బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

వడగళ్ళ వాన తో దెబ్బతిన్న పంటను పరిశీలించి రైతులకు దైర్యం చెప్పిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండల కేంద్రంలో ని జీలకుంట పోత్కపల్లి శానగొండ బయమ్మపల్లి ఇందుర్తి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగళ్ళ వాన ప్రభావం తో నష్ట పోయిన వరి మొక్కజన్న పంటలను సమీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి మాట్లాడుతూ
రైతులు ఆరుకాలం కష్టపడి పoడించిన పంట అకాల వర్షం తో నేలపాలు కావడం జరిగింది పంట చేతికి వచ్చే దశలో ఈవిదంగా వర్షం పడి రైతుల పొట్టకొట్టిననట్టు కావడం దురదృష్టకారం అన్నారు తక్షణమే నష్ట పోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలనివారు డిమాండ్ చేసారు మండలం లోని AO మరియు AEO తో మాట్లాడిన సంజీవ రెడ్డి దాదాపు 500 వందల ఎకరాల్లో పంట నష్ట జరిగిందని ఈ యొక్క వడగళ్ళ వానతో సీడ్ పంటలు వేసినటువంటి రైతులకు ఆదిలాబాద్ జిల్లా లో సీడ్ ఆర్గనైజర్స్ ఎకరానికి యాభై వెల రూపాయలు ఇస్తున్న విదంగా పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం తోపాటు అన్నీ మండలాల్లో ఇవ్వాలని కోరడమైనది. లోకల్ వరిపంటలు ఇంకా చాలా రకాల పంటలు దెబ్బతినడం జరిగిందని నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల వివరాలు సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపి వారికీ నష్ట పరిహారం వచ్చే విదంగా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది రైతుల పంటలు కోసి కొనుగోలు కేంద్రాలలో ఎదురు చూస్తున్నారని ఇంకా ఐకేపీ సెంటర్ లు ప్రారంభం చేయలేదని కాబట్టి వెంటనే ఐకేపీ సెంటర్ లో ఓపెన్ చేసి వడ్ల కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు.
ఈకార్యక్రమంలో లో బీజేపీ నాయకులు దాత రాకేష్ పటేల్ ఎర్రవెల్లి అనిల్ రావు, పుల్లూరి పృథ్వి రాజ్,చర్లపల్లి రాజు,తజ్ ఉద్దీన్,పుల్ల సదయ్య,భూషణవేణి సత్యం, రవీందర్, బిక్షపతి, రమేష్,నరసింహ చారి, భాస్కర్ రెడ్డి,అగ్గి శ్రీనివాస్,కుక్కల మహేందర్,మధునయ్య,ఐలయ్య,పులి కొమురయ్య,మీడుదూల రాజు,రాజా మనోహర్,సతీష్,వినయ్,సాయి కృష్ణ, అనిల్,తదితరులు పాల్గొన్నారు.

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

 

 

*వనపర్తి పట్టణములో పాత బజార్ 4వ వార్డ్ లో దక్షిణ కాళికాంబ సమేత కమరేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్టలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు
దక్షిణ కాళికాంబ సమేత కమరేశ్వర స్వామి అమ్మవారికి వనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటలతో రైతులు అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు
అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు అడిగిన వెంటనే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆర్థిక సహాయం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు ఎమ్మెల్యే మేఘా రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు
తిరుమల మహేష్ విగ్రహ ప్రతిష్ట కు ఆర్థిక ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ తిరుమల మహేష్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ నాయకులు ఓ బీ సీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ మాజీ మున్సిపల్ వై
స్ చైర్మన్ బి కృష్ణ కృష్ణ నందిమల్ల శ్యామ్ పాషానాయక్ పరుశురాం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య టీ పీ సీ సీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.!

‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’

 

అలంపూర్ / నేటి ధాత్రి.

 

గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించే వరి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతులకు ఉపయోగకరంగా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడాలని కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం వచ్చేలా కాకుండా,లాభాలు వచ్చేలా దానికి అనుగుణంగా అధికారులు రైతులను సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.

ఏసిబి వలలో అవినీతి అధికారి..

ఏసిబి వలలో అవినీతి అధికారి.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శేరిలింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్

ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాల అధికారులు పరారు…

శేరిలింగంపల్లి, నేటి,ధాత్రి :-

 

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. శేరిలింగంపల్లి జోనల్ జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టింది. అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా చాంద్రాయణ గుట్ట సర్కిల్ లో అర్బన్ బయోడైవర్సిటి విభాగం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.

https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30

చాంద్రాయణ గుట్ట సర్కిల్ పనికి సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 2 లక్షల 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. కాగా ఇదివరకే రూ. 1 లక్ష 50 వేలు పలు దఫాలుగా తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం మిగతా రూ. 50 వేలు ఇచ్చేందుకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి రావాలని సూచించాడు. దీంతో కాంట్రాక్టర్ శ్రీనివాస్ తెలిపిన విధంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని ఛాంబార్ కు వచ్చాడు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాసుని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ తెలిపారు.

https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30

 

ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాల అధికారులు పరారు…
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారి పై ఏసీబీ రైట్స్ జరగడంతో, జోనల్ కార్యాలయంలోని మిగతా విభాగాల అధికారులు పరారయ్యారు. ఉదయం 12 గంటల నుంచి అన్ని విభాగాల అధికారులు కార్యాలయంలో లేకపోవడంతో కుర్చీలు కాలిగా దర్శనమిచ్చాయి. అధికారులు అందుబాటులో లేకపోవడంతో పనుల పైన విచ్చేసిన ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏదో ఒక అధికారిపై ఏసీబీ దాడులు జరిగితే మిగతా అందరూ వీధిల నుంచి తప్పించుకుని వెళ్లడంపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఏసీబీ దాడులకు భయపడే అధికారులు పారిపోయారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

 

https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30

గులాబీ దండు కదం తొక్కాలి..!

గులాబీ దండు కదం తొక్కాలి..!
కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి..!!ఎంపీ “వద్దిరాజు”

“నేటిధాత్రి”,ఇల్లెందు, ఏప్రిల్, 15:

 

 

వరంగల్ లో జరిగే సభకు ఇల్లెందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు బాణోత్ హరిప్రియా నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లెందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్ లో పది లక్షల మందితో జరిగే సభలో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతరోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరకే ప్రజలు విసిగి, వేసారి పోయారని అన్నారు. ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. కేసీఆర్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు.

BRS

 

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేద్దామని భ్రమ పడుతున్న ముఖ్యమంత్రి.. తాను కూర్చున్న కుర్చీ కూడా కేసీఆర్ పెట్టిన బిక్షే అని గురైరగాలని అన్నారు. కేసీఆర్ పోరాటం చేయకపోతే ఇవాళ రాష్ట్రమే వచ్చేది కాదని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అద్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. వరంగల్ సభ విజయవంతానికి దిశా నిర్ధేశం చేశారు.

BRS

 

బహిరంగ సభకు హాజరయ్యే ముందు పార్టీ కార్యకర్తలంతా తమ తమ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించుకుని బయలుదేరాలని పిలుపునిచ్చారు.

BRS

 

 

సమావేశంలో గ్రంధాలయ సంస్థ మాజీ అద్యక్షుడు దిండిగాల రాజేందర్, మహబూబాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోత్ బిందు, డిసీసీబీ మాజీ డైరెక్టర్ లక్కినేని సురేందర్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు శీలం రమేష్, బొమ్మెర ప్రసాద్, తాతా గణేష్, లక్ష్మణ్ నాయక్, పరుచూరి వెంకటేశ్వరరావు, టీబీజీకేఎస్ నాయకులు రంగనాధ్, జాఫర్ హుస్సేన్, జెకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం.

ప్రజలారా కథం కథం తొక్కి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఛలో వరంగల్ సభను విజయవంతం కొరకు పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్య టిస్తున్నారు.ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయ ప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27 నాడు కెసిఆర్ ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటు వంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్త యి 25వ సంవత్సరాల్లో అడు గుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వ హించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం.

BRS party’s

 

భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించ లేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవాసభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటు వంటి ప్రభుత్వాలు ఉండవు, దానికి కారణమేంటంటే అమ లు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నటు వంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికా రంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు. ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపా లన, అసమర్ధ పరిపాలన, చేత గాని వ్యవహారం ఇవన్నీ చేసు కుంటుప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి.

ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ ఎస్ జెండానే గెలిచేది బిఆర్ ఎస్ అభ్యర్దులే.

ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలం గాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

రజతోత్సవ సభకు వాల్ రైటింగ్ కార్యక్రమం ప్రారంభం.!

చలో వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వాల్ రైటింగ్ కార్యక్రమం ప్రారంభం

జహీరాబాద్ . నేటి ధాత్రి:

 

 

27న వరంగల్‌లో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ప్రారంభించారు. సభకు పూర్వాహ్నం నుంచి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టబడింది అని.

MLA Manikrao

 

వాల్ రైటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా జహీరాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహీ ఉద్దీన్,తులసి దాస్ గుప్తా,యువ నాయకులు మిథున్ రాజ్ ,ప్రభు ,
ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ విజయ రథాన్ని ముందుకు నడిపేందుకు ప్రతి కార్యకర్త ఈ రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మల్యే మాణిక్ రావు గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మహబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి.

ఖమ్మం – మహబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి: వద్దిరాజు

రామయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ “వద్దిరాజు”.

“నేటిధాత్రి”,ఖమ్మం రూరల్, ఏప్రిల్, 15:

 

 

తన జీవితం మొత్తం మొక్కలు నాటాడానికే అంకితం చేసిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య ధరిత్రి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇటీవలే మృతి చెందిన వనజీవి రామయ్య కు మంగళవారం రవిచంద్ర నివాళులు అర్పించారు. రెడ్డిపల్లి లోని ఆయన నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం – మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య మార్గ్ పేరుతో నామకరణం చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు.

Vanajeevi Ramaiah

 

ఖమ్మం నుంచి రెడ్డిపల్లి వరకు 8 కిమీ మేర వనజీవి రామయ్య మొక్కలు నాటారని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లన్నీ కూల్చేసినందున, మళ్ళీ అదే వరసలో మొక్కలు నాటి.. సంరక్షించి రామయ్య కు నివాళులు అర్పించాలని కోరారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రామయ్య చరిత్ర భావి తరాలకు తెలిసేలా కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్ర ను ప్రవేశ పెట్టాలని ఎంపీ రవిచంద్ర కోరారు. జిల్లాలో కూడా ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి.

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి.

చిట్యాల,నేటిధాత్రి

 

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని బిజెపి చిట్యాల మండలాధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఇప్పుడు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకున్నదంటే అదికేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందనిఅన్నారూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన భారత దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది అంటే ఆ మహనీయుని కారణంగ భారత రాజ్యాంగంవ్యవహరిస్తున్నదని కుల మత విభేదం లేకుండా ఓటు అనే ఆయుధం ద్వారా బానిస సంకెళ్లను తొలగించడంజరిగిందని*
భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గ కాశయాలను కొనసాగిచలనిఅన్నారు,
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య ఓబిసి జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ సదానందం శ్రీహరి గుర్రపు రవీందర్ మైదం శ్రీకాంత్ కింసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ.

రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ.

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాశిబుగ్గ నేటిధాత్రి.

 

 

ఆదివారం గ్రేటర్ వరంగల్ 16 వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ నుండి కీర్తి నగర్ వరకు డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ ఆధ్వర్యంలో పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం పరిరక్షణ పాదయాత్రను ఉద్దేశించి రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం అవమానించిందని, రాజ్యాంగ పరిరక్షనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవటానికి పోరాటం చేయాల్సిన పరిస్థితి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిందని అన్నారు.ప్రతి గ్రామానికి,ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్లి రాజ్యాంగానికి జరుగుతున్న ప్రమాదాన్ని వివరించాలన్నారు. పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.కుల మతాలను రెచ్చగొడుతూ బిజెపి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని అన్నారు.దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరియు భారత రాజ్యాంగం పై బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, డివిజన అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో ర్యాలీ నిర్వహించి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ స్థాయి గర్వించదగ్గ గొప్ప మహనీయులని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి ప్రపంచ స్థాయిలో దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికి అమలవుతుందని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ లోపల అభివృద్ధి కార్యక్రమాలు రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల మహిళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు కోహీర్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు ₹4,22,000 విలువ గల చెక్కులను మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు ,గ్రామాల మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,ముఖ్య నాయకులతో కలిసి అందజేయడం జరిగింది.వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ ₹.36,000/- చింతల్ ఘట్ గ్రామానికి చెందిన జాని మియా ₹.51,000/- మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాములు ₹.60,000/-
పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన జనార్ధన్ ₹.35,000/-
చింతల్ ఘట్ గ్రామానికి చెందిన నికిత ₹.30,000/-
మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహబూబ్ పాషా ₹.21,000/-పెయిడిగుమ్మల్ గ్రామానికి చెందిన ప్రభు ₹.22,500/-వెంకటాపూర్ గ్రామానికి చెందిన అశోక్ ₹.27,000/-ఉమ రాణి ₹.15,000/-కొత్తూర్ పట్టి గ్రామానికి చెందిన నాగమ్మ ₹.25,500/-చింతల్ ఘట్ గ్రామానికి చెందిన నికిత ₹.19,500/-కవెల్లి గ్రామానికి చెందిన రఫీ ఉద్దీన్ ₹.28,500/-దిగ్వాల్ గ్రామానికి చెందిన పాండు ₹17,500/-పరమ్మ ₹.20,000 /-తస్లీమా బేగం ₹.13,500/- చెక్కులు అందించడం జరిగింది.

మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి.

అభివృద్ధి – సంక్షేమం బిజెపితోనే సాధ్యం నినాదంతో బస్తి చలో కార్యక్రమం

మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

 

నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో బస్తి చలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు ఎం. సత్యనారాయణ గారి నివాసంలో ఆయనకు ఘన సన్మానం చేయడం జరిగింది.
అనంతరం ఆర్‌ఎల్ నగర్ వార్డ్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడంతో పాటు, వారి కోసం అల్పాహారం ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ

BJP Former

 

46 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కార్యకర్తల త్యాగం సేవా భావంతో బీజేపీ ప్రజలలో విశ్వాసాన్ని సంపాదించింది. పార్టీ పెద్దలను సన్మానించడం దైవ కార్యంతో సమానం. ఎం. సత్యనారాయణ గారు జాతీయ స్థాయిలో పార్టీ కోసం చేసిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు.
అలాగే, పారిశుద్ధ్య కార్మికులు కరోనా మహమ్మారి సమయంలో చేసిన సేవలు అపూర్వమైనవని కొనియాడారు.
సమాజంలో పరిశుద్ధ కార్మికులను చిన్నచూపు చూడకూడదు. వారు లేకపోతే మన దైనందిన జీవితం సక్రమంగా సాగదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు మునిగంటి సురేష్, బొమ్మిడి బుచ్చిరెడ్డి, జిల్లా బీజేపీ కార్యదర్శి గణపురం శ్యామ్ సుందర్ శర్మ, మాజీ ఎంపిటిసి తరిగొప్పుల బలరాం, మాజీ కౌన్సిలర్లు బుద్ధవరం లక్ష్మీ, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, బుద్ధవరం వేణుగోపాల్, మామిడి జంగారెడ్డి, కౌకుట్ల రాహుల్ రెడ్డి, వొల్లాల శ్రీనివాస్ గౌడ్, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, కర్ర వెంకటేశ్వరరావు, భువనేశ్వరి, మాధవరావు, ఎలసాని నాగరాజు యాదవ్, ఏనుగు మహేందర్ రెడ్డి, మధు గౌడ్, చారి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ రజతోత్సవ సభకు కార్యకర్తలు రావాలి.

పార్టీ రజతోత్సవ సభకు కార్యకర్తలు రావాలి

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

గుడాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా పార్టీ నిర్వహించే రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు ఈ నెల 27 నా తరలిరావాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కోరారు. శనివారం మండలం పరిధిలోని దామరతోగు గ్రామంలో రజతోత్సవ సభ పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో పార్టీ రజతోత్సవాన్ని కేంద్ర పార్టీ అట్టహాసంగా నిర్వహిస్తుందని అన్నారు.వరంగల్ జిల్లా ఎలక తుత్తి వద్ద జరిగే ఈ సభను పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చి ప్రసంగించే ప్రసంగాన్ని తిలకించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమన్న, పార్టీ సీనియర్ నాయకులు, సుతారి సత్యం, కుంజ నాగేశ్వరరావు, పాయం శ్రీను, గడ్డం వీరన్న, తాటి కృష్ణ, బొమ్మెర్ల శ్రీను, గోగ్గల రాంబాబు, పొంబొన సుధాకర్, బొమ్మెర్ల పద్మారావు, బొమ్మెర్ల సతీష్, మోకాళ్ళ నరేష్, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ సభా వేదికసిద్ధం….

వరంగల్ సభా వేదికసిద్ధం….

ప్రతి పల్లె కదలి రావాలి కదం తొక్కుతూ…!

కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తరుణ్ నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

వరంగల్ ను గమ్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తం గా బిఆర్ఎస్ కార్యకర్త లు, ప్రజలు ఉత్సాహం తో కదలికలోకి వస్తున్నారని. కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వాంకుడోత్ తరుణ్ నాయక్ తెలిపారు.
“పల్లె పల్లె కదలి రావాలని నినాదంతో ప్రతి ఊర్లో నూ చైతన్యం వెల్లి విరుస్తోందని.
25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) మరోసారి ప్రజల మద్దతుతో ముందుకు సాగేందుకు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమవుతుందని. ఈ సభ కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని. ఇది ఒక విశాల సంకల్పానికి సంకేతమని. ఉద్యమాన్ని గుర్తు చే సుకుంటూ, భవిష్యత్తు దిశగా ప్రజలను నడిపించే ప్రయ త్నం. ఉద్యమ కాలం నుంచీ సాధన వరకూ మార్గనిర్దేశ కుడిగా నిలిచిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఇప్పుడు భవిష్యత్తు తలుపులు తట్టేందుకు సిద్ధమవు ఉన్నారని తెలిపారు. గ్రామాలన్నీ ఒక్కటై, బండి మీద బండి, పాదా లపై పాదాలు వేసుకుంటూ, ఒకే నినాదంతో ముందుకు సాగుతున్నాయని “మన తెలంగాణ కోసం మళ్లీ కసితో ముందుకు సాగుతోందని ప్రతి వాడలోనూ, ప్రతి గూడెం లోనూ ఉద్యమాత్మక జోష్ చల్లరాని ఉత్సాహాన్ని నింపు తోందని. ఈనేపథ్యంలో, కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వాంకుడొత్ తరుణ్ నాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు.. వెనుకంజ లేదు వెనక్కి తిరిగే అవసరం లేదు. అన్నదమ్ములారా అక్కచెల్లెళ్ళారా బండి ఎక్కండి, కెసిఆర్ సభకు రండి వరంగల్ రజతోత్సవ సభను ఘనవిజయం చేద్దాం అని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఏర్పాటు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ ఏర్పాటు

ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ఏఎస్ రావు నగర్ నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లానేటిధాత్రి:

 

ఎఎస్ రావు నగర్ డివిజన్ లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ తల్లి గారి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు వారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ
ఆరోగ్య కేంద్రంలో వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేయడంతో రోగులకు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి వేసవిలో దాహార్తిని తీర్చేందుకుఉపయోగపడుతుందని అన్నారు
వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసినందుకు కేశెట్టి ప్రసాద్ ను ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రాజేంద్రన్, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, సీనియర్ నాయకులు అజిజ్, సుంకు శ్రీకాంత్ రెడ్డి, పెద్ది నాగరాజు, పెద్ది శ్రీను, తాడూరి అనిల్ కుమార్, భద్రగామ నరసింహ, మామిడి శ్రీనివాస్, పూర్ణ యాదవ్, మల్లారెడ్డి,శ్రీహరి, సత్యనారాయణ, తాడూరి ఉష రాణి,భవాని, సునీత, సంధ్య, మాదవి, మీనా, రాణి,మరియ తదితరులు  పాల్గొన్నారు.

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నీలం కుమారస్వామి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి యువతీ యువకులు నిరుద్యోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న మన నాయకుడు గౌరవ శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు ఆదేశాల మేరకు ఈనెల 26 తారీఖున జరగబోయే మేఘా జాబ్ మేళా కు గోపాలపురం మూర్తి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్, పంచాయతి కార్యదర్శి రమాదేవి ఎ ఎస్ ఐ సమ్మిరెడ్డి అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, జ్యోతి, నీలవర్ణ ఆశ వర్కర్స్ మహిళా సమైక్య CA కోడూరు ఓంకార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవిందుల భద్రయ్య హెడ్ కానిస్టేబుల్ యాకయ్య పిసి నాగరాజ్ యూత్ నాయకులు పనస రాకేష్, సునీల్ కుంచాల, కత్తి మహేష్ శ్రీకాంత్ మూల నాగరాజ్, గ్రామంలోని యువతీ యువకులు మెగా జాబ్ మేళా లో అధికసంఖ్యలో పాల్గొని 70 మంది యువతి యువకులు, పేర్లు నమోదు చేసుకున్నారు.

ఉపాధి హామీ పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్.

ఉపాధి హామీ పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు పరిశీలన,కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్, అంగన్వాడి సెంటర్ తనిఖీ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని పెద్ద ఎత్తున లేబర్ ను మొబలైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన అడవిలోకి వెళ్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు చేస్తున్న ట్రాం చ్ పనులను పరిశీలించారు.

Collector

అలాగే కూలీల సమస్యలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కూలీల కుటుంబ వివరాలు, ఉపాధి హామీ కూలీ డబ్బులు,పని వేళలు,తదితరాల విషయాలను అడుగుతూ, వారితో హాయిగా ముచ్చటిస్తూ, స్ఫూర్తిని కలిగించారు.ఈ సందర్భంగా ఎంత మంది ఇక్కడ ఈ కూలీ పనులు చేస్తున్నారు? వారి పని వేళలు ఎప్పటివరకు? రోజుకు ఎంత మేర కొలతతో పనులు చేస్తున్నారు? వంటి వివరాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని ఉపాధి హామీ పథకం పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు లేబర్ ను మొబలైజ్ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.ఈ మూడు నెలలు అత్యంత కీలకమని చెప్పారు.ఈ మేరకు అధికారులు స్పందిస్తూ పర్వతాపూర్ గ్రామంలో 160 మంది ఈ కూలీ పనులు చేస్తున్నారన్నారు.ఎండాకాలం దృష్ట్యా వారి పని వేళలు ఉదయం 7 నుంచి 11 వరకు అని అన్నారు. 5 మీటర్స్ పొడవు 1 మీటర్ వెడల్పు , 0.5 మీటర్ లోతు పనులు చేస్తున్నారని వారు కలెక్టర్ కు వివరించారు.అలాగే ఉపాధి హామీ పనులకు సంబంధించిన కొలతల పుస్తకాన్ని, జాబ్ కార్డులను, మాస్టర్ రోల్ ను అన్ని రిజిస్టర్ లను స్పష్టంగా నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని, పనుల పురోగతికి సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు.కొలతల్లో వ్యత్యాసం రావొద్దని, సామాజిక తనిఖీల్లో ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు.స్వయంగ అక్కడ తీసిన ట్రెంచ్ ల కొలతలు టేప్ తో కొలచి సంతృప్తి వ్యక్తం చేశారు.వేజ్ పెరిగితే మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని అన్నారు.

Collector

 

వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని అదే విధంగా తాగునీరు,నీడ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి ప్రభావం ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.శరీరం నిర్జలీకరణ డీ హైడ్రేషన్ కు గురికాకుండా సరిపడా స్వచ్ఛమైన తాగునీరు, ఉత్తేజితులయ్యేందుకు గాను ఓఆర్ఎస్ నీటిని క్రమం తప్పకుండా తాగాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూలీలకు సూచించారు.కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు, అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు, అంగన్వాడి సెంటర్లో చిన్నారుల మేధస్సును పాటలు పద్యల రూపంలో పరీక్షించి అంగన్వాడీ పనితీరు పట్ల ఆదర్శంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాజుద్దీన్, పంచాయతీ సెక్రెటరీ వరలక్ష్మి, ఏపీవో శంకరయ్య, టెక్ని టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి.

‘అందరిపై.. ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

అందరిపైనా ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా.. మహబూబ్ నగర్ పట్టణంలోని అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆకాంక్షించారు. ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు గుండా మనోహర్, శివశంకర్, రామాంజనేయులు , హరిబాబు , రామకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అందరిపై ఉంది కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర.

రాజ్యాంగమును కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో నగరంపల్లి కొండంపల్లి కొండాపూర్ రంగారావుపల్లి బిక్కోనిపల్లి బంగ్లాపల్లి సీతారాంపురం అప్పయ్య పల్లి, భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు,జై భీం,జై సంవిధాను లో బాగంగా ఈ రోజు గణపురం మండలం గ్రామంల లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,రాజ్యాంగ పిటికలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్,కార్యక్రమ మండల ఇన్చార్జి పంతకాని సమ్మయ్య మాజీ ఎంపిటిసి కాటారం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమారస్వామి, మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుందని అన్నారు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ,అణగారిన వర్గాల హక్కులు కాలరాస్తున బీజేపీ వైఖరి నశించాలని నినదించారుభారత రాజ్యాంగమును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆద్వర్యంలో నెల రోజులు మండల వ్యాప్తంగా జరిగే యాత్రలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు,విద్యావంతులు పాల్గొని విజయంతం చేయాలని కోరారు. నగరంపల్లి మాజీ సర్పంచ్ ఆలూరి కుమారస్వామి, పరశురాంపల్లి మాజీ సర్పంచ్ తాళ్ల పెళ్లి భాస్కర్ రావు, మాధవ్ సత్యనారాయణ రెడ్డి, గొర్రె బాలరాజు, గొర్రె రవి, వెల్గం రాజయ్య, మల్లికార్జున, ఆవుల రవి, తదితరులు పాల్గొన్నారు.కొండంపల్లి దాసర రవి,చిట్యాల నాగరాజు, దాసరి లక్ష్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజబాబు , మాజీ సర్పంచ్ మామిడి రవి, మామిడి సర్వేశం, మాజీ ఎంపిటిసి పెద్దల్ల సారయ్య, మామిడి చిరంజీవి, రవి తదితరులు పాల్గొన్నారు. రంగారావు పల్లి మాజీ ఎంపీపీ రామేశ్వరరావు, కందుకూరు బ్రహ్మచారి, రవి, ఎర్రబెల్లి మలల్ రావు,భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. బంగ్లాపల్లి సీనియర్ నాయకులు ఉపేందర్ రావ్, గొట్టేముక్కల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. సీతారాంపురం గ్రామ శాఖ అధ్యక్షులు పీట్ల రంజిత్, మాజీ ఎంపిటిసి బొల్లం జంపయ్య, మాజీ ఎంపిటిసి పెద్దోళ్ల సారయ్య, ఉపేందర్ రావ్, గొట్టేముక్కుల సుధాకర్ రావు, దూడ దేవేందర్ రెడ్డి, గంధం రాజు, మంద రగు, మేకల పున్నo, తదితరులు పాల్గొన్నారు. అప్పయ్య పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు కొడాలరి రవి, దోమల రాజయ్య, దోమల సమ్మయ్య, ఎలుక పెళ్లి రమేష్, దోబ్బాల సాంబయ్య, మాజీ సర్పంచ్ దోమల రవీందర్, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version