తెలంగాణ పరువుతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ పరువుతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..

చెప్పుల దొంగగా అభివర్ణించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

*తెలంగాణను దివాలా రాష్ట్రంగా చిత్రీకరించిన రేవంత్ *

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజ ద్రోహం కేసుపెట్టాలి..

ప్రజలు,ఉద్యోగుల మధ్య విబేధాలు సృష్టిస్తూ సీఎం సలహాలు

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

చెప్పుల దొంగల్లాగా ఢిల్లీలో తనను బ్యాంకర్లు చూస్తున్నారని ఒక ముఖ్యమంత్రి స్వయంగా అభివర్ణించుకోవడం దురదృష్టకరం దేశం ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల పరువుతీస్తున్నారని తెలంగాణ ఉద్యమనేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.ఒక ముఖ్యమంత్రి దేశ రాజదాని డిల్లీలో చెప్పుల దొంగగా కనబడితే స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.గత కెసిఆర్ ప్రభుత్వం, ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే అప్పులు చేయడం జరిగిందని, దేశంలో తెలంగాణ కన్న 28 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేశాయి. మిగతా రాష్ట్రాలలో ఈ పరిస్థితి లేనప్పుడు తెలంగాణకే ఈ స్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే అని పేర్కొన్నారు.ఎన్నికల ముందు అధికారం కోసం అడ్డగోలు 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
తను తెలంగాణలో లేనట్టుగా తనకేమి తెలియనట్టుగా కొత్తగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది. దివాలా చేసింది. ఆనా పైసా రావడం లేదు. అని చెప్పడం అనేది ఇచ్చిన హామీల నుండి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.సోమవారం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు విన్నాక ఈ రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకచ్చి పనులుచేయలేని పరిస్థితి ఉంది.ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కీలకమైన పథకాల అమలు కూడా కష్టసాధ్యమే అనిపిస్తుందని ఆయన చెప్పారు.
రాబోయే రోజుల్లో ఇతర దేశాలు,రాష్ట్రాల నుండి తెలంగాణలో కంపెనీలలో పెట్టబడులు పెట్టకుండా ఉద్యోగాల కల్పన జరగకుండా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సూచిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఎక్కడ నిలదీస్తారో,ఎదురు తిరుగుతారో అనే భయంతో పరిపాలన చేతకాదు. హామీలు అమలు చేయలేము అని మూడున్నర సంవత్సరాల ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.ఇందిరమ్మ ఇండ్లు ,యువ వికాసం, మహాలక్ష్మి, రైతు భరోసా,రుణమాఫీ,కళ్యాణ లక్ష్మి తులం బంగారం,పెన్షన్ల పెంపు లాంటి పథకాల అమలుపైన ప్రజలు ఇప్పటికే నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు.
దేశంలోనే అత్యధిక జీడీపీని కలిగి దేశానికి అత్యధికంగా జీఎస్టీ చెల్లించే స్థాయికి ఎదిగిన తెలంగాణను నేడు అప్పులు పుట్టని రాష్ట్రంగా మారిందని చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి,మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని వీరిపైన రాజద్రోహం కేసుపెట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు ఉద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ సేవలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టారని,మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలను అమలుపట్ల అడగడం నేరమా అని ప్రశ్నిస్తూ ఉద్యోగుల కోసం సంక్షేమ పథకాలు ఆపమంటారా అని చెప్పడం ప్రజలకు ఉద్యోగులకు మధ్య విభేదాలు సృష్టించడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని అవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమైందని వారి హక్కుల సాధనకు ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ వెంట ఉంటుందని వెంటనే ఉద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version