రాజీవ్ యువ వికాసం పథకం అర్హులకు మాత్రమే.!

రాజీవ్ యువ వికాసం పథకం అర్హులకు మాత్రమే అందించాలి

బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం వెంటనే అమలు చేయాలని మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు సివిల్ స్కోర్ ఎలాంటి షరతులు విధించకుండా అర్హులైన వారికి పథకము అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు మాత్రమే కేటాయించాలని,అనర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .

 

 

BJP Executive Committee

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు…

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.

సంక్షేమ పథకాలు అందించడంలో పేదలకు అన్యాయం చేస్తే.!

సంక్షేమ పథకాలు అందించడంలో పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదు
ఇందిరమ్మ ఇండ్లు,రాజీవ్ యువ వికాసం పథకంలో కాంగ్రెస్ పార్టీ జోక్యం తగదు
చిగురుమామిడి ఎంపీడీవో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించడం సిగ్గుచేటు

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్.

ఎంపీడీవో కార్యాలయం ముట్టడికి సీపీఐ నాయకుల యత్నం అరెస్టు చేసిన పోలీసులు.

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక, రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీవో వైఖరిపై జిల్లా స్థాయి అధికారులు సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ముట్టడి కి యత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారని సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈముట్టడికి సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు అందించే క్రమంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని,ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగాప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారుల ఎంపికలో జిల్లా వ్యాప్తంగా అనేక అవతకవలు చోటు చేసుకున్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పూర్తిగా అధికార పార్టీ కాంగ్రెస్ కనుసన్నల్లోనే లబ్దిదారుల ఎంపిక జరగడంతో అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, అర్హులైన వారిని ఎంపిక చేయాల్సిన చిగురుమామిడి ఎంపిడీవో తన చాంబర్ లో అర్దరాత్రి వరకు కాంగ్రెస్ నాయకులను కూర్చోబెట్టుకుని లబ్దిదారులను ఎంపిక చేయడం వివాదాస్పదమైందని, ఎంపిడీవో స్థాయి అధికారి ఓకాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరించడం సిగ్గుచేటని, లబ్దిదారుల ఎంపికలో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసినా అధికారులు కూడా వారి విధులు సక్రమంగా నిర్వహించలేదని, ప్రత్యేక అధికారి ఉన్నప్పటికీ లబ్దిదారుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకుల మితిమీరిన జోక్యంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అంతటా నెలకొన్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపికలో చిగురుమామిడి ఎంపిడివోపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటూనే అర్హులైన లబ్దిదారులను గుర్తించి న్యాయం చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో డబుల్ బెడ్ రూం పథకం పేరిట ఊరించినప్పటికీ ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. జిల్లాలో కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూంలు ఇండ్లు నిర్మించినా పేదలకు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. పదేళ్ల పాటు పేదల సొంతింటి కల నెరవేలేక పోయిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతింటి కళ నెరవేరుతుందనుకుంటే అర్హులకు అందకపోవడం బాధాకరమని, ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వకంగా కొనసాగుతున్నప్పటికీ పేద ప్రజలకు అన్యాయం జరిగితే సిపిఐ చూస్తూ ఊరుకోదని,పేదల పక్షాన అండగా నిలిచి సర్కారు మెడలు వంచేలా మిలిటెంట్ పోరాటాలకు సీపీఐ సిద్దమవుతుందని శ్రీనివాస్ తెలిపారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, బోయిని అశోక్,గూడెం లక్ష్మి,మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి,అందె చిన్న స్వామి, మావురపు రాజు, తేరాల సత్యనారాయణ,బామండ్ల పెల్లి యుగేందర్,సీపీఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ,పైడిపల్లి వెంకటేష్, మాజీ సర్పంచులు గోలి బాపురెడ్డి కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శిలు ఎలగందుల రాజు,కయ్యం తిరుపతి,మంద ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి, ప్రజావాణి విజయవంతం.

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి, ప్రజావాణి విజయవంతం: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

సోమవారం శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఐఏఎస్ శ్రీ హేమంత్ భోర్ఖడేతో నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నేను కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను” అని జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య పనులకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, అధికారులు డివిజన్లలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని, ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హఫీస్ పేట్ డివిజన్ మొత్తం సమస్యల మాయం.

హఫీస్ పేట్ డివిజన్ మొత్తం సమస్యల మాయం……..

బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో రోడ్లు, విధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా రోడ్లను ఆక్రమించడం వల్ల అంబులెన్స్ మరియు వాహనాలు పోయే పరిస్థితి అక్కడే లేవు మరియు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారాని బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చందనగర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి వినతి పత్రం అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ మొత్తం సమస్యలమైయం అయ్యింది అన్ని అన్నారు.ఈ యొక్క సమస్యలను అధికారులుగాని,నాయకులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు.ఇకనైనా నాయకులు,అధికారులు మేలుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే విదంగా పనిచైయండి అన్ని అన్నారు.లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు అన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్,నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

“అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం”

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

 

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ 25 , గోల్ మజీద్ ప్రాంతంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులతో నిర్మించనున్న బాక్స్ డ్రైనేజీ నిర్మాణపు పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పట్టణంలోని గోల్ మజీద్ నుంచి రైస మజీద్ వరకు రూ.4 కోట్లతో బాక్స్ డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2047 తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, వారి అడుగు జాడల్లో ముందుకు నడుస్తూ విజన్ 2047 ద్వారా మహబూబ్ నగర్ ను తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్క సంవత్సరంలోనే రూ.250 కోట్లతో విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, అందులో కొన్ని ఇప్పటికే పూర్తి చేసుకోగా, మరి కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ ను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ కు ఏమి కావాలన్నా ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, రానున్న 3 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి మహబూబ్ నగర్ ను అద్బుతంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , ఫైయాజ్, లీడర్ రఘు, మోయీజ్,ఉమర్ అఫీజ్, మహబూబ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ సిలిండర్ లపై అదనంగా డబ్బులు వసూలు.

గ్యాస్ సిలిండర్ లపై అదనంగా డబ్బులు వసూలు

గ్యాస్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలి

బీఎస్పీ పార్టీ నాయకుల డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ డెలివరీ సమయంలో ఆన్లైన్లో బుక్ చేసిన రవాణ చార్జీల పేరుతో వినియోగదారుల నుండి అదనంగా 100 రూ” వరకు వసూలు చేస్తున్నారని (రిసిప్ట్ బిల్లు) అడుగుతే ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని వినియోదారులకు అందుబాటులో ఉంచకుండా కమర్షియల్ సిలిండర్లకు బదులు ఇండ్లలో వాడే సిలిండర్లను హోటల్స్ బేకరీ షాపులలో నిల్వ ఉంచుతూ ప్రజలకు సకాలంలో అందించకుండా ఇబ్బందులు గురిచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని దళారులను గుర్తించి వారి లైసెన్సులు రద్దు చేసి ప్రజలను వారి బారి నుండి కాపాడాలని వారితో కుమ్మక్కైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం తదితరులు పాల్గొన్నారు

పెద్దవాగు ఆనకట్ట మరమ్మత్తులు ఎప్పుడు.

పెద్దవాగు ఆనకట్ట మరమ్మత్తులు ఎప్పుడు

ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

మొగుళ్లపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద గత రెండు సంవత్సరాలుగా పెద్దవాగు అధిక వర్షపాతంతో ఈ వాగులో అధిక మోతాదులో నీటి ప్రవాహం రావడం వలన ఈ యొక్క బ్రిడ్జి ఆనకట్ట వరద ప్రభావానికి కొట్టుకొని పోయింది అప్పటినుండి ఇక్కడున్న అధికారులు ఈ యొక్క ఆనకట్టకు మరమ్మత్తులు చేయలేదు కనీసం పలు అభివృద్ధి పనుల కోసం మండలంలో ఉన్న 20 గ్రామాలకు ఇదే రోడ్డు నుండి వెళ్తున్న ఎమ్మెల్యే గారికి ఈ సమస్య పట్టలేదా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు చెప్పలేదా మళ్లీ వర్షాకాలం మొదలైంది వాగు అధిక మోతాదులో మళ్ళీ వస్తే ఇక్కడ ఉన్న 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉంది ఎందుకనగా ఇప్పటికే రోడ్డు పై నుండి అనకట్ట కిందకు వర్షం వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోతుంది కావున ఈ రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది కావున తక్షణమే సంబంధిత అధికారులు గమనించి ఈ ఆనకట్టకు మరమ్మత్తులు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్ డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు తక్షణమే మరమ్మతు పనులు జరిపించాలని  కోరుకుంటున్నాను

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం.

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం???
మండల కమిటీలో అన్ని గ్రామాలకు లభించని ప్రాతినిధ్యం
అధ్యక్షుడి వ్యవహార తీరుపై సర్వత్రా అసంతృప్తి???
అధికారం కాంగ్రెస్ గెలుపు కాదు బిఆర్ఎస్ ఓటమి
క్యాడర్ ను సమన్వయ పరచడంలో పూర్తిగా విఫలం ప్రజలతో మమేకమవ్వకుండా పదవులపై కన్ను
ఐలోనోళ్లకు నచ్చకపోతే అంతే సంగతులు
నైరాశ్యంలో వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులు

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

త్వరలోనే మండల కమిటీ మార్పు తద్యం అని నాయకులు భావిస్తున్నారు.

ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఆపత్కాలంలో ఉన్న నాయకులతో మండల కమిటీని సర్దుబాటు చేయగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేదని వారంతా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే మండల కమిటీలో ఇన్నాళ్లు ఏకపక్షంగా వ్యవహరించిన నాయకులు త్వరలో జరగబోయే స్థానిక సమరంలోను పదవులు ఆశిస్తుండటంతో ఇన్నాళ్లు అధికారం అనుభవించిన వారికి మళ్ళీ పదవులు ఇస్తే కేడర్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారు.

అందుకే పోటీపై ఆసక్తి ఉన్న నాయకులకు మండల కమిటీలో చోటు లేకుండా చేసి అసంతృప్తితో ఉన్న నాయకులతో మండల కమిటీని పూర్తి చేసి పాత కొత్త నాయకులను కలుపుకొని ముందుకు పోవాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా ప్రస్తుత అధ్యక్షుని వ్యవహార శైలి పై వివిధ గ్రామాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మండల కమిటీ అంటే తాను ఒక్కడినే అన్నట్లు భావిస్తూ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కింది స్థాయి నాయకులకు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మండలంలో ఉన్న ఒకరిద్దరు వైట్ కాలర్ నాయకులను వెంటవేసుకొని తం చెప్పిందే మండలంలో తాను చెప్పిందే శాసనం అన్నట్లుగా ఈ గ్రూపు వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది.

పాత కొత్త నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి వారి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యున్నతికి కృషి చేయాల్సిన నాయకులే తాము చెప్పిందే వేదం అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తమకు తగిన ప్రాధాన్యత లభిస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయాన్ని వాళ్ళ పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పార్టీలో తమ స్థానం ఏమిటో కొత్తగా వచ్చిన నాయకులకు తెలియని పరిస్థితి.

ఇటు మండల కమిటీ లోను మరియు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ లోను కొత్తవారికి చోటు కల్పించలేదు.

అంతేకాకుండా ప్రభుత్వ పథకాల కేటాయింపులో కూడా తగిన ప్రాధాన్యత లభించడం లేదని పదవులు పథకాలు అన్ని సీనియర్లము అన్న పేరుతో పాత కాంగ్రెస్ నాయకులే పెత్తనం చెలాస్తుండడంతో ఏదో ఆశించి అధికార పార్టీలో చేరిన నాయకులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా అయినవోలు మండలంలో ఉన్న పెద్ద నాయకుడు కాంగ్రెసులో చేరికతో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో నడిచిన నాయకులు కార్యకర్తలకు రాబోయే స్థానిక సమరంలోనూ టికెట్లు కేటాయిస్తారు అన్న ఆశ లేదు.

తమకు తగిన గుర్తింపు లభించకపోవడంతో పార్టీ మారి తాము తప్పు చేశామా అని నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

పోలీస్ భాస్ గా ఎన్నో ఆపరేషన్లు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయాల్లో అరగంట తర్వాత రాజకీయ చాణక్యతను చూపి పాత కొత్త నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు చెక్ పెట్టి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తారా లేదా వేచి చూడాలి

నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్.

నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ నూతన తహశీల్దారిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మల్గి గ్రామానికి భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ఎమ్మార్వో ప్రభులు సార్ గారికి సన్మానించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి మైనార్టీ నాయకులు అఖిల్ మియా తదితరులు పాల్గొన్నారు.

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు.

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు

మొదటి జాబితాలో పేరు న్న ఆ తర్వాత మాయం

ఇందిరమ్మ కమిటీల మాయాజాలం

పంతపాడుతున్న అధి కారులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో వైద్యుల రాజిరెడ్డి నిరుపేద కుటుంబం రేక్కాఆడితే గాని డొక్కా నిండని పరిస్థితి. నిత్యం కూలి పని చేస్తూ ఇద్దరి కూతుర్ల పెళ్లి చేసి కష్టంగా జీవనం కొనసాగిస్తున్నారు నిజానికి తమకంటే గ్రామంలో నిరుపేదలు ఉండరని పై అధికారులు వచ్చి చూస్తే అన్ని తెలుస్తాయని వారు అంటు న్నారు. గ్రామసభలు జరిగినప్పుడు తమ పేర్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు తమ పేర్లు కనిపించకపోకుండా చేశారని వారు బోరు మంటున్నారు. గ్రామంలో 35 ఇండ్లు వస్తే ముందుగా ఉండాల్సిన తమ పేరు లేకపోవడం ఎంపికలో ఎంత అన్యాయం జరిగిందో చెప్పడానికి నిదర్శనం అంటున్నారు నాకు ఇద్దరు ఆడబిడ్డల పెళ్లి చేసి ఇల్లు లేక గుడిసెలలో నివసించి, ప్రజల సహకారంతో అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా అర్హులకే ఇస్తాం ఎవరు ఎటువంటి అక్రమాలకు పాల్పడిన సహించే లేదంటూ చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నీటిముట్టలేనా!

ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం

Indiramma’s committees.

 

 

ఎన్నికల్లో చేత గుర్తుకు ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అన్నారు చేత గుర్తుకు ఓటేసినా మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు ఇద్దరు ఆడబిడ్డలతో కూలి పని చేసుకుని బతుకుతున్న ఊళ్లో నాకంటే పేదవాళ్ళు ఎవరూ లేరు గ్రామంలో 35 మందికి ఇల్లు వస్తే నాలాంటి పేదోడికి మాత్రం రాలేదు ఒకసారి మా గ్రామానికి వచ్చి మేము చెప్పేది నిజము కాదా చూస్తే తెలుస్తుంది

మా పేదరికం కనబడలేదా!
శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన వైద్యుల రాజిరెడ్డి దంపతులు కూలి పని చేస్తూ ఇద్దరూ కూతురుపెళ్లిళ్లు చేసి జీవనో పాధి సాగడం చాలా ఇబ్బం దిగా మారింది. ఉండడానికి ఇల్లు లేక అద్దె ఇంట్లో చాలా కష్టంగా నివసిస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా కుటుంబం పట్ల చొరవ చూపి నిరుపేద కుటుంబానికి ఆసరా చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు

అప్పుడున్న పేరు ఇప్పు డేమైనట్లు!

ఇందిరమ్మ ఇండ్లు కోసం అందరిలాగే దరఖాస్తు చేసుకున్నాం గ్రామ సభలో మా పేరు చదివినప్పుడు మాకు ఇల్లు వస్తుందని అనుకున్నాం ఇప్పుడు మాత్రం లేదంటు న్నారు గ్రామపంచాయతీ ఆఫీసర్లను అడిగితే పైనుంచి పేర్లు వచ్చినాయి మమ్మల్ని ఏమి చేయమంటారు అన్నారు మాకు ఏమి సంబంధం లేదన్నారు గ్రామంలో మాకంటే పేదవారు ఎవరూ లేరు ఆర్థికంగా ఉన్న వాళ్లకు నాయకుల దగ్గర ఉన్నోళ్లకు మాత్రం ఇండ్లు వచ్చినాయి మేము ఏం పాపం చేసిన్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యుల రాజిరెడ్డి దంపతులు, ప్రకాశ్ రెడ్డి, మహిళలు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నా

వివేక్ కు మంత్రి పదవి పట్ల హర్షం.

వివేక్ కు మంత్రి పదవి పట్ల హర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వేంకట స్వామి మాలకి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా స్థానం లభించిన విషయం విదితమే. ఈ విషయం పట్ల అంబేడ్కర్ యువజన సంఘం జహిరాబాద్ నియోజకవర్గం అద్యక్షులు డి.శ్రీనివాస్ సోమవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అఖిలపక్షం బహిరంగ లేఖ…

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అఖిలపక్షం బహిరంగ లేఖ…

నేటి ధాత్రి – గార్ల :-

 

 

 

ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సోమవారం మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బహిరంగ లేఖను విడుదల చేశారు.

2016లో ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల సాగు, త్రాగు నీటి అవసరాల కోసం శంకుస్థాపన చేసిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,రోల్లపాడు ప్రాజెక్టును 2018లో సీతారామ ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్, రిడిజైన్ చేపించి సీతారామ ప్రాజెక్టును సత్తుపల్లి, అశ్వరావుపేట, వైరా, ఖమ్మం, పాలేరు ప్రాంతాలకు అక్రమంగా దారి మల్లించడం జరిగింది.

ఏజెన్సీ గిరిజన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్, ఇల్లందు, డోర్నకల్ నియోజకవర్గాల ప్రాంతాలకు తీరని అన్యాయం చేశారు.

సీతారామ ప్రాజెక్ట్ రీ డిజైన్ లో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి.

సీతారామ ప్రాజెక్ట్ దారి మళ్లింపు పై, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై తగు విచారణ జరిపించి మొదటి డిపిఆర్ ప్రకారం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఇల్లందు మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల బీడు భూములకు సాగునీరు ఇక్కడి ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

పాఖాలేరు అలిగేరు కలిసేచోట గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ఎన్నికల వాగ్దానం గానే మిగిలిపోతుంది.

ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల గార్ల, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్, డోర్నకల్, కురవి, మహబూబాబాద్, మరిపెడ తదితర మండలాలకు సాగు, త్రాగు నీరు అందించవచ్చు.

గత ప్రభుత్వాలు అనేకసార్లు సర్వేలు, జీవోలతో కాలం వెళ్ళదీశారు.

తెలంగాణ ఉద్యమంలో సైతం మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం అనేది ప్రధాన ఏజెండాగా ఉన్నది.

తెలంగాణ ఏర్పడి 11 ½ సంవత్సరాలు అయినప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణం మీద ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం 136 కోట్ల రూపాయల వ్యయంతో మున్నూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తూ 1076 జీవో విడుదల చేసినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఆ జీవోను పట్టించుకున్న పాపానా పోలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరీ చేస్తూ, మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టేలా తగు చర్యలు తీసుకోగలరని కోరారు.కాకతీయుల కాలం నాటి గార్ల పెద్ద చెరువు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి ప్రాణాధారం లాంటిది.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములను ఆక్రమించుకొని కొంతమంది వ్యక్తులు అక్రమంగా పట్టా పాస్ బుక్కులు పొందడం జరిగింది.

అట్టి శిఖం భూములలో బావులు తవ్వడం, పంటలు సాగు చేయడం వలన నీటి నిల్వ సామర్థ్యం తగ్గి సుమారు రెండువేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది.

దీనివల్ల రైతులు అప్పులు
తెచ్చి పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారు.

అనేక సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజలు ఉద్యమాలు చేయడంతో చెరువు భూములను కొలతలు వేస్తూ వదిలేస్తున్నారు తప్ప, అక్రమ పట్టాలు తీసుకున్న వ్యక్తులపై చర్య తీసుకోవడం గానీ చెరువు శిఖం భూములకు రక్షణ వలయాలను ఏర్పాటు చేయడం గానీ చేయకుండా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

గార్ల పెద్ద చెరువు భూములను పరిరక్షించే విధంగా నీటి నిల్వ సామర్థ్యం పెరిగే విధంగా తగిన చర్యలకు ఆదేశించగలరని కోరారు.

పాఖాలేటిపై హై లెవెల్ బ్రిడ్జి లేకపోవడం వల్ల రాంపురం మద్దివంచ గ్రామపంచాయతీలో ఉన్నటువంటి సుమారు 15 తండాల, గ్రామాల ప్రజలు గార్ల మండల కేంద్రానికి చేరుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పాఖాలేరు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో సుమారు నాలుగు నెలల పాటు రహదారి బంద్ అవుతుంది.

ఆ ప్రాంత ప్రజలు విద్య, వైద్యం ఇతర పనుల నిమిత్తం గార్ల మండల కేంద్రానికి రావడానికి బ్రిడ్జి సౌకర్యం లేదు.

అనేక మంది పాఖాలేరులో పడి కొట్టుకుపోయి చని పోయినారు.

పాఖాలేటిపై గార్ల రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు, రాజకీయ పార్టీలు అనేక ఉద్యమాలను నిర్వహించాయి.

ఫలితంగా గత ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.

అయినప్పటికీ బ్రిడ్జి నిర్మాణం కాలేదు.

ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణంపై ఒక అడుగు కూడా ముందుకు వయలేదు.

ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి గార్ల రాంపురం మద్దివంచ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ప్రజల రహదారి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

మున్నేరు నీటిని సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా పాలేరు తరలించేందుకు ప్రస్తుత ప్రభుత్వం 2025, మే 17 తారీఖున జీవో నెంబర్ 98 విడుదల చేస్తూ కాలువ నిర్మాణ పనులకు 162 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.

దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం.

మున్నేరు నీటిని మున్నేరు పరివాహక ప్రాంత రైతులకు సాగు తాగునీరు ఇచ్చిన తర్వాతే మిగతా ప్రాంతాలకు తీసుకుపోవాలి తప్ప ఇక్కడ ప్రాంతాలను ఎండబెట్టి వేరొక ప్రాంతాలకు నీరు ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్నేరు నీటిని పాలేరుకు తరలించే జీవో నెంబర్ 98 ను తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతులు వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కందునూరి శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుగులోత్ సక్రు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, టీజేఎస్ రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి తారక రామారావు, బీఎస్పీ మండల అధ్యక్షులు బాదావత్ వెంకన్న, టిడిపి మండల కార్యదర్శి కత్తి సత్యం, బిజెపి మండల నాయకులు తోడేటి నాగరాజు, వివిధ పార్టీల నాయకులు పోతుల నరసింహారావు మొదలాకర్ శివాజీ, శంకర్, బాలాజీ, కేలోత్ బాల, గుండేటి వీరభద్రం, తెల్ల గర్ల నాగేశ్వరరావు, ప్రవీణ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ lప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .

BJP Durgam Ashok.

 

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన నాయకులు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇందిర ఇండ్ల లకు. భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పేద ప్రజల అభివృద్ధిలో లో. పేద రాష్ట్రపతిగా అభివృద్ధి.లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగిస్తూ. దేశంలో ఇందిరమ్మ. కన్న కలలు సహకారం చేస్తూ నిరుపేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయిస్తూ. వారి కుటుంబాల కల సహకారం చేస్తున్నారని. అలాగే ఇప్పటివరకు మండలంలో 85 ఇండ్లకు గాను గ్రౌండ్ వర్కింగ్ చేయడం జరుగుతుందని. ఇప్పటివరకు. 45 ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేయడంతో పాటు. ముగ్గు పోసి నూతన గృహాలు ప్రారంభించామని. అలాగే గత ప్రభుత్వాలతో పోల్చితే. ఈ ప్రభుత్వ. హయాంలో. అలాంటి అవినీతికి తావియ్యకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అని. ఇకముందు కూడా గ్రామాలలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికై. నిరుపేద కుటుంబాల కలసహకారం చేసుకోవాలని. కుటుంబ. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నది అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాపల్లి ఆనందం మాట్లాడుతూ. ఇప్పటివరకు మండలంలో చాలామందికి ఇందిర ఇండ్లకు ముగ్గుపోసి భూమి పూజ చేయడం జరిగిందని మండలంలో ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం. మహోద్యమంగా మొదలుపెట్టిన. ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకుగాను. మాకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు. రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. పొన్నం ప్రభాకర్కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో. ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. లింగాల భూపతి. సుద్దాల శ్రీనివాస్. సుద్దాల కర్ణాకర్. సామల గణేష్. సత్యనారాయణ రెడ్డి. మచ్చ. మధు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు.

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.

ఆగిన రోడ్డు మరమ్మతులు.

ఆగిన రోడ్డు మరమ్మతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం : గత మూడేళ్ల క్రితం రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరు కాగా ఇటీవలే పనులు ప్రారం భమైనప్పటికీ తిరిగి నిలిచిపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతు న్నారు.

దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించనట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే నిధులు మంజూరు జరిగిన కాంట్రాక్టర్ మా త్రం పనులు వెంటనే ప్రారంభించ లేదు.

ఇటీవలే పనులు ప్రారంభమై నప్పటికీ కొన్ని నెలల్లోనే అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు.

ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామం నుండి పూర్యానాయక్ తండా వైపు 3.50 కిలోమీటర్ల మేర రోడ్డును మరమ్మతులు చేసేందుకు 2022 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.38 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

ఇట్టి పనులను పర్యవేక్షించేందుకై ప్రభుత్వం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగానికి నియమించింది.

దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచి ఇట్టి పనిని చేసేందుకు కాంట్రాక్టర్కు అప్పగించింది.

అయితే కాంట్రాక్టర్ గత మూడు సంవత్సరాలు పాటు ఎలాంటి రోడ్డు మర మ్మతు పనులను ప్రారంభించకపోవడంతో గిరిజనుల ఆశలు సన్నగిల్లాయి.

 

BRS Government.

 

గత కొన్ని ఏళ్లుగా గిరిజనులు కంకర తేలి గుంతలపడ్డ రో డ్డుపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ద్విచక్ర వాహనాల మాట అటు ఉంచితే కనీసం కాలినడకన వెళ్లాలన్న ఈ రోడ్డు అనువుగా లేక పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ తరు ణంలోనే గత రెండు నెలల క్రితం కాంట్రాక్టర్ ఈ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించడంతో గిరిజనుల ఆశలు తిరిగి రేకెత్తిన్నాయి.

కాగా ఇప్పటి వరకు ఈ రోడ్డుపై పలుచోట్ల కల్వర్టులు నిర్మించారు.

అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న రేగడి మట్టిని తవ్వి సైడ్ వైన్దింగ్ పనులను చేపట్టారు.

అదే విధంగా మొరం కాకుండా చెడేతో కూడు కున్న మట్టిని రోడ్డుపై వేసి చదును చేశారు.

తదుపరి కంకర వేయ కుం డా రోడ్డు మరమ్మతు పనులను అర్ధాంతరంగా వదిలిపెట్టారు.

దీంతో ప్రస్తుతం ఈ రోడ్డు చిరుజల్లుతే చిత్తడిగా మారి ప్రయాణం చేయ డా నికి తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయా తండాలో గిరి జనులు ఆందోళన వ్యక్తం చేశారు.

పలువురు వాహనదారులు జారి పడి ప్రమాదాన్ని గురైనట్లు వారు వివరించారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు

ఈ రోడ్డుపై కంకర వేసి బీటీ రోడ్డుగా మార్చడా నికి తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి..

◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…..

◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని……

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అందులో ముగ్గురు కొత్త మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక ముస్లింను చేర్చుకుంటారని తెలంగాణ ముస్లింలు ఆశించారు. మంత్రివర్గంలో ఒక్క ముస్లింను కూడా చేర్చకపోవడం విచారకరం. తెలంగాణలో ముస్లింల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముస్లింల ఓట్లు అందుకు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు. ముస్లింలు అసూయపడే మంత్రి లేరు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. అవును,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు,కానీ బిజెపి మరియు మోడీ ప్రభుత్వాల మాదిరిగానే సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పాలిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డికి అందరూ మంచి గుణపాఠం నేర్పించాలని కోరారు. ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు వచ్చే గ్రామ పంచాయతీ జడ్పిటిసి ఎంపిటిసి ఎలక్షన్లలో ముస్లింలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గుణపాఠం నేర్పించాలని కోరారు.

నేడే విస్తరణ.

నేడే విస్తరణ.

 

 

నేటిధాత్రి

 

 

 

 

 

ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా.. అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు.

మధ్యాహ్నం 12.19కు రాజ్‌భవన్‌లో ప్రమాణం

ఆరు ఖాళీల్లో.. మూడు మాత్రమే భర్తీచేసే అవకాశం

బీసీ, ఎస్సీ వర్గాలకే మంత్రివర్గ విస్తరణ పరిమితం!

బీసీల నుంచి వాకిటి శ్రీహరికి క్యాబినెట్‌ బెర్తు పక్కా

ఎస్సీల్లో మాల, మాదిగలకు ఒక్కొక్కరి చొప్పున..

మాల సామాజివర్గం నుంచి జి.వివేక్‌కు చాన్స్‌

మాదిగల్లో కవ్వంపల్లి, అడ్లూరి లక్ష్మణ్‌లలో ఒకరికి!

ఎస్టీల నుంచీ ఒకరికి ఇవ్వాలంటున్న సీఎం రేవంత్‌

ఓసీల నుంచి సుదర్శన్‌రెడ్డి పేరూ ప్రతిపాదన

విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. తుది జాబితాలో ఎవరెవరు ఉంటారన్న ఉత్కంఠ

 

అందుబాటులో ఉండండి: సీఎం

మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వేముల వీరేశం, కాలె యాదయ్య, మందుల సామేలు శనివారం రాత్రి సీఎం రేవంత్‌ను కలిశారు.

విస్తరణలో తమ సామాజికవర్గానికి స్థానం కల్పించాలని కోరారు.

‘ఆదివారం అందుబాటులో ఉండండి. మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది.

ఎవరికి వచ్చినా.. ఇప్పుడు కలిసివచ్చినట్లే కలిసి ఉండాలి, కలిసి రావాలి’ అని వారితో సీఎం అన్నట్లు సమాచారం.

కాగా, ఈ ఐదుగురిలో కవ్వంపల్లి పేరు తొలి ప్రాధాన్యంగా ఉండగా..

అడ్లూరి లక్ష్మణ్‌ పేరూ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

 

చివరికి ఇన్నాళ్లకు జరగబోతోంది.

ఆశావహులు, సామాజిక సమీకరణలు వంటి అంశాలతో ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా..

అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు.

ఈ దఫాలో కేవలం ముగ్గురినే తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

అది కూడా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది.

బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది.

ముదిరాజ్‌ సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు.

ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరే కావడంతో ఈయనకు బెర్త్‌ ఖాయమైంది.

ఇక ఎస్సీల నుంచి మాల సామాజికవర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి.వివేక్‌కు అవకాశం దక్కనుంది.

మరో బెర్తును కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు.

ఈ అవకాశం మాదిగ సామాజికవర్గానికి చెందిన కరీంనగర్‌ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గానీ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు గానీ లభించనుంది.

ఇలా ఎస్సీల నుంచి మాల, మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున ఇద్దరు ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

3 బెర్తులూ కొత్త ఎమ్మెల్యేలకే..

క్యాబినెట్‌లో భర్తీ చేయబోయే మూడు స్థానాలకూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే తీసుకుంటుండడం గమనార్హం.

వీరిలో జి.వివేక్‌ 2009-2014 మధ్య ఓసారి ఎంపీగా పనిచేసినా..

ఎమ్మెల్యేగా ఎన్నికయింది మాత్రం తొలిసారే.

వాకిటి శ్రీహరి, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.

అయితే ఇదే తుది జాబితా కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

బీసీ, ఎస్సీలతోపాటు ఒక ఎస్టీకి, అదే సమయంలో ఓసీల నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికీ అవకాశం ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్‌ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

ఎస్టీల నుంచి లంబాడ సామాజికవర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచందర్‌నాయక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

కాగా, నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖాయమని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది.

అయితే తుది జాబితాలో ఆయన పేరు ఉంటుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గానే మారింది. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించి, విస్తరణ ముహూర్తం కూడా ఖరారైౖనా..

జాబితాపై మాత్రం అర్ధరాత్రి వరకు తుది చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బెర్తుల ఖరారులో మార్పుచేర్పులు కూడా ఉండవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా..

ప్రస్తుతం జరిగేది మంత్రివర్గ విస్తరణా? పునర్‌వ్యవస్థీకరణా? అన్న చర్చ కూడా నడిచింది.

అయితే ప్రస్తుతానికి విస్తరణ మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version