదితర అంశాలను ముఖ్యనేతలు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని విషయాలను పీసీసీ అధ్యక్షులు ఓపికగా విన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నేతలతో పీసీసీ అధ్యక్షులు మాట్లాడారు. పురుమళ్ల వ్యవహారాన్ని పార్టీ నేతల నుంచి తెలుసుకున్నానని, వెలిచాల రాజేందర్ రావు తన దృష్టికి తీసుకొచ్చారని, పూర్తి వివరాలతో నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. మీరు ఏలాంటి ఆందోళన చెందవద్దు, పార్టీలో అధిష్టానమే సుప్రీం, వారి ఆదేశాలను పాటించాలని సూచించారు. బహిరంగంగా విమర్శలు చేస్తూ పార్టీ పరువు తీసే వారిని ఉపేక్షించమని, సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్పై శ్రీనివాస్ వ్యక్తిగతంగా దూషణలకు దిగడం పద్దతి కాదని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి సానుకూలంగా చర్చించుకుంటే బాగుంటుందని తెలిపారు. ఇలా వ్యవహరించడం బాగా లేదని, శ్రీనివాస్ తీరు సరిగా లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, మరో వైపు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పీసీసీ అధ్యక్షులు నేతలకు సూచించారు. పురుమళ్ల పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు-కాంగ్రెస్ ముఖ్యనేతలు పురుమళ్ల శ్రీనివాస్ వ్యవహారం రోజు రోజుకు శృతిమించుతున్నదని, బీజేపీ, బీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని పార్టీలోనే ప్రతిపక్ష నేతలాగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలుగుతున్నదని పీసీసీ అధ్యక్షుని దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చారు. కరీంనగర్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారిందని, శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ పెద్దలే తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గత నెల 28వ తేదీ సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సన్నాహాక సమావేశం జరిగిందనీ, దీనికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ పరిశీలకులు, ఇతర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని వివరించారు. పురుమళ్ల శ్రీనివాస్ కుట్రపూరితంగా అలజడి సృష్టించేందుకు హాజరై మంత్రి పొన్నంపై పరోక్షంగా దుర్భాషలాడారని పేర్కొన్నారు. సమావేశానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకులు, పార్టీ పెద్దల ముందే పార్టీ లైన్ దాటి తమరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే శ్రీనివాస్పై తిరగబడ్డారని తెలిపారు. ఇప్పటికే పార్టీ పెద్దలు ఆయనకు రెండు సార్లు షోకాజ్ నోటీస్ అందించారని, అయినా ఆయనపై ఏలాంటి చర్య మాత్రం తీసుకోలేదనీ, పట్టపగ్గాల్లేకుండా నీచంగా పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని విన్నవించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్కు శ్రీనివాస్ అమ్ముడుపోయారని ఫిర్యాదు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్తో లోపాయికార ఒప్పందం చేసుకొని పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని, ఇలాంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని కోరారు. లేకపోతే కరీంనగర్లో పార్టీకి భవిష్యత్ ఉండదని పేర్కొన్నారు. ఈసమావేశంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనద్ రహమాత్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మడుపు మోహన్, తుమ్మనపల్లి శ్రీనివాస రావు, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ పురం రాజేశం, జిల్లా గౌడ్ సంఘ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఆకుల నరసన్న నర్మదా, కోటగిరి భూమా గౌడ్, గంట కళ్యాణి శ్రీనివాస్, మల్లికార్జున రాజేందర్, పడిశెట్టి భూమయ్య, పత్తెమ్ మోహన్, మాచర్ల ప్రసాద్, మాజీ ఎంపీపీ సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, జక్కని ఉమాపతి బొమ్మ ఈశ్వర్ గౌడ్, బోనాల మురళి, గడ్డం శ్రీరాములు, మాచర్ల అంజయ్య గౌడ్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్, బత్తిని చంద్రయ్య, అనరాసు కుమార్, కుంబాల రాజ్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కులగణన నిర్ణయంతో బీసీలకు నాయ్యం-బీజేపీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం వారికి మనస్పూర్తిగా యావత్ తెలంగాణ మరియు భారతదేశ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెళ్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు కాడే నర్సింగమ్, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిత్తవేణి అంజిబాబు, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సెంటి జితేందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రామ్, మండల యువ మోర్చ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, ఉత్తేమ్ కనుకరాజు, దైవల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు వీరనాగమ్మ పండుగను నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామంలో గత రెండు రోజులుగా ఆరెకటిక కులస్తులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తికి ముక్తికి అమ్మవారు ప్రసిద్ధి చెందారు.
కుక్కలు దాడి చేసి జింకను చంపేసాయి. ఈ ఘటన నిజాంపేట మండలం చల్మెడ గ్రామ శివారులో గల మామిడి తోటలో జరిగింది. స్థానికుల వివరాలు జింకను కుక్కలు వెంబడిస్తూ తరుముకుంటూ వస్తున్నా క్రమంలో రైతు సంతోష్ రెడ్డీ అది గమనించి జింకను కుక్కల నుండి రక్షించిన ఫలితం లేకుండా పోయింది. స్థానిక పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, సోహిల్, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.