విదేశీ వలసదారులను వెనక్కి పంపాలి.

విదేశీ వలసదారులను వెనక్కి పంపాలి
అప్రమత్తం కాకపోతే దేశ భద్రతకే ముప్పు
డిప్యూటీ తాసిల్దార్ కి
వినతి పత్రం అందజేసిన అయినవోలు బిజెపి మండల కమిటీ

నేటి ధాత్రి అయినవోలు

 

భారతీయ జనతా పార్టీ ఐనవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా వలసదారులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐనవోలు డిప్యూటీ తహసిల్దార్ అనిల్ కుమార్ కి మండల అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గం కన్వీనర్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా వలసదారులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా దేశాలకు చెందిన వ్యక్తులు అక్రమంగా నివాసం ఉంటూ, పౌరసత్వం లేని పరిస్థితుల్లో అబద్ధ పత్రాలతో ప్రభుత్వ సేవలను పొందుతున్నారని మాకు సమాచారం అందింది.ఇది రాష్ట్ర భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నాము. ఈవిధంగా విదేశీ జాతీయులు అక్రమంగా నివాసం ఉండటమే కాకుండా, కొన్ని చోట్ల అక్రమ కార్యకలాపాలలో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం ఉంది. ఇది స్థానిక ప్రజల భద్రతకు, సౌకర్యాలకు తీవ్ర నష్టం కలిగించగలదు.అందువల్ల మీ అధికార పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ విదేశీ అక్రమ వలసదారులపై వెంటనే విచారణ జరిపి, వారిని గుర్తించడముతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి వారిని తక్షణమే వెనక్కి పంపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ గారికి విన్నపించుకోవడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సంఘటన సంరచన ఇన్చార్జ్ మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, బిజెపి జిల్లా కార్యదర్శి గుండె కారికోటేశ్వర్ రావు , జిల్లా కౌన్సిల్ మెంబర్ అడ్డగడ్డ రాజేంద్రప్రసాద్ రావు, మండల ప్రధాన కార్యదర్శిలు పొన్నాల రాజు, మడ్డి రవితేజ, మాజీ ఎంపిటిసి పెండ్లి తిరుపతిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కొట్టెం రాజు,ఉపాధ్యక్షులు తాటికాయలు ఆనందం, గూబ దేవేందర్ , కళ్లెపు విజయ్ గౌడ్, సీనియర్ నాయకులు కోట నరసయ్య, ఆడేపు భాస్కర్ , తాళ్లపల్లి వెంకటనారాయణ, మండల కార్యదర్శి ఆడెపు విక్రమ్, అనంతుల బిందు శ్రీ, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు కట్కూరి రమేష్, బర్లనవీన్, ఇసరపు అఖిల్, ఓబిసి మోర్చ నాయకులు వేముల ప్రభాకర్ పటేల్, మూడెంమహేందర్ గౌడ్, మెరుగుఅనిల్, బోయిన రాజు, యువమోర్చా నాయకులు పులి సాగర్ గౌడ్, శ్రీకాంత్, శివ, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version