encounter chesthava…, ఎన్‌కౌంటర్‌…చేస్తావా…?

ఎన్‌కౌంటర్‌…చేస్తావా…?

వరంగల్‌ పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, పరకాల సీఐ మధు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన స్వగ్రామం అయిన పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో సీఐ టిఆర్‌ఎస్‌కు సహకరించాడని దొమ్మాటి సాంబయ్య ఆరోపించారు. తమ కార్యకర్తలను ఎందుకు బూతులు తిడుతున్నావని గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సీఐతో దొమ్మాటి వాగ్వాదానికి దిగాడు. గ్రామంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేసిన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించాడు. దీంతో సీఐ తాను ఎవరిని దూషించలేదని స్పష్టం చేశారు. దొమ్మాటి సీఐతో వాగ్వాదానికి దిగుతూనే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి రాతపూర్వకంగా తాను ఫిర్యాదు చేస్తానని సీఐ మధు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. దీంతో మరోసారి కలగజేసుకుని సీఐ తాను అమర్యాదగా ఎంతమాత్రం ప్రవర్తించలేదని, వీడియో సాక్ష్యాలు ఉన్నాయన్నారు. సీఐ వివరణతో సంతృప్తి చెందని దొమ్మాటి ఎన్‌కౌంటర్‌ చేస్తావా…? చెయ్యి అంటూ ముందుకు వెళ్లారు. తాను అలా అనలేదని సీఐ చెప్పిన అదేం పట్టించుకోని దొమ్మాటి తీవ్ర స్వరంతో సీఐతో వాగ్వాదానికి దిగారు.

 

police sibbandipie suspention veetu,పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

ఎన్నికల విధులకు గైర్హాజరయిన ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు. సస్పెషన్‌ వేటుకు గురైయిన వారిలో యు.రాజు సుబేదారి పోలీస్‌స్టేషన్‌, వి.నిరంజన్‌ సంగెం పోలీస్‌ స్టేషన్‌, ఇ.గణేష్‌ సిటి గార్డ్స్‌, కె.ఉపేందర్‌ కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌, డి.శ్రీనివాస్‌ రఘనాధ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందినవారు వున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా సెలవుల్లో వున్న 69మంది సిబ్బంది తక్షణమే విధుల్లో చేరి ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి వుంది. ఇలా సెలవులో వెళ్లిన వారికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అదేశాల మేరకు సెలవులో వున్న పోలీస్‌ సిబ్బంది తక్షణమే ఎన్నికల విధుల్లో చేరిపోవాలని సంబంధిత పోలీస్‌స్టేషన్ల ద్వారా నోటీసులను సైతం జారీచేశారు. అందులో 64మంది సిబ్బంది తిరిగి విధుల్లో చేరగా ఈ నోటీసులకు స్పందించకుండా ఎన్నికల విధుల్లో చేరేందుకు రాకుండా ఆలసత్వంతో వ్యవహరించిన మిగితా ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్ల తీరుపై ఎన్నికల కమీషన్‌ నియమాలను అనుసరించి సదరు ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్ళను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

……………………………………………….

parlament ennikalaku kattudettamaina bhadratha erpatlu

పార్లమెంట్‌ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌

వరంగల్‌ క్రైం, నేటిధాత్రి : పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సుమారు ఐదువేల మంది పోలీసులను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. ఈనెల 11వ తేదీన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరగబోయే ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి బుధవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌తోపాటు పాక్షికంగా వున్న మహబూబాబాద్‌, కరీంనగర్‌, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలను ప్రశాంతవంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు ప్యూహత్మకమైన ప్రణాళికను రూపోందించామని చెప్పారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 2127పోలింగ్‌ కేంద్రాలు 1053 ప్రాంతాల్లో వున్నాయని, అందులో 246 సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లుగా గుర్తించామన్నారు. ఈ మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 234మార్గాల్లో ఏర్పాటు చేయబడ్డాయని, ఇందుకు సంబంధించి పోలీస్‌శాఖ తరుపున అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్డ్‌ ప్రకటించిన నాటి నుండే నియోజకవర్గం వారిగా స్టాటిక్‌ సర్వేలేన్స్‌ ప్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు గత రెండు నెలలకాలంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ బందాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపణీ చేసే డబ్బు, మద్యంతో చట్ట వ్యతిరేకమైన అయుధాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా గత రెండునెలల నుండి 8 సంఘటనల్లో 58,29,860రూపాయల డబ్బును సీజ్‌ చేయడంతోపాటు, 1523 కేసుల్లో 9302మందిని బైండోవర్‌ చేశామని చెప్పారు. ఇందులో రౌడీ షీటర్లు, బెల్టుషాపు నిర్వాహకులు, అనుమానితులతోపాటు గతంలో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడిన వారు వున్నారని, అధేవిధంగా వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రభుత్వ అనుమతులు వున్న 143తుపాకులు సంబంధిత పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్‌ చేయగా, మరో 79 తుపాకులు బ్యాంక్‌ సెక్యూరిటీగార్డుల వద్ద వున్నాయని, రెండునెలల నుండి పెండింగ్‌లో వున్న 133 నాన్‌-బెయిల్‌బుల్‌ వారెంట్లలోని నిందితులను కోర్టుకు హాజరుపర్చామని అన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్‌కు సంబంధించి 74 కేసులు నమోదు చేయడంతోపాటు, 3,31,695రూపాయల విలువ గల 1144లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నేరస్థుల నియంత్రణలో భాగంగా పోలీస్‌ మిషనరేట్‌ పరిధిలో మొత్తం 58మంది నిందితులపై పీడీ యాక్ట్‌ కింద కేసులను నమోదు చేయబడ్డాయని, ఇక ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 10కేసులు నమోదయ్యాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ ఎన్నికల బందోబస్తుకు సంబంధించి తొలిసారిగా పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, ఎన్నికల బందోబస్తు కోసం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ సిబ్బందితోపాటు ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల నిర్వహణకు వినియోగిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రతి ఓటరు తమ హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని, అలాగే ఎవరైనా ఎన్నికలకు ఆటంకంపర్చడం గానీ, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్టయితే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు నేరచరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి పీడీ యాక్ట్‌ నమోదుచేస్తామని కమిషనర్‌ హెచ్చరించారు.

……………………………………………….

votuku velaye, ఓటుకు వేళాయే…

ఓటుకు వేళాయే…

– ఓటింగ్‌కు సర్వం సిద్దం చేసిన ఎన్నికల కమీషన్‌

– పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

– కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసుశాఖ

– ఎన్నికల విధులకు గైర్హాజరైన పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

– ప్రత్యేక రైళ్లను కేటాయించిన రైల్వేశాఖ

– సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

నేటిధాత్రి బ్యూరో : మొదటిదశ పార్లమెంట్‌ ఎన్నికలకు సర్వం సిద్దమయింది. మరికొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌ సాయంత్రం 5గంటలకు ముగియనుంది. పోలింగ్‌ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ఎన్నికల కమీషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. వివిధ పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం పోలింగ్‌ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వేసవికాలం అయినందున పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎండ తీవ్రతను తగ్గించేందుకు చలువ పందిళ్లు, షామియానాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు పోలింగ్‌ సిబ్బంది బుధవారం ఉదయమే వివిధ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో పోలీస్‌శాఖ అదనపు భద్రత ఏర్పాట్లను చేసింది.

మొదటి దశకు అంతా సిద్ధం

లోక్‌సభ మొదటి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాజకీయ నేతల భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో ఓట్ల ద్వారా దేశ ప్రజలు తీర్పునివ్వనున్నారు. దేశంలోని 543 స్థానాల్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 11న (గురువారం) దేశంలోని మొత్తం 91 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను సిద్ధం చేశారు. అవి మొరాయిస్తే వెంటనే సరిచేయడానికి నిపుణులను నియమించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 25, తెలంగాణలోని 17, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 2, అసోంలోని 5, బిహార్‌లోని 4, ఛత్తీస్‌గఢ్‌లోని 1, జమ్ముకశ్మీర్‌లోని 2, మహారాష్ట్రలోని 7, మణిపూర్‌లోని 1, మేఘాలయలోని 2, మిజోరంలోని 1, నాగాలాండ్‌లోని 1, ఒడిశాలోని 4, సిక్కింలోని 1, త్రిపురలోని 1, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, ఉత్తరాఖండ్‌లోని 5, పశ్చిమ్‌బెంగాల్‌లోని 2, లక్షద్వీప్‌లోని 1, అండమాన్‌ నికోబార్‌లోని 1స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి.

అసెంబ్లీ ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి.

ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటికి ఏప్రిల్‌ 11, 18, 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటన్నింటికీ గురువారం ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి.

సిక్కింలో ఒక లోక్‌సభ స్థానం, 32శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటికీ గురువారం ఒకేదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎన్నికల వేళ.. 36 ప్రత్యేక రైళ్లు!

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వేలాదిమంది ప్రయాణికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో సతీష్‌ మాట్లాడుతూ ప్రతిరోజు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు 40రైళ్లు ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ఇవేకాకుండా వేసవి, ఎన్నికల రద్దీ దష్ట్యా రానున్న మూడురోజుల్లో ప్రత్యేకంగా 36రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు. గుంటూరు, విజయవాడ, విశాఖకు ప్రతిరోజు 28 రైళ్లు నడుస్తుండగా..రోజుకు 11 రైళ్ల చొప్పున అదనంగా నడపనున్నారు. గుంతకల్‌, కర్నూలు, తిరుపతికి 16 రైళ్లు ఉన్నప్పటికీ అదనంగా 9 రైళ్లు నడుపుతామని తెలిపారు.

తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి…

సీఇఓ రజత్‌కుమార్‌

తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర సిఇఓ రజత్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 15 నియోజకవర్గాలలో పోలింగ్‌ సామగ్రి చేరుకున్నాయని, నిజామాబాద్‌లో సామగ్రి మారుమూల గ్రామాలకు వెళ్ళడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా బుధవారం రాత్రికి పోలింగ్‌ సామగ్రి చేరుకుంటుందని, గురువారం ఉదయం 5.30కి మాక్‌ పోలింగ్‌ ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7గంటల నుండి పోలింగ్‌ ప్రారంభమవుతుందని, నిజమాబాద్‌లో ఉదయం 8నుండి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో 5గంటల వరకు లైన్లో ఉండే వారికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఓటర్‌ స్లిప్‌ ఐడి ప్రూఫ్‌ కాదు..12రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవచ్చునని తెలిపారు. 48లక్షల మందికి ఓటర్‌కార్డులు పంపిణీ చేసామని, ఓటరు లిస్ట్‌లో పేరు ఉందో…లేదో చెక్‌ చేసుకోవాలని, ఎపిక్‌ ఉంటే ఓటు ఉన్నట్టు కాదని అన్నారు. ఓటర్లు పోలింగ్‌ బూత్‌లలో మొబైల్‌ అనుమతించబడవని, ఏదైనా ఇబ్బంది కలిగితే తప్ప అక్కడ అధికారి మాత్రమే మొబైల్‌ తీసుకెళ్తారని, కానీ ఎవరూ కూడా పోలింగ్‌ తేదీన మొబైల్‌ తీసుకొని రాకూడదని చెప్పారు.

ఏర్పాట్లు పూర్తయ్యాయి…

నిజామాబాద్‌లో 600మంది ఇంజనీర్లు విధుల్లో ఉంటారని, మొత్తం 2లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై వచ్చిన కంప్లైంట్‌ ఓ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇసిఐ నేడు నోటీస్‌ ఇచ్చిందని, 171 కేసు కింద కొండ సందీప్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యిందని, కానీ కొండ విశ్వేశ్వరరెడ్డికి సంబంధం లేదు అని తాను చెప్పారు…టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఇప్పుడు పిర్యాదు చేసిందని, 55వేల పోలీస్‌ సిబ్బంది పోలింగ్‌ భద్రతలో ఉంటారని, 3లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. ప్రగతిభవన్‌లో చేరికలు జరుగుతున్నాయని, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారని ఇసిఐకి నివేదించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్‌లో ఒక్కో బూత్‌ లో 12మెషీన్లు వాడుతున్నామని, అదనపు గదులు తీసుకుని మాక్‌ పోలింగ్‌కు ఉపయోగించుకునున్నామని తెలిపారు.

మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి/ maoistla daadilo mla mruthi

మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి

దంతేవాడ, నేటిధాత్రి : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి విరుకుపడ్డారు. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో సహా ఐదుగురు పోలీసులు మతి చెందినట్లు సమాచారం. కౌకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్యామ్‌గిరిలో ఈ దాడి జరిగింది. ఐఈడీ పేలడంతో కాన్వాయ్‌లోని వాహనం తునాతునకలైంది. ఘటన జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడికి వెళ్లాయి. కాన్వాయ్‌లో ఎమ్మెల్యే చివరి వాహనంలో ఉన్నట్లు తెలిసింది. ఐఈడీని పేల్చిన వెంటనే మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అక్కడ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో మూడు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత జరిగే రెండురోజుల ముందే మావోయిస్టులు దాడి చేయడం ఆందోళన కలిగిస్తున్నది.

‘కమలం’ కష్టాల్లో పడింది – పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

‘కమలం’ కష్టాల్లో పడింది

– పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

– శాసనసభ ఎన్నికల్లో అదే పరిస్థితి…

నర్సంపేట, నేటిధాత్రి : కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి గ్రామస్థాయి నుండి డివిజన్‌ స్థాయి వరకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి పార్టీ ఉన్నప్పటికీ ఓటింగ్‌ శాతం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పలువురు విమర్శించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌ బరిలో ఉండగా, నర్సంపేట నియోజకవర్గం నుండి మెజార్టీ ఓట్లు వస్తాయని భావించినట్లు సమాచారం. కానీ గత శాసనసభ ఎన్నికల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా పోటీ చేయగా ఆయనకు 1476ఓట్లు (0.78శాతం) మాత్రమే నమోదయ్యాయి. నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతంలో టిఆర్‌ఎస్‌ పార్టీ మొదటిస్థానంలో, కాంగ్రెస్‌ పార్టీ రెండవస్థానంలో, స్వతంత్ర అభ్యర్థి మూడవస్థానంలో ఉండగా, ఎడ్ల అశోక్‌రెడ్డికి నాల్గవ స్థానం లభించింది. దీనికి కారణం అభ్యర్థి ఎడ్ల అశోక్‌రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ నాయకులను కలుపుకోకపోవడమే కారణమని పలువురు నాయకులు చర్చించుకున్నారు.

ఎన్నికలకు ముందు నర్సంపేట పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించగా 1500మంది కార్యకర్తలు హాజరైనట్లు నాయకులు తెలపగా ఓటింగ్‌ శాతం మాత్రం ఎందుకు తగ్గిందని నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకున్నారు. ఈనెల 11వ తేదీన జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో గతంలో కంటే ఓటింగ్‌శాతం పెరిగేనా అని పలువురు విమర్శించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు పట్టిపట్టనట్లుగా ఉంటున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి హుస్సేన్‌నాయక్‌ ఓటింగ్‌ శాతం పెంచడానికి చేసిన ప్రయత్నాలు ఫలించేనా అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.

 

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు

నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్‌ శ్రీను అలియాస్‌ తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ పోతారం శ్రీను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుతోపాటు కలప స్మగ్లింగ్‌లో ఆయనకు సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, భారీగా టేకు కలపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఖేల్‌ ఖతమేనా…?

తెలంగాణ, మహారాష్ట్రలో యథేచ్చగా కలప వ్యాపారం చేస్తున్న తెలంగాణ వీరప్పన్‌ కథ ఈ అరెస్టుతో ముగిసినట్లేనా అనే అనుమానం కలుగుతుంది. గత 10సంవత్సరాలుగా పోలీసులకు కోట్ల రూపాయల కలప వ్యాపారం చేస్తూ అధికారులను సైతం ఇతగాడు గడగడలాడించాడు. కొత్తకొత్త పద్ధతుల్లో కలప వ్యాపారం చేస్తూ ఫారెస్ట్‌ అధికారులు, పోలీసుల కళ్లు గప్పి తిరిగి ఎట్టకేలకు చిక్కాడు. కలప స్మగ్లింగ్‌లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ఎవరు సహకరిస్తున్నారు. తదితర విషయాలు పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

సూత్రధారులకు గుబులు

తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ శ్రీను అరెస్టుతో ఇంతకాలంగా అతనికి సహకరిస్తున్న కొందరికి గుబులు మొదలైనట్లు తెలిసింది. అరెస్టు అయిన తెలంగాణ వీరప్పన్‌ తమ పేరు ఎక్కడ చెబుతాడోనని వారు భయపడుతున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా వాటాలు అందుకుంటూ స్మగ్లర్‌కు సహకరిస్తూ వస్తున్న వారు సైతం తమ పేర్లు ఎక్కడ చెబుతాడోనని వణికిపోతున్నారట. మొత్తానికి తెలంగాణ వీరప్పన్‌ అరెస్టు అటు అధికారుల్లో ఇటు రాజకీయ నాయకుల్లో గుబులు రేపుతుందట.

 

తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు

నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్‌ శ్రీను అలియాస్‌ తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ పోతారం శ్రీను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనుతోపాటు కలప స్మగ్లింగ్‌లో ఆయనకు సహకరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమీషనరేట్‌లోని మంథని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక స్కార్పియో వాహనం, భారీగా టేకు కలపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఖేల్‌ ఖతమేనా…?

తెలంగాణ, మహారాష్ట్రలో యథేచ్చగా కలప వ్యాపారం చేస్తున్న తెలంగాణ వీరప్పన్‌ కథ ఈ అరెస్టుతో ముగిసినట్లేనా అనే అనుమానం కలుగుతుంది. గత 10సంవత్సరాలుగా పోలీసులకు కోట్ల రూపాయల కలప వ్యాపారం చేస్తూ అధికారులను సైతం ఇతగాడు గడగడలాడించాడు. కొత్తకొత్త పద్ధతుల్లో కలప వ్యాపారం చేస్తూ ఫారెస్ట్‌ అధికారులు, పోలీసుల కళ్లు గప్పి తిరిగి ఎట్టకేలకు చిక్కాడు. కలప స్మగ్లింగ్‌లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ఎవరు సహకరిస్తున్నారు. తదితర విషయాలు పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

సూత్రధారులకు గుబులు

తెలంగాణ వీరప్పన్‌ అలియాస్‌ శ్రీను అరెస్టుతో ఇంతకాలంగా అతనికి సహకరిస్తున్న కొందరికి గుబులు మొదలైనట్లు తెలిసింది. అరెస్టు అయిన తెలంగాణ వీరప్పన్‌ తమ పేరు ఎక్కడ చెబుతాడోనని వారు భయపడుతున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా వాటాలు అందుకుంటూ స్మగ్లర్‌కు సహకరిస్తూ వస్తున్న వారు సైతం తమ పేర్లు ఎక్కడ చెబుతాడోనని వణికిపోతున్నారట. మొత్తానికి తెలంగాణ వీరప్పన్‌ అరెస్టు అటు అధికారుల్లో ఇటు రాజకీయ నాయకుల్లో గుబులు రేపుతుందట.

……………………………………….

ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు : నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

“ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు” నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

నర్సంపేటకు పెద్ద బిడ్డగా ఉంటా ..

ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత.

నర్సంపేటలో భారీగా ర్యాలీ రోడ్‌ షో

వేలాదిగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు

నర్సంపేట, నేటిధాత్రి : మహాబూబాబాద్‌ పార్లమెంటు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోరుతూ నర్సంపేట నియోజకవర్గస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భారీగా ర్యాలీ, రోడ్డు షో నిర్వహించారు. మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు రోడ్డు షోలో పాల్గొని కోలాటాలు, డప్పుచప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందఠంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పదహారు సీట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశ రాజకీయాల్లో కీలకం కానున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకులకు ముందు సమన్వయం లేకపోవడం వలనే ప్రచారాలు కూడా చేసుకోలేక పోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం బలవంతంగా సీటు కేటాయించాలని పత్రికల ప్రకటనలు బలరామ్‌నాయక్‌ చెసుకుంటున్నారని తెలిపారు. ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారని, ఎన్నికల్లో మాలోతు కవిత గెలుపు ఖాయమని అన్నారు.ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పార్టీ గెలుపు కోసం కషి చేయాలని సూచించారు .

పార్లమెంట్‌ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గానికి పెద్ద బిడ్డగా ఉంటానని తెలిపారు. ఆడబిడ్డగా ఆదరించి ఓట్లు వేయాలని కోరారు .నర్సంపేట నియోజకవర్గ అభివద్ధి కోసం నర్సంపేట కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపాల్టీ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ పొన్నం మొగిలి, టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి సానబోయిన రాజకుమార్‌, మనోహర రెడ్డి, సంజీవరెడ్డి, రాణా ప్రతాప్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడి, గుంటి కిషన్‌, పుట్టపాక కుమారస్వామి, దార్ల రమాదేవి, ఆకుల శ్రీనివాస్‌, బానోతు సారంగపాణి, అజయ్‌ కుమార్‌, రాయిడి రవీందర్‌రెడ్డిలతోపాటు అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతిధులు పాల్గొన్నారు.

 

అధికారులు నిద్రపోతున్నారా…? మరీ ఇంత అధ్వాన్నమా…?


అధికారులు నిద్రపోతున్నారా…? మరీ ఇంత అధ్వాన్నమా…?

  • – పోచాపురం మినీ గురుకులంలో చిన్నారుల అవస్థలు
  • – పిల్లల చేత మరుగుదొడ్లు కడిగిస్తున్న ప్రిన్సిపాల్‌
  • – నీళ్ల పప్పు, చాలీచాలని ఉప్మా, పనికిమాలిన మెను
  • – నీటి సౌకర్యం లేక అల్లాడుతున్న విద్యార్థినులు-వ్యవసాయ బావులే దిక్కు
  • – ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు…?
  • – ఇంత జరుగుతున్న కన్నెత్తి చూడని అధికారులు

నేటిధాత్రి బ్యూరో : నేటి బాలలే రేపిటి పౌరులు, తరగతి గదిలో దేశభవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అంటారు. ఇవన్ని అధికారులకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు. అప్పుడప్పుడు వీరు సైతం ఈ నీతి సూత్రాలను వల్లిస్తుంటారు. ఆచరణలో మాత్రం ఆవగింజతైనా పాటించారు. ఓవైపు సర్కార్‌ బాలకార్మికులు లేని రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్దాలని చూస్తుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం బడికి వెళుతున్న బాలికలను బాలకార్మికులుగా మారుస్తున్నారు. పోషకాహారం అందిస్తున్నాం, సన్నబియ్యం, గుడ్డు, చికెన్‌ అంటూ తెలంగాణ సర్కార్‌ చెపుతుంటే వాటిని అధికారులు మింగుతున్నారో, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ మింగుతున్నారో తెలియదు కానీ నీళ్లచారు, చాలీచాలని ఉడికి ఉడకని, నీళ్లను పోసి బాగా కాచిన ఉప్మాతో అర్థాకలితో బాలికలు చదువును కొనసాగిస్తున్నారు. అంతేకాదు సభ్యసమాజం తలదించుకునేలా నిసిగ్గుగా ఇక్కడ విద్యనభ్యసిస్తున్న బాలికలతోనే ప్రిన్సిపాల్‌ మరుగుదొడ్లు కడిగిస్తూ తన తెలివి తక్కువతనాన్ని ప్రదర్శిస్తోంది. ఇదంతా జరుగుతుంది ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపురం మినీ గురుకుల పాఠశాలలో ఇక్కడి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న శ్రీలత తన వ్యక్తిగత పనుల మీద ఉన్న శ్రద్ద విద్యార్థినులపై చూపడం లేదు. తన పిల్లలను చూసుకునేందుకు ప్రభుత్వ సొమ్ముతో ఇదే గురుకులం తిండి పెడుతూ కేర్‌టేకర్‌ను నియమించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మినీ గురుకులంలోనే ఉంచుతున్న ప్రిన్సిపాల్‌ పిల్లల బాగోగులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

75మందికి కిలో పప్పు

పోచాపురం మినీగురుకులం పాఠశాలలో 75మంది గిరిజన బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి అందిస్తున్న భోజనం తీరును చూస్తే జాలేస్తుంది. 75మంది బాలికలకు కిలోపప్పుతో ఆలుగడ్డలు ఇతర సామాగ్రి కలిపి నీళ్లచారులా కూర తయారుచేసి వడ్డిస్తున్నారు. రోజు ఇదే కూర పిల్లలకు పెడుతూ ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్లు తెలిసింది. సరైన ఆహారం లేక అర్థాకలితో తాము అలమటిస్తున్నామని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు అందించాల్సిన అల్పాహారం విషయంలో ప్రిన్సిపాల్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. చాలీచాలని ఉప్మాను అందిస్తున్నారు.

బాలికలచే మరుగుదొడ్లు శుభ్రం

పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన చేతులు వంతులవారీగా బ్రష్‌ పట్టుకుని మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నాయి. పోచాపురం మినీ గురుకులం పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలను చూస్తుంటే జాలేస్తుంది. ఇక్కడి ప్రిన్సిపాల్‌ రోజు పిల్లల చేతే మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తుంది. కొంతమంది పిల్లలు అందుకు నిరాకరిస్తే బెదిరిస్తుందని, కొడుతుందని బాలికలు ఆరోపిస్తున్నారు. ఓవైపు బాలకార్మికులను పనిలోంచి బడికి పంపుతుంటే ఇక్కడి ప్రిన్సిపాల్‌ మాత్రం బడికి వెళ్లిన బాలికలను పనిమనుషులుగా మారుస్తుందనే విమర్శలు వినవస్తున్నాయి.

నీటి సౌకర్యం లేదు

మినీగురుకులంలో నీటి సౌకర్యం లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానం చేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకులం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బావులపై ఆధారపడి నీళ్లు తెచ్చుకుంటున్నారు. స్నానం చేయాలంటే ఆరుబయటే వ్యవసాయ బావుల వద్దకే వెళుతున్నారు. ప్రిన్సిపాల్‌ మాత్రం అధికారులతో మాట్లాడి విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు చొరవ చూపడం లేదు.

గురుకుల పాఠశాలలో బయటివ్యక్తులు

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో అందులో పనిచేసే సిబ్బందికి, ఉపాధ్యాయులకు బయటి వ్యక్తులెవరికి అనుమతి ఉండదు. కానీ ప్రిన్సిపాల్‌ మాత్రం బయటివ్యక్తులు గురుకులంలోనే ఉండేలా సహకరిస్తోందని తెలిసింది. ప్రిన్సిపాల్‌ అనుసరిస్తున్న విధానాలు, పిల్లలకు అందిస్తున్న భోజన విషయాలు అధికారుల దృష్టికి వెళ్లకుండా కొంతమంది స్థానికులను గురుకుల పాఠశాలలోకి అనుమతించి వారికి భోజన సౌకర్యాలు కల్పిస్తుందని, వీరు ఇక్కడే తిష్ట వేస్తున్నారని విద్యార్థినులు తెలిపారు.

అధికారులు మొద్దునిద్ర వీడతారా…?

తాడ్వాయి మండలం పోచాపురం మినీగురుకులంలో ఇంత జరుగుతున్న అధికారులెవరికీ తనిఖీ చేయడానికి మనసు రావడం లేదు. బాలికలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్న వీరు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. పట్టణాలకు, మైదాన ప్రాంతాలకే పరిమితమైన అధికారులు ఏజెన్సీ గురుకులాలను పట్టించుకోవడం మానేశారని విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా గురుకులాన్ని తనిఖీ చేసి బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేస్తారా…లేదా చూడాలి.

ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి

– ఎస్‌ఎఫ్‌ఐ

పోచాపురం మినీగురుకులంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్‌ శ్రీలతపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు సాగర్‌ డిమాండ్‌ చేశారు. గురుకులంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అధికారులకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గురుకులాన్ని సందర్శించి సమస్యలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ సౌకర్యాలు లేక విద్యార్థినులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. గురకులాన్ని సందర్శించిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నారా దిలీప్‌, సానబోయిన ప్రశాంత్‌ ఉన్నారు.

 

ఎర్రబెల్లికి సీఎం క్లాస్‌

ఎర్రబెల్లికి సీఎం క్లాస్‌

  • – మంత్రి దయాకర్‌రావు అతిపై ఆరా…
  • – దూకుడు కాస్త తగ్గించాలని సూచన
  • – సీనియర్లతో సమన్వయం పాటించాలని హితవు

నేటిధాత్రి బ్యూరో : మంత్రిగా పదవీబాధ్యలు చేపట్టిన నాటి నుండి మునుపటి కంటే కాసింత దూకుడు ప్రదర్శిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ క్లాస్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఖమ్మం, వరంగల్‌లలో ఎర్రబెల్లి ప్రసంగం ఆయన చేస్తున్న అతిపై ఆరా తీసిన సీఎం గట్టిగానే క్లాస్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించావ్‌ అందరిని కలుపుకుని వెళ్లు, సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ, పార్టీ క్యాడర్‌ పట్ల మర్యాద పాటించాలని సీఎం మంత్రికి చెప్పినట్లు తెలిసింది. వరంగల్‌ నగరంలో నిర్వహించిన డివిజన్ల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడిన భాషపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు, పార్టీ క్యాడర్‌ను సీనియర్లను అలా సంభోధిస్తే మొదటికే మోసం వస్తుందని సీఎం సూచించినట్లు తెలియవచ్చింది. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉన్నందున పదవికి తగ్గట్టుగా హుందాగా ఉండాలని కేసిఆర్‌ హితవు పలికినట్లు గులాబీవర్గాలు అనుకుంటున్నాయి. మంత్రి పదవి చేపట్టిన నుంచి బ్రేకులు లేకుండా దూసుకువెళ్తున్న మంత్రి దయాకర్‌రావుకు సీఎం కేసిఆర్‌ బ్రేకులు వేశాడని ప్రచారం జరుగుతోంది. కొంతమంది సీనియర్లు, ప్రజాప్రతినిధులు ఎర్రబెల్లి తమను ఎంతమాత్రం లెక్క చేయడం లేదని మాటల విషయంలో సైతం ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంలో కేసిఆర్‌ మంత్రికి ఆక్షింతలు వేసినట్లు టిఆర్‌ఎస్‌ పార్టీలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ మంత్రి ఈ విధంగా ప్రవర్తించలేదని, లేకలేక మంత్రి పదవి దక్కించుకున్న ఎర్రబెల్లి మాత్రం తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తు అధినేత దగ్గర మార్కులు కొట్టెస్తున్నానని అనుకున్నాడని, సీన్‌ రివర్స్‌ కావడంతో సీఎం ఆగ్రహానికి గురికావల్సి వచ్చిందని వారు చర్చించుకుంటున్నారు.

కడియంకు అప్పగింత…?

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవర్తన, క్యాడర్‌తో మసలుకుంటున్న తీరుపై గులాబీవర్గాల్లో అంతర్గతంగా నిరసన వ్యక్తం కావడంతో మొన్న జరిగిన వరంగల్‌ సభ బాధ్యతలు చివరి నిమిషంలో సీఎం కేసిఆర్‌ కడియంకు అప్పగించినట్లు తెలిసింది. వరంగల్‌ డివిజన్ల సమావేశంలో ఎర్రబెల్లి మాటలతో మనసు నొచ్చుకున్న కొంతమంది సీనియర్లు, కార్పొరేటర్లు ఈ విషయాన్ని అధిష్టానం దాక తీసుకుపోవడంతో ఇంకా ఎక్కువ నష్టం జరగకుండా ఎర్రబెల్లిని కొనసాగిస్తున్నట్లు సభా బాధ్యతలు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అప్పగించినట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఎం క్లాస్‌తో మంత్రి ఎర్రబెల్లి ఒక దారికి రానున్నాడని అతి తగ్గించి అందరితో సమన్వయం చేసుకుంటూ పదవికి తగ్గట్టు హుందాగా ప్రవర్తిస్తాడని ప్రస్తుతం గులాబీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో విచ్చలవిడిగా గంజాయి దందా

కిట్టుబాయి దేనా…

  • – గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో విచ్చలవిడిగా గంజాయి దందా
  • – సిగరేట్ల రూపంలో విక్రయం…ఒక్కో సిగరేట్‌ ఐదువందల రూపాయలు
  • – కోడ్‌ చెపితేనే సిగరేట్‌ దొరుకుతుంది
  • – లేదంటే…అలాంటివి మా దగ్గర దొరకవని అమాయకత్వం నటిస్తారు
  • – పాన్‌షాపులే ప్రధాన విక్రయ కేంద్రాలు

నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో గంజాయి దందా ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగుతోంది. సినిమా తరహాలో గంజాయిని విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు గంజాయి విక్రయదారులు. గంజాయికి అలవాటుపడిన యువత దానికి బానిసలా మారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఒక్క గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోనే గంజాయి విక్రయం లక్షల్లో నడుస్తుందని ఓ అంచనా. గట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న కేటుగాళ్లు ఓ మాఫియా తయారై అన్ని ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దుకుని నగరంలో ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు…ఆరు కాయల్లా కొనసాగిస్తున్నారు. వీరికి తెర వెనుక అన్నిరకాల సపోర్టు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా కేవలం పరిచయం ఉన్న వారికే వీరు గంజాయి సిగరేట్లను విక్రయిస్తున్నారు.

ఒక్కసారి పీల్చారా…?

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో సిగరేట్ల రూపంలో దొరుకుతున్న గంజాయిని ఒక్కసారి పీల్చారా…? ఇక అంతే సంగతులు. ఆ సిగరేట్‌కు బానిస కావాల్సిందే. ఒక్క దమ్ములాగితే…ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్లు అవుతుందట. ఎవరితో సంబంధం లేకుండా, అసలు ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా 24గంటలు మత్తులో జోగవచ్చు. ఎక్కువగా అలవాటు ఉన్న వారు. సిగరేట్‌ను ఒక్కసారే కాల్చి మత్తులో ఊగుతుంటే, కొందరు ఈ ఒక్క సిగరేట్‌ను మూడురోజులపాటు తాగుతూ మత్తులో ఏం కానరాకుండా ఊగి…ఊగి పోతున్నారట. ఐదువందల రూపాయల ధర ఉనన& ఈ సిగరేట్‌ కొనడానికి యువత నుంచి మొదలుకుని అన్ని వయస్సుల వారు విక్రయిస్తూ మత్తులో చిత్తవుతూ జేబు గుల్ల చేసుకుంటున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని హన్మకొండ, వరంగల్‌ ప్రాంతాలలో ఈ గంజాయి సిగరేట్లు లభిస్తున్నాయి. హన్మకొండ అశోకా థియేటర్‌ ప్రాంతం, వరంగల్‌ రైల్వేస్టేషన్‌ వెనకాల ప్రాంతాల్లో ప్రధానంగా పాన్‌సాపులల్లో ఈ సిగరేట్‌లను విక్రయిస్తున్నట్లు తెలిసింది. గంజాయి సిగరేట్లు గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని పాన్‌షాపులలోనే కాకుండా యాచకుల ద్వారా రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, హోటళ్లు రద్దీగా ఉండే ప్రాంతాలలో యాచకుల ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసింది. వీరికి ఎంతో కొంత కమీషన్‌ ముట్టజెపుతూ ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. యాచకుల ద్వారా గంజాయి సిగరేట్లను అమ్మిస్తే ఎవరికి అనుమానం రాదని గంజాయి కేటుగాళ్లు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

కిట్టుబాయ్‌…హోనా…

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని కొన్ని పాన్‌షాపులలో గంజాయి సిగరేట్లు లభిస్తున్నాయి. అయితే ఈ సిగరేట్లను ఎవరికి పడితే వారికి విక్రయించకుండా కేవలం పరిచయం ఉన్న వారికే విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయాలంటే ‘కిట్టుబాయ్‌’ అనే కోడ్‌ చెప్పాలి. గంజాయి సిగరేట్‌ అనకుండా కిట్టుబాయ్‌ కావాలంటే ఆ పాన్‌షాప్‌ యజమానికి అర్థం అయిపోతుందట. ఐదువందలు చెల్లించగానే గంజాయి సిగరేట్‌ చేతిలో పెడతారట.

కొరవడిన నిఘా

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో గంజాయి మాఫియా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించకుంటుపోతుంటే నిఘా వ్యవస్థలు కళ్లు మూసుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. బహిరంగంగా, ఇంత విచ్చలవిడిగా కోడ్‌ భాషలో రోజు లక్షల రూపాయల బిజినెస్‌ నడుస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పాన్‌షాపులు కేంద్రాలుగా గంజాయి సిగరేట్లు విక్రయిస్తున్న సిగరేట్లు పీల్చి యువత మత్తులో చిత్తవుతున్న వీరు మాత్రం తమకేం పట్టనట్లుగానే వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

 

కబ్జాకోరు దార్కారిజం

కబ్జాకోరు దార్కారిజం

– ‘నేటిధాత్రి’ కార్యాలయంపై దాడికి రెక్కి

– కార్యాలయం మూసి ఉండడంతో స్థానికులను ఆరా తీసిన మోట దార్కారులు

– ఐదు ద్విచక్రవాహనాలపై వచ్చిన కబ్జాకోరు గుండా గ్యాంగ్‌

– ఎప్పుడు వస్తారు…? ఎప్పుడు వెళ్లారంటూ హమాలీ కార్మికుడిని ప్రశ్నించిన కబ్జాకోర్లు

– దాడికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడే…?

– గ్రేటర్‌లో కబ్జాలన్నింటికి తెరవెనుక అతగాడే…?

– త్వరలో ఆ వివరాలను వెల్లడిస్తాం…

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : గోపాలపురం ప్రాంతంలో ఓ సామాన్యుని భూమిని అన్యాయంగా కబ్జాచేసి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతూ, అదే స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న ఓ కబ్జాకోరు నేటిధాత్రి కార్యాలయంపై దాడి చేసేందుకు తన కబ్జాగ్యాంగ్‌ను ఉసిగొల్పాడు. బరితెగించి సామాన్యుని భూమిని కబ్జా చేయడమే కాకుండా ఆ నీచపు పనిని సామాన్యుడి తరపున ‘నేటిధాత్రి’ ప్రశ్నించినందుకు దాడి చేసుందుకు రెక్కి నిర్వహించారు. గురువారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఐదు మోటారు సైకిళ్లపై మోటాదర్కార్లు నేటిధాత్రి కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కార్యాలయం మూసిఉండడంతో పక్కనే ట్రాన్స్‌ఫోర్టులో పనిచేసే ఓ హమాలీ కార్మికుడిని ఎప్పుడు వస్తారు…; ఎప్పుడు వెళ్తారు…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారట.

ఇంత ధైర్యం ఎక్కడిది

కాసేపు బిల్డర్‌నంటూ బిల్డప్‌ కాదు, కాదు పైనాన్సర్‌ను అంటూ బిల్డప్‌ ఇచ్చే హనుమంతరావు అనే వ్యక్తి ‘నేటిధాత్రి’ కార్యాలయానికి సైతం ఫోన్‌చేసి బెదిరింపులకు దిగాడు. ఆధారాలతో రమ్మని అనడంతో తగ్గిన సదరు బిల్డర్‌ అలియాస్‌ కబ్జాకోరు. గురువారం రాత్రి దాడి చేసేందుకు తెగించాడు. అయితే అతనికి ఇంత ధైర్యం ఎక్కడిది…? కబ్జా వెనకాల ఉండి అంతా నడిపిస్తూ గ్రేటర్‌ వరంగల్‌లో కబ్జా కథలన్నింటికి సూత్రధారి అయిన ఎమ్మెల్యే తమ్ముడి అండ చూసుకునే ఇలా చేస్తున్నట్లు తెలిసింది. వీరు కబ్జా చేసే దగ్గర బాధితులను బెదిరించేందుకు ఉపయోగించుకునే చిల్లర రౌడీమూకలను ‘నేటిధాత్రి’ కార్యాలయం పైకి ఎమ్మెల్యే తమ్ముడే పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం కబ్జాలు8 చేయడానికే ఈ గ్యాంగ్‌ను ఉపయోగించుకుంటూ బలవంతంగా బాధితులను బెదిరించి దాడులతో లొంగదీసుకుని భూములను కబ్జా చేసేందుకు ఈ ముఠాను ఎమ్మెల్యే తమ్ముడు పెంచి పోషిస్తున్నట్లు కొందరు తెలిపారు. ఈ గ్యాంగ్‌ గతంలో అనేకమందిని బెదిరించి దాడులకు దిగి భూములను కబ్జా చేశారని విశ్వసనీయ సమాచారం. బాధితులను బెదిరించినట్లే ‘నేటిధాత్రి’ని బెదిరించాలని చూశౄరు.

బెదిరింపులకు లొంగుతామా…?

జనం పొట్టగొట్టి, పాపాలు మూటగట్టుకుని సంపదను పోగేయాలనుకుంటున్న వారి బెదిరింపులకు ‘నేటిధాత్రి’ ఎప్పుడు లొంగదని గుర్తుంచుకోవాలని సామాన్యులను బెదిరించి భూములు కబ్జా పెట్టి అధికార బలాన్ని ఉపయోగించి కోట్లు కూడబెట్టి ప్రజాప్రతినిధిని అంటూ నిసిగ్గుగా చెప్పుకుంటూ తిరుగుతున్న గోముఖ వ్యాఘ్రాలకు ప్రజాస్వామ్యయుతంగా అక్షరాలతో గట్టి సమాధానమే చెప్తాం.

భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలు? కథనం వెలువడకముందే వెన్నులో వణుకు

భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలు

– వరుస కథనాలతో బెంబేలెత్తుతున్న కొందరు అక్రమ ఎర్నలిస్టులు

– ఇక నెక్ట్స్‌ తమ అవినీతి బయటపడుతుందంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు

– తనపై వార్తకథనం వస్తే దాడికి సిద్దంగా ఉండాలంటూ తన ఉద్యోగులకు సూచించిన ఓ సీనియర్‌ ఎర్నలిస్టు…?

– అంతా తాను చూసుకుంటానని అభయహస్తం

– కథనం వెలువడకముందే వెన్నులో వణుకు

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : వరుస కథనాలతో కబ్జాయిస్టులు, అక్రమ ఎర్నలిస్టుల వెన్నులో వణుక పుట్టిస్తున్న ‘నేటిధాత్రి’ని బెదిరింపులతో లొంగదీసుకోవచ్చని భావిస్తున్నారు. కొంతమంది తెలివి తక్కువ పిరికి మనుషులు, అవినీతిపరుల కథనాలు అన్ని ప్రచురితం అవుతున్నాయి. ఇక తరువాయి తమపైన వార్త వస్తుందంటూ గుమ్మడి కాయ దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారు. కొంతమంది జర్నలిస్టులు అలియాస్‌ ఎర్నలిస్టులు. జర్నలిజం ముసుగు కప్పుకుని తమ చుట్టూ ఉండే భజనపరులకు, అక్షరం ముక్కరాని వారికి గుర్తింపు కార్డులు, అక్రిడిటేషన్లు ఇప్పించి సెటిల్‌మెంట్లు, అక్రమ దందాలకు గ్రేటర్‌ నగరంతో మొదలుకుని వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తం తిప్పుతూ సామాన్యులను బెదిరిస్తున్న వీరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయట. మీడియా పేరుతో కేవలం పోలీస్‌స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల్లో తిష్ట వేసి అవినీతి దందాలతో తమ బినామీల ద్వారా అక్రమార్జనకు పాల్పడుతూ సీనియర్‌ జర్నలిస్టులుగా చెప్పుకునే కొంతమంది యూనియన్ల పేరుతో మేథావుల్లా ఫోజులు కొట్టేవారు, తమపై ఎప్పుడు కథనం వెలువడుతుందా అని ఎదురు చూస్తున్నారట. అక్రమాలతో తమకు అసలే సంబంధం లేదని తాము ‘పత్తి ఇత్తులం’ అని చెప్పుకునే వీరు తమపై కథనం వస్తుందని ముందుగానే ఊహించుకోవడం అక్రమార్కులుగా వీరికి, వీరే గుర్తించుకున్నారని స్పష్టం అవుతుంది.

జర్నలిజం ముసుగులో వార్తలు రాయడం తప్ప అన్ని పనులు వెలగబెట్టే ఈ స్వయం ప్రకటిత మేథావుల వల్ల ఒక్క గ్రేటర్‌ నగరంలోనే మూడువందలకుపైగా చదువులేని వారు తమ పేరు తాము రాయలేని వారు, జర్నలిజంలో ఓనమాలు తెలియనివారు ప్రముఖ జర్నలిస్టులుగా ఫోజులు కొడుతున్నారట. వీరికి ఈ స్వయం ప్రకటిత మేథావులు తెరవెనుక సహకరిస్తూ అఇడిటేషన్లు సైతం ఇప్పించారంటే ఏ స్థాయిలో సహకరిస్తున్నారో అర్థం అవుతుంది. నోరు విప్పితే నీతులు, జర్నలిస్టుల అభివృద్ధి పోలీసు పరిచయాలు అంటూ సుద్దపూసలా నీతులు వల్లించే ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఐతే ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తికి, అక్రమ బిడీ వ్యాపారం చేసే వ్యక్తికి, ప్లెక్సీ ప్రింటింగ్‌, ప్రెస్‌ నడుపుతున్న వ్యక్తులకు అక్రిడిటేషన్‌ ఇప్పించి రోజు సాయంత్రం కాగానే వారితో నగరంలోని ఓ బార్‌షాప్‌లో తాగి తందానలాడుతాడట. దురదృష్టం ఏంటంటే అరకొర తెలివితేటలు గల ఇతగాడు తానే ప్రముఖ జర్నలిస్టుగా ఫోజులు కొట్టడం, అధికారులు, రాజకీయ నాయకుల వద్ద నుంచి కావాల్సింది దండుకోవడం ఇతగాడికి అలవాటుగా మారిపోయిందట.

గ్రేటర్‌ వరంగల్‌లో పెట్రోల్‌బంక్‌లు మొదలుకుని బార్‌షాపులు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు వద్ద నుంచి నెలవారి మాముళ్లు దండుకునే ఇతగాడు మీరు ఎలాగైన వ్యాపారం చేస్కోండి నీను ఉన్నా అని అభయహస్తం అందించాడట. దీంతో నాణ్యత సరిగా లేకున్నా, కల్తీ జరిగినా వినియోగదారులు నిలదీస్తే, మిగతా జర్నలిస్టులు ఇదేంటని జనంపక్షాన ప్రశ్నించిన, ఈయన గారికే ఫోన్‌ వస్తుందట. సెటిల్‌మెంట్‌ జరిగిపోతుందట. ఓ సీనియర్‌ జర్నలిస్టుకు పెట్రోల్‌బంక్‌ మోసం విషయంలో ఇతగాడి నుంచి స్వీయ అనుభవం కలిగిందట. జర్నలిజం తప్ప, ఆ ముసుగులో అన్ని శాఖల బాధ్యతలు ఎలాంటి జంకు లేకుండా నిర్వహిస్తూ సెటిల్‌మెంట్‌ దందాల్లో ఆరితేరిన ఇతగాడిపై అధికారులు, ఏ మాత్రం చర్యలు తీసుకోరు. వీరి ఆగడాలు నగరంలో శృతిమించుతున్న ఇంటెలిజెన్స్‌ మొదలుకుని ఏ నిఘాసంస్థ అధికారులు వారి శాఖకు కనీసం విషయాన్ని కూడా చెప్పరు. కారణం ఇతగాడి జర్నలిజం ముసుగు.

గ్రేటర్‌లో ‘కార్పొరేటర్‌’ గిరి – కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట

గ్రేటర్‌లో ‘కార్పొరేటర్‌’ గిరి

– కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట

– అధికారులు సహకరిస్తే సరి…లేదంటే బదిలీలు…సరెండర్లు

– మున్సిపల్‌ కమిషనర్‌ను వదలని కార్పొరేటర్‌ గిరి

– భవన నిర్మాణంలో జోక్యం…అన్ని సరిగా ఉన్న అడిగింది ముట్టజెప్పాల్సిందే

– ఎవరి డివిజన్‌లో వారిదే రాజ్యం

– ఇబ్బందులు పడుతునన నగర ప్రజలు

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ప్రస్తుతం కార్పొరేటర్‌ గిరి నడుస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచింది మొదలు డివిజన్‌లలో వారి ఇష్టారాజ్యం నడుస్తోంది. ఎన్నికల వేళ కాళ్లవేళ్ల పడి గెలిపించాలని అందరిని వేడుకున్న కార్పొరేటర్లు ఇప్పుడు ఓట్లేసిన జనాన్నే ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు అయితే ఏకంగా తాము ఎన్నికల్లో ఖర్చుపెట్టామని ఇప్పుడు సంపాదించుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారట. ఓట మల్లన్న…బోడ మల్లన్న సామెతను బాగా ఒంట బట్టించుకున్న కొందరు కార్పొరేటర్లు డివిజన్‌లలో తమ రాజ్యాన్ని నడుపుతున్నారట. తమకు తెలియకుండా ఎంతమాత్రం అభివృద్ధి పనులు జరగరాదని, డివిజన్‌లో ఉన్న ప్రజలు సైతం నిర్మాణాలతో సహ ఎలాంటి పనులైన చేయరాదని అలా చేయాలంటే తమకు కావాల్సింది ముట్టజెప్పాల్సిందేనని తెల్చి చెపుతున్నారట. గతంలో ఎన్నడూ లేనంతంగా ప్రస్తుత కార్పొరేటర్లు డివిజన్‌ ప్రజలకు చుక్కలు చూపెడుతున్నారని, ఇంటి నిర్మాణం, గొడవలు, వ్యక్తిగత విషయాలు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ తదితర విషయాలలో తల దూర్చుతూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు గ్రేటర్‌ వరంగల్‌ వ్యాప్తంగా వినబడుతున్నాయి.

ప్రతి పనికో రేటు…?

డివిజన్‌లలో కార్పొరేటర్లు ప్రతి పనికో రేటు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. జనన, మరణ ధృవీకరణ పత్రం మొదలుకుని ఇంటి నిర్మాణ అనుమతుల వరకు వీరి జోక్యం చేసుకుంటున్నట్లు తెలిసింది. ‘సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం’ అన్న చందంగా ఉన్న వారు, లేని వారు అనే తారతమ్యాలు లేకుండా డివిజన్‌లో ప్రజలకు కార్పొరేటర్‌తో పని పడింది అంటే చాలు తమకు కావాల్సింది ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. దీంతో డివిజన్‌ ప్రజలు స్థానిక కార్పొరేటర్ల పేరు చెపితేనే వామ్మో…అంటున్నారు.

అధికార్లు సహకరిస్తే సరీ…!

‘కార్పొరేటర్‌ గిరి’తో డివిజన్‌లలో అధికారులకు వేధింపులు ఎక్కువైనట్లు తెలిసింది. ప్రధానంగా డివిజన్‌లలో ఇంటి నిర్మాణ పనుల అనుమతి విషయాలలో కార్పొరేటర్లు చేతివాటానికి అలవాటుపడ్డారట. డివిజన్‌లో ఎవరు నిర్మాణ పనులు మొదలుపెట్టిన పిల్లర్‌కు ఇంత అని నగదు ముట్టజెప్పాలట. నిబంధనల ప్రకారం అన్ని ఉన్న కార్పొరేటర్‌కు సమర్పించేది సమర్పించాలి లేదంటే భవన యజమాని, అధికారులపై కార్పొరేటర్లు కేకలు వేస్తారు. వాటా ముట్టజెప్పందే నిర్మాణాన్ని కొనసాగనిచ్చేది లేదని తెల్చి చెబుతారు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. నిబంధనల ప్రకారమే అనుమతులు ఇచ్చామని అధికారులు చెప్పిన కార్పొరేటర్లు వినరు. ఏది ఏమైనా తమకు నగదు ముట్టజెప్పాల్సిందేనని నానా ఇబ్బందులకు గురిచేస్తారట. ఇటీవల హన్మకొండలోని ఓ డివిజన్‌లో ఓ కార్పొరేటర్‌ అధికారిపై ఇలాంటి ప్రతాపాన్నే చూపాడట. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న వారి దగ్గర నుంచి అధికారే నగదు వసూలు చేసి అప్పగించాలని ఆదేశించాడట. ఆ అధికారి ససేమిరా అనడంతో ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి ఆ అధికారిని సరెండర్‌ చేయాలని నిర్ణయించి, సమావేశంలో తీర్మాణం చేయించి పనికినిచ్చాడట.

ఆ అధికారితో సహా మొత్తం ఐదుగురు ఇటీవలే గ్రేటర్‌ పాలకమండలి సరెండర్‌ చేస్తూ తీర్మాణం చేసింది. అధికారులు తమకు సహకరిస్తే సరి లేదంటే బదిలీలు, సరెండర్‌లు కార్పొరేటర్లు అనుసరిస్తున్న అవినీతి విధానాలతో సక్రమంగా, నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని భూకబ్జాలు, అక్రమ వసూలును అడ్డుకున్నందుకే ఐఎఎస్‌ అధికారి గౌతమ్‌ను కార్పొరేటర్లు, ఇతరులు కలసి బదిలీ చేయించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు కొంతమంది కార్పొరేటర్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. డివిజన్‌లు వీరి రాజ్యం అయినట్లు, ప్రజలను దోచుకునేందుకు వీరికి ఎవరో లైసెన్స్‌ ఇచ్చినట్లు ఇష్టారీతిన వ్యవహారిస్తూ అటు అధికారులను, ఇటు డివిజన్‌ ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్న కార్పొరేటర్‌లకు రానున్న ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పి ప్రజలదే అంతిమ విజయం అని నిరూపిస్తామని కార్పొరేటర్‌గిరికి పులిస్టాప్‌ పెడతామని పలువురు ప్రజలు అంటున్నారు.

…………………………………..

లక్ష్యం చేరేందుకు మూకుమ్మడి ప్రణాలికలు

ఒక ‘లక్ష్య’ం ముగ్గురి భవితవ్యం

మంత్రి పదవే లక్ష్యంగా అరూరి

మరోమారు కుడా చైర్మన్‌ కొరకు మర్రి

అధినాయకత్వం భరోసా,సముచితస్థానం కొరకు మార్నేని

లక్ష్యం చేరేందుకు మూకుమ్మడి ప్రణాలికలు

వర్ధన్నపేట,నేటిధాత్రి: ఒక ఎన్నిక లక్ష్యం నెరవేర్చి అధినాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఆ ముగ్గురు ప్రస్తుతం జరుగుతన్న పార్లమెంట్‌ ఎన్నికల్లో శాయశక్తులా పని చేస్తున్నారు. నిర్ధేశిత లక్ష్యంను అధిగమించి తమ కార్యదక్షతను చూపెందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక ఎన్నిక ముగ్గురి భవిష్యత్తుగా మారమేంటి అనుకుంటున్నారా. అవును ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.వారిలో ఒకరు రాష్ట్రంలో వరుసగా రెండోమారు శాససభ్యునిగా రెండవ అతిపెద్ద మెజారిటి సాధించిన అరూరి రమేష్‌, మరోకరు కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి మరియు ఉమ్మడి జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు ,వర్ధన్నపేట ఎంపిపి మార్నేని రవిందర్‌రావు .అందరు ప్రస్తుతం పదవుల్లోనే ఉన్నారు. మరి ఇంకా వారి భవితవ్యం ఎంటనుకుంటున్నారా.ఉంది దాని కోరకు ప్రస్తుతం వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్‌లు,వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికల సంధర్భంగా నియోజకవర్గ ఇంచార్జీ భాద్యతలు నిర్వహిస్తున్న కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావు పాటుపడుతున్నారు.

మంత్రి పదవే లక్ష్యంగా అరూరి రమేష్‌…

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండవమారు శాసనసభ్యునిగా ఉన్న అరూరి రమేష్‌ మంత్రివర్గంలో స్థానం కోరకు మంత్రివర్గ విస్తరణకు ముందు విశ్వప్రయత్నాలు చేశారు. స్థానిక ప్రజల్లో కూడా ఈ విషయమై విస్తరణకు ముందు మంత్రి పదవి ఖాయమనే చర్చ కూడా జరిగింది.వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మెజారిటి సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అధినాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక గత ప్రభుత్వంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరిని రాజకీయ గురువుగా అరూరి రమేష్‌ భావిస్తారు. కాబట్టి తనకు మంత్రి పదవి వచ్చితీరుతుందనే నమ్మకంతో ఉన్నాడు. జనవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ మారు అత్యధిక మెజారిటితో విజయం ఇస్తే రానున్న ప్రభుత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి మంత్రి ఉంటాడనే అంశాన్ని కూడా ప్రచారంలో ప్రధానంగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఎన్నికల అనంతరం జరగబోయే విస్తరణలో అవకాశం చేజారకుండా ఉండేందుకు గతంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి పోటి చేసిన కడియం శ్రీహరి,పసునూరి దయాకర్‌ల కంటే అధికంగా మెజారిటి వచ్చే విధంగా చూడాలని తద్వారా అధిష్టానం దృష్టిని ఆకర్షించి అవకాశం పొందాలనే లక్ష్యంతో అరూరి రమేష్‌ ముందుకు వెళుతున్నారు.నిర్దేశిత లక్ష ఓట్ల మెజారిటి సాధించి శాసనసభ్యుని నుండి మంత్రిగా మారాలని ఆకాంక్షిస్తున్నారు.

మరోమారు ‘కూడా’ చేజిక్కించుకోవాలని…

ప్రస్తుతం కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌గా ఉన్న మర్రి యాదవరెడ్డి పదవి కాలం మరో 8 నెలల సమయంతో ముగిసిపోతుంది.ఈ నెపథ్యంలో తనను మరోమారు కుడా కు చేర్మన్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అందు కోరకే ఆయన కూడా ప్రస్తుత పార్టమెంట్‌ ఎన్నికల్లో అధిష్టానం అప్పగించిన ఇంచార్జీ బాధ్యతలను పూర్తిస్థాయిలో విజయవంతంగా నిర్వహించి తన విధేయతను నిరుపించేందుకు పాటుపడుతున్నారు. అయితే ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇంచార్జీ బాధ్యతలు తీసుకున్నప్పటికి అర్బన్‌తో సహా,రూరల్‌ ప్రాంతం కూడా వర్ధన్నపేట నియోజకవర్గంలో భాగమై ఉండడం స్థానిక పార్టీ శ్రేణులు,కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.అయినప్పటికి స్థానిక ఎమ్మెల్యే అరూరి,మర్రి మిత్రుడు అయిన స్థానిక ఎంపిపి మార్నేని రవిందర్‌రావులు కలుపుకుపోతూ వారి సహాయసహకారాలు అందిస్తున్నారు. ఎది ఎమైనా సాదించాల్పి లక్ష్యం చేరుకుని మరోమారు కుడా చైర్మన్‌గా కోనసాగాలన్నదే మర్రి యాదవరెడ్డి లక్ష్యంగా కనిపిస్తున్నది.

భవిష్యత్తుపై భరోసా కోరకు మార్నేని రవిందర్‌రావు…

గత రెండు ప్రభుత్వాల్లో పని చేసిన అమాత్యులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి .ప్రస్తుత గ్రామీణ,ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శిష్యుడిగా,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న వరంగల్‌ ఉమ్మడి జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు,వర్ధన్నపేట ఎంపిపి మార్నేని రవిందర్‌రావు.ఉద్యమ కీలక సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆహ్వనంతో ప్రస్తుత మండల కేంద్రం ఐనవోలులో బహిరంగసభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుండి స్థానికంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్మాణం కోరకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే నేడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పటిష్టంగా ఉంది. అయితే తన రాజకీయ జీవితంలో స్థానికంగా ప్రజాక్షేత్రంలో అన్ని పదవులను చేపట్టి సేవ చేశారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత స్థానికంగా గాని జిల్లాలో గాని పార్టీ అధినాయకత్వం తప్పకుండా రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పిస్తారని అంతా అనుకున్నారు. కాని అప్పటి పరిస్థితుల్లో ఆ అవకాశం చేజారింది.అనంతరం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ మార్కెట్‌గా పిలువబడే వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ చైర్మన్‌గా అవకాశం ఇస్తారని అధిష్టానం నుండి స్పష్టమైన హామి ఇచ్చినట్లు మార్నేని అనుచరులు బహిరంగంగానే చెప్పుకున్నారు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన తప్పనిసరి మార్కెట్‌ చైర్మన్‌లను రిజర్వేషన్ల ద్వారా ఎన్నుకోవాల్సి వచ్చింది. దాంతో చైర్మన్‌ పదవికి రిజర్వేషన్‌ కలిసి రాలేదు. అయితే అప్పటికే వర్ధన్నపేట ఎంపిపిగా ఉన్న మార్నేని నామినేటెడ్‌ పదవుల్లో అయినా అవకాశం ఇస్తారని ఆశించారు. కాని అది కూడా జరగలేదు. దాంతో ఎంపిపిగా కొనసాగారు. సాధారణ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుండి అభ్యర్ధి ఎంపిక విషయంలో అనుహ్యంగా మార్నేని రవిందర్‌రావు పేరు అనుహ్యంగా తెరపైకి వచ్చింది. అధినాయకత్వం దృష్టిలో సమర్ధనాయకుడిగా,సీనియర్‌గా ఉన్నప్పటికి సామాజికకోణంలో మరోమారు అవకాశం చేజారింది.అయితే పార్టీ కార్యక్రమాల్లో,వచ్చిన ప్రతి ఎన్నికలను అనుకూల ఫలితాల కోరకు పాటుపడిన మార్నేని ఎంపిపిగా ఇంకో నెల రోజులు మాత్రమె కొనసాగుతారు.ఈ నెపథ్యంలో రాష్ట్రస్థాయిలో కాకపోయినా కనీసం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా అయినా అవకాశం వస్తుందని అశించినప్పటికి రిజర్వేషన్‌ రూపంలో మరోమారు రవిందర్‌రావు,వారి అనుచరుల ఆశలను నీరుగార్చింది.దింతో పార్టీలో కీలక నేతగా ఉన్నప్పటికి భవిష్యత్తుపై నిలినీడలు కమ్ముకొవడం పట్ల ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.తన భవిష్యత్తు గురించి సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిసిన సంధర్భంగా తన భవిష్యత్తును గురించి మార్నేని ప్రస్తావించారని అయితే ఎలాంటి ఆందోళన చెందవద్దని రానున్న అవకాశాల్లో ప్రథమ స్థానంలో ఉంచి అవకాశం ఇస్తానని హామి ఇచ్చినట్లు చర్చ నడుస్తుంది.ఏది ఎమైనా స్థానికంగా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడికి భవిష్యత్తు భరోసా లేకపోవడం పట్ల స్థానిక ప్రజల్లో కొంత అసహనం ఉంది.ఇప్పటికైన తన భవిష్యత్తుపై భరోసా ఇచ్చి తనకు సముచితస్ధానం కల్పించాలనే లక్ష్యంతో మార్నేని రవిందర్‌రావు ఈ ఎన్నికల్లో కూడా క్రియాశీలకంగా పని చేస్తున్నారు.

ప్రధాని కావాలని లేదు – వరంగల్‌ సభలో సీఎం కేసిఆర్‌ వ్యాఖ్యలు

ప్రధాని కావాలని లేదు

– వరంగల్‌ సభలో సీఎం కేసిఆర్‌ వ్యాఖ్యలు

నేటిధాత్రి బ్యూరో : తనకు ప్రధానమంత్రి కావాలన్న కోరిక అసలే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్‌లోని అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పదవిపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అజంజాహి మిల్లు మైదానంలో సమావేశం నిర్వహించిన వారంతా ప్రధానమంత్రులయ్యారని, మంత్రి దయాకర్‌రావు తనతో అన్నారని, తనకు మాత్రం ప్రధానమంత్రి కావాలన్న కోరిక అసలే లేదని కేసిఆర్‌ అన్నారు. తన ప్రసంగంలో కాంగ్రెస్‌, బిజెపి పార్టీలపై విరుచుకుపడ్డ ఆయన కేంద్రంలో చేతకాని వారే పాలిస్తున్నారని, ఈ దేశానికి అంతగా మంచిది కాదని, దేశంలో కాంగ్రెస్‌, బిజెపి లేని కూటమి రావాలని ఆయన ఆశించారు. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు గోల్‌మాల్‌ గోవిందంలాగా తయారయ్యాయని ప్రధానమంత్రిపై కేసిఆర్‌ విమర్శలు చేశారు.

చిన్నచిన్న సమస్యలు సైతం కేంద్రం దగ్గర పరిష్కారం కాకుండా ఉన్నాయని, గడ్డివాము దగ్గర కుక్కలాగా వారు సమస్యలను పరిష్కరించారు..మనవి పరిష్కరించుకోనివ్వరు అని అన్నారు. నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీ అనవసరంగా పెడబొబ్బలు పెడుతున్నారన్నారు. వరంగల్‌ జిల్లా ఉద్యమంలో అగ్రభాగాన ఉందని, పార్లమెంట్‌ ఎన్నికల తీర్పులో సైతం అగ్రభాగంలోనే ఉండాలన్నారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, దేశంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తయారైందని, అనేక సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేశామన్నారు. ఎస్సారెస్పీ కాలువలు పూర్తి దశకు వచ్చాయని, త్వరలోనే కాళేశ్వరం నుంచి సైతం బటన్‌ నొక్కితే నీళ్లు వచ్చేలా నిర్మాణం పూర్తవుతుందన్నారు.

ప్రధాని మోడీ గుజరాత్‌ రాష్ట్రంలో సైతం 24గంటల కరెంట్‌ అమలులో లేదని, తెలంగాణ రాష్ట్రం ఆ ఘనత సాధించిందన్నారు. ఎన్నికలు వస్తే గెలువాల్సింది పార్టీలు కాదని, ప్రజల అభిమతం గెలవాలని కేసిఆర్‌ అన్నారు. కేంద్రం తెలంగాణకు 35వేల కోట్లు ఇచ్చామని ప్రగాల్బాలు పలుకుతోందని, కేంద్రం మనల్ని సాకడం లేదని, కేంద్రాన్నే మనం సాకుతున్నామన్నారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన కేసిఆర్‌ పసునూరి వివాదరహితుడని, నియోజకవర్గానికి కావాల్సిన పనులను చేయించుకునే సత్తా కలవాడన్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో దేవాదుల, ఇతర ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయని, ఈ ప్రాజెక్టు వల్ల జిల్లా అంతా సస్యశ్యామలం కానుందన్నారు. తెలంగాణ హక్కులు, ప్రాజెక్టులు తదితర అవసరాల కోసం కేంద్రంపై పోరాడాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్య కేంద్రంలో పరిష్కారం కావాలంటే ప్రాంతీయ పార్టీలు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఎవడు అడ్డొస్తాడో చూస్తా…!

– కబ్జా స్థలంలోనే నిర్మాణం చేస్తా

– కార్పోరేటర్‌ను మున్సిపల్‌ అనుమతులు నాకో లెక్కా….

– అధికార పార్టీ నాయకులకే అడ్డొస్తారా…అరగంటలో అనుమతి పత్రాలిస్తా

– ఓ కార్పోరేటర్‌ అతి…కబ్జాతో అధికార పార్టీ పరువు తీస్తున్న వైనం

– మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చిన లెక్క లేదు

– అధికారంలో ఉన్నాం…మాకెవడు అడ్డు అంటూ ఫోజులు

నేటిధాత్రి బ్యూరో: ఓవైపు ముఖ్యమంత్రి స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తుంటే పార్టీ బలోపేతానికి కేటిఆర్‌ అహర్నిశలు కృషి చేస్తుంటే గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో నాయకులు మాత్రం అతిగా వ్యవహారిస్తూ యథేచ్చగా కబ్జాలు చేస్తూ పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు. అధికారం వీరొక్కరి సొత్తు అయినట్లు అహోరాత్రులు శ్రమించి ప్రజల మనసు గెలిచి టిఆర్‌ఎస్‌ను వీరే అధికార పీఠమెక్కించినట్లు ఫోజులు కొడుతున్నారు. గులాబీ హవాలో, కేసిఆర్‌ చరిష్మాతో కార్పోరేటర్‌గా గెలిచి కాలర్‌ ఎగరేస్తూ హన్మకొండ నడిబొడ్డున కబ్జాపర్వం కొనసాగిస్తున్న ఓ కార్పోరేటర్‌ అధికారంలో ఉన్నాం…మేం ఇష్టం వచ్చినట్లు చేయ్యెచ్చు అంటూ గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ అధికారులపై తన జులుం చూపిస్తున్నాడట. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కబ్జాస్థలంలో నిర్మాణాలు చేస్తున్నారని నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన అధికారుల వద్ద నుంచి నోటీసులు తీసుకుని బూతుపురాణం అందుకున్నాడట. ఎవడు అడ్డొస్తాడో చూస్తా.. కబ్జాస్థలంలోనే నిర్మాణం చేస్తా…అనుమతులు నాకో లెక్క కాదు. అరగంటలో తెస్తా అంటూ డిసి స్థాయి అధికారులపై విరుచుకుపడ్డాడట. గ్రేటర్‌ వరంగల్‌లోని ఓ ఎమ్మెల్యే తన వెనుక ఉన్నాడని, ఈ స్థలంలో ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన కాంప్లెక్స్‌ నిర్మాణం చేస్తున్నామని చెపుతున్న ఈ కార్పోరేటర్‌తో సహా మరో ఇద్దరు కార్పోరేటర్లు ఎలాంటి జంకు లేకుండా దర్జాగా కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. హన్మకొండ నగరంలో వీరు చేసిన కబ్జాస్తలం విలువ పదికోట్లపైగానే ఉంటుంది. ఏకంగా 900గజాలకుపైగా స్థలాన్ని కబ్జా చేసిన వీరు. ఎవరు అడ్డు చెప్పిన వినకుండా నిర్మాణాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. అసలు స్థల యజమాని పోలీసులకు, మున్సిపల్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేసిన ఈ ముగ్గురు కార్పోరేటర్లు మాత్రం సేమ్‌ డైలాగ్‌ అందుకుంటున్నారట. అధికారంలో ఉన్నాం…అంటూ విర్రవీగుతున్నారట. ఇలాంటి కబ్జారాయుళ్లపై గులాబీ అధిష్టానం సీనియస్‌గానే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని వెనకుండి నడిపిస్తున్నాడని అందరూ అంటున్నా గ్రేటర్‌లోని ఆ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.

………………………………………….

మోదీ ప్రసంగంపై ఈసీ క్లీన్‌ చిట్‌

దిల్లీ, నేటిధాత్రి: కక్ష్యలోని ఉపగ్రహాన్ని క్షిపణితో కూల్చివేసే ఏ శాట్‌ పరీక్ష విజయంపై దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ విషయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘన జరగలేదని ఈసీ స్పష్టం చేసింది. ప్రధాని ప్రసంగించే సమయంలో పార్టీ పేరును ప్రస్తావించడం, ఓట్లు అభ్యర్థించడం వంటివి చేయలేదని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఉపగ్రహ నిరోధక పరీక్ష విజయంపై గత బుధవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అత్యంత కఠినమైన మిషన్‌ శక్తి ప్రయోగం విజయవంతమైందని, ఏశాట్‌ ద్వారా తక్కువ ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న ఓ సజీవ ఉపగ్రహాన్ని కూల్చివేశామని మోదీ చెప్పారు. దేశ ప్రజలకు ఈ ప్రయోగం గర్వకారణమని తెలిపారు. మిషన్ శక్తితో అంతరిక్షంలోనూ మన రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకున్నామని అన్నారు.
అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మోదీ ఈ ప్రసంగం చేయడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీంతో స్పందించిన ఈసీ.. మోదీ ప్రసంగం అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. ప్రధాని ప్రసంగానికి సంబంధించిన వివరాలను దూరదర్శన్‌, ఆల్‌ఇండియా రేడియోల నుంచి సేకరించింది. వీటిని పరిశీలించిన అనంతరం మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.

Exit mobile version