గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి….

గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి తన తల్లిదండ్రులు దివంగత గుండు రాధ,రామలక్ష్మన్ జ్ఞాపకార్థం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గౌడు కు రూ 40 వేల రూపాయల విలువగల పుస్తకాలను అందించి ఔదార్యం చాటుకున్న భూపాలపల్లి రూరల్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన పూజిత,నరహరి దంపతులు. సందర్భంగా వారు మాట్లాడుతూ
నేటి సమాజంలో పుట్టినరోజు చనిపోయిన రోజుల పేరుతో ఎన్నో డబ్బులు వృధా చేస్తున్నారని,ఏదైనా ఒక మంచి పని చేయాలని ఉద్దేశంతో విజ్ఞానాన్ని అందించడానికి పుస్తకాలను గ్రంధాలయానికి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ఏఐటీయుసి నాయకుడు రమేష్. బాలగొని రమేష్ మంతెన సమ్మయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version