మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి.

అభివృద్ధి – సంక్షేమం బిజెపితోనే సాధ్యం నినాదంతో బస్తి చలో కార్యక్రమం

మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

 

నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో బస్తి చలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు ఎం. సత్యనారాయణ గారి నివాసంలో ఆయనకు ఘన సన్మానం చేయడం జరిగింది.
అనంతరం ఆర్‌ఎల్ నగర్ వార్డ్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడంతో పాటు, వారి కోసం అల్పాహారం ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ

BJP Former

 

46 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కార్యకర్తల త్యాగం సేవా భావంతో బీజేపీ ప్రజలలో విశ్వాసాన్ని సంపాదించింది. పార్టీ పెద్దలను సన్మానించడం దైవ కార్యంతో సమానం. ఎం. సత్యనారాయణ గారు జాతీయ స్థాయిలో పార్టీ కోసం చేసిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు.
అలాగే, పారిశుద్ధ్య కార్మికులు కరోనా మహమ్మారి సమయంలో చేసిన సేవలు అపూర్వమైనవని కొనియాడారు.
సమాజంలో పరిశుద్ధ కార్మికులను చిన్నచూపు చూడకూడదు. వారు లేకపోతే మన దైనందిన జీవితం సక్రమంగా సాగదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు మునిగంటి సురేష్, బొమ్మిడి బుచ్చిరెడ్డి, జిల్లా బీజేపీ కార్యదర్శి గణపురం శ్యామ్ సుందర్ శర్మ, మాజీ ఎంపిటిసి తరిగొప్పుల బలరాం, మాజీ కౌన్సిలర్లు బుద్ధవరం లక్ష్మీ, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, బుద్ధవరం వేణుగోపాల్, మామిడి జంగారెడ్డి, కౌకుట్ల రాహుల్ రెడ్డి, వొల్లాల శ్రీనివాస్ గౌడ్, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, కర్ర వెంకటేశ్వరరావు, భువనేశ్వరి, మాధవరావు, ఎలసాని నాగరాజు యాదవ్, ఏనుగు మహేందర్ రెడ్డి, మధు గౌడ్, చారి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version