అక్రమ కేసు లకు భయపడేది లేదు…

అక్రమ కేసు లకు భయపడేది లేదు

గుండాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్

గుండాల,నేటిదాత్రి:

 

మణుగూరు పట్టణం లో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ భవనం అని పిలవబడే కార్యాలయం పైన జరిపిన దాడిని కండిస్తూ బిఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదం గా ఉన్నాయని గుండాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచి తర్వాత వారి స్వలాభం కోసం గులాబీ కండువా కప్పుకుని తల్లి పాలు తాగి రొమ్ము మీద తన్నిన మాదిరి నీ గెలుపుకి కారణమయిన కాంగ్రెస్ పార్టీ కి సంబందించిన కార్యాలయాన్ని కబ్జా చేసి బిఆర్ఎస్ భవన్ గా మార్చుకున్న మీ నాయకుడా ఈ దాడిని ఖండించేది. ఏ అధికారం లేని నాడు కూడా మా పార్టీ కార్యాలయం మాకు కావాలని పోరాడిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే సొంతం, అధికారం ఉన్నా లేకున్నా ఆ భవనం కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే సొంతం, అయిదేండ్లుగా మా భవనాన్ని మాకు లేకుండా చేసి మా ఓపిక ను పరీక్షించిన మీకు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అంతా కలిసి బుద్ధి చెప్పే కార్యక్రమం నిర్వహించాం, మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే వారి కార్యాలయాన్ని నాడు కబ్జా చేసుండకపోతే నేడు ఈ పరిస్థితి మనకు రాకుండేది గా అని మీ నాయకుడ్ని ప్రశ్నించండి అని మొదట ఆజ్యం పోసిందే మీ నాయకుడు కదా అని ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి కేసులకు భయపడేది లేదని మా భవనాన్ని మేము స్వాదీన పర్చుకోవడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్, యువజన నాయకులు వాజీద్ పాషా, ఇస్రార్, బొంగు చంద్రశేఖర్, పల్లపు రాజేష్ సోషల్ మీడియా నాయకులు మండలోజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవం.

ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవం.

పలమనేరు నేటి ధాత్రి :

పలమనేరు పట్టణం గుడియాత్తం రోడ్డు సమీపంలో ఉన్న ఐ సి డి ఎస్ కార్యాలయం ఆవరణలో ముందస్తు మహిళా దినోత్సవం నిర్వహించినట్లు సిడిపిఓ ఇందిరా ప్రియదర్శిని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాల్సి ఉండగా శనివారం సెలవు రోజు కాబట్టి ముందుగా జరపాలసి వచ్చిందన్నారు. ఈ దినోత్సవానికి మహిళా డాక్టర్లు శారద, సుధారాణి, ఎస్సై స్వర్ణ తేజ ,లెక్చరర్ రుక్మిణి, బాలికల పాఠశాల హెచ్ఎం కుప్పమ్మ ముఖ్య అతిథులుగా హాజరైనారు.ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథులకు సామాజిక సేవాదాత శ్రీపురం సీతారామయ్య, వీరి పెద్ద కోడలు సునీత చేతుల మీదుగా శాలువులు కప్పి ఘనంగా సన్మానించారు. లెక్చరర్ రుక్మిణి, ఎస్సై స్వర్ణ తేజ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, అప్పుడే సమ సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మహిళలు, బాలికల యొక్క మేదస్సు దానికి అనుగుణంగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, వాటికోసం మనమందరము పెద్ద ఎత్తున శ్రమించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే భారతదేశంలో పురుషాధిపత్యం చెలరేగుతున్నదనడానికి మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలే నిదర్శనం అన్నారు.ఎక్కడో అమెరికా దేశంలో ఓ రాష్ట్రమునందు 5000 మంది మహిళా కార్మికుల చేత ప్రారంభమైన పోరాటం ప్రపంచ దేశాల్లో అలుముకుందని గుర్తు చేశారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ఉద్యమ పండుగగా జరుపుకోవాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులు చిన్నతనం నుండి విద్యతోపాటు, సామాజిక నైపుణ్యతలు, మానవతా విలువలు ఇంటి దగ్గరే వారికి బోధించాలన్నారుబాలికలను అన్ని రంగాల్లో పాల్గొనడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం కల్పించి ధైర్యంగా ముందుకు పంపించాలన్నారుఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు నజ్మా, మాధవి లత, గీత, శారదమ్మ, ద్రాక్షాయని, పుష్ప, అంగన్వాడి వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

వేతనాల పెంపుకై మార్చి 10న అంగన్వాడీల ఛలో విజయవాడ..

వేతనాల పెంపుకై మార్చి 10న అంగన్వాడీల ఛలో విజయవాడ..

తిరుపతి నేటిధాత్రి :

అంగన్ వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం, వేతనాల పెంపుకై మార్చి 10వ తేదీన ఛలో విజయవాడ, మహాధర్నా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు, కార్యక్రమ జయప్రదానికై సిఐటియు తరపున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నట్టు కందారపు మురళి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో 42 రోజులపాటు అంగన్ వాడీ సిబ్బంది ఆంధ్ర రాష్ట్రంలోని యావత్తు స్కూళ్ళను మూసివేసి ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్నారని కందారపు మురళి గుర్తు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసిందని వాటిని జీఓలుగా నేటికీ విడుదల చేయకపోవడం సమంజసం కాదని కందారపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అంగన్ వాడీలకు వైసీపీ ప్రభుత్వం కంటే గొప్ప నిర్ణయాలు చేసి సహకరిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు సమ్మె సందర్భంలో పలుమార్లు చెప్పారని అధికారంలోకి వచ్చాక ఏమాత్రం పట్టించుకోవటం లేదని,గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలను సైతం అమలు చేయడం లేదని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఒక రకంగా ఎన్నికల తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలం గడుస్తున్నా కనీసం అంగన్వాడీలను పిలిపించి మాట్లాడాలన్నా కనీసమైన నైతికతను ప్రభుత్వం ప్రదర్శించకపోవడం వారి చిత్తశుద్ధిపట్ల అనుమానానికి ఆస్కారం ఏర్పడిందని అన్నారు.
ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో సిఐటియు, ఎఐటియుసి ఐఎఫ్ టియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో పదవ తేదీన మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు.
తిరుపతి జిల్లాలోని అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version