కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బిజెపిలో చేరికలు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బిజెపిలో చేరికలు.

#రాబోయే స్థానిక ఎన్నికల్లో యువతకే పెద్దపీట.

#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకే మొదటి ప్రాధాన్యత దక్కుతుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు సోమవారం మండలంలోని రంగాపురం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ముల్క రాజేష్ తో పాటు 50 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం గ్రామ కూడలిలో జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ. ఈరోజు పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి పల్లెకు నేరుగా నిధులను విడుదల చేసి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా పథకాలను రూపొందించి గ్రామాలు దృశ్యశ్యామలంగా ఈరోజు ఇలా ఉన్నాయంటే దానికి కారణం మోడీ ప్రభుత్వం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం, రైతులకు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు పెట్టుబడి సహాయం, ప్రతి గ్రామాలలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డులు, సిసి రోడ్లు, వీధిలైట్ల ఏర్పాటు, పి ఎం జి ఎస్ వై,, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా తారు రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇలాంటి మరెన్నో అభివృద్ధి పనులకు మోడీ ప్రభుత్వం నిధులను సమకూర్చుతున్నది. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం లో ఎక్కువ స్థానాల్లో యువకులకే అవకాశం కల్పించి ప్రజా ప్రతినిధులను చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు ,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి ,జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి ,సీనియర్ నాయకులు వల్లె పర్వతాలు ,మండల ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version