హై అలర్ట్.. 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు..

హై అలర్ట్.. 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా త‌నిఖీలు చేపట్టాయి.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా త‌నిఖీలు చేపట్టాయి. బాంబు బెదిరింపు మెయిల్ వ‌చ్చిన పాఠశాలలకు పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు, అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే, ఈ వారంలో రాజధానిలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగో సారి.

భారత్‌పై సుంకాలు..20% లోపే..

భారత్‌పై సుంకాలు..20% లోపే

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్‌ సుంకాల బాదుడుకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి…

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సన్నాహాలు

బ్రిటన్‌ తర్వాత మనతోనే ఈ తరహా అవగాహన

ట్రంప్‌ సర్కారు నిర్ణయం

వాషింగ్టన్‌, జూలై 12: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్‌ సుంకాల బాదుడుకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచ షేర్‌ మార్కెట్లు ‘బేర్‌’మంటున్నాయి. చైనా లాంటి దేశాలపై పదుల్లో కాకుండా.. వందల శాతాల మేర సుంకాల బాదుడుతో ట్రంప్‌ దూసుకుపోతున్నారు. ఇటీవల బ్రిక్స్‌ దేశాలకు 50శాతానికి పైగా సుంకాలు తప్పవని, భారత్‌ కూడా మినహాయింపు కాదని హెచ్చరించిన సంగతి తెలిసిందే..! అయితే.. త్వరలో భారత్‌తో కుదరనున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 26%(ముందుగా ప్రకటించినది) కాకుండా.. 20% కంటే తక్కువగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు పలు వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ ఒప్పందంతో ట్రంప్‌ పాలనలో వాణిజ్య ఒప్పందం చేసుకున్న అరుదైన దేశాల జాబితాలో భారత్‌ చేరనుంది. ఇప్పటికే బ్రిటన్‌ ఈ జాబితాలో ఉంది.

ఇక ఆసియా దేశాలైన మయన్మార్‌పై 40%, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లపై 20% మేర అమెరికా సుంకాలు కొనసాగుతున్నాయి. భారత్‌ మాత్రం అధిక సుంకాల జాబితాలో చేరకపోవచ్చని బ్లూమ్‌బెర్గ్‌ కూడా ఓ నివేదికలో పేర్కొంది. మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ ప్రతినిధి బృందం అమెరికాకు చేరుకుని, అక్కడి అధికారులతో చర్చలు జరపనుంది. ఇప్పటికే భారత్‌ తన తుది ప్రతిపాదనను అమెరికాకు అందజేసింది. జన్యు మార్పిడి(జీఐ) పంటలకు భారత్‌ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే..! అయితే.. అమెరికా తన తాత్కాలిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్‌పై జీఐ పంటల విషయంలో ఒత్తిడి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి భారత్‌ అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. ఇటు ఔషధ రంగ నియంత్రణ సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుత చర్చల తర్వాత తాత్కాలిక ఒప్పందం కుదురుతుందని, ఈ ఏడాది చివరికి తుది ఒప్పందంపై ప్రకటన ఉంటుందని సమాచారం.

20 ఏళ్లుగా ఒకే కుక్కర్లో అన్నం వండిన భార్య..

20 ఏళ్లుగా ఒకే కుక్కర్లో అన్నం వండిన భార్య.. లెడ్ పాయిజనింగ్తో ఆస్పత్రి పాలైన భర్త

జహీరాబాద్ నేటి ధాత్రి:

Lead Poisoning | వంట( Cook ) చేసేస్తుంటారు. ఎందుకంటే వంట పని అయిపోతే రిలాక్స్ గా ఉండొచ్చని. ఇక త్వరగా వంట అయ్యేందుకు చాలా మంది మహిళలు ప్రెజర్ కుక్కర్ లను వినియోగిస్తుంటారు. అన్నం వండే సమయంలో ఒక రెండు విజిల్స్ పెడితే.. ఐదు నిమిషాల్లో అన్నం రెడీ. ఇక కూరల విషయంలో ఓ ఐదారు విజిల్స్ పెడితే.. 10 నిమిషాల్లో కూర రెడీ. ఇలా ఓ అర గంటలో నాలుగైదు రకాల వంటలు తయారు చేస్తారు.కానీ ఈ ప్రెజర్ కుక్కర్లో వంటలు చేయడం ఏ మాత్రం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకే ప్రెజర్ కుక్కర్ ను ఏండ్ల తరబడి వినియోగించొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఓ మహిళ 20 ఏండ్లుగా ఒకే ప్రెజర్ కుక్కర్లో అన్నం వండుతుంది. ఆమె భర్త ఆ కుక్కర్లో వండిన అన్నం, ఇతర పదార్థాలను తిని లేట్ పాయి జనింగ్ గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.ముంబైకి చెందిన ఓ 50 ఏండ్ల వ్యక్తి.. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్ గబాలే.. బాధిత వ్యక్తిని పరిశీలించి షాక్ అయ్యాడు. అతని శరీరమంతా లెడ్ పాయిజనింగ్ అయిందని వైద్య పరీక్షల్లో తేలింది. అతను మెమోరీ కోల్పోవడం,కాళ్లల్లో తీవ్రమైన నొప్పి, కడుపు నొప్పి రావడం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇదంతా లెడ్ కెమికల్ టాక్సిసిటీ వల్ల జరుగుతుందని డాక్టర్ తెలిపారు.బాధిత రోగిని పరిశీలించి, వైద్య పరీక్షలు చేసినప్పుడు అన్ని రిపోర్ట్స్ సాధారణంగా ఉన్నాయి. కానీ హెవీ మెటల్ స్క్రీనింగ్లో అతను లెడ్ పాయిజనింగ్కు గురైనట్లు నిర్ధారణ అయింది. లెడ్ స్థాయిలు డెసిలీటర్కు 22 మైక్రోగ్రాముల చొప్పున అతని శరీరంలో ఉన్నాయి. ఇది దీర్ఘకాలిక లెడ్ పాయిజనింగ్కు దారి తీసిందని డాక్టర్ గబాలే పేర్కొన్నారు. లెడ్ పాయిజనింగ్ వల్ల శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. బ్రెయిన్, కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

మరి లెడ్ పాయిజనింగ్కు ఎలా గురయ్యాడంటే..?

రోగితో పాటు అతని భార్యను విచారించినప్పుడు లెడ్ పాయిజనింగ్కు గల కారణాలు బయటపడ్డాయని డాక్టర్ తెలిపారు. గత 20 ఏండ్ల నుంచి రోగి భార్య ప్రెజర్ కుక్కర్లోనే వంట చేస్తుందని తేలింది. పాత, పాడైన అల్యూమినియం కుక్కర్లలో సీసం ( Lead), అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోతాయని, తద్వారా లెడ్ పాయిజనింగ్కు గురవుతారని నిర్ధారించారు. దీంతో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి, మెదడు పని నెమ్మదిస్తుందన్నారు. రోగికి కీలేషన్ థెరపీ నిర్వహించామని, ప్రస్తుతం కోలుకుంటున్నాయని డాక్టర్ గబాలే పేర్కొన్నారు.

కుక్కల దాడుల్లో మరణించిన 20 మేకలు.

కుక్కల దాడుల్లో మరణించిన 20 మేకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ పరిది కోహిర్ మండలంలోని గురుజువడ గ్రామంలో ముజఫర్ పటేల్ రైతుకు చెందిన మేకలపై కుక్కల దాడులతో 20 మేకలు మరణించాయని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్థికంగా పెద్దఎత్తున నష్టం జరిగిందని, తమకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో అదుకొని తమ బతుకుదేరువైన మేకల కోసం ఆర్థికంగా ఆదుకుంటూ తమకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. కుక్కల దాడుల్లో 20 మేకలు మృతి చెందగా, మరో 5 మేకలకు గాయలయ్యాయని రైతులు తెలిపారు.

20 లక్షల నిధులను మంజూరు….

గుండం శివాలయం కు 20 లక్షల రూ..నిధులను మంజూరు చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క

కృతజ్ఞతలు తెలిపిన బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి

కొత్తగూడ,నేటిధాత్రి:

ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండలం లోని గుండం పల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం గుండం జాతర ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు జరుగు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా… భక్తులు సేధా తీర్చుట మరియు సౌకర్యాల కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ విన్నపాన్ని తెలియజేశారు వెంటనే సానుకూలంగా స్పందించి రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క గారు.
10 లక్షల రూ.. గల నూతన రేకుల షెడ్డు నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం మరియు 10 లక్షల రూ.. గల గుండం చెరువుకు స్నాన ఘట్టాలు మెట్లు భక్తుల వసతి కోసం మొత్తం 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క..
ఏజెన్సీ ప్రాంతంలో అటు పాకాల సరస్సు ఇటు గుండం సరస్సు పచ్చని ప్రకృతి నడుమ అందమైన కాకతీయులనాటి క్రీస్తుపూర్వం దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం ప్రతి మహాశివరాత్రి సందర్భంగా.. ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తారు కళ్యాణ ఘట్టంలో భక్తులు చుట్టూ నలుమూలల కొత్తగూడ , పోగుళ్లపల్లి ఓటాయి రాంపూర్ ఎదులపల్లి, వేలుబెల్లి, కోనాపూర్ సాదిరెడ్డిపల్లి ఎంచగూడా, మండలంలోని అన్ని గ్రామాలతో పాటు… నర్సంపేట , ఖానాపూర్, చెన్నారావుపేట, నల్లబెల్లి, మల్లంపల్లి, ములుగు, దుగ్గొండి, వరంగల్, మండలాల నుండి భక్తులు పోటెత్తుతారు స్వామి వారి కళ్యాణ ఘట్టంలో భాగంగా… సంకీర్తనలు భజనలు శివనామ నామంతో ఓం నమశ్శివాయ అంటూ ఆలయం శివనామ స్మరణతో మార్మోగుతుంది భక్తుల సౌకర్యం కోసం ముందుగాk మన మంత్రిగారు 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు గుండం దేవాలయ కమిటీ సభ్యులు. మంత్రి ఆదేశాల మేరకుపండితులు భాను శాస్త్రి వేద మంత్రోచ్ఛారణ నడుమ వారి దివ్య కరకరములచే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి,
వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,సుంకరబోయిన మొగిలి కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వీరనేని వెంకటేశ్వరరావు జిల్లా నాయకులు,
భానోత్ విజయ రూప్సింగ్ మాజీ ఎంపీపీ & జిల్లా ప్రధాన కార్యదర్శి,
పులుసం పుష్పలత సరోజన మాజీ జెడ్పిటిసి,
బొల్లు రమేష్ నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్
ఇరుప రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
గట్టి బాబు మాజీ సర్పంచ్, గట్టి రమేష్, గుల్లపల్లి శ్రీనివాస్, లక్కాకుల రాజు, వద్ది సోమయ్య, బిట్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version