సాహితి సమితి ఆధ్వర్యంలో దర్పణం పుస్తకం ఆవిష్కరణ.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో దర్పణం పుస్తకం ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోనీ ఈరోజు సిరిసిల్ల సాహితి సమితి అధ్యక్షులు జానపాల శంకరయ్య, మరియు కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మల్లేష్ చక్రాల కోనరావుపేటకు చెందిన రచయిత (ధర్పణం)కవిత పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగినది.అధ్యక్షులు జానపాల శంకరయ్య మాట్లాడుతు..ధర్పణం పుస్తకం నేటి సమాజంలో
నేటి యువతకు ఎంతగానో తొడపడుతున్నది.
సాహిత్యంతో నేటి యువత సద్వినియోగం చేసు కొని సమాజం లో ఉన్న అసమానతలు తొలిగించాలి అని తెలిపారు. అలాగే బాల సాహిత్య వేత్త వాసరవేణి పర్శరాములు మాట్లాడుతు పుస్తక రచయిత తన అక్షరాలను పూల మల్లికాల కుర్చీ
సమాజానికి తెలియజేస్తుంది అని తెలిపారు.
మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచంధర్ మాట్లాడుతు ధర్పణం ఒక అద్భుతం పుస్తకం అని
అంతేకాకుండా సమాజంలో జరిగే పరిమానాలు
తెలియజేసే విధంగా ఉన్నది అని తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్ల మానేరు కవులు, రచయతలకు ఒక పుట్టిన్నీళ్లు అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కోడం నారాయణ, బూర దేవానందం, ఏనుగుల ఎల్లయ్య,గడ్డం పర్శరాములు,గాయకుడు సుల్తానా మల్లేష్,
అంకారపు రవి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version