విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఇంటర్న్‌షిప్ సమస్య..

*విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఇంటర్న్‌షిప్ సమస్య..

*లోక్‌సభలో ప్రశ్నించిన తిరుపతి ఎంపి గురుమూర్తి..

తిరుపతి( నేటి ధాత్రి)జూలై 25:

ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ఇంటర్న్‌షిప్ సమస్యల గురించి తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ఇదే సమస్యపై గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఎంపి శుక్రవారం మరోసారి పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు.
ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా మూడేళ్ల కోర్సు చేయాలని నిబంధన ఉందని కేంద్ర ప్రభుత్వానికి తెలుసా,ఈ నిబంధన ఇతర రాష్ట్రాలలో ఉన్న ఇంటర్న్‌షిప్ వ్యవధి, స్టైపెండ్‌కు భిన్నంగా ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలలో ఇంటర్న్‌షిప్ పరిస్థితులలో వ్యత్యాసాలకు కారణాలు ఏమిటి, జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, అన్ని రాష్ట్రాలలో ఇంటర్న్‌షిప్ వ్యవధిలో ఒకటే నిబంధన ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది,
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, అలా అయితే వివరాలు తెలుపగలరు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు భారతదేశంలో వైద్యం చేయడానికి లైసెన్స్ లేదా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పొందడానికి నేషనల్ మెడికల్ కమిషన్ 2021లో జారీ చేసిన నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.ఈ నియమాలు దేశవ్యాప్తంగా విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు అందరికీ ఒకేలా వర్తిస్తాయని పేర్కొన్నారు. కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ కు సంబంధించిన నియమాలను నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు 2021ని అనుసరించి నిర్వహించబడతాయని తెలిపారు.
కోవిడ్-19 మహమ్మారి, యుద్ధాలు వంటి పరిస్థితుల వలన విద్యను అభ్యసించడంలో వచ్చిన అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, నేషనల్ మెడికల్ కమిషన్ 2023 డిసెంబర్ 7న, 2024 జూన్ 19న పబ్లిక్ నోటీసుల ద్వారా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని తెలియజేసారునేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు గురించి వివరిస్తూ..
విదేశాలలో వైద్య, విద్యను అభ్యసిస్తూ చివరి సంవత్సరంలో బ్రేక్ వచ్చి, ఆన్‌లైన్ ద్వారా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు 1 సంవత్సరం క్లినికల్ క్లర్క్‌ షిప్ చేయాలి. ఆ తర్వాత వైద్య కళాశాల నుండి లేదా గుర్తింపు పొందిన సంస్థలో 1 సంవత్సరం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాలని పేర్కొన్నారు.
చివరి సంవత్సరానికి ముందు సంవత్సరంలో బ్రేక్ వచ్చి, ఆన్‌లైన్ ద్వారా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు 2 సంవత్సరాల క్లినికల్ క్లర్క్‌ షిప్ చేయాలి. ఆ తర్వాత 1 సంవత్సరం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాలని తెలిపారు.
ఆన్‌లైన్ క్లాసులకు బదులుగా నేరుగా హాజరై, సరిపడా ప్రాక్టికల్ శిక్షణ పొంది, పూర్తి కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు 1 సంవత్సరం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్‌కు అర్హులని తెలియజేశారునేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా రూపొందించబడ్డాయని, వీటి విషయంలో రాష్ట్రాలు వేర్వేరు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని కేంద్రం ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఎంపి గురుమూర్తి స్పందన ; ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు మూడు సంవత్సరాల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేస్తున్నారని, ఇది ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో వేర్వేరు ఇంటర్న్‌షిప్ వ్యవధి, స్టైపెండ్ పాలసీలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానాన్ని అనుసరించడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఆర్థిక, వృత్తి పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల నిరసన కార్యక్రమంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఒకే విధమైన నిబంధనలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపి గురుమూర్తి డిమాండ్ చేసారు…

విదేశీ వలసదారులను వెనక్కి పంపాలి.

విదేశీ వలసదారులను వెనక్కి పంపాలి
అప్రమత్తం కాకపోతే దేశ భద్రతకే ముప్పు
డిప్యూటీ తాసిల్దార్ కి
వినతి పత్రం అందజేసిన అయినవోలు బిజెపి మండల కమిటీ

నేటి ధాత్రి అయినవోలు

 

భారతీయ జనతా పార్టీ ఐనవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా వలసదారులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐనవోలు డిప్యూటీ తహసిల్దార్ అనిల్ కుమార్ కి మండల అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గం కన్వీనర్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా వలసదారులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా దేశాలకు చెందిన వ్యక్తులు అక్రమంగా నివాసం ఉంటూ, పౌరసత్వం లేని పరిస్థితుల్లో అబద్ధ పత్రాలతో ప్రభుత్వ సేవలను పొందుతున్నారని మాకు సమాచారం అందింది.ఇది రాష్ట్ర భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నాము. ఈవిధంగా విదేశీ జాతీయులు అక్రమంగా నివాసం ఉండటమే కాకుండా, కొన్ని చోట్ల అక్రమ కార్యకలాపాలలో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం ఉంది. ఇది స్థానిక ప్రజల భద్రతకు, సౌకర్యాలకు తీవ్ర నష్టం కలిగించగలదు.అందువల్ల మీ అధికార పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ విదేశీ అక్రమ వలసదారులపై వెంటనే విచారణ జరిపి, వారిని గుర్తించడముతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి వారిని తక్షణమే వెనక్కి పంపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ గారికి విన్నపించుకోవడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సంఘటన సంరచన ఇన్చార్జ్ మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, బిజెపి జిల్లా కార్యదర్శి గుండె కారికోటేశ్వర్ రావు , జిల్లా కౌన్సిల్ మెంబర్ అడ్డగడ్డ రాజేంద్రప్రసాద్ రావు, మండల ప్రధాన కార్యదర్శిలు పొన్నాల రాజు, మడ్డి రవితేజ, మాజీ ఎంపిటిసి పెండ్లి తిరుపతిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కొట్టెం రాజు,ఉపాధ్యక్షులు తాటికాయలు ఆనందం, గూబ దేవేందర్ , కళ్లెపు విజయ్ గౌడ్, సీనియర్ నాయకులు కోట నరసయ్య, ఆడేపు భాస్కర్ , తాళ్లపల్లి వెంకటనారాయణ, మండల కార్యదర్శి ఆడెపు విక్రమ్, అనంతుల బిందు శ్రీ, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు కట్కూరి రమేష్, బర్లనవీన్, ఇసరపు అఖిల్, ఓబిసి మోర్చ నాయకులు వేముల ప్రభాకర్ పటేల్, మూడెంమహేందర్ గౌడ్, మెరుగుఅనిల్, బోయిన రాజు, యువమోర్చా నాయకులు పులి సాగర్ గౌడ్, శ్రీకాంత్, శివ, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version