అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి :

 

KG to PG విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాల కాళ్లు విరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. కెసిఆర్ తీర్పుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి. ది అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్-2024 ప్రకారం 2వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న 82% విద్యార్థులకు 2వ తరగతి బుక్స్ చదవడం రావడం లేదు, 8వ తరగతి చదువుతున్న 65% మంచి విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్ పైన అవగాహన లేదు, బీహార్ జార్ఖండ్,ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం విద్యావ్యవస్థలో అధమ స్థానంలో ఉంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ, 5వ, 8వ,10వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాన్ని రాష్ట్రాల వారిగా నిర్వహించే పరీక్షలో టాప్-5 వరస్ట్ పర్ఫామెన్స్ రాష్ట్రాల్లో తెలంగాణను ఉంచిన ఘనత కేసిఆర్ కు దక్కుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో 2017-18 నుండి పర్ఫామెన్స్ ఆఫ్ గ్రేడింగ్ ఇండెక్స్ సూచిక ద్వారా రాష్ట్రాల విద్య వ్యవస్థ పనితీరుకు ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది, ఈ ఇండెక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం జాతీయలోనే అధమ స్థానంలో నిలిచింది. 2022 సూచిక ప్రకారం సెకండరీ విద్య తర్వాత డ్రాప్ అవుట్ లలో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, జాతీయస్థాయిలో ఈ సగటు 13.2% గా ఉంటే,తెలంగాణ రాష్ట్రంలో 22.2% గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు నారాయణ,శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు.

కెసిఆర్ హయంలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యాభివృద్ధికి రూ.23,108 కోట్ల రూపాయలను ప్రభుత్వం కే ప్రతిపాదించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను ప్రారంభించాలని సంకల్పించి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 8 వేల పై చిలుకు టీచర్ ఉద్యోగాలనే భర్తీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ బదిలీలు, మోషన్లు చేపట్టలేదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు ప్రమోషన్లను కల్పించింది. విద్యా వ్యవస్థను పర్యవేక్షణ చేయడానికి గత ప్రభుత్వం హాయంలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓ లను నియమించలేదు. కేజీ టు పీజీ విద్య నేపంతో ప్రారంభించిన సంక్షేమ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆనాటి బిఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వారి కోళ్ల ఫారాలు, అభ్యభవనాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టింది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం. గత దసరా సమయంలో టిఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో ఉన్న భవనాలకు అద్దె చెల్లించలేదని ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ ఛానల్ ద్వారా భవనాలకు మధ్య చెల్లిస్తామని, పాఠశాలలు నడవకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో తిరిగి ప్రారంభించారు. శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండా ప్రారంభించిన ఈ పాఠశాలలతో రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు చాలావరకు మూతపడ్డాయి, ఉన్న పాఠశాలల్లో సరైన విద్యార్థులు లేకుండా పోయింది.

కెసిఆర్ హయంలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థను తిరిగే గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. కులం,మతం,ఆర్థిక సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి విధమైన విద్యను అందజేయడానికి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయం. విద్య ద్వారానే జీవితానికి సార్థకత ఏర్పడుతుందన్న అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు డబ్బులు ఉన్న పిల్లలకే ఐఐటీ,నీట్ అనే విధానం పోవాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నీళ్ల చారు అన్నం తినవలసి వచ్చింది. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించడానికి డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి

ఎంపీడీవో కల్పనకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

పరకాల,దామెర నేటిధాత్రి

పరకాల నియోజకవర్గంలోని దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కల్పన కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల అర్హులైన లబ్ధిదారులందరికీ పక్క ఇండ్లు పంపిణీ చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని భారతీయ జనతా పార్టీ దామెర మండల శాఖ తరపున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మరియు దామెర మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి,నియోజకవర్గ కో కన్వీనర్ పిఎసిఎస్ డైరెక్టర్ మాదారపు రతన్ కుమార్,ఓబీసీ మోర్చా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేవైఎం జిల్లా కోశాధికారి సూర చంద్రర్,వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ కొట్టే రమేష్, కో కన్వీనర్ గండు ముఖేష్, సీనియర్ నాయకులు గువ్వ సాంబయ్య,ఆలేటి పోషాలు, దామెర పృథ్వీరాజ్,శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు ఎక్కలదేవి రమేష్, గోగుల సమ్మిరెడ్డి,గండు పరుశురాం,బూత్ అధ్యక్షులు బి.రమేష్,చెల్పూరి రాజు, గూడూరు శ్రీనివాస్,మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి.

మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి
బీజేపీ మత చాందసవాద రాజకీయాలను మానుకోవాలి…ఏఏం సి చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య
`మతం అంటే నమ్మకం విశ్వాసం… మతం అంటే రాజకీయం కాదు బీజేపీ నాయకులు గుర్తేరుగాలి
`బతుకమ్మ పట్టుకున్నాడు బోనాల పండుగలలో బోనమెత్తిన నాయకుడు మా ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజు
`అన్ని మతాచారాలను, మత విశ్వాసాలు గౌరవించే నాయకుడు ఎమ్మెల్యే కె.ఆర్‌. నాగరాజు
`మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే కుటిల బుద్ది బీజేపీ నాయకులు మానుకోవాలి
`జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అనేది కాంగ్రెస్‌ పార్టీ నిధానం
`లౌకిక వాదం, బావసారుప్యత కాంగ్రెస్‌ పార్టీ విధానం : కాంగ్రెస్‌ నాయకులు

వర్ధన్నపేట,నేటిధాత్రి:

నియోజక వర్గ కేంద్రములో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏద్దు సత్యం,వర్ధన్నపేట ,వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ , కోతపెల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ కమ్మాగొని ప్రభాకర్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్‌ లు విలేఖర్లతో మాట్లాడుతూ.గతములో వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజు గుళ్ళు కడితే బిచ్చా గాల్లు అవుతారు, బడులు కడితే విద్యావంతులు అవుతారని మాట్లాడిన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించి రాజకీయ రంగును పులుముతున్నారు మన శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజు డా: బీ అర్‌ అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్‌ హైడాలోజిలో మాట్లాడడం జరగింది.కేఆర్‌ నాగరాజు మాట్లాడిన మాటలు డా: అంబేద్కర్‌ చెప్పినవే . ఓ. ఏస్‌.నేడు ఈ దేశములో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు స్వేచ్చా గా జీవిస్తూ ఐఏఎస్‌,ఐపీఎస్‌,డాక్టర్లు,లాయర్లు,ఇంజనీర్లు, పొలిటీషియన్లు అయ్యారు అవుతున్నారాంటె, డా:బీ.అర్‌ అంబేద్కర్‌ చలవే. మి లాగా నిత్యం మతం ,బజనలు చేసుకుంటూ పోతే మా వర్గాలు ఈ దేశములో జీవించే స్థానమే లేదు.
ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్‌ ని జవహర్‌ లాల్‌ నెహ్రూ క్యాబినెట్లో న్యాయ శాఖ మంత్రి నీ చేసి గౌర వించింది . మి లాగా (బీజేపీ) గుళ్ళు, గోపురాలు, బజనలు,కీర్తనలు నమ్ముకుంటు,చేసుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ లు వంద సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా మో,నేటి వరకు అలానే ఉండే వాళ్ళము. నేడు ఈ దేశములో బీజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయం చేయకుండా ,లౌకిక ప్రజాస్వామ్య లోకి రాండి.135 సంవత్సరాల నుండి మొదులుకొని నేటి వరకు ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ,నిమ్న ,అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తూ వస్తుంది.నేడు కూడా కాంగ్రెస్‌ పార్టీ జై బాపు,జై బిమ్‌,జై సంవిధాన్‌ నినాదంతో బ్రహ్మ నడంగ ముందుకు వెళుతున్నా ము.భవిష్యత్‌ ఎన్నికలలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తోంది. గురువింద గింజ లాగా మాటలు మాట్లాడి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నుండి డిమాండ్‌ చేస్తున్నాం.

ఐకెపి వివోఏ లా ముందస్తు అరెస్ట్.

ఐకెపి వివోఏ లా ముందస్తు అరెస్ట్

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని ఐకెపి వివోఏ రమేష్,లింగన్న,పద్మ,వినోద, కొమురయ్య,గట్టయ్య లను ముందస్తుగా అరెస్టు చేసి మంగళవారం జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 వేల రూపాయల జీతంతో పాటు ఇన్సూరెన్స్,ఉద్యోగం భద్రత, డ్రెస్ కోడ్ వంటి అనేక డిమాండ్లను కచ్చితంగా తీర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది.కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పర్చిన ఏ ఒక్క హామిని కూడా తీర్చలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాదులోని సెర్ఫ్ కార్యాలయంలో మంగళవారం నిరసన చేపట్టే కార్యక్రమాన్ని అడ్డుకోవడం తమకు తగదని అన్నారు.

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమం

 

పరకాల నేటిధాత్రి

ఒకేదేశం ఒకేఎన్నిక పై అవగాహన కార్యక్రమం బిజెపి భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
డాక్టర్.సిరంగి సంతోష్ కుమార్
హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భాగం పడడంతో పాటు సమయం వృధా అవుతుందని అన్నారు వాటిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం తేవడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.తరచూ ఎన్నికలు రావడం వలన ఎన్నికల కోడ్ ఉండడంతో ఆయా రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది గతంలో జమిలి ఎన్నికలు అనేవి 1952 నుంచే ఎన్నికలు జరిగినవి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలను మార్చి రాష్ట్రపతి పాలన పెట్టడం తద్వారా దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంతి లాల్,బిజెపి నాయకులు మార్త రాజభద్రయ్య,చందుపట్ల రాజేందర్ రెడ్డి,బెజ్జంకి పూర్ణ చారి,కుక్కల విజయకుమార్, మార్త బిక్షపతి,సంగా పురుషోత్తం,దంచనాల సత్యనారాయణ,మారేడుగొండ భాస్కరాచారి,ఆకుల రాంబాబు,బూత్ అధ్యక్షులు మరాఠి నరసింగరావు,ముత్యాల దేవేందర్,సంఘ నరేష్, ఉడుత చిరంజీవి,బీరం రాజిరెడ్డి,గాజుల రంజిత్ బిజెపి కార్యకర్తలు  పాల్గొన్నారు.

రాష్ట్రములో విద్యాశాఖ మంత్రినీ నియమించాలి.

రాష్ట్రములో విద్యాశాఖ మంత్రినీ నియమించాలి

ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్

నేటిధాత్రి : హన్మకొండ

తెలంగాణ రాష్టంలో విద్యార్థి నిరుద్యోగ యువత మద్దతుతో గెలిచినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రనీకి విద్యాశాఖ మంత్రినీ కేటాయించకపోవడం చాలా బాధాకరం అని మంద నరేష్ అన్నారు విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి రాష్ట్రములో ఒక్క విద్యాశాఖ మంత్రి నీ కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయ్యింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రములో ప్రతిపక్షములో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వస్తే విద్యార్థి నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తాము అని హామీ ఇవ్వడంతో విద్యార్థి నిరుద్యోగ యువత మొత్తం కాంగ్రెస్ పార్టీనీ నమ్మి ఓట్లు వేయడంతో తెలంగాణా రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులకు న్యాయం చేయడంలో విఫలం అయ్యిందని మంద నరేష్ అన్నారు ఇప్పటి వరకు రాష్ట్రములో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయ్యిందని అన్నారు విద్యారంగానికి తీవ్రంగా అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకె దక్కుతుందని అన్నారు.

బండి సంజయ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలి.!

కేసీఆర్ కు బండి సంజయ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలి

బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ చెన్నూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్‌ రాజా రమేష్‌, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో బండి సంజయ్ మీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించడంలో ధైర్యం చేయని బండి సంజయ్ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటం అవివేకమని అన్నారు. కేంద్రంలో మంత్రి పదవి చేపట్టిన ఆయన రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధికి సహకరించాల్సిందిపోయి.. అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి నోరు జారితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు జాడి శ్రీనివాస్,రామిడి కుమార్,గడ్డం రాజు,టైలర్ రాజు, జక్కనబోయిన కుమార్, స్వరూప మాజి కౌన్సిలర్ల పోగుల మల్లయ్య,రేవేల్లి ఓదెలు, జిలకర మహేష్,పారుపెల్లి తిరుపతి,యువ నాయకులు ఆర్నే సతీష్,కొండ కుమార్, లక్ష్మీ కాంత్, ఆశనవేణి సత్యనారాయణ,చంద్రకిరన్, సాయి కృష్ణ,దినేష్,క్రాంతి, నస్పూరి శివ,గోనే రాజేందర్, బుధగడ్డ రమేష్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

భగత్ సింగ్ పోరాటం స్ఫూర్తి దాయకం…

*భగత్ సింగ్ పోరాటం స్ఫూర్తి దాయకం…

*సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పి.వెంకటరత్నం..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 24:

 

బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధనకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల రాజీలేని పోరాటం యువతకు స్ఫూర్తి దాయకమని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి.వెంకటరత్నం అన్నారు. సోమవారం తిరుపతి నారాయణపురం లోని ఐఎఫ్టియు కార్యాలయంలో భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా పి.వెంకటరత్నం మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ స్థాపించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ దేవ్ పోరాటాలు చేశారన్నారు. స్వాతంత్ర సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వ మారణకాండను వ్యతిరేకిస్తూ వారు చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయక మన్నారు. స్వాతంత్రం ద్వారా దేశంలో రాజకీయ అధికార మార్పిడి జరిగిందే తప్ప భగత్ సింగ్ ఆశయం మేరకు దోపిడీ లేని సమాజం అవతరించలేదన్నారు. నేటి మతోన్మాద దుశ్చర్యల పాలన అంతమయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. పిడిఎస్యు జిల్లా కార్యదర్శి హెచ్. లోకేష్ మాట్లాడుతూ నేటి యువతరం 23 ఏళ్లకే పక్కసారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను నిర్వీర్యం చేయడం వెనుక రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించారు. భగత్ సింగ్ మీరోచిత జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. భగత్ సింగ్ ఏ లక్ష్యంతో అయితే స్వాతంత్ర పోరాటం చేశారో ఆ స్వాతంత్రం నేటికీ అందలేదన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల ఆశయ సాధన కోసం పిడిఎస్యు రాజీలేని పోరాటాలను చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర కన్వీనర్ పి.లోకేశ్వర్,
పి ఓ డబ్ల్యు జిల్లా కన్వీనర్ ఎం.అరుణ, ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షురాలు ఆర్.సుజాత అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ అనిల్ కుమార్ అనారోగ్యరీత్యా కన్నుమూశారు..

సిరిసిల్ల పట్టణ ప్రజా వైద్యశాల డాక్టర్ అనిల్ కుమార్ అనారోగ్యరీత్యా కన్నుమూశారు

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ (ప్రజా వైద్యశాల) ఈరోజు మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన సుదీర్గ కాలంగా సిరిసిల్ల ప్రజానీకానికి (ప్రజా వైద్యశాల నెలకొలిపి) వైద్య సేవలు అందించారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట మార్చ్ 24(నేటిదాత్రి).

 

గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అని మాట్లాడి హిందూ మతాన్ని అగౌరవ పరిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈరోజు ఒక మతాన్ని గౌరవిస్తూ మరో మతాన్ని వ్యతిరేకించడం చాలా విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని విమర్శించారు.

ఒక మతం కి చెందిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వాళ్లని మాత్రమే ఓటర్లుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మిగతా మతాలను కులాలను పట్టించుకోకుండా వారికోసం విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని విందులు ఇవ్వడం వల్ల వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మిగతా మతాల వారిని మిగతా కులాల వారిని నియోజకవర్గ ప్రజలుగా వారి ఓటర్లుగా భావించడం లేదని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారిని విమర్శించారు.

నియోజకవర్గంలో ఎన్నో కులాలు మతాలు ఉన్న వారందరినీ కలుపుకొని పోకుండా కేవలం ఒక వర్గాన్ని వారి ఓటర్లుగా సృష్టించుకోవడం విడ్డూరంగా ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.

గ్రామాల్లో కులాల వారిగా వారి వారి కులదేవతలను మొక్కుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటున్న వారి కోసం విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు కానీ ఒక వర్గం కోసం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విందులు ఏర్పాటు విందులు ఇవ్వడం వారి ఓటు బ్యాంకు రాజకీయానికి నిదర్శనం అని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

ఇప్పటికైనా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి వారికి చేస్తున్న అన్యాయాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వారికి విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

పార్టీపై అలక.. వ్యక్తిగత కారణమా?

జడ్చర్ల : పార్టీపై అలక.. వ్యక్తిగత కారణమా?

 

జడ్చర్ల /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ పట్టణంలో ఆదివారం డీసీసీ కార్యాలయంలో జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డా.చల్లా వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య మినహా .. మిడ్జిల్, జడ్చర్ల, బాలానగర్, ఉర్కొండ, జడ్చర్ల, నవాబుపేట మండలాల అధ్యక్షులు హాజరు కాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కావడం వ్యక్తిగత కారణమా.. పార్టీపై అలక? అని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం

 

నేటిధాత్రి:హన్మకొండ

 

పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ సంస్థగత సిద్ధిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్

భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో
గత బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా 30 పడకల హాస్పటల్ గురించి అనేక సార్లు ఉద్యమాలు నిరాహార దీక్షలు చేపట్టి కరోనా సమయం లో మండలం లో అంబులెన్సు లేకపోతే పోరాడి ఆ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి అంబులెన్సు తెచ్చింది బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అని మరిచిపోవద్దు అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 15 నెలలు అవుతున్నా భీమదేవరపల్లి మండల ప్రజల కోసం కనీసం 30 పడకల హాస్పటల్ ను కేటాయించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలం లో హన్మకొండ సిద్ధిపేట హైవే రోడ్డు పై మండల ప్రజలకు హాస్పటల్ కావాలని ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. అయినా ఇప్పటి వరకు కూడా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం లేదు. మండల పేద బడుగు బలహీన వర్గాలు దాదాపు 50 వేల జనాభా ఉన్నా మండలానికి ఒక ఎండి డాక్టర్ కానీ. ఒక గైనాకలాజిస్ట్ కానీ ఎమర్జెన్సీ డాక్టర్ లేకుండా మండల ప్రజలు అల్లాడిపోతున్నారు

బిఆర్ఎస్ నాయకుల అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం.

బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండలంలోని గొట్లకొండ గ్రామానికి చెందిన యువ అడ్వకేట్ మాలోతు వెంకన్న జాదవ్ ను బి ఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, మాజీ వైస్ ఎంపీపీ సారంగం, వాగ్య నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను మాలోతు వెంకన్న జాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుంటుక సోమయ్య మాట్లాడుతూ గిరిజన బిడ్డగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఎగ్జామ్స్ లో వెంకన్న ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పసునూటి లక్ష్మీనారాయణ, రెడ్యానాయక్, శ్రీను, లింగం నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ఓదేలు మృతదేహానికి నివాళులర్పించిన రంజిత్ రెడ్డి.

ఓదేలు మృతదేహానికి నివాళులర్పించిన రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు గాండ్ల ఓదెలు గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతిచెందగా విషయం తెలుసుకున్న నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ఓదేలు మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల ప్రసాద్, గుండ్రపల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ మండల నాయకులు రావుల మైపాల్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, కనపర్తి రమేష్, ఇటికల సంజీవయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరుబాట.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పోరుబాట:

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి:

సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:

నేర్మట గ్రామపంచాయతీ, బస్టాండ్ ముందుమురికి కాలువ సరిగ్గా లేకపోవడంతో మురికి కాల్వ యందు ఈగలు, దోమలు ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారంచండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతకాలంగా గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామాలలో పలు వార్డులలో గతంలో సిసి రోడ్లు వేసినారు గాని ఆ రోడ్లు వర్షం వస్తే గుంతల మయంగా మారుతుందని, మురికి కాల్వల నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలైన పుల్లెంల, గొల్లగూడెం, బంగారిగడ్డ, లెంకలపల్లి, శేరి గూడెం, ఈ గ్రామాలకు లింకు రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అధికారులు గ్రామాలలో ఇప్పటికప్పుడు సమాచారం తీసుకోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, బల్లెం వెంకన్న,ఈరగట్ల నరసింహ, బొమ్మరగోని యాదయ్య, దాసరి రాములు, నారపాక నరసింహ, శంకర్, గ్రామ ప్రజలు బొమ్మరగోని నాగరాజు,సతీష్,బుర్కల నవీన్, బొడిగె నగేష్, బుర్కల సైదులు, రావుల రవి, పగిళ్ల స్వామి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.

ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంధర్బంగా శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ మతాలకతీతంగా ఇఫ్తార్ విందులో పాల్గొనడం సోదరాభావాన్ని పెంచి లౌకిక విలువలను కాపాడుతాయని, ముస్లిం సోదరులు నెలరోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో అల్లాను ప్రార్థిస్తారని, అల్లా దయతో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.

అనంతరం ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాసన్ని విరమింప చేశారు.

Iftar dinner

ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప, రామకృష్ణ రెడ్డి ,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంట రెడ్డి,మాజి మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు, తాంజిమ్,మాజి పట్టణ అధ్యక్షులు మోహి ఉద్దీన్,డి ఆర్ యు సిసి మెంబర్ షేక్ ఫరీద్ , మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , పాక్స్ చైర్మన్ మచెందర్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,న్యాల్కల్ మాజి మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,మాజి ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్,బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు…

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు…

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏ జోన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు.

Iftar dinner

సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింల‌కు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. మసీద్ లభివృద్ధిపై మత పెద్దలు అందించిన వినతి పత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు.

మసీదుల అభివృద్ధికి, ఆలయాల నిర్మాణాల స్థలాల కొరకు సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూస్తానని మత పెద్దలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డాక్టర్ సలీం, లాడెన్, పట్టణంలోనీ ముస్లిం మత పెద్దలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్ట్…

బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్ట్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉన్న నేపథ్యంలో బిఆర్ఎస్వీ నాయకులను రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని, ఎన్నికల్లో గెలుపు కోసం నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఉద్దేశంతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ముందస్తు అరెస్టు చేయడం మంచిది కాదని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు శ్రవణ్, గోనె రాజేందర్, గాజుల చంద్ర కిరణ్, దేవి సాయికృష్ణ, కుర్మ దినేష్, కంది క్రాంతి తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్..!

బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్ అర్ధరాత్రి విద్యార్థులపై నిర్భందఖాండ అమలు చేస్తున్నదని శనివారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. జహీరాబాద్ లో అసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్వీ నాయకులు రాకేష్, ఓంకార్ లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండల కేంద్రంలో శనివారం బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్ ని నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి సమాచారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రతిపక్షాల నాయకుల మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఈ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version