వాటి కోసం ఒక యుద్దమే చేశాం: సీపీ రాజశేఖర్ బాబు..

వాటి కోసం ఒక యుద్దమే చేశాం: సీపీ రాజశేఖర్ బాబు

 

ఈ ఏడాది పోలీసుల పరంగా ప్రజలకు అనేక సేవలు అందించామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 21శాతం క్రైం తగ్గించామన్నారు.

 వచ్చే యేడాది లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికను సిద్దం చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. మంగళవారం విజయవాడ సిటీ కమిషనరేట్‌లో 2025 ఏడాదిలో జరిగిన నేరాల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఏడాది పోలీసు పరంగా ప్రజలకు అనేక సేవలు అందించామని చెప్పారు. 2024లో 11,937 నేరాలు నమోదు అయితే.. 2025లో 9,503 నేరాలు జరిగాయని.. అంటే గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 21శాతం క్రైం తగ్గించామన్నారు. ఈ ఏడాది అంటే.. 2025 తమకు చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. సీసీ టీవీల ఏర్పాటు కోసం ఒక యుద్దమే చేశామని తెలిపారు.

ఎవిడెన్స్ బేస్ పోలీసింగ్‌..

సురక్ష పేరు పెట్టి ఒకే సారి వెయ్యి కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆ తరువాత అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చామని వివరించారు. ఎవిడెన్స్ బేస్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా పది వేల సీసీ కెమెరాలు పబ్లిక్ ప్లే‌స్‌ల్లో పెట్టడం ఒక రికార్డు అన్నారు. అందుకు సహకరించిన సురక్ష సభ్యులు, ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆలయాలు, ప్రార్ధనా మందిరాల్లో సైతం కెమెరాలు పెట్టామన్నారు.

అస్త్రం ద్వారా ట్రాఫిక్..

గంజాయ, మత్తు పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించామని స్పష్టం చేశారు. అస్త్రం ద్వారా ట్రాఫిక్‌ను పూర్తిగా కంట్రోల్ చేశామన్నారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. విజయవాడ చరిత్రలో ఎప్పుడూ క్రైం తగ్గదని గుర్తు చేశారు. కానీ ఈ ఏడాది.. చాలా విభాగాల్లో క్రైం రేట్‌ను తగ్గించామన్నారు. నార్కోటిక్, ఎకనామిక్ అఫెన్స్ కేసులు మాత్రమే ఈసారి పెరిగాయని తెలిపారు. వచ్చే యేడాది కూడా వీటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలీస్ పనితీరుకు నిదర్శనం..

సైబర్ క్రైం తగ్గినా… నగదు నష్టం ఎక్కువుగానే ఉందన్నారు. వివిధ రకాల దొంగతనాల్లో మర్డర్ గెయిన్ ఒకటి పెరిగిందని వివరించారు. మిగిలిన వాటిలో కేసులు సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. రికవరీల్లో కూడా 80.70 శాతం ఉండటం ఒక రికార్డు.. 2024 లో 52 శాతం మాత్రమే రికవరీ ఉందన్నారు. కన్వెన్షన్ కూడా చాలా మందికి పడటం తమ పోలీసు పని తీరుకు నిదర్శనమని తెలిపారు. రోడ్టు ప్రమాద మరణాలు ఇరవై శాతం తగ్గాయని చెప్పారు.

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంది వారే..

హెల్మెట్, సీటు బెల్ట్ పై అవగాహన కల్పించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు. వచ్చే ఏడాది ఈ ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గించేలా చర్యలు చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో టూ వీలర్ల వాళ్లే అధికంగా మరణిస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ వాడాలంటూ ప్రజలకు ఆయన సూచించారు.

ఎన్టీఆర్ జిల్లా పోలీసుల గొప్పతనం..

హిట్ అండ్ రన్ కేసులు 328 ఉంటే… 238 మందికి న్యాయం చేసేలా చర్యలు తీసుకన్నామన్నారు. దేశంలోనే ఇది మూడో స్థానంలో ఉండటం ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ గొప్పతనంగా భావిస్తున్నామని తెలిపారు. సైబర్ క్రైం లో రూ. 9.54 కోట్లు సీజ్ చేశామని వివరించారు. నార్కోటిక్ కేసుల్లో పిట్ యన్డీపీఎస్ కింద 22 మందిని అరెస్టు చేశామని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా మనమే ఈ సెక్షన్ కింద కేసు పెట్టామని గుర్తు చేశారు.

డ్రోన్లు కీలకం..

దసరా, భవానీ దీక్షల విరమణ, ఇతర భారీ ఉత్సవాలకు రద్దీని మానటరింగ్ చేయడంలో డ్రోన్లు కీలకంగా పని చేశాయని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ ఏడాది అద్భుతంగా పని చేశామన్నారు.

లక్షల మంది భక్తులు వచ్చినా..

కొత్త యాప్‌ల ద్వారా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు దసరా నవరాత్రులు వేళ 18 లక్షల మంది భక్తులు, భవానీ దీక్షల విరమణకు 6 లక్షలు మంది వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశామన్నారు. క్యూలైన్లలో కౌంటింగ్ కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు క్రౌడ్‌ను అంచనా వేశామని వివరించారు. అన్ని ప్రధాన ఆలయాల్లో వచ్చే ఏడాదిలో ఈ కౌంటింగ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

వాటికి అనుసంధానించే సర్వర్, ఇతర పరికరాలు సైతం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. పార్కింగ్ ప్లేస్‌ల్లో కూడా కౌంటింగ్ కెమెరాలు పెట్టబోతున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో క్రైమ్ తగ్గినందుకు ఏబీసీడీ అవార్డు వచ్చిందని.. ఈ సందర్భంగా టీంకు ఆయన అభినందనలు తెలిపారు. పసి కందులను విక్రయించే ముఠాను అరెస్టు చేశామన్నారు.

పని తీరులో మార్పు వచ్చేలా చర్యలు..

కీలక వ్యక్తులను అరెస్టు చేసేందుకు బృందాలు పని చేస్తున్నాయని వివరించారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. 2024 అక్టోబర్ నెలలో 83 జంక్షన్‌లో 97 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్‌నూ క్రమబద్దీకరణ చేశామన్నారు. 2025 నవంబర్‌లో 97 కిలోమీటర్ల ఉన్న ట్రాఫిక్‌ను 43 కిలోమీటర్లకు తగ్గించామని సోదాహరణగా వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఇన్స్‌పెక్టర్ల పని తీరు సైతం తెలిసిపోతుందని.. వీటి ఆధారంగా వారి పని తీరులో మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అందుబాటులోకి కొత్త యాప్

రేపు ఏ జంక్షన్ వద్ద రద్దీ ఉండబోతుందో కూడా ఈ రోజే ముందస్తుగా తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక అంశాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని వివరించారు. అస్త్రం టూల్ ద్వారా కచ్చితమైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ఈ పాత్ ద్వారా అంబులెన్స్ మూవ్‌మెంట్ తెలిస్తే.. గ్రీన్ ఛానల్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. మనం ఏ రూటులో వెళితే రద్దీ ఉండదని తెలిపేలా యాప్ ద్వారా తెలియ చేస్తామని చెప్పారు. వచ్చే నెలలో ఈ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

 

జూబ్లీహిల్స్ నియోజవర్గానికి రేపు ఎన్నిక జరుగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాలనుు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలింపు ప్రక్రియ మొదలైంది. సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించనున్నారు.
3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో కలిపి మొత్తం 5 వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరుగనుంది. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సమస్యత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

కాగా.. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో‌ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైన ఉప ఎన్నికలో గెలవాలని బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో చూడాలి మరి.

కపిలతీర్థంలో ఎలాంటి తొక్కిసలాట జరుగలేదు.. తిరుపతి పోలీసులు క్లారిటీ

కపిలతీర్థంలో ఎలాంటి తొక్కిసలాట జరుగలేదు.. తిరుపతి పోలీసులు క్లారిటీ

 

 

మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసిలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు స్పందించారు. కపిలతీర్థంలో తొక్కిసిలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు.

మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసిలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు (Tirupati SP Subbarayudu) స్పందించారు. ఇవాళ(ఆదివారం) మీడియాతో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు. కపిలతీర్థంలో తొక్కిసిలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వార్తలు అసత్యమని కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి తొక్కిసిలాట జరుగలేదని క్లారిటీ ఇచ్చారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
భక్తుల రద్దీని పూర్తిగా నియంత్రిస్తూ సజావుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. తప్పుడు సమాచారం సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు నిజమైన సమాచారం కోసం పోలీస్ శాఖ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం నిత్యం కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రజల భద్రత – మా ప్రధాన లక్ష్యం’ అని ఉద్ఘాటించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడమహాలయ అమావాస్య – కపిలతీర్థం వద్ద పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు . ఈరోజు(ఆదివారం) మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతి కపిలతీర్థం ఆలయంలో తర్పణాలు వదిలే భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించడానికి అదనపు పోలీస్ సిబ్బందిని నియమించామని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనాల కదలికలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశామని వివరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.

వాహనాల పార్కింగ్ స్థలం పరిమితంగా ఉండటంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. తాను స్వయంగా కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ ఏర్పాట్లను పరిశీలించానని పేర్కొన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version