గందె సత్యానందం ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో.

గందె సత్యానందం ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

 

పరకాల నేటిధాత్రి:

పరకాల పట్టణంలోని గందె సీతారాములు కంపెనీ యజమాని గందె సత్యానందం ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినం రోజున వేసవికాలంలో మండుటెండలో బాటసారిలకు వివిధ గ్రామాల నుంచి పనులకు పరకాలకు వస్తున్న రైతు సోదరులకు ప్రజలకు దాహార్తిని తీర్చుటలో తన వంతు సహాయం చేసే సదుద్దేశంతో ఉచిత చలివేంద్రమును ప్రారంభించడం జరిగింది.గత కొన్ని సంవత్సరాలుగా ఈ చలివేంద్రమును నిర్వహిస్తూ బాటసారిలకు చల్లని నీటిని అందిస్తున్నామని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల పరిసర గ్రామ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందచాహలతో సంతోషంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీ కుంకుమేశ్వర స్వామిదేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు శిరీష దంపతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version