భువన్ రిభుకు వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్ అవార్డు.
రామాయంపేట నేటి ధాత్రి:
ప్రపంచ న్యాయ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు భువన్ రిభు.
వరల్డ్ లా కాంగ్రెస్ లో వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్ అవార్డును మన భారత సుప్రీంకోర్టు న్యాయవాది భువన్ రిభు అందుకోవటము మన దేశానికి ఒక గొప్ప ప్రతిభ గా చెప్పుకోవాలి, ఈ విజయం 262 జాతీయ స్వచ్ఛంద సంస్థలు తరపున, బాలల హక్కుల కన్వీనర్ భువన్ రిభు అందుకున్నారు.
Association
భువన్ రిభు దేశంలోని బాలల హక్కుల కోసం 416 జిల్లాల్లో పనిచేస్తున్న 262 ఎన్జీవోలను ఒకే గొడుగు కింద తీసుకువచ్చి, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా భువన్ రీభుకు బుధవారం విజన్ సంస్థ డైరెక్టర్ వంగరీ కైలాస్, జిల్లా కోఆర్డినేటర్ రాజు, సిబ్బంది ప్రత్యేక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు.
ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనిషి జీవితంలో నీరు ఒక భాగం. నీరు లేకపోతే జీవ రాశుల మనుగడ కష్టం. ఆహారం లేకున్నా కొన్ని రోజుల పాటు జీవించగలం కానీ నీరు లేకపోతే ఒక్క రోజూ జీవించలేం. అటువంటి అత్యవసరమైన నీరు దొరకక ఐదు ఆరు రోజుల నుండి ఓ జహీరాబాద్ లోని ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు అల్లాడుతోంది. 12వ వార్డు వీధిలో ఒకే ఒక బోరు ఉంది ఆ బోరు గ్యాప్ ఇవ్వడం వల్ల బ్యాంకులో నీరు ఎక్కడం లేదు అయితే మంజీరా నీరు ఎనిమిది రోజుల నుండి రావడం లేదు ఆర్ డబ్ల్యు ఎస్ మరియు ఎం సి జెడ్ అధికారులు చూసి చూడలేనట్టు వ్యవహరిస్తున్నారు తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఆందోళన చేశారు.మంచినీటి సమస్యతో అల్లాడుతున్నామని మహిళలు తెలిపారు. కనీసం తాగడానికి మంచి నీరు లేక నోరుఎండిపోతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారన్నారు. ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగిన తప్ప ఇప్పటివరకు మంచినీరు మా ప్రాంతానికి ఇవ్వలేదని మండుతున్న ఎండల్లో పిల్లా పాపలతో అల్లాడిపోతున్నామన్నారు. తక్షణం జిల్లా కలెక్టర్ స్పందించి మాకు మంచి నీటి సౌకర్యం కల్పించి మా దాహార్తిని తీర్చాలని మహిళలు ఆందోళన చేపట్టారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కలెక్టరేట్ ని కలిసి తమ సమస్యలను చెప్తామని మహిళలు హెచ్చరించారు పై అధికారులు వెంటనే స్పందించి ప్రజలను నీటి సౌకర్యం కల్పించాలని కోరుచున్నారు.
Natural Star Nani’s HIT: The 3rd Case, directed by Sailesh Kolanu, has emerged as a clear box office winner, achieving break-even status across all territories within just six days of its release.
In an industry climate where many films are struggling to find footing, this achievement stands out as a major success.
The film has already crossed the coveted 100 crore milestone globally and also surpassed the $2 million mark in North America.
With momentum on its side, HIT: The 3rd Case is well on track to become one of the highest-grossing Telugu films of 2025.
Nani’s HIT 3
Its success further reinforces Nani’s reputation as one of Telugu cinema’s most bankable stars. Known for his script sense and consistent box office pull, Nani continues to deliver crowd-pleasing content that resonates across demographics.
In today’s challenging market, where theatrical footfall is unpredictable and only a few films are managing to turn a profit, HIT: The 3rd Case reaching profitability within a week is a rare and commendable accomplishment.
వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకునే వరకు నిరసన కొనసాగుతుంది.
◆ జహీరాబాద్లో మహిళా మహాసభ – మౌలానా గియాస్ రషాది ప్రకటన
జహీరాబాద్ నేటి ధాత్రి:
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అన్ని ఆలోచనా విధానాలు, లౌకిక సమాజం మరియు దళిత సోదరులు ముస్లిం పర్సనల్ లా బోర్డుతో ఉన్నారు మరియు ఈ నల్ల చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదు. ఘోరీ ఫంక్షన్ హాల్లో జరిగిన మహిళల కోసం జరిగిన సాధారణ సమావేశానికి హాజరైన పెద్ద సంఖ్యలో మహిళలను ఉద్దేశించి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు మౌలానా గియాస్ అహ్మద్ రషాది ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంతకుముందు, ప్రత్యేక అతిథి న్యాయవాది జలీసా డాక్టర్ నసీరా ఖానుమ్, డాక్టర్ ఖదీరా కూడా వక్ఫ్ సవరణ చట్టం వక్ఫ్కు ముప్పు అని, దానిలోని వివిధ సవరణలు వక్ఫ్ రక్షణకు చాలా హానికరమని, మహిళలు ఈ బిల్లులో పాల్గొనాలని, దానికి వ్యతిరేకంగా ఉండాలని అభ్యర్థించారు. ఉమ్-ఉర్-రెహ్మాన్ సమావేశం యొక్క ఉద్దేశ్యాన్ని వివరించారు. బుష్రా అఫ్రోజ్ మాట్లాడుతూ, ఇస్లామిక్ దానధర్మాల చరిత్రను వివరించగా, మరియం జమీలా దానధర్మాల షరియా స్థితిపై మాట్లాడారుఖా. ఫరానుమ్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మీ, మౌలానా అతిక్ అహ్మద్ ఖాస్మీ ముఫ్తీ నజీర్ అహ్మద్ హస్సామీ, ముఫ్తీ ఒబైద్ ఉర్ రెహ్మాన్ ఖాస్మీ, నజీముద్దీన్ ఘోరి, అమీర్ మామి, మహమ్మద్ మజీద్ మహమ్మద్ వసీం, హఫీజ్ అక్బర్ సమావేశాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ యూసుఫ్, మహ్మద్ ఫరూఖ్ అలీ, ఎంబీజీ అధ్యక్షుడు ముహమ్మద్ అయూబ్, ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ మోతాజుద్దీన్ మహమ్మద్, ఖ్వాజా నిజాముద్దీన్ మహమ్మద్ నసీరుద్దీన్, ఖాజీ సయ్యద్ మోయిజ్, మౌలానా అబ్దుల్ మతీన్, మౌలానా నా ఈసా మహమ్మద్ జమీర్ మెహబూబ్ గోరీ, గోరీక్ గోరీ, గోరేబ్ తదితరులు పాల్గొన్నారు.
ఎనుమాముల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ఏనుమాముల, నేటిధాత్రి
https://youtu.be/GCpLX43wfVs?si=qoAdJYysMaLnnAWn
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మంగళవారం మామూనూర్ డివిజన్ పరిధిలోని ఏనుమాముల పోలీస్ స్టేషన్ను సందర్శించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఎనుమాముల పోలీస్ స్టేషన్ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను సిపి సంబంధిత స్టేషన్ ఇన్స్స్పెక్టర్ రాఘవేందర్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి.
Commissioner
స్టేషన్ పరిధిలో ఎన్నిసెక్టార్లు వున్నాయి, సెక్టార్వారిగా ఎస్.ఐలు నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత సెక్టార్ ఎస్.ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్వారిగా బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులకు పలుసూచనలు చేస్తూ ప్రతి స్టేషన్ అధికారి తప్పనిసరిగా రౌడీ షీటర్ ఇండ్లను సందర్శించి వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా ఆరా తీయాలని, ఆర్థిక సైబర్ నేరాలకు సంబంధించి కేవలం కేసు నమోదు చేయడమే తమ బాధ్యతనే కాకుండా సైబర్ నేరాలకు సంబంధించి నేరానికి పాల్పడిన నేరస్థుల మూలాల కూడా దర్యాప్తు అధికారులు కనిపెట్టి నిందితులను అరెస్టు చేయాలని.
Commissioner
ట్రైసిటి పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి క్రయ విక్రయాలపై స్టేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని. నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ అవసరమని, ఇందుకొసం నగరంలో నిరంతం పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించాలని పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులకు సూచించారు.
పోలీస్ కమిషనర్ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసిపి తిరుపతి ఇన్స్స్పెక్టర్ రాఘవేందర్, స్టేషన్ ఎస్.ఐ రాజు, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.
ప్రజా పాలన ప్రగతి బాట సందర్భంగా వనపర్తి జిల్లా మున్ననూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ భూబారతి సదస్సులో జిల్లా ఆదర్శ్ సురబి అధికారులు పాల్గొన్నారు
అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ
జైపూర్ నేటి ధాత్రి:
జైపూర్ మండలం లోని కాన్కుర్ శివారులో నీలగిరి ప్లాంటేషన్లలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు మంగళవారం మజ్జిగ ను పంపిణీ చేశారు.తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ )దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఇక్కడి నీలగిరి ప్లాంటేషన్ లలో మట్టి తేమ సంరక్షణ పనులు చేస్తున్న కూలీలకు సామజిక సేవ కింద ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం లో తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,గ్రామ కార్యదర్శి ఉపేందర్,ఫీల్డ్ సూపర్ వైసర్ లు రాజేష్,శ్రీనివాస్,వాచర్ లు శంకర్,సాయికిరణ్,ఓదెలు, రాకేష్,సిబ్బంది షాహిద్, సంజీవ్ లు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి
తొర్రూరు( డివిజన్ )నేటి ధాత్రి
బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమానుల తిరుపతిరెడ్డి అన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పైండ్ల సోమయ్య, పైండ్ల మహేందర్ ల పైండ్ల కేశమల్లు అనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం బాధిత కుటుంబాన్ని సందర్శించి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డిల సహకారంతో బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామన్నారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బాధిత కుటుంబాలకు సకాలంలో అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రమర్శించిన వారిలో కాంగ్రెస్ నాయకులు పెదగాని సోమయ్య, అనుమాండ్ల నరేందర్ రెడ్డి,చెవిటి సధాకర్,కొమురయ్య,బిజ్జాల వరప్రసాద్, నాగిరెడ్డి,రవీందర్ రెడ్డి,మహేందర్ రెడ్డి, మహబూబ్ రెడ్డి, వెంకన్న యాదవ్,వాసు రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మహేందర్, శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి,దర్గయ్య,యాకన్న, చిట్టి మల్ల మహేష్, బుచ్చిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ధర్మారపు నాగయ్య,రామ్ రెడ్డి, సుధాకర్,వెంకన్న, నరసింహ యాకుబ్ రెడ్డి,ఎద్దు మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజ ద్రోహం కేసుపెట్టాలి..
ప్రజలు,ఉద్యోగుల మధ్య విబేధాలు సృష్టిస్తూ సీఎం సలహాలు
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
నర్సంపేట,నేటిధాత్రి:
చెప్పుల దొంగల్లాగా ఢిల్లీలో తనను బ్యాంకర్లు చూస్తున్నారని ఒక ముఖ్యమంత్రి స్వయంగా అభివర్ణించుకోవడం దురదృష్టకరం దేశం ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల పరువుతీస్తున్నారని తెలంగాణ ఉద్యమనేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.ఒక ముఖ్యమంత్రి దేశ రాజదాని డిల్లీలో చెప్పుల దొంగగా కనబడితే స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.గత కెసిఆర్ ప్రభుత్వం, ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే అప్పులు చేయడం జరిగిందని, దేశంలో తెలంగాణ కన్న 28 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేశాయి. మిగతా రాష్ట్రాలలో ఈ పరిస్థితి లేనప్పుడు తెలంగాణకే ఈ స్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే అని పేర్కొన్నారు.ఎన్నికల ముందు అధికారం కోసం అడ్డగోలు 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. తను తెలంగాణలో లేనట్టుగా తనకేమి తెలియనట్టుగా కొత్తగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది. దివాలా చేసింది. ఆనా పైసా రావడం లేదు. అని చెప్పడం అనేది ఇచ్చిన హామీల నుండి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.సోమవారం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు విన్నాక ఈ రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకచ్చి పనులుచేయలేని పరిస్థితి ఉంది.ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కీలకమైన పథకాల అమలు కూడా కష్టసాధ్యమే అనిపిస్తుందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఇతర దేశాలు,రాష్ట్రాల నుండి తెలంగాణలో కంపెనీలలో పెట్టబడులు పెట్టకుండా ఉద్యోగాల కల్పన జరగకుండా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సూచిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఎక్కడ నిలదీస్తారో,ఎదురు తిరుగుతారో అనే భయంతో పరిపాలన చేతకాదు. హామీలు అమలు చేయలేము అని మూడున్నర సంవత్సరాల ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.ఇందిరమ్మ ఇండ్లు ,యువ వికాసం, మహాలక్ష్మి, రైతు భరోసా,రుణమాఫీ,కళ్యాణ లక్ష్మి తులం బంగారం,పెన్షన్ల పెంపు లాంటి పథకాల అమలుపైన ప్రజలు ఇప్పటికే నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. దేశంలోనే అత్యధిక జీడీపీని కలిగి దేశానికి అత్యధికంగా జీఎస్టీ చెల్లించే స్థాయికి ఎదిగిన తెలంగాణను నేడు అప్పులు పుట్టని రాష్ట్రంగా మారిందని చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి,మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని వీరిపైన రాజద్రోహం కేసుపెట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ సేవలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టారని,మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలను అమలుపట్ల అడగడం నేరమా అని ప్రశ్నిస్తూ ఉద్యోగుల కోసం సంక్షేమ పథకాలు ఆపమంటారా అని చెప్పడం ప్రజలకు ఉద్యోగులకు మధ్య విభేదాలు సృష్టించడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని అవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమైందని వారి హక్కుల సాధనకు ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ వెంట ఉంటుందని వెంటనే ఉద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట పరధిలోని ఐనవోలు మండలములో రైతుల సౌకర్యార్ధము మార్కెట్ సబ్ యార్డు ఏర్పాటు కొరకు 6 ఏకరముల ప్రభుత్వ భూమి కేటాయించగలరని ఈ రోజు వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీ నరుకుడు వెంకటయ్య హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య ని కలిసి కోరడం జరిగినది. గతములో ఐనవోలు తహసీల్దార్ గారు 5 ఏకరముల భూమిని గుర్తించడం జరిగినది. కానీ అట్టి భూమి మార్కెట్ సబ్ యార్డుకు కేటాయించబడలేదు. అందుకు గాను ఐనవోల్ గ్రామపంచాయతీ పాలక వర్గం వారు గ్రామ రెవిన్యూ పరిదిలో ఆరు ఏకరముల ప్రభుత్వ భూమినీ గుర్తించి తీర్మానం చేసి అప్పటి కలెక్టర్ కి కూడా దరఖాస్తులు కూడా చేయడం జరిగింది అయితే వర్ధన్నపేట ఎంఎల్ఏ కేఆర్ నాగరాజు కూడా స్థల పరిశిలిన చేసి హన్మకొండ కలెక్టర్ గారికి ఎంఎల్ఏ నాగరాజు ల్యాండ్ ఉంది సంక్షన్ ఇవ్వండి అని రేక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది.కేటాయిస్తే సబ్ యార్డు నిర్మాణం, అందులో గోదాము మరియు కవర్ షెడ్డు నిర్మాణాలు చేపట్టవచ్చునని మరియు ఇట్టి యార్డు ఏర్పాటు చేస్తే ఐనవోలు మండల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది అని కలెక్టర్ గారిని ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య కోరడము జరిగినది.కలెక్టర్ గారిని కలిసిన వారిలో బ్లాక్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి,వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్.లు పాల్గొన్నారు.
అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీధి సౌర కాంతి సామాగ్రి పంపిణీ
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం లోని కాన్కుర్ గ్రామంలో తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో మంగళవారం వీధి సౌర కాంతి సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది.అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కార్పొరేట్ సామాజిక భాద్యత (సి. ఎస్. ఆర్ ) కింద ముప్పై ఆరు వేల విలువ చేసే వీధి సౌర కాంతి సామాగ్రి ని డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపేందర్ కు అందజేశారు.ఈ సందర్బంగా శ్రీశ్రావణి మాట్లాడుతూ జైపూర్ మండలంలోని కాన్కుర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో నీలగిరి ప్లాంటేషన్ లను పెంచుతూ పర్యావరణ పరిరక్షణ తో పాటు స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. గ్రామాలకు తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశ్యం తో సి. ఎస్. ఆర్ కింద టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం లో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, ఫీల్డ్ సూపర్ వైసర్ లు రాజేష్, శ్రీనివాస్,వాచర్ లు శంకర్,సాయికిరణ్,ఓదెలు, రాకేష్,సిబ్బంది షాహిద్, సంజీవ్ లు పాల్గొన్నారు.
పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.
ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.
మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి లో ఇదే తంతు.
అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.
దర్జాగా వసూళ్ల సాక్షాలు అయిన టీఎస్ఎండిసి నిశ్శబ్దం, అమ్ముడుపోయిందని ప్రజలకు అర్థం.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, టీజీఎండిసి శాఖ కాసులకు కక్కుర్తి పడడం, కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు చేసుకొని అక్రమ వసూళ్లకు సహకరించడం యదేచ్చగా కండ్ల ముందు అక్రమ వసూళ్ల దందాను టీజీఎండిసి సిబ్బంది తోపాటు కాంట్రాక్టర్ సిబ్బంది వసూళ్ల పరంపరను కొనసాగిస్తున్నప్పటికీ టీజీఎండిసి ఉన్నత అధికారులు మరోవైపు ప్రభుత్వం అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం తో మండలంలోని ఇసుక రీచులు అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రెచ్చిపోయి కొనసాగించడం జరుగుతుంది. మరోవైపు పక్క జిల్లాలకు సంబంధించిన ఇసుక రీచుల కాంట్రాక్టర్లు హద్దులు దాటి గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాన్ని చేసి ఇసుకను రవాణా కొనసాగిస్తుంటే ప్రభుత్వం టీజీఎండిసి అధికారులు చర్యలకు ససేమీరా అనడం తో కాంట్రాక్టర్లు ఇసుక రీచుల్లో అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్రమాలపై టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఇసుక రిచుల్లో అక్రమాల వ్యవహారం అదునపు వసూళ్లు తీసుకుంటున్న టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ సూపర్వైజర్ లా ఫోటోలు వీడియోల సాక్షాలు వచ్చినా కూడా ఇప్పటివరకు ఒక్క క్వారీపై కూడా చర్యలు తీసుకోలేదంటే టీజీఎండిసి కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయారని స్పష్టంగా కనబడుతుంది.
పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.
సోమవారం రోజు పలుగుల తొమ్మిది ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ సిబ్బంది లారీ డ్రైవర్ నుండి 1100 రూపాయలు సీరియల్ పేరుతో వసూలుచేస్తూ. తరువాత లోడింగ్ కొరకు సీరియల్ నంబర్ చిట్టిని అందించాడు. ఈ క్వారీలో గత నెల రోజులు నుండి పెద్ద మొత్తంలో అన్ని క్వారీల కంటే ఎక్కువగా వసూళ్ల పరంపర కొనసాగుతుందని, దానికి సంబంధించిన సాక్షాలు గత నెలలో 1200 తీసుకున్న పలుకుల 9 ప్రస్తుతం 1100 వందలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ వద్ద 200. వందల రూపాయలు గత నెలలో 1400 వసూలు చేయడం జరిగింది. ప్రస్తుతం 1300 పాసింగ్ పై అదనపు ఇసుకను తీసుకోవడం జరుగుతుంది. పలుగుల తొమ్మిది గత నెల ప్రతిరోజు 119 నుండి 148 వరకు లారీల్లో ఇసుక నింపి రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ మార్చ్ నెలలో నాలుగవ తేదీన ప్రారంభమై మొదట్లో ఆవరేజ్ 60 నుండి మొదలుకొని నేటి వరకు ప్రతిరోజు 100కు పైచిలుకు లారీల ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మూడు నెలల్లో సుమారు ఈ క్వారీ 60 రోజుల్లో 6000 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది. లారీకి 14 నుండి 1100 అక్రమ వసూళ్ల విషయానికొస్తే 65 నుండి 85 లక్షల రూపాల అక్రమ వసూళ్లను సొమ్ము చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు తెరలేపిన పలుగుల తొమ్మిది పై, టి జి ఎం డి సి కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, మరి కొన్ని రోజుల్లో అక్రమ వసూళ్లతో తమ క్వాంటిటీని సమాప్తం చేసుకునే వరకు టీజీఎండిసి అధికారులు చూస్తూనే ఉంటారు.
TSMDC
ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.
మండలంలో ఇసుక క్వారీల అక్రమాల వ్యవహారం, సాక్షాలు వసూళ్ల పర్వం, నిబంధనలు దాటి తవ్వకాలు, యదేచ్ఛగా కొనసాగుతుంటే టి జి ఎం డి సి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, టీజీఎండిసి అధికారుల పుణ్యం కాంట్రాక్టర్లు రెచ్చిపోయి, తమకు అడ్డు ఎవరు అని అక్రమ వసూళ్ల వ్యవహారాలను తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మండలంలో నిర్వహించబడే ఇసుక రిచుల్లో పలుగుల తొమ్మిది మహదేవపూర్, పుసుక్ పల్లి 1, పలుగుల 8, ఈ రిచుల్లో పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్ల వ్యవహారాలను దర్జాగా కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క జిల్లా ఇసుక క్వారీలు కూడా గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాలు చేసి, కుంట్లం గోదావరి వద్ద అక్రమ తవ్వకాలు జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడుతు యదేచ్చగా అక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. కొత్తగా ఇసుక పాలసీ అమలులో ఉన్న క్రమంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం టీజీఎండిసి పై చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిశ్శబ్దాన్ని పాటించడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది.
TSMDC
మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి, లో ఇదే తంతు.
మహదేపూర్ పుసుపుపల్లి1, పేరుతో నిర్వహించబడే ఇసుక క్వారీ లోను కూడా అక్రమ వసూళ్లకు హద్దు లేకుండా పోయింది. ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది 900 రూపాయలు, సీరియల్ పేరుతో వసూలు చేయడం, లోడింగ్ వద్ద 200, కాంటా వద్ద అదనపు ఇసుకకు 300 నుండి 500, యథేచ్ఛగా కొనసాగడం జరుగుతుంది. ఈ ఇసుక క్వారీ మార్చ్ నెల ఆరవ తేదీన ,ప్రారంభించడం జరిగింది, కానీ కొద్ది రోజులు నామమాత్రంగా లారీలో ఇసుక నింపిన ఈ క్వారీ ఏప్రిల్ నెలలో, అక్రమ వసూళ్ల పరంపరను ప్రారంభించడంతో 60 నుండి మొదలుకొని 175 యావరేజ్ గా ప్రతిరోజు లారీల్లో ఇసుకను రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ ఇప్పటివరకు అక్రమ వసూళ్ల తో 45 లక్షల నుండి 60 లక్షల వరకు సొమ్ము చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పలుకుల 8 ఇసుక క్వారీ స్థానికులకు భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో లోడింగ్ నిలిచివేయడం జరిగింది, పలుకుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, టీజీఎండిసి అధికారుల పుణ్యమని అక్రమ వసూళ్లు పెద్ద మొత్తంలో జరుపుకొని లక్షల రూపాయల సొమ్ము చేసుకుని ఇసుక క్వాంటిటీని సమాప్తం చేసుకోవడం జరిగింది.
TSMDC
అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.
అక్రమ వసూళ్ల వ్యవహారం మండలంలోని ఇసుక క్వారీలకు ఒక వరంగా అందించింది టీజీఎండిసి, అదుపు ఇసుక రవాణా నిలిపివేయడం, నూతన ఇసుక పాలసీ విధానం అమలు చేయడం జరుగుతుంది అని చెప్పిన ప్రభుత్వం, టీజీఎండిసి అధికారులకు ఇచ్చిన” డేడ్” లైన్ అధికారులు లెక్కచేయకుండా ప్రభుత్వ డెడ్ లైన్ ను తీసిపారేశారు, గత వారం రోజుల క్రింద ఓ అధికారి” హోటల్లో మకాం వేసి, కాంట్రాక్టర్ అందరికీ తమ వద్దకు పిలుచుకొని, సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ అధికారి విధులు కూడా హోటల్లోనే పూర్తి చేసుకున్నాడు. ఇలా అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే, అక్రమ వసూళ్ల పరంపర జోరుగా కొనసాగకుంటే, కాంట్రాక్టర్లు ఎందుకు ఊరుకుంటారు. అధికారుల హోటల్లో సిట్టింగ్ పరంపర, గత కొన్ని రోజులుగానే కొనసాగుతుందని చెప్తున్నారు, అందుకే ఏమో ఇసుక క్వారీల ప్రారంభం నుండి, అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం గా కనబడుతోంది. దర్జాగా వసూళ్ల సాక్షాలు అక్రమ ఇసుక తవ్వకాలు మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడుస్తుంటే, టీజీఎండిసి అధికారులు చర్యలకు బదులు హోటల్లో” సిట్టింగ్ తో సెట్టింగ్” చేసుకోవడానికి, ప్రజలు గమనించి వాస్తవమే అక్రమాలకు చర్యలు కాదు, సిట్టింగ్లతో సక్సెస్ అయింది, ఇంకేముంది టిజీఎండిసి కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిందని అక్రమ వసూళ్ల సాక్షాలు చెబుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ టీజీఎండిసి అధికారులపై చర్యలకు ఆదేశించి, ఇసుక రీచుల్లో అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శ్రీ దుర్గామాత & ఉరడమ్మ మాతల విగ్రహాల ప్రతిష్ఠాపన,ధ్వజస్తంభం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్,
◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మండలం లోని చింతల్ ఘట్ గ్రామంలో మంగళవారం శ్రీ దుర్గామాత & ఉరడమ్మ మాతల విగ్రహాల ప్రతిష్ఠాపన,ధ్వజస్తంభం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.అనంతరం కార్యక్రమ నిర్వాహకులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంలింగా రెడ్డి,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ యం.పి.టి.సి మల్లన్న పాటిల్,అశ్విన్ పాటిల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట నూతన తహసిల్దార్ ను కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు జమ్మికుంట నేటిధాత్రి:
జమ్మికుంట మండల తహసిల్దారు గా పదవి బాధ్యతలు స్వీకరించిన చలమల్ల రాజు గారిని ఈరోజు వారి కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ కమిటీలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ మరియు మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి ఆ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ముందుండాలని యువజన కాంగ్రెస్ కమిటీలు కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో; యువజన కాంగ్రెస్ జిల్లా కమిటీ జనరల్ సెక్రెటరీ చైతన్య రమేష్, సంధ్యా నవీన్, సెక్రటరీ సజ్జు అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు నాగమణి, ప్రధాన కార్యదర్శి అజయ్, కార్యదర్శులు గొడుగు మానస, రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, మండల కమిటీ ఉపాధ్యక్షులు వినయ్, శ్యామ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కార్యదర్శులు రవి, అజయ్, 15వ వార్డు అధ్యక్షులు మైస సురేష్, యువజన నాయకులు ప్రవీణ్, జావీద్, శివ, శ్రీకాంత్, భాను, పవన్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం సీపీఎం వనపర్తి నేటిధాత్రి
. సిఐటియు వనపర్తి జిల్లా కార్యాలయంలో సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశము నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సి పి ఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ మాట్లాడారు. కార్ల్ మార్క్స్ 207వ, జయంతి సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ” కారల్ మార్క్స్ 1818 లో జర్మనీలో జన్మించారని నేటికీ 207 సంవత్సరాలు అవుతుందని, ఆయన సిద్ధాంత రచన కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలై 177 సంవత్సరాలు అవుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడంతో పాటు స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. కేరళ తరహ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డుకు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితం గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ ,జిఎస్ గోపి, బాల్ రెడ్డి ,ఏం. రాజు ,ఏ. లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, ఆర్. ఎన్. రమేష్, బి. వెంకటేష్, బాల్య నాయక్, గుంటి వెంకటేష్ ,ఎం. పరమేశ్వరా చారి, ఎం. కృష్ణయ్య, ఎస్. రాజు, బి వెంకటేష్, ఎం. వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు
విదేశీ వలసదారులను వెనక్కి పంపాలి అప్రమత్తం కాకపోతే దేశ భద్రతకే ముప్పు డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన అయినవోలు బిజెపి మండల కమిటీ
నేటి ధాత్రి అయినవోలు
భారతీయ జనతా పార్టీ ఐనవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా వలసదారులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐనవోలు డిప్యూటీ తహసిల్దార్ అనిల్ కుమార్ కి మండల అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గం కన్వీనర్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా వలసదారులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా దేశాలకు చెందిన వ్యక్తులు అక్రమంగా నివాసం ఉంటూ, పౌరసత్వం లేని పరిస్థితుల్లో అబద్ధ పత్రాలతో ప్రభుత్వ సేవలను పొందుతున్నారని మాకు సమాచారం అందింది.ఇది రాష్ట్ర భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నాము. ఈవిధంగా విదేశీ జాతీయులు అక్రమంగా నివాసం ఉండటమే కాకుండా, కొన్ని చోట్ల అక్రమ కార్యకలాపాలలో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం ఉంది. ఇది స్థానిక ప్రజల భద్రతకు, సౌకర్యాలకు తీవ్ర నష్టం కలిగించగలదు.అందువల్ల మీ అధికార పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ విదేశీ అక్రమ వలసదారులపై వెంటనే విచారణ జరిపి, వారిని గుర్తించడముతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి వారిని తక్షణమే వెనక్కి పంపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ గారికి విన్నపించుకోవడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సంఘటన సంరచన ఇన్చార్జ్ మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, బిజెపి జిల్లా కార్యదర్శి గుండె కారికోటేశ్వర్ రావు , జిల్లా కౌన్సిల్ మెంబర్ అడ్డగడ్డ రాజేంద్రప్రసాద్ రావు, మండల ప్రధాన కార్యదర్శిలు పొన్నాల రాజు, మడ్డి రవితేజ, మాజీ ఎంపిటిసి పెండ్లి తిరుపతిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కొట్టెం రాజు,ఉపాధ్యక్షులు తాటికాయలు ఆనందం, గూబ దేవేందర్ , కళ్లెపు విజయ్ గౌడ్, సీనియర్ నాయకులు కోట నరసయ్య, ఆడేపు భాస్కర్ , తాళ్లపల్లి వెంకటనారాయణ, మండల కార్యదర్శి ఆడెపు విక్రమ్, అనంతుల బిందు శ్రీ, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు కట్కూరి రమేష్, బర్లనవీన్, ఇసరపు అఖిల్, ఓబిసి మోర్చ నాయకులు వేముల ప్రభాకర్ పటేల్, మూడెంమహేందర్ గౌడ్, మెరుగుఅనిల్, బోయిన రాజు, యువమోర్చా నాయకులు పులి సాగర్ గౌడ్, శ్రీకాంత్, శివ, పాల్గొన్నారు.
జూన్ 14 న జాతీయ లోక్ అదాలత్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. కవిత దేవి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూన్ 14 న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను పునస్కరించుకొని స్థానిక కోర్టు ఆవరణలో మీడియా ప్రతినిధులతో సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి. కవిత దేవి సమావేశమై తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి మాట్లాడుతూ రాజి మార్గం ద్వారా రాజీ పడదగ్గ కేసులను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. మీడియా ప్రతినిధులందరు లోక్ ఆదాలత్ పై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. లోక్ ఆదాలత్ ద్వారా కేసు రాజీ చేసుకోవడం ద్వారా సమయాన్ని, డబ్బును ఆదాచేసుకున్నవారావుతారని సూచించారు. బాధితులు, కాక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని సూచించారు. లోక్ ఆదాలత్ పై ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న స్థానిక తహసీల్దార్ కార్యాలయాలను గాని, న్యాయ వాదులను గాని, పోలీస్ ఉన్నతధికారులను గాని, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను గాని సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రింట్ మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
మండల కేంద్ర పరిధిలో గల 15గ్రామ పంచాయతీ లలో ఇందిరమ్మ ఇండ్ల ఏంపిక లో నిరుపేదలకు మొండి చేయి చూపే విధంగా ఇందిరమ్మ కమిటీ లు వ్యవహారిస్తున్నాయని కరకగూడెం మండల తుడుం దెబ్బ, అధ్యక్షులు, పోలేబోయినా ప్రేమ్ కుమార్ ఆరోపించారు.గ్రామ సభ లో మాట్లాడిన విధంగా కాకుండా ఇందిరమ్మ కమిటీలు వాళ్ళ ఇష్టనుసారంగా వాళ్లకు నచ్చినవాళ్లకు కేటాయిస్తున్నారని, నిరుపేదలు కనీసం గుడిసెలలో వారికీ కేటాయించక పోవటం చాలా బాధాకరం, అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు, కనీసం ఎంపికైనటువంటి లబ్ధిదారుల జాబితాను కూడా తెలుపకుండా పంచాయతీ సెక్రటరీలు వ్యవహరించడం తగదుఅన్నారు. అదేవిధంగా మండల ఎంపీడీవో ఆయా పంచాయతీ కార్యదర్శులు ఇంత జరుగుతున్న చూసి చూడనట్టుగా వ్యవహరించడం అనేక అనుమానాలకు దారితీస్తుందని వాపోయారు తక్షణమే దీనిపై విచారణ చేపట్టి అసలైన అర్హులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేవిధంగా చర్యలుతీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు సుతారి నాగేష్ మాట్లాడుతూ. ఐదవ షెడ్యూల్ ఏరియా లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఏజెన్సీ చట్టాలకు, హక్కులకు అనుకూలంగా నే ఎంపికలు జరగాలని పీసాగ్రామసభ తీర్మానాలు జరిపి గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల జాబితా ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి కలం సంపత్, కార్యవర్గ సభ్యులు, పోలె బొయిన కార్తీక్, రేగ కిరణ్ పోలిబోయిన శ్యాం ప్రసాద్, కొమరం వెంకట్, తోలేo హరికృష్ణ, గోగ్గల వేణు పోలే బోయిన రఘు పోలేబోయిన సురేష్ కుమార్, పోలే బోయిన సంతోష్ పూణేo రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గాలి బీభత్సం బాధితులను పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రంలో గాలి బీభత్సం కారణంగా కిరాయి ఇంటిలో నివాసముంటున్న రాపర్తి లక్ష్మీ, భర్త రామచంద్రయ్య తీవ్రంగా బాధపడ్డారు. గత కొన్ని రోజులుగా కిరాయికి ఓ చిన్న ఇంటిలో నివసిస్తున్న ఈ కుటుంబానికి, రాత్రి వచ్చిన బలమైన గాలికి ఇంటి పై భాగంలో ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. విషయం తెలుసుకున్న పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించారు. ఎమ్మెల్యే వారి నివాసానికి స్వయంగా వెళ్లి, రాపర్తి లక్ష్మీ ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నారు. తక్షణ సహాయం కింద ఎమ్మెల్యే స్వయంగా నిత్యావసర సరుకులు కొనిచ్చి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాన్ని ఓదార్చుతూ, ప్రభుత్వం వారి సంక్షేమానికి అంగీకరంగా ఉన్నదని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాపర్తి లక్ష్మీకి ఇప్పటివరకు ఇంటి స్థలం లేకపోవడం వల్ల డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరవలేదు. అయితే తదుపరి విడతలో ప్రభుత్వం ద్వారా ఆమెకు ఇంటి స్థలం మంజూరు చేయించి, డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలెవరూ ఒంటరిగా ఉండకుండా చూడటమే మా బాధ్యత అని అన్నారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి భార్గవ్, పట్టణ అధ్యక్షులు నాగన్న, మాజీ సర్పంచ్ యకంత రావు, మండల యూత్ అధ్యక్షులు హరీష్, రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బాధిత కుటుంబం ఎమ్మెల్యే చర్యలను చూసి హర్షం వ్యక్తం చేస్తూ, వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
నూతన తహసిల్దార్ కి పూల మొక్క తో స్వాగతం పలికిన సామాజిక కార్యకర్తలు
వీణవంక, (కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి :తెలంగాణ రాష్ట్రం లో పరిపాలన మార్పులలో భాగంగా, వీణవంక మండలం లో నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన దూలం మంజుల గారికి పూలమొక్కతో సాధర స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపిన సామజిక కార్యకర్తలు దేవునూరి శ్రీనివాస్, సిలివేరు శ్రీకాంత్, ఈ శుభ సందర్బంగా,తహసీల్దార్ మండల ప్రజలకు నూతన రెవెన్యూ చట్టాలు “భూభారతి, సాదా బైనామా”ల విషయంలో ప్రజలకు విరివిగా సేవలను అందించాలని, వీణవంక మండల ప్రజలు, అన్నదాతలైన రైతాంగ వర్గం తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడమైనది, అందుకు సానుకూలంగా స్పందించిన నూతన తహసీల్దార్ గారికి వీణవంక మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.