సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో.!

సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ పాల్గొని మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాలకు దెబ్బతిన్న ఉల్లేపల్లి గ్రామపంచాయతీలోని చెక్ డాం మర్మంతులకు,పురుషోత్తమాయ గూడెం చెక్ డాం మరమ్మతుకు, అబ్బాయి పాలెం రోడ్డుకు సెంటర్ లైటింగ్ మరమ్మకు, మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులకు మొత్తం సుమారు 3 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, పేద ప్రజలకు విద్య వైద్యం అందాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమన్నారు, అభివృద్ధిలో డోర్నకల్ నియోజకవర్గం ముందంజలో ఉంచామని పేద ప్రజల చిరకాల వాంఛ ఐనా ఇందిరమ్మ ఇండ్లు,నూతన రేషన్ కార్డులు వంటి కార్యక్రమాల్ని చేయడం జరుగుతుంది అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, పురుషోత్తమాయగూడెం తాజా మాజీ సర్పంచ్ నూకల అభినవరెడ్డి,శ్రీపాల్ రెడ్డి,నల్లు శ్రీకాంత్ రెడ్డి,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు, అంబరీష్య రామ్లాల్,మెంచు అశోక్ కుమార్, అబ్జల్,టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్,మాజీ సర్పంచులు,మాజీ కౌన్సిలర్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు,ప్రజా ప్రతినిధులు,స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version