నాలుగు లేబర్ కోడ్ ల దగ్ధం.

నాలుగు లేబర్ కోడ్ ల దగ్ధం

శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని శ్రీరాంపూర్ లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్ ల ప్రతులను దగ్ధం చేశారు. మంగళవారం ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. బ్రహ్మానందం మాట్లాడుతూ.. దేశంలో కార్మిక వర్గం బ్రిటిష్ కాలం ( 1926 ) నుండి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అనేక చట్టాలను సాధించుకున్నట్లు తెలిపారు.మొత్తం 44 కార్మిక చట్టాలు కొనసాగుతున్నాయని అందులో 29 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం కుదించి నాలుగు లేబర్ కోడ్ లుగా మారుస్తున్నారని ఆరోపించారు.వేతనాలు,వృత్తి భద్రత,ఆరోగ్యం,పని పరిస్థితులు,సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాల కోడ్ లు వీటి ద్వారా 29 కార్మిక చట్టాలు రద్దు చేయబడతాయన్నారు. కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడం కొరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నాలుగు కోడ్లను తీసుకొస్తున్నారని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి కార్మిక వర్గం ఒక పెద్ద మిలిటెంట్ ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. జాతీయ వ్యాప్తంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్న కార్మిక సంఘాలు కార్మికులని ఈ నాలుగు లేబర్ కోడ్ లు అమలైతే జరిగే నష్టాన్ని వివరించాలన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అనిల్,సుధాకర్,వెంకటి,సురేష్,రాజేష్,నగేష్,రాంబాబు, సమ్మయ్య,శేఖర్,రాము, విజయేందర్,శారద,కవిత, శిరీష,లక్ష్మీ,మల్లేశ్వరి, కమలమ్మ పాల్గొన్నారు.

లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న నిరసన ప్రదర్శనలు నిర్వహించండి.

లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న నిరసన ప్రదర్శనలు నిర్వహించండి

ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

లేబర్ కోడ్స్ రద్దు,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ,ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణను నిలిపివేయాలని నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్స్ విధానాన్ని అమలు చేయాలని కనీస పెన్షన్ Rs/- 9000 ఇవ్వాలని, స్కీం వర్కర్లు ను కార్మికులుగా గుర్తిస్తూ కనీస వేతనం అమలు చేయాలని హమాలి,బీడీ,భవన నిర్మాణం, ఆటో అండ్ మోటార్,తదితర రంగంలో పనిచేస్తున్న సంఘటిత కార్మికులకు సామాజిక బాధ్యత కల్పించాలని ఈ.ఎస్.ఐ,ఈ.పి.ఎఫ్, ఇన్సూరెన్స్,సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్లపై మే 20 న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు కార్మిక వర్గనికి పిలుపునిస్తుంది.

అలాగే మే 20న జరగవలసిన సమ్మెను దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా సార్వత్రిక సమ్మెను వాయిదా వేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని,కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.

కానీ సరిహద్దుల్లో కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఇరుదేశాలు ప్రకటించిన నేపథ్యంలో దేశంలో సాధారణ పరిస్థితిలో నెలకొన్న స్థితిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను వాయిదా వేయటం సరికాదని ఐ ఎఫ్ టి యు భావిస్తుంది.

ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే కేంద్ర కార్మిక సంఘాలు మే 9న ఢిల్లీలో సమావేశమైన సందర్భంలోనే నాటి నిర్దిష్ట పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటే కార్మికులకు వాయిదా వేయాల్సిన విషయాన్ని అర్థం చేయించడానికి అవకాశం ఉండేది.దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగి కార్మికులు సమ్మెకు సన్నద్ధమై ఉన్న తరుణంలో అకస్మత్తుగా సమ్మెను వాయిదా వేయడం వలన కార్మికులను నిరాశ నిస్పృహ గురి చేసుకున్నది.

ఈ నిర్ణయం కార్మిక వర్గంలో కార్మిక సంఘాల పట్ల విశ్వాసం సన్నగిల్లడం కోసం దోహదపడుతుంది.

భవిష్యత్తు కాలంలో కార్మిక వర్గం సమ్మెలకు దూరంగా ఉండే ప్రమాదం ఉంటుంది.కేంద్రం మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడిని మరింత ముమ్మరంగా చేయడానికి అవకాశం ఇప్పటికే టోకెన్ సమ్మెలు, ఒక్కరోజు సమ్మె వలన కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై తాగిన ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం లేకుండా పోతున్న తరుణంలో కార్మిక వర్గంలో క్రమంగా మిలిటేన్సిని పెంచుతూ నిరవధిక సమ్మెల వైపు కార్మిక వర్గాన్ని సన్నద్ధం కర్తవ్యాన్ని కలిగి ఉండి కార్మిక సంఘాలు ముందుకు పోవాల్సిన తరుణంలో ఈ తరహా సమ్మేలను కూడా నిర్మాణాత్మకంగా నడపకపోతే కార్మికుల నుండి కార్మిక సంఘాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది.సమ్మె వాయిదా పట్ల ఐ ఎఫ్ టి యు కు భిన్నభిప్రాయం ఉన్నప్పటికీ ఐక్య కార్యక్రమం పట్ల ఉన్న గౌరవం ఐక్య ఉద్యమాలకు ఉన్న ప్రాధాన్యత దృశ్య ఐక్య కార్యచరణలో నిర్దేశించుకున్న పద్ధతులకు కట్టుబడి ఉండే సంస్థగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ ఉమ్మడి పిలుపులో మా సంస్థ కూడా భాగస్వామిగా ఉన్నందున మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేస్తూ చేసిన నిర్ణయానికి కట్టుబడి మే 20 న జరగాల్సిన,నిరసన ప్రదర్శన కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్ని జిల్లాల్లో మా సంస్థ అన్ని జిల్లాల్లో చురుకైన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ రాష్ట్రంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులు నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఐ ఎఫ్ టి యు కార్మికులను విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.

44 కార్మిక చట్టాలను అమలు చేయాలి AITUC డిమాండ్. !

4.లేబర్ కోడ్లను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి AITUC డిమాండ్…………………

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి :

 

 

అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ AITUC ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలోని ICDS అధికారి మజార్ గారికి సమ్మె నోటీసు ఇచ్చి అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చీర లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు సాధించుకున్న చట్టాల గురించి ఆలోచించకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సరి అయిందన్నారు 44 కార్మిక. చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా చేయాలని చూసి ఆలోచనను విరమించుకోవాలన్నారు అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం కార్మికులంతా కేంద్ర ప్రభుత్వ స్కీం వర్కర్స్ లక్షలాదిమంది శ్రమదోపిడికి గురవుతూ అతి తక్కువ వేతనాలతో ఎక్కువ పని గంటలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ప్రయత్నిస్తుంటే మా యొక్క హక్కులను కాలరాయటం బిజెపి ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీకి తగునా అన్నారు మే 20 తారీకు నాడు చేపట్టినటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు………….. కార్యక్రమంలో. రేషపల్లి నవీన్. బందు మహేందర్. డప్పు శీను తదితరులు పాల్గొన్నారు

కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ ను తిప్పికోట్టండి.

కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్స్ ను తిప్పికోట్టండి

గుండాల(టీయూసిఐ)మేడే పిలుపు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా (టీయూసిఐ)
139 వ మేడే, పోస్టర్లను గుండాల మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ పార్టీ కార్యాలయం లో పోస్టర్లు
ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వెల్డింగ్ ఆటో అండ్ మోటర్ మెకానిక్ వర్కర్స్(టీయూసిఐ)
మండల నాయకులు మొక్క మరీ అధ్యక్షతన వహించగా
గుండాల మండల కమిటీ కార్యదర్శి గడ్డం రమేష్ మాట్లాడుతూ ప్రియమైన
కార్మికులారా 1886 మే ఒకటి పాలక వర్గాల ధమాకాండలో చికాగో (అమెరికా)
కార్మికవర్గం రక్తం చిందించి ఉరికంబాలను
సైతం లెక్కచేయక సాధించిన పోరాట ఫలితమే 8 గంటాల పనిని ప్రపంచం ఆమోదించాల్సి వచ్చింది,
139 సంవత్సరం ల క్రింద ఇంతగా శాస్త్ర సంకేతిక పరిజ్ఞానం రవాణా అభివృద్ధి చెందని కాలం మన దేశంలో ఆనాడు మనిషి సాగటు అయుర్దాయం 40 సం,రాలు
నేడు 70 సంవత్సరాల మానవ జాతినే నాశనం చేసిన కాలర మాసుచీ క్షయ
గత్తరలాంటి వ్యాధులను
తరిమి ఏసిన వైద్య విజ్ఞానం ఒక్కనాడు కరువుతో అల్లాడి లక్షలాది మంది తిండి లేక అమానుషంగా మరణించారు.కనీసం మంచినీరు కూడా అందించని
దురావస్థ నుండి తాగు నీరందించడంతో వ్యవసాయరంగం విప్లవాత్మక మార్పులతో ప్రపంచానికే తిండి గింజలు అందించే శక్తి వచ్చింది కరువు కాటకాల నుండి బయట పడ్డారు.కానీ పాలకుల చర్యల ఫలితంగా తిండి లేక అలమటించే స్థితి అవడం సిగ్గుచేటు.
నేడు యాంత్రీకరణతో
శ్రామికుడు 8.గం„ల పనిని 4.గం„లు కూడా చేసిన సరిపోతుంది పెట్టుబడిదారులు నేడు కార్మిక రక్తాన్ని మరింతగా పిల్సిపిప్పి చేసి సంపద పోగేసుకోవడానికి
12 గం„ల పని పెంపుదల ముందుకు తీసుకొస్తున్నారు.ఇన్పోసిస్ అధినేత నారాయణమూర్తి వారానికి 70 గం„లు పనిచేయాలని ఆదివారం కూడా పనిచేయాలని
ఎల్, టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వారానికి 90 గం„లు పని చేసి ప్రపంచంలోనే
అగ్రగామిగా నిలవాలని చీలుక పలుకులు వల్లిస్తున్నారు.దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ లో పని గంటల పెంపు ప్రతిపాదించారు. దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్నట్లు
అధిక పనిగంటలతో శ్రమజీవుల రక్తాన్ని పీల్చిపిప్పి చేసే లక్ష్యం తప్ప మరొకటి కాదు 8 గంటల పనితోనే పారిశ్రామక వేతనాలు గణనీయంగా అభివృద్ధి అయ్యరు ప్రపంచంలోనే ఆదాని మూడవ స్థానానికి దేశంలో అంబానీలు అత్యంత సంపదగల వారిగా నిలిచారు
12 గంటాల పనితో ఎంతో అభివృద్ధి కావాలనుకున్నారు.
ఇప్పటికే 70 శాతం దేశ సంపద కేవలం ఐదు శాతం గల ధనికుల చేతుల్లో ఉందని 30 శాతం సంపద 95 శాతం గల ప్రజల చేతుల్లో ఉందని సర్వేలు ఘాోషిస్తున్నాయి.ఈ స్థితిలో పని గంటల పెంపును మే డే స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపుని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీయూసి ఐ నాయకులు మాచర్ల కోటేష్, మహేష్, తరుణ్, కార్తీక్, ఎస్.కె యాకూబ్, తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version