అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీధి సౌర కాంతి సామాగ్రి పంపిణీ
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం లోని కాన్కుర్ గ్రామంలో తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో మంగళవారం వీధి సౌర కాంతి సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది.అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కార్పొరేట్ సామాజిక భాద్యత (సి. ఎస్. ఆర్ ) కింద ముప్పై ఆరు వేల విలువ చేసే వీధి సౌర కాంతి సామాగ్రి ని డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపేందర్ కు అందజేశారు.ఈ సందర్బంగా శ్రీశ్రావణి మాట్లాడుతూ జైపూర్ మండలంలోని కాన్కుర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో నీలగిరి ప్లాంటేషన్ లను పెంచుతూ పర్యావరణ పరిరక్షణ తో పాటు స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. గ్రామాలకు తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశ్యం తో సి. ఎస్. ఆర్ కింద టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం లో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, ఫీల్డ్ సూపర్ వైసర్ లు రాజేష్, శ్రీనివాస్,వాచర్ లు శంకర్,సాయికిరణ్,ఓదెలు, రాకేష్,సిబ్బంది షాహిద్, సంజీవ్ లు పాల్గొన్నారు.