బోరు మంజూరు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి కృతజ్ఞతలు..

బోరు మంజూరు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి కృతజ్ఞతలు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో అడగగానే బోర్ మంజూరు చేపిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో శాలివాహన సంఘం నాయకులు, తిర్మలాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు, రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి విన్నవించుకోగానే నిధులు మంజూరు చేశారని, నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యం కృషి చేస్తున్నారని, కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని,బీజేపీ తోనే కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, సీనియర్ నాయకులు తడగొండ అశోక్, బూత్ కమిటీ అధ్యక్షులు పెంచాల నరేష్, పాదం సాగర్, పాదం రవి, శాలివాహన సంఘం నాయకులు పాల్గొన్నారు.

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న.!

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

సిరిసిల్లబిజెపి బిజెపి కార్యకర్తల్లో జోష్

సిరిసిల్ల టౌన్:( నేటిదాత్రి )

సిరిసిల్ల కి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ * తేదీ:16-03-2025 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా * విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నేడు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాంప్రసాద్, పార్లమెంటు కో- కన్వీనర్ శ్రీ ఆడెపు రవీందర్, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, మరియు రాజాసింగ్ మరియు సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, మరియు సిరిసిల్ల ఓ బి సి టౌన్ అధ్యక్షుడు శ్రీ అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు మరియు సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ వైశాలి మరియు బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version