విజయ్ తో హరీష్ శంకర్.. ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు.

విజయ్ తో హరీష్ శంకర్.. ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు

 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం పరాజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర కింగ్డమ్(Kingdom) వరకు కొనసాగుతూ వచ్చింది.

 

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం పరాజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర కింగ్డమ్(Kingdom) వరకు కొనసాగుతూ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. విజయ్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతుంది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ కష్టపడుతూనే ఉన్నాడు. కింగ్డమ్ లాంటి పరాజయం తరువాత కూడా కుర్ర హీరో ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతూనే వస్తున్నాడు. ఇప్పటికే విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా మరో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా హిట్

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ- విజయ్ దేవరకొండ కాంబోలో ఇప్పటికే కింగ్డమ్ సినిమా వచ్చింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబో మరోసారి రీపీట్ కానుందని తెలుస్తోంది. సితారలోనే విజయ్ మరో సినిమాను ఓకే చేశాడట. డైరెక్టర్ ఎవరంటే హరీష్ శంకర్ అని టాక్ నడుస్తోంది. కాంబో కొత్తగా ఉంది కదా. అవును.. ఈమధ్యనే హరీష్ శంకర్.. ఒక మంచి కథను విజయ్ కు చెప్పడం, అతనికి కూడా నచ్చడంతో ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరి కాంబోను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట.

ప్రస్తుతం హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. తమిళ్ మూవీ తేరికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. దీని తరువాత హరీష్. విజయ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా అయినా కొట్టాడా ..? లేక ఇంకేదైనా హిట్ సినిమాకు రీమేక్ నా అనేది తెలియాల్సి ఉంది.

 రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం హరీష్‌రావు ఫైర్.

 రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం హరీష్‌రావు ఫైర్…

 

రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు.

జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.

హైదరాబాద్:
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు.. రేవంత్ ప్రభుత్వ (Revanth Government) పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA HarishRao) ఆరోపించారు.
విద్యావ్యవస్థపై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరితో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్త్‌ని ప్రశ్నార్థకం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా హరీష్‌రావు ట్వీట్ చేశారు.
రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం శోచనీయమని హరీష్‌రావు అన్నారు.
జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లు, మాంసం, అరటిపండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు.
బకాయిలు చెల్లించకుంటే జులై ఒకటోవ తేదీ నుంచి అన్నిరకాల ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రి సరఫరాను నిలిపి వేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు 13 నెలలుగా రూ. 450 కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి ఉందని చెప్పారు.
విద్యాసంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, స్కూల్ బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు హరీష్‌రావు.
దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలని, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదపిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. యూనిఫామ్, బూట్లు, స్కూల్ బ్యాగులు తక్షణమే పంపిణీ చేయాలని హరీష్‌రావు కోరారు.

ఘనంగా హ‌రీష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు.

ఘనంగా హ‌రీష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు

జహీరాబాద్ నేటిధాత్రి:

మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే మాణిక్ రావు కేక్ కట్ చేసిన అనంతరం గులాబీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద‌ర్భంగా శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మాట్లాడుతూ ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ వెన్నంటి నడిచిన నిజమైన గులాబీ సైనికుడు హ‌రీష్ అని అన్నారు.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న గొప్ప నాయకుడు హ‌రీష్ రావు గార‌ని కొనియాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్టీ వెన్నెముక, క‌ష్ట‌కాలంలో నిలుస్తూ.. ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడుతున్న యోధుడు హ‌రీష్ రావుగార‌ని అన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, 10 ఏండ్ల ప్ర‌భుత్వ పాల‌న‌లో నీటి పారుద‌ల‌, ఆర్థిక మంత్రిగా వారు రాష్ట్రానికి ఎన‌లేని సేవ‌లు చేశారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే కాళేశ్వ‌ర ప్రాజెక్టు సాకారంలో కేసీఆర్ గారితో పాటు హ‌రీష్ గారు శ్ర‌మ, కృషి మ‌రువ‌లేనిద‌ని అన్నారు. హ‌రీష్ రావు నిండు నూరేళ్లు అష్టైశ్వ‌ర్యాల‌తో , సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ముఖ్య‌మంత్రిగా తిరిగి కేసీఆర్ గారిని చేయ‌డంలో హ‌రీష్ రావు గారి నాయ‌క‌త్వాన్ని తెలంగాణ కోరుకుంటోంద‌ని అన్నారు.కార్య‌క్ర‌మంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,యువ నాయకులు మిథున్ రాజ్ ,చిన్న రెడ్డి,వెంకట్, నర్సింహ రెడ్డి,ఇబ్రహీం,దేవదాస్,గణేష్,సురేష్ ,నరేష్ రెడ్డి,జాకీర్,అశోక్ రెడ్డి,ఇమ్రాన్ ,నాయకులు కార్యకర్తలు త‌దిత‌రులు పాల్గొన్నారు

మాజీ మంత్రి హరీశ్ రావు రేపే నాగిరెడ్డి పల్లి రాక…

మాజీ మంత్రి హరీశ్ రావు రేపే నాగిరెడ్డి పల్లి రాక…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,సిద్దిపేట శాసన సభ్యులు టి హరీష్ రావు మేమాసం 4 వతారీకు ఆదివారం ఉదయం జహిరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించతలపెట్టిన
దుర్గా భవాని ఆలయజాతర కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన పత్రికా ప్రకటన లో తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version