ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి
ములుగు టౌన్ నేటి ధాత్రి
ఈరోజు వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ మఖ్యనాయకుల సమావేశం లో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య మాట్లాడుతూ కార్మికులు ఎధుర్కొంటున్న అనేక సమస్యలు, ప్రభుత్వాల కార్మిక వ్వతిరేఖ విధానాలపై పోరాట రూప కల్పన చేయడానికి గాను ఈ నెల 26 వ, తేదీన వెంకటాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవణలో జరిగే ఏఐటీయూసీ మండల
మహసభను, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కావెంజర్లు, హమాలీ కార్మికులు, భవణ నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్స్, నీరడీలు, ఆశ, అంగన్వాడీ, రెండవ ఏ,యన్, యం, లు తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు,, ఈ సమావేశంలో పాల్గొన్న వారు కొక్కుల రాజేందర్, గాలి సమ్మయ్య, జనగాం శోభ, తోట సంపత్,సంగు పోషమ్మ, నార్లగిరి సరిత, జనగాం లావణ్య,
ప్రజాపక్షం దిన పత్రిక ప్రజల గొంతుకగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. ప్రజాపక్షం దిన పత్రిక 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు హాజరై కేక్ కట్ చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో,పారదర్శక పాలనను,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రజాపక్షం దిన పత్రిక ఎనలేని కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో ఈ పత్రిక మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి పార్వతి సురేష్ కుమార్,మంచిర్యాల ఆర్సీ ఇన్చార్జి కేశేటి వంశీ,నస్పూర్ మండల విలేకరి నారగొని పురుషోత్తం,గంగారపు గౌతమ్,కుమ్మరి సతీష్, చిట్యాల వినీత్ తదితరులు పాల్గొన్నారు.
ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు
కేసముద్రం/ నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కార్మిక హక్కులను రక్షించుకోవడానికి కనీస వేతనాలు సాధించుకోవడానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి
ములుగు టౌన్ నేటి దాత్రి
ములుగు జిల్లాలో ఈరోజు ఏఐటీయూసీ ములుగు మండల మహాసభ గుంజ శ్రీనివాస్,,, పెద్ద కాసు వినోద్ గారి అధ్యక్ష వర్గంగా, ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన మహాసభలో పాల్గొన్న, ఏఐటియుసి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి, జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం,కార్పోరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉండడానికి గాను, నాలుగు కోడ్స్ గా కుదించడం జరిగింది అన్నారు,అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ప్రజలు,కార్మికులు,ఉద్యోగులు,ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది అన్నారు, కనుక పై చట్టాలను రక్షించుకోవడానికి, కనీస వేతనాలు సాధించుకోవడం కోసం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు,, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని తీర్పు ఇచ్చినప్పటికీ, పాలకులు మాత్రం అమలు చేయడం లేదు అన్నారు, కనుక సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం పైన కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది, కేంద్ర రాష్ట్ర,ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే బదులు వాటిని ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నారు, అలాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలను విరమించుకొని ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించాలని ప్రభుత్వం ద్వారా అనే నేరుగా వేతనాలు చెల్లించాలని స్కీం వర్కర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలని కనీస వేతనాలు 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇవన్నీ సాధించుకోవడం కొరకు అన్ని వర్గాల ప్రజలు కార్మికులు ఉద్యోగులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది జేఐటియుసి మండల అధ్యక్షులుగా పెద్దకాసు వినోద్ ప్రధాన కార్యదర్శిగా గుంజ శ్రీనివాస్ గారలతోపాటు 22 మందిని ఎదుర్కోవడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బండి నరసయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షురాలు సామల రమ, సిపిఐ సీనియర్ నాయకులు ఇంజన్ కొమురయ్య, ముత్యం కొమురయ్య, వీరన్న,శ్రవణ్,, కొత్తపెళ్లి శ్రీనివాస్,అజిత, సంధ్య, లలిత, సంధ్య, సమత, గుండ్రెడ్డి శ్రీనివాస్, గుండె దీపిక,మల్రాజుల సమ్మయ్య,కమలక్క రమేష్,కుంకర స్వామి,కౌసల్య, శ్రీను, శిరీష, ప్రవీణ్,శ్రీకాంత్,జంపాల శ్రీనివాస్, ఎండి రంజాన్, నవ లోక,రజిత,లావుడే రాములు, కనక లక్ష్మి ఆసరి లక్ష్మి రాజకుమారి స్వరూప
గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి తన తల్లిదండ్రులు దివంగత గుండు రాధ,రామలక్ష్మన్ జ్ఞాపకార్థం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గౌడు కు రూ 40 వేల రూపాయల విలువగల పుస్తకాలను అందించి ఔదార్యం చాటుకున్న భూపాలపల్లి రూరల్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన పూజిత,నరహరి దంపతులు. సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో పుట్టినరోజు చనిపోయిన రోజుల పేరుతో ఎన్నో డబ్బులు వృధా చేస్తున్నారని,ఏదైనా ఒక మంచి పని చేయాలని ఉద్దేశంతో విజ్ఞానాన్ని అందించడానికి పుస్తకాలను గ్రంధాలయానికి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ఏఐటీయుసి నాయకుడు రమేష్. బాలగొని రమేష్ మంతెన సమ్మయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు
సింగరేణి కార్మికుల లాభాల వాటా పై యాజమాన్యం పునరాలోచించాలి
ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి వ్యాప్తంగా లాభాల వాటా ప్రకటనపై ప్రతి కార్మికుడికి అసంతృప్తి ఉందని, వాస్తవ లాభాలు ప్రకటించాలని ఏఐటీయూసీ గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తుందని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. లాభాల వాటా పై రకరకాల చర్చలు, కామెంట్లు వస్తున్న నేపధ్యంలో వాస్తవ లాభాలను ప్రకటించకుండా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం గోప్యతతో లాభాలను ప్రకటించడం కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా వాస్తవిక లాభాలను ప్రకటించాలని ఏఐటియుసి డిమాండ్ చేస్తుందని అన్నారు. లాభాలను సింగరేణి ప్రాంతంలో అభివృద్ధికై కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్న ప్రభుత్వం,యాజమాన్యం సింగరేణి ప్రాంతాలలో ఏం అభివృద్ధి చేశారో తెలియచేయాలని అన్నారు. ప్రభుత్వం నుండి సింగరేణికి ఇప్పటికే 40 వేల కోట్ల బకాయిలు రావాల్సింది ఉందని గుర్తు చేశారు. లాభాలు ఎన్ని వచ్చాయో యాజమాన్యం ప్రకటించకుండా ఇన్ని రోజులు నాన్చుతూ వచ్చి చివరకు కేవలం 34% లాభాల వాటా మాత్రమే అందించడంతో కార్మిక లోకం తీవ్ర అసంతృప్తికి లోనైందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సైతం సరైన లాభాలు ప్రకటించకపోవడంతో వారు కూడా నిరాశ చెందుతున్నారని తెలిపారు. ఏఐటియుసి సంఘం తరఫున లాభాల వాటపై ప్రభుత్వం పై,యాజమాన్యం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రతి కార్మికుడికి చెందాల్సిందేనని డిమాండ్ చేశారు. లాభాల వాటాపై యాజమాన్యం పునరాలోచించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్
ములుగు టౌన్ నేటి ధాత్రి
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని భాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు,, మల్లంపల్లి మండలాల సంయుక్త సమావేశము గున్నాల రాజకుమారి,,అంకం పధ్మ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ పాఠశాలలలో వంటలు చేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికులు అంటే ప్రభుత్వానికి, అధికారులకు చిన్నచూపు అన్నారు అందుకే వారి సర్వీసు,సేవాభావానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా హేళనగా చూస్తున్నారు అన్నారు,వంట కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతూ అనేక దఫాలుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్ళినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికే వంటలు చేస్తున్న సందర్భంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా జరిగాయి అన్నారు రంగారెడ్ది జిల్లా శంషాబాద్ లో, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గాంధినగర్ లో, హన్మకొండ జిల్లా కటాక్షపూర్ లో,నిన్న నిజామాబాద్ జిల్లా అమ్రాధ్ ఉన్నత పాఠశాలలో లలిత అనే కార్మికురాలు ఇలా గంజి పడి ఒకరు, కుక్కర్ పేలి ఒకరు కూర పడి ఒకరు ఇలా అనేక మంది వంట కార్మికులకు విపరీతమైన గాయాలై నడువలేని స్థితిలో ఉన్నారు అన్నారు ఇదంతా విధ్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందిస్తున్న సందర్భంలో జరిగినవే లక్షలాది రూపాయలు వారు స్వంతంగా పెట్టుకోవలసిన పరిస్థితితులు వీరు ప్రభుత్వం లో భాగస్వాములు కారా వారి ఖర్చులు ప్రభుత్వం భరించకూడదా అన్నారు కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి వంట కార్మికులకు భీమా కల్పించి పరిహరాలు అందించాలని డిమాండ్ చేశారు, ఇప్పటికే లక్షలాది రూపాయలు స్వంత డబ్బులు పెట్టి వంటలు చేస్తుంటే ఆ బిల్లులు నేలల తరబడి పెండింగ్లో ఉండి అప్పుల పాలౌతుంటే, మల్లీ ప్రమాదాలు జరుగుచున్న సందర్భంలో ప్రభుత్వం భరించక పోతే ఎలా అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పరిహరాలు చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్రంలో ఉన్న 54200 మంది వంట కార్మికులను సమీకరించి ఏఐటియుసి నాయకత్వంలో ఉద్యమాలు నిర్వహస్తము అన్నారు,,ఈ సమావేశంలో గున్నాల రాజకుమారి,గుండ్రెడ్డి శ్రీనివాస్,మాలగాని కమల,పౌర రాధ,మాడిశెట్టి భాగ్య,సలువాల స్వరూప, కొత్త కనుకలక్ష్మి, కొత్త పూల,ఆసరి లక్ష్మి,ముత్యం రవీంద్ర,,అకఖం పధ్మ, బండి సరోజన,పోరిక ప్రమీల,భానోత్ బుల్లీ,భానోత్ కమల,సార సుగుణ,పల్లెవేణ మల్లిఖాంభ, తదితరులు పాల్గొన్నారు*
జహీరాబాద్ పట్టణానికి విచ్చేసిన ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్, సిపిఐ జాతీయ కార్యదర్శి అజిజ్ పాషా గారిని సిపిఐ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జిల్లాలుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ, “దేశంలోని కార్మికులకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన చట్టాలను రద్దు చేయడం పూర్తిగా దారుణం” అని అభిప్రాయపడ్డారు. కార్మిక హక్కులను హరించే విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి అజిజ్ పాషా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కార్మిక, రైతు, చిన్న మధ్య తరగతి ప్రజలకు చేటు చేస్తాయని విమర్శించారు. “ప్రజా సమస్యలపై పోరాడటమే సిపిఐ లక్ష్యం” అని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొని జాతీయ నాయకుల అభిప్రాయాలను స్వాగతించారు.
ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన గౌరవ ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయులు ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు క్యాంపు కార్యాలయంలో ప్రో. జయశంకర్ సార్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,తులసి దాస్ ,మాజి సర్పంచ్ లు చిన్న రెడ్డి ,ఓంకార్ ,నాయకులు మోహన్,శ్రీనివాస్ , ఫయాజ్ ,అశోక్ రెడ్డి ,శేఖర్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఏఐటియుసి నాయకుల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఐఎన్టియుసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు
శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:
ఆర్కే5 గనిపై ఇటీవల జరిగిన ద్వార సమావేశంలో ఏఐటియుసి నాయకులు తమకు అసలు సంబంధం లేని విషయాలపై ఘనతను దక్కించుకోవాలని తాపత్రయపడటం దురదృష్టకరమన్నారు. డిపెండెంట్ల వయోపరిమితిని 30 నుండి 40 సంవత్సరాలకు పెంచేలా,మీప్రభుత్వంతో మాట్లాడి యాజమాన్యాన్ని ఒప్పించగలిగిన ఘనత ఐఎన్టియుసి యూనియన్ కే దక్కుతుంది అని అన్నారు. కానీ ఆ విషయాన్ని ఏఐటీయూసీ నాయకులు తమ విజయంగా చెప్పుకోవడం వారి నీతి మాలిన అసత్య ప్రచారానికి నిదర్శనమని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఐఎన్టియుసి నాయకత్వంలో బి.జనక్ ప్రసాద్,సెక్రటరీ జనరల్,తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరి బోర్డు చైర్మన్ ప్రభుత్వ స్థాయిలో అనేకసార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,సింగరేణి చైర్మన్ డైరెక్టర్లతో జరిపిన చర్చలు,సమర్పించిన నివేదికలు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పెద్దపల్లి యువ వికాసం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రివర్యులు పాల్గొన్న ఈ సమావేశం అత్యంత విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. ఈసమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభలో సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల సొంతింటి పథకం, అలవెన్సులపై ఇన్కమ్ టాక్స్ చెల్లింపులు,మారుపేర్ల పరిష్కారం,ఇతర పలు సమస్యలపై బి.జనక్ ప్రసాద్ సమర్పించిన వినతిపత్రాల అంశాలను సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని స్పష్టంగా ప్రకటించడమే కాక,త్వరలో కార్మికుల కల నెరవేరేలా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.ఐఎన్టియుసియూనియన్ కృషి, నిబద్ధతా కార్యాచరణకు, విజయపథానికి ప్రత్యక్ష నిదర్శనమని జెట్టి శంకర్రావు పేర్కొన్నారు. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో జరిపిన స్ట్రక్చర్ సమావేశాలలో ఏమి సాధించామో చెప్పకుండా , ఐఎన్టియుసి కార్యాచరణను, తమదిగా చెప్పుకుంటూ కాలం వెళ్ళేదీయడం వారి అనైతికతకు నిదర్శనమన్నారు.గనుల్లో, డిపార్ట్మెంట్లలో కార్మికులు, మహిళా కార్మికులు అధిక పనిభారంతో,మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కొరవడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా, ఏఐటీయూసీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో, పైరవీలకే పరిమితమవుతూ కార్మికుల సమస్యల పట్ల శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో కార్మికులు ఏఐటీయూసీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని, నిజమైన కార్మిక సంక్షేమానికి కృషి చేస్తున్న ఐఎన్టియుసి పట్ల తమ మద్దతును కొనసాగించాలని జెట్టి శంకర్రావు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిహెచ్.భీమ్ రావ్, గరిగ స్వామి,కలవేన శ్యామ్, తిరుపతి రాజు,వెంకటేష్ పేరం రమేష్,ఏనుగు రవీందర్ రెడ్డి, ఐరెడ్డి తిరుపతిరెడ్డి,ల్యాగల శ్రీనివాస్,జీవన్ జోయల్, మనోజ్,గోపాల్ రెడ్డి,చాట్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సిఐటియు బందు సాయిలు ఏఐటియుసి కొరిమి రాజ్ కుమార్ టిబిజికేఎస్ సమ్మయ్య, ఐఎన్ టియుసి మధుకర్ రెడ్డి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజున ఒక బిఎంఎస్ తప్ప అన్ని రకాల కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనడం ఆనందించదగ్గ విషయమని, ఈ సమ్మె కార్యక్రమంలో అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నారని,సార్వత్రిక సమ్మె కార్మిక సంఘం అని చెప్పుకునే బి ఎం ఎస్ కార్మిక సమ్మెలో పాల్గొనకుండా ఇది రాజకీయ సమ్మె అంటూ కుంటి సాకులు చెప్పడం కార్మికులకు ద్రోహం చేయడమేనని పనిగంటలు 8 నుండి 10 గంటలకు అవసరమైతే 12 గంటలకు పెంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడులలో, రాష్ట్ర ప్రభుత్వం జీవో 282 ద్వారా చెబితే వారానికి 48గంటలు దాటదని బిఎంఎస్ చెప్పడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనం.. వారానికి 48 గంటలు దాటితే ఓవర్ టైం పేమెంట్ వస్తుందని చెప్పారే తప్ప వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలని కానీ, వారానికి మూడు రోజులు సెలవులు ఇస్తారని కానీ లేబర్ కోడ్ లలో ఎక్కడా చెప్పలేదని సత్యం కండ్లున్న ఈ కబోధులకు కనబడటం లేదా అని సిఐటియు ప్రశ్నిస్తుంది..
రోజుకు 10 నుండి 12 గంటలు పని చేయాలని 6 గంటల తర్వాతే బ్రేక్ ఉంటుందని ప్రభుత్వం రాతపూర్వకంగానే చెబుతుంటే కార్మికుల తరఫున మాట్లాడాల్సిన ఈ దివాలాకోరులు ప్రభుత్వానికి, కార్పొరేట్లకు మద్దతు పలకడం కార్మికుల పట్ల వీరికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.. ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ రోజుకు రూ.178/-(నెలకు 4628/-) ఉంటే చాలని చెప్పిన మోడీ ప్రభుత్వం వీరికి ఆదర్శమట…వేతనాల కోడ్ కు సామాజిక భద్రత కొడుకు తేడా తెలవని ఈ తేడా గాళ్ళకు వేతనాలకోడు రూల్స్ లో కనీస వేతనాల నిర్ణయంలో డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములాను కానీ, సుప్రీంకోర్టు రాప్తా కోస్ & బ్రెస్ట్ కేసులో ఇచ్చిన తీర్పును గాని పరిగణలోకి తీసుకోకపోగా ఫ్లోర్ లెవెల్ కనీస వేతనం గురించి చెప్పి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెరగాలని పేర్కొనకపోవడం కార్మికులను మోసం చేయడమే…ఇటువంటి కోడ్ ను బిఎంఎస్ సమర్థించడం సిగ్గుచేటు.. వాస్తవాన్ని కప్పిపుచ్చి ఐదు సంవత్సరాలకోసారి కేంద్ర ప్రభుత్వమే కనీసం పెంచుతుందని బిఎంఎస్ వారు చెప్పడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనం..
సామాజిక భద్రత కోడ్ బాగుందని చెప్పే వీరికి ఈ కోడ్ లో 12 శాతంగా ఉన్న పీఎఫ్ ను 10 శాతానికి తగ్గిస్తామని సెక్షన్ 16(1)ప్రకారం ఈ 10 శాతం కూడా తగ్గించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది కనబడలేదా? సెక్షన్ 15(1)(e) ప్రకారం ఈపీఎఫ్, ఈపీఎస్, ఈ డి ఎల్ ఐ లను తనకు అవసరమైన విధంగా మార్చేందుకు, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ రేటును నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వానికే అధికారం కట్టబెట్టిన విషయం వీరు చదవలేదా? అని సిఐటియు ప్రశ్నిస్తున్నది… దీంతో ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డును, ఈఎస్ఐ గవర్నింగ్ బాడీని నామమాత్రం చేస్తున్న విషయం వీరికి అర్థం కాలేదా?
గిగ్ వర్కర్స్ కు, కొంతమంది అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నట్లు ఫోజు పెట్టి మొత్తం కార్మికుల సామాజిక భద్రతని నాశనం చేసే ప్రభుత్వ విధానం వీరికి నచ్చడం వీరి దివాలా కోరుతనానికి నిదర్శనం.. ఈ కోడ్ ల వల్ల యాజమాన్యాలు పర్మనెంట్ ప్లేస్ లలో ఫిక్స్డ్ టర్మ్ కార్మికులను పెట్టుకొని యదేచ్చగా దోపిడీ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు.. 300 మంది లోపు కార్మికులు ఉన్న కంపెనీలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కార్మికులను తొలగించడానికి, లే ఆఫ్, మూసివేతలకు యాజమాన్యాలకు లైసెన్స్ ఇచ్చింది పారిశ్రామిక సంబంధాల కోడ్. అంతేకాక మెడికల్ కారణాలతో కార్మికుని తొలగిస్తే అది రిట్రించ్మెంట్ క్రిందికి రాదని సెక్షన్ 2 (3)లో పేర్కొన్నారు. మెడికల్ అన్ ఫిట్ సర్టిఫికెట్ తో సంబంధం లేకుండానే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో కార్మికులను తొలగించే అవకాశం యాజమాన్యాలకు ఇస్తే అది బిఎంఎస్ కు నచ్చుతుంది
ఈ కోడ్ యూనియన్ల ఏర్పాటును, రిజిస్ట్రేషన్ ను, రిజిస్ట్రేషన్ కొనసాగింపును కఠిన తరం చేస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన అంశాలు పొందుపరిచిన ఈ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు పిలుపునిస్తే అది బి ఎం ఎస్ వారికి రాజకీయ సమ్మెగా కనబడుతుంది అంటే వీరిని ఏమనాలో కార్మికులే నిర్ణయించాలి…బిజెపికి అంటగాగే బిఎంఎస్ వారి నుండి ఇంతకంటే ఏమి కొత్తది ఆశించగలం.. అందుకే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం రూ.26,000 కు పెంచాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు చేయొద్దని తదితర ప్రజోపయోగ డిమాండ్లపై జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెలో కార్మికులంతా పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రమేష్ కంప్యూటర్ రాజయ్య రామచంద్రయ్య సోతుకు ప్రవీణ్ సతీష్ ఆకుదారి రమేష్, నాయకులు వెలిశెట్టి రాజయ్య రవికుమార్, రాజేందర్, శేఖర్, మహేందర్
4.లేబర్ కోడ్లను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి AITUC డిమాండ్…………………
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి :
అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ AITUC ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలోని ICDS అధికారి మజార్ గారికి సమ్మె నోటీసు ఇచ్చి అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చీర లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు సాధించుకున్న చట్టాల గురించి ఆలోచించకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సరి అయిందన్నారు 44 కార్మిక. చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా చేయాలని చూసి ఆలోచనను విరమించుకోవాలన్నారు అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం కార్మికులంతా కేంద్ర ప్రభుత్వ స్కీం వర్కర్స్ లక్షలాదిమంది శ్రమదోపిడికి గురవుతూ అతి తక్కువ వేతనాలతో ఎక్కువ పని గంటలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ప్రయత్నిస్తుంటే మా యొక్క హక్కులను కాలరాయటం బిజెపి ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీకి తగునా అన్నారు మే 20 తారీకు నాడు చేపట్టినటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు………….. కార్యక్రమంలో. రేషపల్లి నవీన్. బందు మహేందర్. డప్పు శీను తదితరులు పాల్గొన్నారు
ఐకె 1ఎ గనిని సందర్శించిన ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ లోని ఇందారం 1ఎ గని లో ఏఐటియుసి కార్మిక నేతలు సందర్శించారు.శనివారం గనిలోని అన్ని విభాగాల కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కార్మికులు ఎదుర్కొనే పలు సమస్యలను పరిష్కరించాలని గని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు.వారు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ సందర్భంగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కంది కట్ల వీరభద్రయ్య మాట్లాడుతూ పని ప్రదేశాల్లో రక్షణ పరికరాలు,పనిముట్లు అందుబాటులో ఉంచాలని,వేసవికాలం ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని,ఓసి లోని పలు సమస్యలు పరిష్కరించాలని వివిధ అంశాలపై మేనేజర్ తో చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె బాబా సైదా,సహాయ కార్యదర్శి మోత్కూర్ కొమరయ్య,ఫిట్ కార్యదర్శి నవీన్ రెడ్డి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.