ప్రభుత్వ నిర్లక్ష్యం..గురుకులాల్లో ఫుడ్ పాయిజన్…

ప్రభుత్వ నిర్లక్ష్యం..గురుకులాల్లో ఫుడ్ పాయిజన్

-కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేరుకే సంక్షేమం..గురుకులాలన్నీ సంక్షోభం

-కస్తూర్బా గురుకులంలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన విద్యార్థులు

-ఫుడ్ పాయిజన్ బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి

-సర్పంచ్ ల ఫోరం మొగుళ్ళపల్లి మండలం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు కార్పోరేట్ స్థాయి విద్యను కొనలేని దీనస్థితిలో ఉండడాన్ని కళ్ళారా చూసిన మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 5వ తరగతి నుంచే గురుకులాల విద్యను పేద విద్యార్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అందుబాటులోకి తెచ్చి..ఆ గురుకులాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని..కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలను పట్టించుకోకపోవడం వలన రాష్ట్రంలో ఏదో ఒకచోట రోజురోజుకు ఫుడ్ పాయిజన్ జరుగుతుండడంతో..విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారని సర్పంచ్ ల ఫోరం మొగుళ్ళపల్లి మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని కొర్కిశాల గ్రామంలో ఉన్నటువంటి కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో..చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో..గుట్టుచప్పుడు కాకుండా..విద్యార్థులను చిట్యాల సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తుండగా..మీడియా మిత్రులకు సమాచారం తెలియగానే..మీడియా మిత్రులను పాఠశాలల్లోకి రానివ్వకుండా..గేటుకు తాళం వేసి..ఇంత పెద్ద సమస్యను దాచిపెట్టడానికి కుట్రలు చేయడం వెనుక ఎవరి హస్తం ఉందని అన్నారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేరుకే గురుకులాలు సంక్షేమమని, ప్రస్తుతం రాష్ట్రంలోని గురుకులాలు సంక్షోభంలో కొట్టుమిట్టు లాడుతున్నాయని..గురుకులాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడమే ఫుడ్ పాయిజన్ కు కారణమవుతున్నాయా..? లేకుంటే ప్రభుత్వమే విద్యార్థులను నిర్లక్ష్యంగా చూస్తుందా..? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను నిర్లక్ష్యంగా వదిలేసి..పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. గురుకులాల్లో ఉడికి ఉడకని పురుగుల అన్నం, నీళ్ల చారుతో భోజనం పెట్టడం వలన ఇలా ఫుడ్ పాయిజన్ లు అవుతున్నాయని, కాంట్రాక్టర్లు, గురుకులాల ప్రిన్సిపాల్ లు కుమ్మక్కై విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం, అధికారులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అండగా ఉండి గురుకులాల్లో పేద విద్యార్థులకు పెట్టె భోజనంలో ఈ దందాను కొనసాగించడం సిగ్గుచేటని విమర్శించారు. కొర్కిశాల కస్తూర్బా గురుకుల పాఠశాలలోని విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, మెనూ ప్రకారం భోజనం పెట్టని కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని అన్నారెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది..

ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది..

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం…

కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి..

మూతపడిన ప్రభుత్వ పాఠశాల రీఓపెన్ చేసిన మంత్రి వివేక్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.22 సంవత్సరాల క్రితం రామకృష్ణాపూర్ పట్టణంలోని కాకతీయ కాలనీలోని మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ను శనివారం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రీ ఓపెన్ చేశారు.

మూతపడిన పాఠశాలను రీఓపెన్ చేయించేందుకు కృషిచేసిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు పాల రాజును మంత్రి సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తుందని అందులో భాగంగానే మూతపడిన పాఠశాలలను రీ ఓపెన్ చేస్తున్నామని అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన వాళ్లందరికీ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రేషన్ కార్డులు అందించారు.

రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించామని, ఇందిరమ్మ ఇండ్లు సైతం నిర్మించుకునేందుకు సొంత స్థలం కలిగిన వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి ఎంఈఓ దత్తమూర్తి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పీసీసీ సభ్యులురఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గోపతి రాజయ్య ,మాజీ చైర్ పర్సన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు

ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి..

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్ )

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామ గ్రామాన జెండా పండుగలు నిర్వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ఆదివాసి ప్రజానీకానికి పిలుపునిచ్చారు.
శుక్రవారం మహా ముత్తారం మండల పోలంపల్లి గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జెండా పండుగలు గ్రామ గ్రామాన నిర్వహిస్తూ ఆదివాసుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు కలలు పరిరక్షించుకునే విధంగా ప్రతి గ్రామంలోని గ్రామ పెద్దలు మేధావులు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు యువతీ యువకులు కళాకారులు మేధావులు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.
ఐక్యరాజ్యసమితి ఆదివాసి ప్రాంతాల మీద దశాబ్ద కాలం పాటు అధ్యయనం చేసి ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం ఇతర సమాజాలకు భిన్నంగా ఉందని ఏ దేశంలో నైనా పరిపాలకుల విధానాల వల్ల ఆదివాసి మనగడకే ప్రశ్నార్థకం అవుతుందని ఏ దేశంలో నైనా పాలకులు ఆదివాసి అభివృద్ధి పట్ల ఆదివాసి మనుగడను ప్రశ్నార్థకం చేసే విధానాలను అనుసరించవద్దని వారి అభివృద్ధికి దోహదపడాలని సూచించినప్పటికీ, ఆదివాసీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నిరంతరం ఆదివాసి హక్కుల మీద ఆదివాసి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పరిపాలన సాగుతుందని అన్నారు కావున ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వాల యొక్క ఆదివాసి వ్యతిరేక విధానాలను ప్రతి ఆదివాసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగ ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించినప్పుడే ఆదివాసి సమాజంలో ఉన్న మేధావులుగా ప్రజలందరినీ చైతన్యం చేసి వారు స్వేచ్ఛగా పాల్గొనడానికి అవకాశం ఉంటుందని అలాంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించాలని లేనిపక్షంలో ఆదివాసి వ్యతిరేక ప్రభుత్వాలుగా మిగులుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మేకల రాజు కాపుల విజయ్ మడకం నిర్మ ,గుంటి అంజలి ,తోట చందన ,గుండాపూ తేజ అశ్విని గుండం రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

ఆటో డ్రైవర్ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి.

ఆటో డ్రైవర్ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి

టిఏడియు రాష్ట్ర అడ్వాయిజరి బోర్డుమెంబర్ రాజ్ కుమార్

ఘనంగా ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో కుటుంబాలను పోషించలేని పరిస్థితుల్లో ఉన్న ఆటో డ్రైవర్ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని
టిఏడియు రాష్ట్ర అడ్వాయిజరి బోర్డుమెంబర్ శానబోయిన రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (టిఏడియు)ఆధ్వర్యంలో దుగ్గొండి మండలంలోని గిర్నీబావిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డితో కలిసి శానబోయిన రాజ్ కుమార్ కేక్ కట్ చేసి ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.12 వేలు అమలు చేయాలి.లేబర్ కార్డ్ అందించి, 5లక్షల ఎక్స్ గ్రెషియా ప్రకటించాలని తెలిపారు.మహాలక్ష్మి పథకం వలన ఆటో డ్రైవర్ కార్మికులు రోడ్డున పడ్డాయని అవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిఏడియు మండల అధ్యక్షులు బూర రామకృష్ణ గౌడ్,
మండల గౌరవ సలహాదరుడు మోడెం విద్యాసాగర్,నాయకులు నరసింహ,కార్యదర్శి దండు రాజు, అడ్డాల అధ్యక్షులు పొగాకు దేవేందర్, తెప్పే శెంకర్, గణేష్, రాజేందర్, రహీం, ప్రశాంత్, దేవేందర్, అశోక్,రాజు, నాగరాజు, రాంరాజు, సాంబయ్య, నరేష్,సాంబమూర్తి మండలములోని అన్ని అడ్డాల డ్రైవర్ కార్మికులు పాలుగోన్నారు.

దేవాదుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి..

*దేవాదుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి

*వర్ధన్నపేట నియోజకవర్గంలోని దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న అన్ని చెరువులను సత్వరమే నింపాలి
*ఈ విషయంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వెంటనే స్పందించాల
*లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పర్యటనను అడ్డుకుంటాం
*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట (నేటిధాత్రి).:

గత పది రోజుల క్రితం ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి దేవదుల కెనాల్స్ కి నీళ్లు విడుదల చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియోజకవర్గంలోని అయినవోలు వర్ధన్నపేట మండలాల్లో చుక్క నీరు లేక నెర్రెలు వారిన చెరువులను సందర్శించి దేవాదుల నీటి ద్వారా నింపి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఆశించిన వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఏదో నాలుగు రోజులు నాలుగు చినుకులు పడ్డాయని వర్షాలు బాగా కురుస్తాయని ఆశించి రైతన్నలు వరి నాట్లు వేసుకున్నారని ఇప్పుడు అవి ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో కనీసం బోర్లు బావుల్లో నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి పరిస్థితి ఏర్పడితే వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి నాట్లు వేసుకున్న రైతన్నలపై మునిగే నక్క మీద తాడిపండు పడ్డట్లు రైతు అన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుందని కాబట్టి ఇప్పటికైనా రైతుల సమస్యలను పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న అన్ని గ్రామాల చెరువులకు కెనాల్ ద్వారా నీటిని అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలని లేదంటే రైతుల తరపున రైతులను సంఘటితం చేసుకొని మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటనను రైతుల అందరితో కలిసి అడ్డుకొని ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను మీ పార్టీపై ఉన్న వ్యతిరేకతను మీ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గారికి తెలిసే విధంగా చేస్తామని హెచ్చరించారు. వారి పర్యటనకు ముందు దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపకపోతే తప్పకుండా రైతుల ఆక్రోసాన్ని మీరు మరియు మీ ప్రభుత్వం చూడక తప్పదని వెంటనే నీటిని విడుదల చేసి మీ చిత్తశుద్ధి చాటుకోవాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా పనిచేస్తుంది..

*కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా పనిచేస్తుంది..

*ఆర్థిక సమస్యల వెంటాడుతున్నప్పటికీ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు..

*సూపర్ సిక్స్ . . సూపర్ సక్సెస్..

*ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం..

*రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి..

*అన్నదాత సుఖీభవ ద్వారా రేపటి రోజు రైతుల ఖాతాలకు రూ. 7 వేలు జమ..

*యువతకు ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం..

పలమనేరు ఎమ్మెల్యే..

బైరెడ్డిపల్లి(నేటి ధాత్రి) ఆగస్ట
01:

రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిబద్ధతతో అమలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం బైరెడ్డిపల్లి గ్రామంలో సుపరిపాలనలో- తొలి అడుగు కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి,డిసిసిబి చైర్మన్, అమాస రాజశేఖర్ రెడ్డి తో కలిసి, పలమనేరు ఎమ్మెల్యే కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించారుఆయా కార్యక్రమాలలో ఆర్ అండ్ బి మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకం సూపర్ సక్సెస్ అవుతున్నదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుతున్న తీరు ప్రతి నియోజకవర్గం లో ప్రజల వద్దకు వెళ్లి వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు పర్యటనలో భాగంగా పలమనేరులో పర్యటించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలను కలిసినప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన, పనితీరు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని డిజిటల్ హబ్ గా తయారు చేయాలని, ఎపిలో పెట్టుబడులు ద్వారా ఎకో సిస్టం అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్,రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలువెంటాడుతున్నప్పటికీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి మరువలేదని తెలిపారు. గతంలో కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే వర్తించే పథకాన్ని తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి బిడ్డకు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నది అని తెలిపారు. మహిళల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి గతంలో ఆడవారి కష్టాలను చూసి దీపం పథకం ద్వారా గ్యాస్ స్టవ్ లు, సిలిండర్లు పంపిణీ చేశారని, ప్రస్తుతం దీపం- 2 పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్ లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు హామీ ప్రకటించడం ద్వారా ప్రతి నెల రూ.350 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగిందని,
ఈ ఖర్చు ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఆగస్టు 15 నుండి రాష్ట్రంలోనీ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం కొరకు ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.పది ఎకరాల రైతులకు డ్రిప్ 90 శాతం అందిస్తున్నామన్నారు.త్రాగు, సాగునీరు అందిస్తున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు అమలు చేస్తున్నామన్నారు. గతంలో అనేక ఆంక్షలతో అర్హులకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరలేదని, ప్రస్తుతం అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన ద్వారా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు తీసుకురానున్నారని తెలిపారు.ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామికవాడ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలో సుమారు రూ.76 వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, దీని ద్వారా భవిష్యత్తులో దాదాపుగా 50వేల మంది యువతకు ఉపాధి దొరకనుందని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక ఇంటి నుండి ఒకరికి నైపుణ్యత పెంచి ఒక పారిశ్రామిక వేత్త తయారయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర రాజధాని అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టు పనులు సరవేగంగా ముందుకెళ్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో పలు రోడ్లు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కనెక్టెడ్ ఉందని ఈరోజు కేంద్ర ప్రభుత్వ శాఖల మంత్రి తిరుపతి పర్యటన సందర్భంగా వారి దృష్టికి ఈ సమస్యని తీసుకొని పోయి పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రివర్యులు తెలిపారు, పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిలో పెట్టడం జరిగింది.
కొన్ని వేల కోట్ల రూపాయలతో గుంతలు లేని రోడ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు,
పల్లె పండగ వాతావరణం లో 4000 కోట్ల రూపాయలతో గ్రామాలలో సిసి రోడ్లు, అప్రోచ్ రోడ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు.


అంతకు మునుపు పలమనేరు ఎమ్మెల్యే బైరెడ్డిపల్లి నందు జరిగిన సమావేశంలో
మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తున్న నేపథ్యంలో వాడవాడకు తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంచలంచెలుగా పూర్తి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిర్వీర్యమై కుంటుపడిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలను ముఖ్యమంత్రి పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రజా రంజక పాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో అందిస్తున్న సామాజిక పెన్షన్లను రూ. 3,000 నుండి పెంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద రూ.4,000 అందించడం జరిగిందన్నారురైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిపి రూ. 7,000 రైతులు ఖాతాకు ఆగస్టు 2న జమ చేయనున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ పారిశ్రామిక వాడలు ఏర్పాటుకు పెట్టుబడులను ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులలో భాగంగా రోడ్ల పైన గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. త్వరలో పలమనేరు – క్రిష్ణగిరి నాలుగు లైన్ రోడ్లు ఏర్పాటుకు అనుమతులు మంజూరు కానున్నదన్నారు..

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇచ్చిన..

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిరసన వ్యక్తం చేసిన ఆటో యూనియన్ సభ్యులు.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రం లో ఆటో కార్మికులు గురువారం బస్టాండ్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో ఆర్థికంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని చందుర్తి మండల ఆదర్శ ఆటో యూనియన్ కార్మికులు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి గ్యారంటీ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. దీంతో రాష్ర్టంలోని ఎనిమిది లక్షల మంది ఆటో కార్మికులకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆటో కార్మికులకి సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం కాకుండా రూ.15వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆటో కార్మికుల సంక్షేమానికి ఆటో సంక్షేమ బోర్డుగాని, ఆటో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లాంటి సంక్షేమ పథకంలో ఆటో కార్మికులకు 10 శాతం ఇళ్లు కేటాయించాలని శేషు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి…

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి
..మున్సిపల్ కమిషనర్ మనోహర్

రాయికల్, జూలై 31,నేటి ధాత్రి:

ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని 1 వార్డులలో నిరుపేద కుటుంబానికి చెందిన మంద లావణ్య ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి,ఆన్లైన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారు సూచించిన స్థలాన్ని చదును చేసి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లబ్ధిదారులు 400 స్క్వేర్ ఫీట్స్ కు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్స్ కు పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని పెరగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ బి.వెంకటి,హౌసింగ్ ఎ.ఇ పి. తిరుమల,మున్సిపల్ సిబ్బంది రజాక్,గంగారెడ్డి, శేఖర్ వార్డు కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ మొహమ్మద్ షాకీర్ సామాల్ల లత చింతకుంట సాయికుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మ్యకల రమేష్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్ బొమ్మ కంటి నవీన్ కడకుంట్ల నరేష్ బాపురపు నరసయ్య మహమ్మద్ సాబీర్ పొన్నం శ్రీకాంత్ గౌడ్ బొద్దుల శివ కుమార్ కాటిపెల్లిరామ్ రెడ్డి గుమ్మడి సంతోష్ గోపాల్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*అమరావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న‌..

*ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్ ప్రారంభోత్స‌వంలో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T133904.551.wav?_=1

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 30:

ఆనాడైనా ఈనాడైనా క్రీడ‌ల అభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్నార‌ని, ఆయ‌న నేతృత్వంలో క్రీడ‌ల బ‌లోపేతానికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు అన్నారు. తిరుప‌తిలోని శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చిత్తూరు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ నిర్వ‌హిస్తున్న ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌-2025(సీనియ‌ర్ మెన్ అండ్ ఉమెన్‌) పోటీల‌ను మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మతో
ఆయ‌న కలిసి ప్రారంభించారుతొలుత ప‌లు జిల్లాల నుంచి వ‌చ్చిన క్రీడాకారుల‌ను ప‌రిచ‌యం చేసుకుని వారితో బ్యాడ్మింట‌న్ ఆడి పోటీల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్రారంభోత్స‌వ స‌భ‌లో క్రీడాకారుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. సీఎం చంద్ర‌బాబునాయుడు మొద‌టి నుంచి క్రీడ‌ల‌కు అధిక ప్రాధాన్యత‌ క‌ల్పిస్తున్నార‌న్నారు. త్వ‌ర‌లోనే అమ‌రావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేస్తార‌ని వివ‌రించారు. టీటీడీ, శాప్ నిధుల‌తో ఆనాడే శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్సును ఆయ‌న నిర్మించార‌న్నారు. ఏపీ నుంచి అంత‌ర్జాతీయస్థాయి క్రీడాకారుల‌ను త‌యారుచేయాల‌నే సంక‌ల్పంతో అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌కు స్థ‌లాలనిచ్చి అకాడ‌మీల స్థాప‌న‌ల‌కు కృషి చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడని కొనియాడారు. గత ముప్పై ఏళ్లుగా బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్, ఫెడ‌రేష‌న్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తూ బ్యాడ్మింట‌న్ క్రీడ‌ను ముందుకు తీసుకెళ్ల‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు సీఎం కృషి చేస్తున్నార‌న్నారు. అత్యుత్త‌మ క్రీడా విధానాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నార‌న్నారు. అనంత‌రం తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మ మాట్లాడుతూ ఏపీలో క్రీడాభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌లు అపార‌మైన కృషి చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న క్రీడాస‌దుపాయాలు, క్రీడా ప్రోత్సాహ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకుని క్రీడాకారులు భ‌విష్య‌త్తులో మ‌రింత మెరుగ్గా రాణించాల‌ని సూచించారు. సీఎం చంద్ర‌బాబు ఆశ‌యాల‌కు అనుగుణంగా క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌కు ప్ర‌తీ ఒక్క‌రూ కృషి చేయాల‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఎస్డీఓ శ‌శి, బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే…!

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే… మడమ తిప్పదు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి విడత లక్ష మంజూరు

డి సి సి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం సప్పిడి గుట్ట గ్రామపంచాయతీ కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద 6 గురు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను మంజూరు చేయగా 4 గురు లబ్ధిదారులు బానోతు నీలా, సపావట్. కౌంసల్య, బానోతు రజిత, తేజావత్ కాంతమ్మ లు బేస్మెంటు బెడ్ నిర్మాణం పూర్తి అయి వారి ఎకౌంట్లో మనిషికి లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద జమ చేయడం జరిగింది. జమ అయిన లక్ష రూపాయలకు సంబంధించిన వారి ఎకౌంట్ స్టేట్ మెంటును లబ్ధిదారులకు ఇస్తూ విషయాన్ని చెప్పిన కేసముద్రం సింగిల్ విండో వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి వి .వినయ్ కుమార్, ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డికి, మహబూబాబాద్,శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ , లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఇందిరమ్మ కమిటీ సభ్యులు బానోత్ బద్రు నాయక్,బానోత్ వాలు, రవీందర్, లచ్చిరాం, లాలు, సుమన్ పాల్గొన్నారు.

సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో.!

సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ పాల్గొని మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాలకు దెబ్బతిన్న ఉల్లేపల్లి గ్రామపంచాయతీలోని చెక్ డాం మర్మంతులకు,పురుషోత్తమాయ గూడెం చెక్ డాం మరమ్మతుకు, అబ్బాయి పాలెం రోడ్డుకు సెంటర్ లైటింగ్ మరమ్మకు, మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులకు మొత్తం సుమారు 3 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, పేద ప్రజలకు విద్య వైద్యం అందాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమన్నారు, అభివృద్ధిలో డోర్నకల్ నియోజకవర్గం ముందంజలో ఉంచామని పేద ప్రజల చిరకాల వాంఛ ఐనా ఇందిరమ్మ ఇండ్లు,నూతన రేషన్ కార్డులు వంటి కార్యక్రమాల్ని చేయడం జరుగుతుంది అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, పురుషోత్తమాయగూడెం తాజా మాజీ సర్పంచ్ నూకల అభినవరెడ్డి,శ్రీపాల్ రెడ్డి,నల్లు శ్రీకాంత్ రెడ్డి,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు, అంబరీష్య రామ్లాల్,మెంచు అశోక్ కుమార్, అబ్జల్,టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్,మాజీ సర్పంచులు,మాజీ కౌన్సిలర్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు,ప్రజా ప్రతినిధులు,స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వద్దు..

ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వద్దు

పులిగుండాల మాజీ సర్పంచ్ సోడి చలపతి డిమాండ్

నేటిధాత్రి చర్ల

చర్ల మండలంలోని పులిగుండాల గ్రామపంచాయతీ పరిధిలో గల కొండేవాయి గ్రామంలో ఎంపీపీ స్కూల్ కి ఆనుకొని సెల్ టవర్ నిర్మాణం వద్దు గ్రామంలోనే వేరే దగ్గర స్థలం ఇస్తాము అని గ్రామస్తులు చెప్పిన వినకుండా సెల్ ఫోన్ టవర్ నిర్మాణానికి స్థలం కేటాయించడం అన్యాయమని పులిగుండాల మాజీ సర్పంచ్ సోడి చలపతి అన్నారు ఫారెస్ట్ అధికారులు మరొకసారి పునరాలోచించాలని అన్నారు సెల్ ఫోన్ టవర్ ఇంత దగ్గరగా నిర్మాణం చేపట్టడం విద్యార్థులపై రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఇకనైనా చర్ల మండల అధికారులు ఇటువంటి ఇటువంటి నిర్మాణాలను గ్రామంలోని వేరొక ప్రాంతానికి తరలించాలని అన్నారు వలన ఐదవ షెడ్యూల్ ప్రాతంలో పెసా గ్రామ సభ తీర్మానం చేయకుండా ఫారెస్ట్ అధికారులు బిఎస్ఎన్ఎల్ టవర్ కోసం విద్యార్థులు ఆటలు ఆడుకునే స్కూల్ స్థలంలో మార్కింగ్ ఇచ్చివున్నారు మరియు ఎంపీపీ స్కూల్ స్థలం లో కాకుండా గ్రామంలోనే వేరే దగ్గర టవర్ ఏర్పాటు చేయాలనీ చర్ల మండల తాసిల్దార్ కు చర్ల మండల విద్యాశాఖ అధికారికి విన్నతి పత్రం ఇచ్చినారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు పొడియంరాజేష్ పొడియం అంద్దయ్య మడకంరవి వినోద్ యాత్ కాంగ్రెస్ నాయుకులు సోడినాగరాజు తదితరులు పాల్గొన్నారు

సొంతంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం…

సొంతంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవతో మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు బుడగ జంగాల కాలనీలో కొండపల్లి మంగ చందులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లుకు పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ,పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ లు ముగ్గు పోయడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లతో పేద ప్రజల కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నామని సొంత ఇంటి కళ నెరవేర్చుతున్న ప్రజా ప్రభుత్వనికి ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెరుగు శ్రీనివాస్,సమన్వయ కమిటీ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,నల్లెల అనిల్ కుమార్,ఏకు రాజు,దార్నా వేణు,నాయకులు సాదు రఘువీర్,సిరిగిరి మల్లేష్,రెండ్ల సంపత్ కుమార్,బొచ్చు శ్రీను,మౌటం గణేష్,మౌటo చందు,పాస్టర్ సిల్వన్,పాస్టర్ సమ్మయ్య(పాల్),తెలకలపల్లి సోమేశ్వర్,లక్ష్మీ,రమణ, శివకృష్ణ సమ్మక్క,కవిత, శారదా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

మా టీచర్లు మాకే కావాలి..

మా టీచర్లు మాకే కావాలి
• డిప్టెషన ను నిలిపివేయాలి
• గేటు ముందు గ్రామస్తుల నిరసన

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-25T123542.285.wav?_=2

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రభుత్వ పాఠశాలలను నమ్మి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలోకి పంపిస్తే డిప్టేషన్ పేరిట ఉపాధ్యాయులను బదిలీ చేయడం సరికాదని నిరసిస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 55 మంది విద్యార్థులకు గాను 4 టీచర్లు ఉండగా డిప్టేషన్పై ఇద్దరూ ఉపాధ్యాయులను వేరొక ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఇప్పుడు ఉపాధ్యాయులను తీసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను బదిలీ చేస్తే విద్యార్థుల చదువులు నాశనం చేసినట్లు అవుతుందన్నారు. ఈ విషయమై నిరసిస్తూ గంటపాటు గేటు ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. డిప్టేషన్ నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చూస్తామన్నారు. కార్యక్రమంలో బుర్ర సంతోష్ గౌడ్, అందే సిద్ధ రాములు, మ్యాదరి కుమార్, భూపతి రెడ్డి, బురాని నర్సాగౌడ్, నాగభూషణం తదితరులు ఉన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను…. ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను…. ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..

#స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీవే.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకై ప్రతి కార్యకర్త నిస్వార్థం లేకుండా పనిచేయాలని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గొల్లపల్లి, కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్ర నాగరాజు, కొండ నారాయణ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం లో తిరుపతి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి గ్రామం లో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజల వద్దకు తీసుకువెళ్ళి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్యకర్తలు సమన్వయం తో పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు చార్ల శివారెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ ఇఫ్తార్ శేఖర్ గౌడ్ నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దూరి తిరుపతి రావు ,మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి మాలోత్ మోహన్, నాయకులు రఘు పతి రావు, జెట్టి రామూర్తి , బౌ సింగ్ , చిట్యాల ఉపేందర్ రెడ్డి, పోగుల కుమారస్వామి ,దూలపల్లి రవీందర్ రావు , వెంకన్న ,సంపత్ రావు ,రాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) ఆధ్వర్యంలో మూడు దశల పోరాటం.

మొదటి దశలో భాగంగా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మండల స్థాయిలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పణ

విద్యారంగంలో పేరుకుపోయిన 51 సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపం.

ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలి. సిపిఎస్ ను రద్దు చేయాలి.

317 బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలి.

టి పి టీ ఎఫ్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రాం నర్సయ్య, కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యుటిఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్యల డిమాండ్ .

కేసముద్రం/ నేటి దాత్రి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రభుత్వం ముందుంచిన దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పిఆర్సి, డిఏ, ఏకీకృత సర్వీస్ రూల్స్ మొదలగు 51 అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టిపిటిఎఫ్ మహబూబాద్ జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి( యు.ఎస్.పి.సి ) చేపట్టిన మూడు దశల పోరాటం లో, మొదటగా మండల కేంద్రంలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించాలన్న పిలుపు మేరకు గురువారం మండలంలోని యు. ఎస్. పి. సి. భాగస్వామ్య సంఘాలైన టీ.పి.టీ. ఎఫ్, డి. టీ. ఎఫ్. సంఘాల నేతృత్వంలో కేసముద్రం మండల తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యు.టి. ఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలను పెండింగ్లో ఉంచిన గత ప్రభుత్వాన్ని గద్దె దించామని అన్నారు. కానీ ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వం కూడా ఆ సమస్యలను అలాగే కొనసాగించి ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇచ్చిన ఉచితాల హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పరుగులు తీస్తుందని విమర్శించారు. కానీ ఉద్యోగస్తులకు మాత్రం హక్కుగా రావాల్సిన వాటిని పెండింగ్లో పెడుతుందని వాపోయారు. విద్యారంగంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ,డి ఏ లు ప్రకటించాలని,,ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలని, కస్తూరిబాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, గురుకుల వ్యవస్థను తొలగించి గ్రామాలలో ఉండే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆ రోజె అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ప్రధాన కార్యదర్శి నన్నపురాజు నరసింహరాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊట్కూరి ప్రణయ్ కు మార్, జి. శ్రీనివాస్, తండా సదానందం ,జిల్లా కౌన్సిలర్ సదయ్య, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి లావుడ్యా భద్రాసింగ్, కార్యదర్శి భట్టు భద్రు, డి టి ఎఫ్ జిల్లా కౌన్సిలర్ గంగుల శ్రీనివాస్, కార్యదర్శి సుంకరి రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కోడిగుడ్ల..

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కోడిగుడ్ల సరఫరా టెండర్ల పర్యవేక్షణకు కమిటీ

వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలలో ఏడాదిపాటు కోడి గుడ్ల సరఫరా టెండర్ల పర్యవేక్షణకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.కోడిగుడ్ల సరఫరా టెండర్ల పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చైర్మెన్ గా, జిల్లా విద్యాధికారి, ఆయా రెసిడెన్షియల్ విద్యాలయాలు బాధ్యులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సభ్యులుగా ఈ కమిటీ లో ఉంటారని వెల్లడించారు.
ప్రభుత్వ వసతి గృహాల నుండి కోడిగుడ్డుల ఇండెంట్ వివరాలు జిల్లా కలెక్టరేట్ కు సమర్పించాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి నేరుగా సప్లయర్ కు అవసరమైన కోడిగుడ్ల ఇండెంట్ ను సమర్పించడం జరుగుతుందని, గత సంవత్సరం అడ్మిషన్లకు అదనముగా 10% విద్యార్థుల సంఖ్యను పెంచి ఇండెంట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కోడిగుడ్డు బరువు 45 గ్రాముల నుంచి 52 గ్రాములు ఉండాలని, ప్రతి మాసము రెండుసార్లు సప్లై చేయాలని, అర్హత, అనుభవం వారికి నిబంధనల ప్రకారం కోడిగుడ్లు సరఫరా చేసే హక్కులు అందజేస్తామని, కోడిగుడ్ల సరఫరాలో ఆలస్యం చేస్తే పెనాల్టీలు విధిస్తామని కలెక్టర్ తెలిపారు. టెండర్ల విధానం, టెండర్లు ఆహ్వానం, తెరవడం తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, ఆయా విద్యాలయాల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ.

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి కొండా సురేఖ

దేశాయిపేట ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

నేటిధాత్రి, దేశాయిపేట, వరంగల్.

పేదప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం జిడబ్ల్యుఎంసి పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీ ప్రాంతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు,
జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ప్రతులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అధికారులతో కలిసి దేశాయిపేట ఎస్సీ కాలనీలో కలియ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ..

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని, నియోజకవర్గానికి 3500 ఇల్లు మొదటి విడతలో మంజూరయ్యాయని, రెండో విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను ఏమాత్రం ఆలస్యం చేయడం లేదని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. మధ్య దళారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నదని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్యశ్రీ పరిస్థితిని 10 లక్షల రూపాయలకు పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి కల ఇందిరమ్మ ఇల్లు సొంతమయ్యేలా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడుదల రాష్ట్రవ్యాప్తంగా 22 వేల 500 కోట్ల రూపాయలతో నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులు అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల దేవదాయ శాఖకు 176 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని మంత్రి తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప గత పది ఏళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. కొండా దంపతులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వల్లే ప్రజలు ఆశీర్వదించడం వల్ల ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని, తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ అన్ని డివిజన్లను పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న షాదిఖానను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
మహిళలు తలచితే ఏదైనా సాధిస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 6 గ్యారంటీలు మహిళల పేరు మీదే నామకరణం చేయడం జరిగిందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడంతోపాటు 200శాతం కాస్మెటిక్ చార్జీలను పెంచడం, పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు మెప్మా ద్వారా కుట్టించిన యూనిఫామ్ లు పాఠ్యపుస్తకాలు అందించి ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలలను బలోపేతం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, తూర్పు లోని 5 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ ద్వారా ఐదు బస్సులను అద్దెపై నిర్వహించుకొనుటకు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వెనుకబడిన తరగతుల వారికి కమ్యూనిటీ హాల్ లకు బదులు మ్యారేజ్ హాల్ లను నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సూచించారు.

District Collector Dr. Satya Sarada.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ..

ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని, పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు సమీక్షలు జరుపుతున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే మేస్త్రీలకు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మహిళ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణం ఇప్పించడం జరుగుతుందన్నారు. 500 ఎస్ ఎఫ్ టి వరకే నిర్మించుకునేలా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ..

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరిలో మధ్య దళారుల సమయం లేకుండా చూడాలని, అలాంటి దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శుభం, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్న రాణి, సీఎంహెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం భూములను గుర్తించేది ఎర్రజెండా పార్టీ..

ప్రభుత్వం భూములను గుర్తించేది ఎర్రజెండా పార్టీ

#నెక్కొండ, నేటి ధాత్రి:

ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాదారుల నుండి వెలికి తీసే చూపెట్టిన పార్టీ సిపిఐ ఎర్ర జెండా పార్టీ అని వరంగల్ జిల్లా సిపిఐ కార్యదర్శి మేకల రవి అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు అధ్యక్షతన జరిగిన 72వ సిపిఐ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొందరు అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములను, దేవాలయ భూములను, కబ్జా చేసినా కబ్జా కోర్ల నుండి బయటకు తీసి గుడిసెలు వేసి దెబ్బలు పడి, కేసులపాలై, ప్రభుత్వానికి అప్పజెప్పిన ఘనత సిపిఐ పార్టీ , ఎర్రజెండాదని ఇది ఉమ్మడి జిల్లాలో, జిల్లా కేంద్రంలోనే జరిగిందని కాళిదాసు ప్రభుత్వ భూమిని కొందరు భూకబ్జా కోర్ల నుండి బయట తీసి ప్రభుత్వానికి, న్యాయస్థానం ద్వారా ప్రభుత్వానికి అప్పజెప్పారని, ఆ స్థలం లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆడిటోరియంలు నెలకొల్పిందని ఆయన గుర్తు చేశారు. ప్రజా సేవకు ఏ పదవులు అధికారం లేకున్నా ప్రజల అండదండలతో ఎన్నో ఉద్యమాలు చేస్తూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శిలు ఎస్కే భాష్మియా, పనస ప్రసాద్, అక్క పెళ్లి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండె బద్రి ,దండు లక్ష్మణ్, సంఘి ఎలేందర్, ముని,జిల్లా సమితి సభ్యులు మహమ్మద్ అక్బర్ ,అయిత యాకయ్య, మియాపురం గోవర్ధన్, మండల నాయకులు మెరుగు మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉంది

 

విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉంది

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో చదువుతున్న ఇద్దరూ విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నామని,వారి ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో విద్యనభ్యసిస్తున్న బి.తరుణి (8వ తరగతి) జ్వరంతో,బి. రేవతి (6వ తరగతి) టాన్సిలైటిస్ తో కూడిన జ్వరంతో బాధపడుతుండగా మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.విద్యార్థినిలు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని,మీడియా ప్రతినిధులు సందర్శించినప్పుడు వైద్యులు ఈ విషయాన్ని నిర్ధారించారని, చికిత్స కొనసాగుతుందని, ఎ.టి.డి.ఓ. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి వెంట ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై కొంత మంది కలుషిత ఆహారం తినడం వల్ల ఇలా జరిగిందని అవాస్తవాలు ప్రచారం చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని,ఇలాంటి అవాస్తవ,అనాలోచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version