ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను…. ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను…. ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..

#స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీవే.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకై ప్రతి కార్యకర్త నిస్వార్థం లేకుండా పనిచేయాలని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గొల్లపల్లి, కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్ర నాగరాజు, కొండ నారాయణ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం లో తిరుపతి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి గ్రామం లో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజల వద్దకు తీసుకువెళ్ళి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్యకర్తలు సమన్వయం తో పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు చార్ల శివారెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ ఇఫ్తార్ శేఖర్ గౌడ్ నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దూరి తిరుపతి రావు ,మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి మాలోత్ మోహన్, నాయకులు రఘు పతి రావు, జెట్టి రామూర్తి , బౌ సింగ్ , చిట్యాల ఉపేందర్ రెడ్డి, పోగుల కుమారస్వామి ,దూలపల్లి రవీందర్ రావు , వెంకన్న ,సంపత్ రావు ,రాజు తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్ఆర్

నిరుపేదల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్ఆర్

నర్సంపేట,నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ అన్నారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ 76 వ జయంతిని పురస్కరించుకొని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన నాయకులు ఘన నివాళులర్పించారు.

 

 

 

 

 

రాజేందర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజా సంక్షేమమే నిదానంగా ప్రభుత్వం నడవాలని ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజ్ రియింబర్స్ మెంట్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇల్లు, పావలా వడ్డీకే రుణాలు, వడ్డీ లేని రుణాలు, జలయజ్ఞంతో, సహా ఎన్నో గొప్ప పథకాలను తీసుకువచ్చి పథకాల అమల్లో దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు.తన పాదయాత్రతో 2004, 2009, వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన గొప్ప నేత దిగంగత వైయస్ఆర్ అని కొనియాడారు.

 

 

 

ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,మాజీ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్,ములుకల సాంబయ్య,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్,పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, మాజీ సర్పంచ్ చిలువేరు రజిని భారతి, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ పద్మాబాయి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శులు నూనె పద్మ, తక్కళ్ళపెల్లి ఉమా, పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శులు చిప్ప నాగ, నాడెం నాగేశ్వర్లు, మాజీ వార్డు మెంబర్లు పేరం బాబు రావు, కొయ్యడి సంపత్ గౌడ్, గండి యాదగిరి గౌడ్, లక్కార్సు రమేష్, పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి శ్రీనివాస్, కోల చరణ్ గౌడ్,గద్ద జ్యోతి,దేశి లక్ష్మీ, బైరి మురళి, దండెం రతన్ కుమార్, ఖాజాబీ, వేల్పుల శ్రీలత, కటారి ఉత్తమ్ కుమార్, నాగేల్లి సారంగం గౌడ్,దేశిసాయి పటేల్, సామల ప్రశాంత్, వరంగంటి సాయి విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version