రెచ్చిపోయి వసూళ్లు.
పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.
ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.
మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి లో ఇదే తంతు.
అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.
దర్జాగా వసూళ్ల సాక్షాలు అయిన టీఎస్ఎండిసి నిశ్శబ్దం, అమ్ముడుపోయిందని ప్రజలకు అర్థం.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, టీజీఎండిసి శాఖ కాసులకు కక్కుర్తి పడడం, కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు చేసుకొని అక్రమ వసూళ్లకు సహకరించడం యదేచ్చగా కండ్ల ముందు అక్రమ వసూళ్ల దందాను టీజీఎండిసి సిబ్బంది తోపాటు కాంట్రాక్టర్ సిబ్బంది వసూళ్ల పరంపరను కొనసాగిస్తున్నప్పటికీ టీజీఎండిసి ఉన్నత అధికారులు మరోవైపు ప్రభుత్వం అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం తో మండలంలోని ఇసుక రీచులు అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రెచ్చిపోయి కొనసాగించడం జరుగుతుంది. మరోవైపు పక్క జిల్లాలకు సంబంధించిన ఇసుక రీచుల కాంట్రాక్టర్లు హద్దులు దాటి గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాన్ని చేసి ఇసుకను రవాణా కొనసాగిస్తుంటే ప్రభుత్వం టీజీఎండిసి అధికారులు చర్యలకు ససేమీరా అనడం తో కాంట్రాక్టర్లు ఇసుక రీచుల్లో అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్రమాలపై టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఇసుక రిచుల్లో అక్రమాల వ్యవహారం అదునపు వసూళ్లు తీసుకుంటున్న టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ సూపర్వైజర్ లా ఫోటోలు వీడియోల సాక్షాలు వచ్చినా కూడా ఇప్పటివరకు ఒక్క క్వారీపై కూడా చర్యలు తీసుకోలేదంటే టీజీఎండిసి కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయారని స్పష్టంగా కనబడుతుంది.
పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.
సోమవారం రోజు పలుగుల తొమ్మిది ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ సిబ్బంది లారీ డ్రైవర్ నుండి 1100 రూపాయలు సీరియల్ పేరుతో వసూలుచేస్తూ. తరువాత లోడింగ్ కొరకు సీరియల్ నంబర్ చిట్టిని అందించాడు. ఈ క్వారీలో గత నెల రోజులు నుండి పెద్ద మొత్తంలో అన్ని క్వారీల కంటే ఎక్కువగా వసూళ్ల పరంపర కొనసాగుతుందని, దానికి సంబంధించిన సాక్షాలు గత నెలలో 1200 తీసుకున్న పలుకుల 9 ప్రస్తుతం 1100 వందలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ వద్ద 200. వందల రూపాయలు గత నెలలో 1400 వసూలు చేయడం జరిగింది. ప్రస్తుతం 1300 పాసింగ్ పై అదనపు ఇసుకను తీసుకోవడం జరుగుతుంది. పలుగుల తొమ్మిది గత నెల ప్రతిరోజు 119 నుండి 148 వరకు లారీల్లో ఇసుక నింపి రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ మార్చ్ నెలలో నాలుగవ తేదీన ప్రారంభమై మొదట్లో ఆవరేజ్ 60 నుండి మొదలుకొని నేటి వరకు ప్రతిరోజు 100కు పైచిలుకు లారీల ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మూడు నెలల్లో సుమారు ఈ క్వారీ 60 రోజుల్లో 6000 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది. లారీకి 14 నుండి 1100 అక్రమ వసూళ్ల విషయానికొస్తే 65 నుండి 85 లక్షల రూపాల అక్రమ వసూళ్లను సొమ్ము చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు తెరలేపిన పలుగుల తొమ్మిది పై, టి జి ఎం డి సి కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, మరి కొన్ని రోజుల్లో అక్రమ వసూళ్లతో తమ క్వాంటిటీని సమాప్తం చేసుకునే వరకు టీజీఎండిసి అధికారులు చూస్తూనే ఉంటారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.
మండలంలో ఇసుక క్వారీల అక్రమాల వ్యవహారం, సాక్షాలు వసూళ్ల పర్వం, నిబంధనలు దాటి తవ్వకాలు, యదేచ్ఛగా కొనసాగుతుంటే టి జి ఎం డి సి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, టీజీఎండిసి అధికారుల పుణ్యం కాంట్రాక్టర్లు రెచ్చిపోయి, తమకు అడ్డు ఎవరు అని అక్రమ వసూళ్ల వ్యవహారాలను తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మండలంలో నిర్వహించబడే ఇసుక రిచుల్లో పలుగుల తొమ్మిది మహదేవపూర్, పుసుక్ పల్లి 1, పలుగుల 8, ఈ రిచుల్లో పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్ల వ్యవహారాలను దర్జాగా కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క జిల్లా ఇసుక క్వారీలు కూడా గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాలు చేసి, కుంట్లం గోదావరి వద్ద అక్రమ తవ్వకాలు జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడుతు యదేచ్చగా అక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. కొత్తగా ఇసుక పాలసీ అమలులో ఉన్న క్రమంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం టీజీఎండిసి పై చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిశ్శబ్దాన్ని పాటించడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది.
మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి, లో ఇదే తంతు.
మహదేపూర్ పుసుపుపల్లి1, పేరుతో నిర్వహించబడే ఇసుక క్వారీ లోను కూడా అక్రమ వసూళ్లకు హద్దు లేకుండా పోయింది. ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది 900 రూపాయలు, సీరియల్ పేరుతో వసూలు చేయడం, లోడింగ్ వద్ద 200, కాంటా వద్ద అదనపు ఇసుకకు 300 నుండి 500, యథేచ్ఛగా కొనసాగడం జరుగుతుంది. ఈ ఇసుక క్వారీ మార్చ్ నెల ఆరవ తేదీన ,ప్రారంభించడం జరిగింది, కానీ కొద్ది రోజులు నామమాత్రంగా లారీలో ఇసుక నింపిన ఈ క్వారీ ఏప్రిల్ నెలలో, అక్రమ వసూళ్ల పరంపరను ప్రారంభించడంతో 60 నుండి మొదలుకొని 175 యావరేజ్ గా ప్రతిరోజు లారీల్లో ఇసుకను రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ ఇప్పటివరకు అక్రమ వసూళ్ల తో 45 లక్షల నుండి 60 లక్షల వరకు సొమ్ము చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పలుకుల 8 ఇసుక క్వారీ స్థానికులకు భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో లోడింగ్ నిలిచివేయడం జరిగింది, పలుకుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, టీజీఎండిసి అధికారుల పుణ్యమని అక్రమ వసూళ్లు పెద్ద మొత్తంలో జరుపుకొని లక్షల రూపాయల సొమ్ము చేసుకుని ఇసుక క్వాంటిటీని సమాప్తం చేసుకోవడం జరిగింది.
అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.
అక్రమ వసూళ్ల వ్యవహారం మండలంలోని ఇసుక క్వారీలకు ఒక వరంగా అందించింది టీజీఎండిసి, అదుపు ఇసుక రవాణా నిలిపివేయడం, నూతన ఇసుక పాలసీ విధానం అమలు చేయడం జరుగుతుంది అని చెప్పిన ప్రభుత్వం, టీజీఎండిసి అధికారులకు ఇచ్చిన” డేడ్” లైన్ అధికారులు లెక్కచేయకుండా ప్రభుత్వ డెడ్ లైన్ ను
తీసిపారేశారు, గత వారం రోజుల క్రింద ఓ అధికారి” హోటల్లో మకాం వేసి, కాంట్రాక్టర్ అందరికీ తమ వద్దకు పిలుచుకొని, సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ అధికారి విధులు కూడా హోటల్లోనే పూర్తి చేసుకున్నాడు. ఇలా అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే, అక్రమ వసూళ్ల పరంపర జోరుగా కొనసాగకుంటే, కాంట్రాక్టర్లు ఎందుకు ఊరుకుంటారు. అధికారుల హోటల్లో సిట్టింగ్ పరంపర, గత కొన్ని రోజులుగానే కొనసాగుతుందని చెప్తున్నారు, అందుకే ఏమో ఇసుక క్వారీల ప్రారంభం నుండి, అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం గా కనబడుతోంది. దర్జాగా వసూళ్ల సాక్షాలు అక్రమ ఇసుక తవ్వకాలు మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడుస్తుంటే, టీజీఎండిసి అధికారులు చర్యలకు బదులు హోటల్లో” సిట్టింగ్ తో సెట్టింగ్” చేసుకోవడానికి, ప్రజలు గమనించి వాస్తవమే అక్రమాలకు చర్యలు కాదు, సిట్టింగ్లతో సక్సెస్ అయింది, ఇంకేముంది టిజీఎండిసి కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిందని అక్రమ వసూళ్ల సాక్షాలు చెబుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ టీజీఎండిసి అధికారులపై చర్యలకు ఆదేశించి, ఇసుక రీచుల్లో అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.