తొలినాటి కూరగాయ దొండ…

తొలినాటి కూరగాయ దొండ…

 

తొంటి అంటే తొలినాటిదని అది తొండి కాయ’గా కన్నడంలోనూ దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది.

దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్‌లో ‘కాక్సీనియా’ అంటే ఎర్రపండు అని! బెండని లేడీస్‌ ఫింగర్‌ అన్నట్టే, దీన్ని ‘జెంటిల్‌ మాన్స్‌ టో’ అంటారు.

ఘృతపాకేన కరోతి రోచనమ్‌

తొంటి’ అంటే తొలినాటిదని! అది ‘తొండి కాయ’గా కన్నడంలోనూ, దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది. దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్‌లో ‘కాక్సీనియా’ అంటే ఎర్రపండు అని! బెండని లేడీస్‌ ఫింగర్‌ అన్నట్టే, దీన్ని ‘జెంటిల్‌ మాన్స్‌ టో’ అంటారు.

జీర్ణకోశాన్ని శుభ్రపరచటం, తల్లి పాలు పెరిగేలా చేయటం, రక్తహీనత, జ్వరాలు, క్షయ వంటి వ్యాధుల్లో పోషకం ఇది. దీనిలోని కుకుర్బిటాసిన్‌ మధుమేహాన్ని నియంత్రిస్తుందని పరిశోధిస్తున్నారు.

లేత దొండకాయల్ని నిలువు చీలి కలుగా కోసి, ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో మరిగించి ఆ నీటిని పిండేయాలని నలుడు ‘పాక దర్పణం’లో చెప్పాడు. ఉప్పు వేసి పిసికి నీరు పిండటం కూడా చెయ్యదగిందే! ఈ జాగ్రత్త తీసుకోకుండాదొండ ముక్కల్ని నేరుగా కూర,పప్పు పచ్చడి వగైరా చేస్తే తల తిరుగుడు లాంటి సమస్యలు కలుగుతాయి.

ఇగురుకూర: ఒక చెంచాడు నేతిలో ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు జీలకర్రవగైరా తాలింపు గింజలు వేగించి, నీరుపిండిన ముక్కలి అందులో కలిపి మిరియాలపొడి వేసి మగ్గనిస్తే అదే కమ్మని దొండ ఇగురుకూర! పొయ్యి మీంచి దించాక రవ్వంతపచ్చకర్పూరం కలిపితే పరిమళ భరితంగా ఉంటుందన్నాడు నలుడు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది!

మజ్జిగ పులుసు: ‘‘బింబీఫలం సకలమేవఘృతే నిధాన…’’ దొండకాయల్ని నాలుగు పక్షాలుగా చీల్చి నీరుపిండి, కొద్దిగా నెయ్యి వేసి వేగనిచ్చి ఉప్పు, మిరియాలపొడి వేసి, కాయలు మునిగే దాకా చిక్కని మజ్జిగ పోసి ఉడికించాలి.

ఈ మజ్జిగపులుసు జాఠరాగ్నిని పెంచుతుందని క్షేమ కుతూహలం గ్రంథం పేర్కొంది.

ముద్ద కూర: లావుగా పెద్దవిగా ఉండే దొండకాయల్ని నిలువుగా మధ్యకు కోసి, ఇంగువ+ఉప్పు కలిపిన పొడిని ఒక్కో ముక్కకూబాగా పట్టించాలి.తర్వాతభాండీలో తాలింపుగింజలు వేగించిన నూనెలో వేసి నీళ్ళమూత పెట్టి ప్రలేహ విధిలో ముద్దగా అయ్యేలా మగ్గించాలి!

 

పెరుగుపచ్చడి: అంగారభర్జితం అంటేనిప్పులు లేదా మంటమీద కాల్చిన దొండకాయల్ని పైన మాడు వలిచి, నెయ్యి, ఉప్పు వేసి పిసికి పెరుగులో కలిపి ఇంగువ తాలింపు పెట్టి కొత్తిమీర వగైరాలతో అలంకరించిన పెరుగు పచ్చడి జీర్ణకోశవ్యాధులన్నింటికీ మంచిది!

ఆవ పెరుగుపచ్చడి: దొండకాయని నిలువుగా మూడుపక్షాలుగా చీల్చి, నీరు పిండి పెరుగులో వేసి ఉప్పు, నల్ల ఆవాల పిండి కలిపిన ఆవ పెరుగుపచ్చడి కృష్ణదేవరాయలు అన్నట్టు ముకుమందు… అంటే జలుబునీళ్లువదిలిస్తుంది!

దొండకాయ పప్పు: నీరుపిండేసిన ముక్కల్ని పెసరపప్పుతో, ధనియాలు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాల పొడిని కలిపి వండిన పప్పు పోషక విలువలు కలిగి ఉంటుంది.

దొండకాయని చింతపండుతోనూ, అల్లం వెల్లుల్లితోనూ వండే విధానాలను పాకశాస్త్ర గ్రంథాలేవీ చెప్పలేదు. కఫాన్ని తగ్గిస్తుంది. ముక్కులోంచి రక్తస్రావాన్ని తగ్గించే గుణం దీనికుంది. అందుకని, వేడి చేసే వాటితో దీన్ని కలిపి వండటాన్ని శాస్త్రం ఒప్పుకోలేదు.

దొండ కాయ ఉబ్బరాన్ని కలిగిస్తుంది! అందుకని శనగ పిండి వేసి పకోడీ కూరల్లాంటివి కూడా నిషేధం! ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధుల్ని తగ్గిస్తుంది. వాటిని పెంచే అజీర్తికర పదార్థాలతో వండకపోవటమే మంచిది.

దొండకాయలో దోషాలకు విరుగుడుగా దోసకాయ, కాకరకాయ పనిచేస్తాయి. దొండని వండినప్పుడు కాకర లేదా దోస కూడా తప్పకుండా వండుకోండి!

ఫ్రెంచ్‌ ఆనియన్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: శాండ్విచ్‌ బ్రెడ్‌లు-ఆరు, ఉల్లి ముక్కలు (పెద్దవి)- మూడు కప్పులు, బటర్‌-మూడు స్పూన్లు, గోధుమ పిండి- రెండు స్పూన్లు, బిర్యానీ ఆకు-ఒకటి, ఆపిల్‌ సెడార్‌ వెనిగర్‌-స్పూను, ఉడికించిన కూరగాయలతో నీళ్లు-మూడున్నర కప్పులు, వెల్లుల్లి ముక్కలు-అర స్పూను, మిరియాల పొడి – పావు స్పూను, చీజ్‌-ఆరు స్పూన్లు, కొత్తిమీర తరుగు-స్పూను.

 

తయారుచేసే విధానం: వెడల్పాటి పాన్‌లో కాస్త బటర్‌ వేయాలి. అది కరుగుతుంటే ఉల్లి ముక్కలను చేర్చాలి. ఉల్లి బంగారు రంగులోకి మారాక ఆపిల్‌ సెడార్‌ను వేసి, గోధుమ పిండి, బిర్యానీ ఆకు, వెల్లుల్లి కలపాలి.

ఉప్పు, మిరియాల పొడితో పాటు కూరగాయల నీళ్లని ఇందులో పోసి, మూతపెట్టాలి. మంటని తగ్గించి, మధ్యలో కలుపుతూ 30 నిమిషాల పాటు ఉడికించాలి.

బ్రెడ్‌ చివర్లు కత్తిరించి, పెనంపై కాస్త బటర్‌ వేసి ఒక్కో ముక్కను అటూ ఇటూ దోరగా కాల్చాలి లేదా ఓవెన్‌లో టోస్ట్‌ చేయాలి. బౌల్‌లలో సూప్‌ వేసి పైన బ్రెడ్‌ ముక్కలను ఉంచాలి. పైన ఛీజ్‌ తురుమును, కొత్తిమీర తరుగును చల్లితే సరి.

తవా పనీర్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌ ముక్కలు – పదహారు, ఉల్లి, టమాటా ముక్కలు- కప్పు, క్యాప్సికం ముక్కలు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – స్పూను, పెరుగు – పావు కప్పు, పసుపు- అర స్పూను, కారం- రెండు స్పూన్లు, జీలకర్ర పొడి – అర స్పూను, ధనియాల పొడి – అర స్పూను, గరం మసాలా – అర స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు – తగినంత.

తయారుచేసే విధానం: గిన్నెలో పావు కప్పు పెరుగు, కొద్దిగా పసుపు, స్పూను కారం, పావు కప్పు గరం మసాలా, కాస్త జీలకర్ర పొడి, అర స్పూను ఉప్పు, రెండు స్పూన్ల నూనె వేసి అంతా బాగా కలపాలి.

ఇందులోనే పనీర్‌ ముక్కలనీ వేసి, బాగా కలిపి అరగంట పాటు మూత మూసి పక్కన పెట్టాలి. ఓ పాన్‌లో కాస్త నూనె వేసి జీలకర్ర చిటపటలాడించి, ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ జతచేయాలి.

ఉల్లి రంగు మారగానే, మంట తగ్గించి ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర చేర్చాలి. నిమిషం తరవాత టమాటా ముక్కలూ వేయాలి. కాస్త దగ్గరకి వచ్చాక క్యాప్సికం ముక్కలూ చేర్చాలి. క్యాప్సికం కరకరలాడుతుంటే నానబెట్టిన పనీర్‌ను కలపాలి.

అరకప్పు నీళ్లు, అర స్పూను ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరవాత మూత తీసి గరం మసాలా, మిగతా కొత్తిమీర వేసి అంతా కలిపితే తవా పనీర్‌ సిద్ధం.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లపై అధికారులు.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి

-సమాచార హక్కు రక్షణ చట్టం-2005 వరంగల్ జిల్లా స్టూడెంట్ కన్వీనర్ ఎద్దు రాహుల్.

వరంగల్ నేటిధాత్రి:

ప్రైవేట్ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరంకు ముందస్తుగానే అడ్మిషన్లు తీసుకుంటూ విద్యను వ్యాపారంగా మారుస్తూ లక్షల రూపాయలను పేద మధ్య తరగతి విద్యార్థుల నుండి కాజేస్తున్నారని వెంటనే జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 వరంగల్ జిల్లా స్టూడెంట్ కన్వీనర్ ఎద్దు రాహుల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాహుల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ వంటి కోర్సులకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వేలు దాటి లక్షలకు చేరిందని, మేనేజ్మెంట్ కోట సీట్లకు యజమాన్యం చెప్పినంత ఫీజు విద్యార్థులు కట్టాల్సిందే లేదంటే నో అడ్మిషన్ అంటూ విద్యార్థుల జీవితాలపై ప్రైవేట్ విద్యాసంస్థలు చెలగాటం ఆడుతుందని తెలిపారు. జిల్లా రాష్ట్ర విద్యాధికారులు వెంటనే ముందస్తు అడ్మిషన్ల పేరుతో లక్షలు కాజేస్తున్న పలు ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఫీజు నియంత్రణ చట్టం రూపొందించకపోవడం, ముఖ్యమంత్రి విద్యార్థులపై శ్రద్ధ చూపకపోవడం వల్లే ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులకు కొన్ని సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు రాకపోవడం, ప్లీజ్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను యజమాన్యాలు దౌర్జన్యంగా వారి వద్ద నుండి ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.

బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు.

బి ఆర్ ఎస్. నాయకుల ముందస్తు అరెస్టులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

.తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధును. ఈరోజు తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జిల్లాకు అధికార పార్టీ నాయకులు మంత్రులు ఎప్పుడు వచ్చిన ముందస్తు అరెస్టు చేయడం సరికాదని ఈ సందర్భంగా. తెలియజేస్తూఎప్పుడు. ఎ నాడు భయపడలేదని తెలంగాణ ఉద్యమంలో ఎన్నో జైలు జీవితాలు గడిపామని ఎన్నో అరెస్టులు అయ్యామని ఈ సందర్భంగా తెలియజేశారు అరెస్టు అయిన పరామర్శించిన తంగళ్ళపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజన్న బిఆర్ఎస్ మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు పడిగల రాజు. ఎగుమామిడి వెంకటరమణారెడ్డి .మాజీ. రవి. తంగళ్ళపల్లి మండల. జాగృతి అధ్యక్షులు. కందుకూరి రామ గౌడ్. జగత్.గుండు ప్రేమ్ కుమార్.. నాయకులు మాట్లాడుతూఇకముందు అయినా అధికార పార్టీ నాయకులు గాని మంత్రులుగాని జిల్లా పర్యటన సందర్భంలో ఇలాంటి అరెస్టు చేయడం సరికాదని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అధికారం ఉందని అది అందరిసొత్తు కాదని. దృష్టిలో ఉంచుకొని అక్రమ అరెస్టులు చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేశారు

ముందస్తు బడిబాట అవగాహన సదస్సు.

ముందస్తు బడిబాట అవగాహన సదస్సు

జైపూర్ నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను జాగ్రత్తపరిచి,వారిలో చైతన్యం తీసుకువస్తూ,కుందారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ముందస్తు బడిబాట కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో శుక్రవారం స్థానిక గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న చోట ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాల పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా హెచ్ఎం అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకుంటే మంచిది అనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు.ఉచిత పాఠ్యపుస్తకాలు,డిజిటల్ బోధన,యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం,అటల్ టింకరింగ్,ల్యాబ్ అత్యాధునికమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు వివరించారు.వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే బదులు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలని కోరారు.అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా బాత్రూములతో పాటు వివిధ వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాలను సహా వివరంగా వివరించడంతో పిల్లల తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ముందస్తు బడిబాట కార్యక్రమం.

ముందస్తు బడిబాట కార్యక్రమం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని మైలారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహి స్తున్నారు. మంగళవారం హెడ్మాస్టర్ నాగ సుభాషిని ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగారు. బడి ఈడు పిల్లల తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందు తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ర్థులకు ఉచితంగా దుస్తులు, నోట్ పుస్తకాలతో పాటు మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు సంధ్యారాణి, రమేష్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

ముందస్తుగా ఉగాది వేడుకలు.

ముందస్తుగా ఉగాది వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు బండి ఉపేందర్ ఉగాది పర్వదినమున సకల శుభాలకు నిలయం అలాగే ఉగాదినాడు అడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి మానవుని జీవిత గమనంలో కష్టసుఖాలన్ని మర్చిపోయి ఉగాది పచ్చడి లాగా అన్నిటిని సమానంగా స్వీకరించినప్పుడే మనం మోనగలుగుతామని తెలియజేశారు విద్యార్థుల భావి జీవితంలో గెలుపు ఓటములనుసమానంగా స్వీకరించి ముందడుగు వేయాలని. తెలియజేసి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం బూ ట్ల శ్రీనివాస్ పలుమార్ తిరుపతి గట్టు శ్రీకాంత్ ఆవదాల జ్యోతి రాణి ఎలిగేటి శ్రీనివాస్ రామ్ ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ముందస్తు విద్యార్థుల నమోదు కార్యక్రమం.

ముందస్తు విద్యార్థుల నమోదు కార్యక్రమం

పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాటికొండ వీరస్వామి

కమలాపూర్, నేటిధాత్రి :

 

రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని కమలాపూర్ మండలం భీంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ముందస్తుగా విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటికొండ వీరస్వామి మాట్లాడుతూ విద్యా సంవత్సరం చివర్లోనే తల్లిదండ్రులు,యువత, ప్రజాప్రతినిధులను కలవడం ద్వారా ముందుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తే,వచ్చే ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.అందుకే ఈ కార్యక్రమాన్ని ముందుగా చేపట్టామన్నారు.పాఠశాల అందిస్తున్న సౌకర్యాలను వివరించేందుకు,అలాగే ఉపాధ్యాయ బృందం విద్యార్హతలను తెలియజేయడానికి ప్రత్యేక కరపత్రాన్ని ముద్రించి మండల విద్యాశాఖ అధికారిచే ఆవిష్కరించారు.గత వారం రోజులుగా ఉపాధ్యాయ బృందం గ్రామంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు, యువతతో సమావేశమై, వారికి కరపత్రాలను అందజేస్తూ,తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు గట్టి పునాది వేస్తామనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కల్పిస్తున్నారు.తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే బడి ఈడు పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయ బృందం సమావేశం నిర్వహించనుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు మార్గదర్శకమని మండల విద్యాశాఖ అధికారి అభిప్రాయపడ్డారు.భీంపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వాణి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలఉపాధ్యాయులు ఎన్. ప్రభాకర్ రెడ్డి,బి.జోత్స్న, కె.సుజాత అంగన్వాడీ టీచర్ ఏ.వరలక్ష్మి,ప్రీ ప్రైమరి టీచర్ కె.పూజిత,తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుక.

పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుక

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

కేసముద్రం మండలం పెనుగొండ గ్రామపంచాయతీ లోని కట్టు గూడెం ఎం పి పి ఎస్ పాఠశాలలో శనివారం ముందస్తు విశ్వా వసునామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షమీం, ఉగాది పండగ పర్వదినాన్ని తెలుగు సంప్రదాయ ప్రకారం తెలుగు సంవత్సరముగా మరియు కొత్త సంవత్సరం ఉగాది పండగ పర్వదినాన్ని తెలుగు ప్రజలు చాలా సాంప్రదాయ పద్ధతిలో మొదటి పండగగా భావించి అంగరంగ వైభవంగా జరుపుకుంటారని ఉగాది పండగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అలాగే తెలుగు నూతన సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ తో సంబంధం లేకుండా పంచాంగం ప్రకారం నెలలను మాసాలతో తిధులతో మంచి రోజులను చూసుకుంటారని అలాగే శుభ ముహూర్తాలను ఈ పంచాంగం ద్వారానే నిర్ణయిస్తారని విద్యార్థులకు వివరించారు. అలాగే ఈ విశ్వా వసునామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులు…

ముందస్తు అరెస్టులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలలానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నిషేధంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టిఆర్ఎస్వి నాయకులు ముందస్తుగా అడ్డుకొని ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్కు ట్రాఫిక్ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మాకు సంబంధించిన విషయాల గురించి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వారిలో చీమల ప్రశాంత్ యాదవ్ బొలవేణి ఎల్లం యాదవ్ పొందాల చక్రపాణి నందగిరి భాస్కర్ గౌడ్ తదితరులు అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు వీరిని మాజీ జెడ్పిటిసి బిఆర్ఎస్ నాయకులు కోడి యంతయ్య జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు తదితరులు పరామర్శించారు

శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ఘనంగా హోలీ సంబరాలు.

శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ఘనంగా ముందస్తు హోలీ సంబరాలు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం శార్వాణి విద్యానికేతన్ పాఠశాల లో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలు జరుపుకున్నారు శార్వాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాడెంట్ దాయకపు శ్రీనివాస్ మాట్లాడుతూ హోలీ సంబురాలు ఎంత ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నారో విద్యార్థుల జీవితాలు సంతోష కరమైన రంగులమయం కావాలని వారి జీవితాలు ముందుకు సాగాలని కోరుకుంటూ విద్యార్థుల కు ఉపాధ్యాయులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు

ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవం.

ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవం.

పలమనేరు నేటి ధాత్రి :

పలమనేరు పట్టణం గుడియాత్తం రోడ్డు సమీపంలో ఉన్న ఐ సి డి ఎస్ కార్యాలయం ఆవరణలో ముందస్తు మహిళా దినోత్సవం నిర్వహించినట్లు సిడిపిఓ ఇందిరా ప్రియదర్శిని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాల్సి ఉండగా శనివారం సెలవు రోజు కాబట్టి ముందుగా జరపాలసి వచ్చిందన్నారు. ఈ దినోత్సవానికి మహిళా డాక్టర్లు శారద, సుధారాణి, ఎస్సై స్వర్ణ తేజ ,లెక్చరర్ రుక్మిణి, బాలికల పాఠశాల హెచ్ఎం కుప్పమ్మ ముఖ్య అతిథులుగా హాజరైనారు.ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథులకు సామాజిక సేవాదాత శ్రీపురం సీతారామయ్య, వీరి పెద్ద కోడలు సునీత చేతుల మీదుగా శాలువులు కప్పి ఘనంగా సన్మానించారు. లెక్చరర్ రుక్మిణి, ఎస్సై స్వర్ణ తేజ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, అప్పుడే సమ సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మహిళలు, బాలికల యొక్క మేదస్సు దానికి అనుగుణంగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, వాటికోసం మనమందరము పెద్ద ఎత్తున శ్రమించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే భారతదేశంలో పురుషాధిపత్యం చెలరేగుతున్నదనడానికి మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలే నిదర్శనం అన్నారు.ఎక్కడో అమెరికా దేశంలో ఓ రాష్ట్రమునందు 5000 మంది మహిళా కార్మికుల చేత ప్రారంభమైన పోరాటం ప్రపంచ దేశాల్లో అలుముకుందని గుర్తు చేశారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ఉద్యమ పండుగగా జరుపుకోవాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులు చిన్నతనం నుండి విద్యతోపాటు, సామాజిక నైపుణ్యతలు, మానవతా విలువలు ఇంటి దగ్గరే వారికి బోధించాలన్నారుబాలికలను అన్ని రంగాల్లో పాల్గొనడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం కల్పించి ధైర్యంగా ముందుకు పంపించాలన్నారుఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు నజ్మా, మాధవి లత, గీత, శారదమ్మ, ద్రాక్షాయని, పుష్ప, అంగన్వాడి వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version