ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు నీటి సౌకర్యం.!

ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు నీటి సౌకర్యం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనిషి జీవితంలో నీరు ఒక భాగం. నీరు లేకపోతే జీవ రాశుల మనుగడ కష్టం. ఆహారం లేకున్నా కొన్ని రోజుల పాటు జీవించగలం కానీ నీరు లేకపోతే ఒక్క రోజూ జీవించలేం. అటువంటి అత్యవసరమైన నీరు దొరకక ఐదు ఆరు రోజుల నుండి ఓ జహీరాబాద్ లోని ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు అల్లాడుతోంది. 12వ వార్డు వీధిలో ఒకే ఒక బోరు ఉంది ఆ బోరు గ్యాప్ ఇవ్వడం వల్ల బ్యాంకులో నీరు ఎక్కడం లేదు అయితే మంజీరా నీరు ఎనిమిది రోజుల నుండి రావడం లేదు ఆర్ డబ్ల్యు ఎస్ మరియు ఎం సి జెడ్ అధికారులు చూసి చూడలేనట్టు వ్యవహరిస్తున్నారు తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఆందోళన చేశారు.మంచినీటి సమస్యతో అల్లాడుతున్నామని మహిళలు తెలిపారు. కనీసం తాగడానికి మంచి నీరు లేక నోరుఎండిపోతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారన్నారు. ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగిన తప్ప ఇప్పటివరకు మంచినీరు మా ప్రాంతానికి ఇవ్వలేదని మండుతున్న ఎండల్లో పిల్లా పాపలతో అల్లాడిపోతున్నామన్నారు. తక్షణం జిల్లా కలెక్టర్‌ స్పందించి మాకు మంచి నీటి సౌకర్యం కల్పించి మా దాహార్తిని తీర్చాలని మహిళలు ఆందోళన చేపట్టారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కలెక్టరేట్‌ ని కలిసి తమ సమస్యలను చెప్తామని మహిళలు హెచ్చరించారు
పై అధికారులు వెంటనే స్పందించి ప్రజలను నీటి సౌకర్యం కల్పించాలని కోరుచున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version