ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభ.!

ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలి

ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎం సి పి ఐ యు-ఏఐసీటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12న సోమవారం వరంగల్ జిల్లా మచ్చాపూర్ లో నిర్వహించే ఎంసీపీఐయు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూఅమరజీవి మద్ది కాయల ఓంకార్ నర్సంపేట నియోజకవర్గం నుండి 5సార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలిచినాడని ఆయన ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం గల మెత్తడని దాంతో పాలకులకు కనువిప్పు కలిగే విధంగా సమస్యల అధ్యయనం చేసి ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడు అని ఆయన అన్నారు.1984లో ఎం సి పి ఐ పార్టీని స్థాపించి అంచలంచెలుగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపచేసి 2006లో ఎం సిపిఐ యు గా ఏర్పరిచారని అన్నారు.నిత్యం బడుగు, బలహీన వర్గాల సామాజిక అభివృద్ధి కొరకు తన జీవితకాలమంతా పోరాటాలను కొనసాగించినాడని వారి పోరాట ఫలితమే నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనని ఆయన అన్నారు.ఈ సభకు ప్రముఖ కవులు గోరేటి వెంకన్న,జయరాజు గాయకులు యోచన,ప్రజా కళాకారులు,వామపక్ష పార్టీల నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారని ఈ సభ విజయవంతం కొరకు విద్యార్థులు,యువకులు,సామాజిక ఉద్యమకారులు,అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:బొల్లోజు రామ్మోహన్ చారి,ధరావత్ రమేష్,వేల్పుల వెంకన్న,గుగులోతు రాజు,రమణ బోయిన సురేష్,దుగ్గిరాల వెంకన్న,ధారావత్ వీరన్న, సాంబ,బెజ్జం ఐలేష్,కస్తూరి వెంకన్న,లాకావత్ రవి,దేవుల,బానోత్ ఈసు, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

ఓంకార్,బి.ఎన్ రెడ్డి ల పేర్లను వాడితే ఉపేక్షించేదిలేదు.

ఓంకార్,బి.ఎన్ రెడ్డి ల పేర్లను వాడితే ఉపేక్షించేదిలేదు.

పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేకే అధినాయకత్వంపై ఆరోపణలు.

ఎంసిపిఐ(యు) డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ వెల్లడి.

నర్సంపేట టౌన్ ,నేటిధాత్రి:

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అమరజీవి మద్దికాయల ఓంకార్,బి.ఎన్. రెడ్డిల పేర్లను ఉపయోగిస్తూ పార్టీ బహిష్కృత ఆరాచకవాదులు ఎంసిపిఐ పేరుతో చేస్తున్న అరాచక ఆగడాల పట్ల ఉపేక్షించేదిలేదని ఎంసిపిఐ(యు) నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ హెచ్చరించారు.పట్టణం లోని పార్టీ కార్యాలయం ఓంకార్ భవన్ లో పార్టీ సీనియర్ నాయకులు నాగెల్లి కొమురయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.రాజాసాహెబ్ మాట్లాడుతూ అసెంబ్లీ టైగర్ అమరజీవి మద్ది కాయల ఓంకార్ నాయకత్వంలో 1984 నుండి 2006 మధ్యకాలంలో మొదటగా ఎంసిపిగా వరంగల్ జిల్లాలో నర్సంపేట కేంద్రంగా ఏర్పడి, అనతి కాలంలోనే ఓంకార్ ఉద్యమ సహచరులతో కలసి ఎంసిపిఐ గా దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేయడంలో అసెంబ్లీ టైగర్ ఓంకార్ సఫలీకృతులు అయ్యారని పేర్కొన్నారు. సైదాంతిక విభేదాలతో చీలిన కమ్యూనిస్టు నాయకులను ఏకం చేసి వామపక్ష ఉద్యమాలను దేశంలో బలోపేతం చేయడానికి పార్టీ చివరన యూనిటీ అనే పదాన్ని జోడించారని, దీనిని పార్టీ నుండి బహిష్కరణకు గురైన పానుగంటి నర్సయ్య,సింగతి సాంబయ్య, మొగిలిచర్ల సందీప్ తదితరులు ఆర్థిక అరాచవాదులు పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పార్టీ అధినాయకత్వంపై ఎంసిపిఐ పేరుతో నర్సంపేటలో ఏకమై తీవ్రమైన ఆరోపణలు చేయడం వారి దివాలాకోరు రాజకీయ రాక్షసత్వానికి నిదర్శనమని అన్నారు.ఓంకార్, బి ఎన్ రెడ్డి ల పేర్లను వాడే నైతిక హక్కు వారికి లేదని,ఆ మహానుభావుల నిజమైన వారసులు ఎవరనేది సరైన సమయంలో సరైన గుణపాఠం ప్రజలే చెబుతారని తెలిపారు.అందుకు ఓంకార్, బి ఎన్ రెడ్డిల నిజమైన వారసులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికీ చాలా ఓపికగా పార్టీ శ్రేణులు ఉన్నాయని, త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీని, పార్టీ నాయకత్వాన్ని అసత్య ఆరోపణలతో ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజాక్షేత్రంలో శిక్షలు తప్పవని రాజా సాహెబ్ హెచ్చరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు, వంగల రాగసుధ, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, మండల కార్యదర్శులు సింగతి మల్లికార్జున్, కలకొట్ల యాదగిరి, దామ సాంబయ్య, మార్త నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version