ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య.

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండలం, పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల రమేష్ సునీత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యో గ పరీక్షలు రాస్తున్న తమ చిన్న కూతురు రావుల ప్రత్యూష (24)అతి తక్కువ మార్కుల తేడాతో పలు ప్రభుత్వ ఉద్యో గాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

హుగ్గేల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా.

హుగ్గేల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా దత్తు రెడ్డి నియామకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాలు మేరకు హుగ్గెల్లి గ్రామం నూతన గ్రామ బిఆర్ఎస్ పార్టీ కమిటీ ని నియమించిన జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఈ సంధర్బంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పార్టీ అధ్యక్షులు దత్తురెడ్డి,వైస్ ప్రెసిడెంట్ గా ఎండీ అహ్మద్ ,జనరల్ సెక్రటరీ గా బొడ తుకారాం లకు మరియు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, గ్రామ పార్టీ నాయకులు నూతనంగా ఎన్నుకోబడిన నాయకులకు సన్మానించి ,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ మోసపూరిత 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దేనెక్కిందని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ తరపున తమ పోరాటం తప్పదన్నారు సమీష్టగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు
ఈ కార్యక్రమంలో పీజీ శంకర్, కిష్టా రెడ్డి,రాథోడ్ భీమ్ రావు నాయక్,మధు, అహ్మద్,కసిం,షకీల్,అడ్డు,బాబ్బు తదితరులు పాల్గొన్నారు.

మొహరం సందర్భంగా పీర్లను దర్శించుకున్న.

మొహరం సందర్భంగా పీర్లను దర్శించుకున్న బీ. ఆర్ ఎస్ నేతలు

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో పీర్ల గుట్ట లో పీర్ల పండుగ మొహారం సందర్భంగా బి ఆర్ ఎస్ నేతలు పాల్గొన్నారు గట్టు మీద ఇమామ్ హుస్సేన్ గట్టు మీనయ్యను బీ ఆర్ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ 15 అవార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఆర్ ఎం పీ డాక్టర్ డానియల్ సాయికుమార్ మాజీ వక్సు బోర్డు సభ్యులు షేక్ జహంగీర్ తోట శ్రీను త దితరులు పాల్గొన్నారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు

టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం..

టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టివి9 రిపోర్టర్‌‌ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు… ప్రసాద్‌‌ మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని, చిన్న వయస్సులో మరణించడం బాధాకరమన్నారు.వారు మీడియా రంగంలో పనిచేస్తూ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ప్రజా సమస్యలను మీడియాతో పరిష్కరిస్తూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,
ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే కెటీఆర్ కూడా టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని సంతాపం తెలియజేశారు. మరియు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ మిత్రులు కూడా సంతాపం తెలియజేయడం జరిగినది.

5వ మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ జిల్లా 5వ మహాసభలను జయప్రదం చేయండి

పలిమల మండలంలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలి

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్ పలిమల మండల కేంద్రంలో సిపిఐ నాయకులతో కలిసి వాల్ పోస్టర్లను(గోడ పత్రికలు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతు 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మహాసభలను ఈ నెల జులై 13 14వ తేదీన రేగొండ ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ లో లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ జిల్లా మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిలు గా హాజరవుతున్నారని తెలిపారు. మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికై చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు.ముఖ్యంగా పలిమల మండలం అభివృద్ధి ఆమడ దూరం లో ఉంది అన్నారు. పలిమల మండల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. పలిమల మండలంలోని పోడు చేసుకున్న రైతులకు పట్టాలి ఇవ్వాలని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిపి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆందోళన పోరాటాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సిపిఐ 5వ జిల్లా మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్, మండల నాయకులు మట్టి సర్వేష్, మట్టి కృష్ణ, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్ అమీలే శ్రీనాధ్, శ్రీకాంత్, అంజి బాబు, మారవేణి వెంకట్, పోడెం సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన మెరుగు లక్ష్మణ్.

బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన మెరుగు లక్ష్మణ్

మహాదేవపూర్ జూన్5( నేటిధాత్రి )

మంథని నియోజకవర్గంలో అణగారిన వర్గాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడంలేదని మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దళిత నాయకుడు మెరుగు లక్ష్మణ్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది
ముఖ్యంగా పార్టీకి రాజీనామా చేయడంలో పార్టీలో జరుగుతున్న అనగారిన వర్గాల కార్యకర్తల విషయంపై మంథని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మండల నాయకులు
పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కార్యకర్తల పట్ల వివక్ష చూపుతున్నారు కావున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది
ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో డబ్బులు ఉన్న వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
కాబట్టి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.!

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా

లక్ష తులసి పుష్పార్చన

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పుష్పార్చన ప్రత్యేక పూజలు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథంచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు వనపర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుబేర్ జన్మదిన వేడుకలు..

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుబేర్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు మహమ్మద్ జుబేర్ (హౌసింగ్ బోర్డ్) గారి జన్మదిన సందర్భంగా సందర్భంగా శనివారము ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,విజిలెన్స్ మెంబర్ రామకృష్ బంటు,హౌసింగ్ బోర్డు వార్డ్ అధ్యక్షులు వెంకట్ ,నాయకులు నర్సింహ రెడ్డి,యువ నాయకులు ముర్తుజా,జాకీర్,సలీం,అవేజ్,విజయ్ రాథోడ్ ,ఫహీం,తదితరులు.

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…

నేటి ధాత్రి -గార్ల :-

వాణిజ్య పంటలో అధిక లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ పంటలను రైతులు సాగు చేసి అధిక లాభాలు పొందాలని గార్ల వ్యవసాయ అధికారి కావటి రామారావు తెలిపారు.శనివారం మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో డోర్నకల్ ఉద్వాన వన అధికారి శాంతి ప్రియ,ఏఈఓ రాజ్యలక్ష్మి లతో కలిసి ఆయిల్ ఫామ్ పంట క్షేత్ర సందర్శన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితిలు ఉన్నాయన్నారు.ఆయిల్ ఫామ్ పంట దిగుబడి వచ్చేంతవరకు అంతర పంటల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.వరి,పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి,తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయని, నాలుగవ సంవత్సరం నుంచి రైతుకు పంట చేతికి వస్తుందని అన్నారు.రైతులు ప్రతి ఏటా ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానం అవలంబించుకుంటూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను,నికర ఆదాయం లభించే పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర ఆదాయం పొందడమే కాకుండా భూసారం కాపాడుకోవచ్చు అన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ ఫామ్ కు మంచి డిమాండ్ తో పాటు రవాణా, మార్కెట్,ప్రాసెసింగ్ సౌకర్యంతో పాటు గిట్టుబాటు ధర ఉందని తెలిపారు.ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటలను నాలుగు సంవత్సరాల వరకు వేరుశనగ, మొక్కజొన్న,కూరగాయలు మరియు నాలుగు సంవత్సరాల తర్వాత పైనాపిల్,కోకో వంటి పంటలను సాగు చేసుకుని అధిక ఆదాయం పొందవచ్చు అని సూచించారు.ఆయిల్ ఫామ్ పంట సాగుకు చీడపీడల బెడద ఉండదని, కోతుల సమస్య రాదని,అకాల వర్షాలు,వడగండ్ల వాన ఇబ్బందులు ఉండవని అన్నారు.ఎకరా మొక్కలకు 11600, అంతర పంటలకు ప్రతి సంవత్సరంకు 4200 చొప్పున నాలుగు సంవత్సరాలకు 16,800, బిందు సేద్యానికి 22518 మొత్తము కలిపి 50 వేల 918 రూపాయలు రాయితీ పొందవచ్చు అని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

పార్కింగ్ గా మారిన బస్ స్టాప్ లు..

పార్కింగ్ గా మారిన బస్ స్టాప్ లు

నీరుకుళ్ళ బస్టాప్ లలో దర్జాగా ద్విచక్ర వాహనాలు పార్కింగ్

నిలవడానికి నీడ లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు

నేటిధాత్రి, ఆత్మకూరు.

హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం, నీరుకుళ్ళ క్రాస్ రోడ్డు వద్ద.., వరంగల్ నుండి ములుగు కు వెళ్లే ప్రధాన రహదారి నీరుకుళ్ళ క్రాస్ రోడ్డు వద్ద రహదారికి ఇరువైపుల ఉన్న బస్ స్టాపుల్లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తున్న తీరు. ప్రయాణికుల కోసం ప్రజలు నిల్చోవడానికి ఏర్పాటు చేసిన బస్ స్టాపుల్లో దర్జాగా ద్వి చక్ర వాహనాలు పార్కింగ్ చేసి వెళ్తున్న వాహనాదాలు. దీంతో ప్రజలు రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అసలే వర్షాకాలం ప్రయాణం చేస్తున్న ప్రజలు నీడ కోసం నిలబడే బస్ షెల్టర్ లలో వాహనాలు పార్కింగ్ చేయడం సమంజసం కాదు అని ప్రయాణికుల ఆవేదన. స్థానిక పోలీసు అధికారులు స్పందించి బస్ స్టాప్ లో ఉన్న ద్విచక్ర వాహనాలు తొలగించాల్సిందిగా ప్రయాణికుల విజ్ఞప్తి.

Two-wheeler parking

సదరు బస్ స్టాప్ దగ్గర వాహనాలు పార్కింగ్ చేయొద్దు అని బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సిబిల్ స్కోర్ లేదని లోన్ రిజెక్ట్ అయ్యిందా!

సిబిల్ స్కోర్ లేదని లోన్ రిజెక్ట్ అయ్యిందా? ఈ టిప్స్‌తో లోన్ పొందడం చాలా ఈజీ

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. అయితే చాలా మంది లోన్ల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. కానీ బ్యాంకులు ఆ వ్యక్తికి సంబంధించిన సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాన్ని తిరస్కరిస్తున్నాయి. కాబట్టి సిబిల్ స్కోర్ గురించి రుణం తిరస్కరణకు గురవుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.సిబిల్ స్కోరు అంటే మీ క్రెడిట్ హిస్టరీతో పాటు క్రెడిట్ యోగ్యతకు సంబంధించిన రిపోర్ట్ కార్డ్. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణ దరఖాస్తులను ఆమోదించడానికి 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు అనేది క్రెడిట్ దరఖాస్తులను ఆమోదించడానికి పరిగణించే అంశాల్లో ఒకటిగా ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పేర్కొన్న నగరాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఆ నగరాల్లో నివసించే పౌరులకు మాత్రమే అవి క్రెడిట్ ఉత్పత్తులను ఆమోదించవచ్చు. ఉదాహరణకు హెచ్ఎస్‌బీసీ వెబ్‌సైట్ ప్రకారం హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలలో ఒకటి దరఖాస్తుదారు నివసించే నగరం. చెన్నై, గుర్గావ్, ఢిల్లీ, పూణే, నోయిడా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్ లేదా కోల్‌కతా వంటి నగరాల్లో ఉంటేనే రుణాన్ని మంజూరే చేస్తాయి.

అలాగే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ దరఖాస్తుల కోసం ఆదాయ అర్హత ప్రమాణాలను నిర్దేశిస్తాయి. క్రెడిట్ కార్డుల విషయంలో ఒకే బ్యాంకుకు ఆదాయ అర్హత కార్డు నుంచి కార్డుకు మారుతుంది. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ కోసం రూ. 12,000 కంటే ఎక్కువ నికర నెలవారీ ఆదాయం ఉండాల్సి ఉంటుంది. ఇది ఎంట్రీ-లెవల్ క్రెడిట్ కార్డ్. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం రూపొందించారు. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) సంవత్సరానికి రూ. 6 లక్షల కంటే ఎక్కువగా ఉండాలి.

మీరు తరచుగా ఉద్యోగాలు మారుతుంటే మీ కెరీర్‌లో అస్థిరంగా ఉన్నందున బ్యాంక్ దానిని పరిగణిస్తుంది. బ్యాంకులు తమ రుణగ్రహీతలు స్థిరమైన కెరీర్‌ను కలిగి ఉండాలని ఇష్టపడతారు. కెరీర్ స్థిరత్వం నెలవారీ ఆదాయం క్రమం తప్పకుండా రావడానికి హామీ ఇస్తుంది. దీనిని వ్యక్తిగత రుణ ఈఎంఐ ఇతర బాధ్యతలకు చెల్లించడానికి ఉపయోగించవచ్చు.

ఎడ్జ్‌బాస్టన్‌లో కీలక ఇన్నింగ్స్…

ఎడ్జ్‌బాస్టన్‌లో కీలక ఇన్నింగ్స్.. ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డులతో చెడుగుడు ఆడేసిన పానీపూరీ వాలా

India vs England 2nd Test: బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది.

India vs England 2nd Test: టెస్ట్ క్రికెట్ తొలి దశలో ఉన్న యశస్వి జైస్వాల్, రికార్డు సృష్టించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. అది కూడా 21 టెస్ట్ మ్యాచ్‌ల ద్వారా ఈ రికార్డులో చేరడం గమనార్హం. ఈ మ్యాచ్‌ల ద్వారా యశస్వి జైస్వాల్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొట్టడం విశేషం.
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ మొత్తం 115 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన యశస్వి, రెండవ ఇన్నింగ్స్‌లో 28 పరుగులకు ఒక వికెట్ ఇచ్చాడు. దీని ప్రకారం, మొత్తం 115 పరుగులు చేయడం ద్వారా, జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేశాడు.

 

 

దీంతో, యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన భారతీయుడిగా నిలిచాడు. గతంలో, ఈ రికార్డు టెస్ట్ స్పెషలిస్ట్ రాహుల్ ద్రవిడ్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.

 

 

రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా 25 టెస్ట్ మ్యాచ్‌ల్లో 40 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు సాధించారు. దీంతో టీమ్ ఇండియా తరపున అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌ల్లో, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు.ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఈ రికార్డును బద్దలు కొట్టడంలో విజయం సాధించాడు. టీం ఇండియా యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 2000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 21 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే తీసుకున్నాడు. ఈ 21 టెస్ట్ మ్యాచ్‌లలో 40 ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వి జైస్వాల్, భారతదేశం తరపున అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో, అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

 

మీ కిచెన్‎లోనే గోంగూర చికెన్ బిర్యానీ..

మీ కిచెన్‎లోనే గోంగూర చికెన్ బిర్యానీ.. ఎలా తయారుచేసుకోవాలి అంటే?

భారతదేశంలో చాలామంది ఇష్టపడే వాటిలో బిర్యానీ ఒకటి.  బిర్యానీలో చాల రకాలు ఉన్నాయి. వాటిలో గోంగూర చికెన్ బిర్యానీ ఒకటి.  గోంగూరతో పచ్చడి, కూరలు మాత్రమే కాదు. గోంగూర చికెన్ బిర్యానీని కూడా చేయవచ్చు. పుల్ల పుల్లగా నోరూరించే టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ నానా వెజ్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బిర్యానీలలో ఒకటి. ఈ రోజు ఆంధ్రాస్టైల్ లో నోరూరించే గోంగూర చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.కావాల్సిన పదార్ధాలు: బోన్ లెస్ చికెన్ కేజీ, ఉల్లిపాయలు – 2 పెద్దవి నిలువుగా కట్ చేసినవి, అల్లం వెల్లుల్లిపేస్ట్,టొమాటో – ప్యూరీ, గోంగూర- రెండు కట్టలు (సుమారు 100 గ్రాములు), కారం – 2 టీస్పూన్,పసుపుచిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె – తయారీకి సరిపడా, నీరు – ఒక కప్పు, మసాలా పొడి

ఈ బిర్యానీ కోసం ముందుగా గోంగూర ఆకులను ఉడికించి పేస్ట్ గా చేసుకొని పక్కన ఉంచండి. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి.. తగినంత నూనె వేసి వేడి చేయాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వీయించి టొమాటో పేస్ట్ , గోంగూర ఆకులు వేసి తక్కువ మంటలో వేయించాలి.
బోన్ లెస్ చికెన్ పీసెస్ వేసి తక్కువ మంటతో కొంచెం సేపు ఉడికించాలి. తర్వాత కొంచెం కారం, పసుపు వేయండి. తర్వాత కాస్త  నీరు ఆడ్ చేసి పాన్ మీద మూత పెట్టండి. సుమారు 10-15 నిమిషాలు ఉడికించి మూత తెరిచి మసాలా పొడి వేసి బాగా కలపండి. ఉప్పు వేసి గోంగూర చికెన్ మిశ్రమాన్ని పక్కన పెట్టండి.బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్ధాలు: బాస్మతి రైస్ – 750 గ్రాములు, వేయించిన నిలువగా కట్ చేసిన ఉల్లి పాయ ముక్కలు, జీడిపప్పు, కుంకుమపువ్వు – కొంచెం ,రోజ్ వాటర్ ,పచ్చిమిర్చి – 8 నుంచి 10, పుదీనా ఆకులు – 1 టీస్పూన్, కొత్తిమీర, ఉప్పు రుచికి సరిపడా.ముందుగా బాస్మతి రైస్ ను 80 శాతం వరకు ఉడికించి ముందుగా రెడీ చేసుకున్న గోంగూర చికెన్ మిశ్రమన్నీ అందులో వేసుకోవాలి. తర్వాత నెయ్యి, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తమీర , నిలువగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి , జీడిపప్పు ,వేసి, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసుకొని మూత పెట్టండి. చివరిగా తక్కువ మంటపై 20 నిమిషాల పాటు ఉడికించండి. అంతే ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ తినడానికి సిద్ధం.

వర్షాకాలంలో చూడాల్సిన ప్రదేశాలు..

వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. సేఫ్ అండ్ సెక్యూర్ పర్వత ప్రాంతాలు ఇవే..

కొత్త కొత్త ప్రదేశాల్లో పర్యటించడం ఇష్టమా..! అది కూడా వర్షాకాలంలో మన దేశంలోని పర్వత ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే వర్షాకాలంలో కూడా మీరు ఎటువంటి భయం లేకుండా ప్రకృతిని ఆస్వాదించగల కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలకు భయపడితే ఈ ప్రదేశాలకు వెళ్లేందుకు ట్రై చేయండి.

వర్షాకాలంలో ప్రజలు తరచుగా పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి వెనుకాడతారు. ఎందుకంటే ఈ సమయంలో పర్వతాలపై వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య ప్రాంతంలోని కొండ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే సంఘటనలు కనిపిస్తాయి. ఇది ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి మాత్రమే కాదు పర్యాటకుల సెలవులను కూడా పాడు చేస్తుంది.

అటువంటి పరిస్థితిలో.. వర్షాకాలంలో ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి.. ప్రమాదాలను నివారించాలనుకునే వారికి, కొండచరియలు విరిగిపడే ప్రమాదం చాలా తక్కువగా లేదా దాదాపుగా లేని కొన్ని హిల్ స్టేషన్లు ఉన్నాయి. కనుక ఈ రోజు భారతదేశంలోని నాలుగు ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. ఇవి వర్షాకాలంలో కూడా పూర్తిగా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. సందర్శించడానికి కూడా చాలా అందంగా ఉంటాయి.మధ్యప్రదేశ్ లోని పంచమర్హి కొండచరియలు విరిగిపడకుండా ఉండాలనుకుంటే.. పంచమర్హి మంచి గమ్యస్థానం. ఇది మధ్యప్రదేశ్‌లోని సాత్పురా కొండలలో ఉన్న ఒక హిల్ స్టేషన్, ఇది అందంగా, సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ భూమి రాతితో కూడుకున్నది. కనుక ఇక్కడ కొండచరియలు విరిగిపడే సంఘటనలు చాలా తక్కువ. వర్షాకాలంలో ఇక్కడి పచ్చదనం, జలపాతాలు, గుహలు చూడదగినవి. ప్రకృతిని ఆస్వాదించడానికి, తక్కువ జనసమ్మర్థం ఉన్న ప్రదేశం ఇది.

లోనావాలా మంచి ఎంపిక. పూణే, ముంబై మధ్య ఉన్న లోనావాలా వర్షాకాలంలో సందర్శించదగిన ప్రసిద్ధ వారాంతపు విహార ప్రదేశం. ఇది మీకు హిల్ స్టేషన్ పూర్తి వైబ్‌ను అందిస్తుంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా చాలా తక్కువ. వర్షాకాలంలో ఇక్కడి జలపాతాలు, పచ్చదనం, భూషి ఆనకట్ట, రాజ్‌మాచి కోట చూడదగినవి. సురక్షితమైన రోడ్లు, మెరుగైన కనెక్టివిటీ దీనిని కుటుంబంతో సందర్శించడానికి సరైన ప్రదేశంగా చేస్తాయి.

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త…

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర!

ముఖ్యంగా బంగారం ధరలు దిగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి బంగారం ధర తగ్గి రావడమే ఒక కారణం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం, పెట్టుబడిదారుల ఆసక్తి స్టాక్ మార్కెట్స్ పై ఉండడంతో బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశం. నిన్నటితో పోల్చి చూస్తే గోల్డ్‌ నేడు మరింతగా తగ్గినట్లు గమనించవచ్చు. కొద్ది రోజుల వరకు బంగారం ధరలు లక్ష రూపాయలు వరకు దాటగా, ప్రస్తుతం స్వల్పంగా దిగివస్తున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బంగారం ధరలు దిగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి బంగారం ధర తగ్గి రావడమే ఒక కారణం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం, పెట్టుబడిదారుల ఆసక్తి స్టాక్ మార్కెట్స్ పై ఉండడంతో బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,870, 22 క్యారెట్ల ధర రూ.90,640 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,09,900 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490 ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 గా ఉంది.

– చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,720 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,19,900 లుగా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 లుగా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,490 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,900 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు..

ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు..

జహీరాబాద్ నేటి ధాత్రి;

బిజెపి జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్ జగన్ జన్మదిన వేడుకలు నిన్న రాత్రి జహీరాబాద్ లో డాల్ఫిన్ బర్త్డే సెలబ్రేషన్స్ పాయింట్ లో శాలువా పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బిజెపి సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

బరువు తగ్గడానికి కూడా కందను ఉపయోగించవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం, ఈ కంద స్థూలకాయ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ సమ్మేళనం కారణంగా ఇది స్థూలకాయ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఊబకాయం, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.

కూరగాయల్లో ప్రత్యేకమైనది కంద. దీనినే ఎలిఫెంట్‌ ఫుట్‌, గోల్డెన్‌ సీల్‌ అని కూడా పిలుస్తారు. కొంతమందికి ఈ కంద ఇష్టమైన కూరగాయ. మరికొందరు దాని వాసనను కూడా తట్టుకోలేరు. ఆరోగ్య పరంగా చూస్తే.. దీనిని సహజ ఔషధ మూలికగా పరిగణిస్తారు. ఈ కంద ఏనుగు పాదంలా కనిపిస్తుంది. అందుకే దీనిని ఏనుగు పాదం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో ప్రతిరోజూ కంద తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ సమాచారం ఉంది .

1. మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

కంద, ఏనుగు పాదం అని పిలిచే ఈ కూరగాయ (గోల్డెన్ సీల్) మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో సహజంగా లభించే అల్లంటోయిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. అల్లంటోయిన్ డయాబెటిక్ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉందని శాస్త్రీయ పరిశోధనలో తేలింది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడం ద్వారా అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా డయాబెటిస్‌ను నివారించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

2. క్యాన్సర్‌ను నివారిస్తుంది:

క్యాన్సర్‌ను నివారించడానికి కంద ఉపయోగించవచ్చు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఒక అధ్యయనం ప్రకారం, గోల్డెన్‌సీల్‌లోని అల్లంటోయిన్ అనే సమ్మేళనం క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా క్యాన్సర్‌ను నివారించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

3. బరువు తగ్గడంలో సహాయపడుతుంది:

బరువు తగ్గడానికి కూడా కందను ఉపయోగించవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం, ఈ కంద స్థూలకాయ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ సమ్మేళనం కారణంగా ఇది స్థూలకాయ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఊబకాయం, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.

4. మెనోపాజ్ లక్షణాల నుండి ఉపశమనం:

ఆకస్మిక వేడి ఆవిర్లు, నిద్రలేమి, వింత ప్రవర్తన మహిళల్లో రుతువిరతి లక్షణాలు కావచ్చు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, గోల్డెన్ సీల్ సారం ఉపయోగించడం వల్ల రుతుక్రమం ఆగిన లక్షణాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.

5. రక్తహీనతను తగ్గిస్తుంది:

శరీరంలో ఇనుము, ఫోలేట్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. గోల్డెన్‌సీల్‌లో ఇనుము, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.

20 ఏళ్లుగా ఒకే కుక్కర్లో అన్నం వండిన భార్య..

20 ఏళ్లుగా ఒకే కుక్కర్లో అన్నం వండిన భార్య.. లెడ్ పాయిజనింగ్తో ఆస్పత్రి పాలైన భర్త

జహీరాబాద్ నేటి ధాత్రి:

Lead Poisoning | వంట( Cook ) చేసేస్తుంటారు. ఎందుకంటే వంట పని అయిపోతే రిలాక్స్ గా ఉండొచ్చని. ఇక త్వరగా వంట అయ్యేందుకు చాలా మంది మహిళలు ప్రెజర్ కుక్కర్ లను వినియోగిస్తుంటారు. అన్నం వండే సమయంలో ఒక రెండు విజిల్స్ పెడితే.. ఐదు నిమిషాల్లో అన్నం రెడీ. ఇక కూరల విషయంలో ఓ ఐదారు విజిల్స్ పెడితే.. 10 నిమిషాల్లో కూర రెడీ. ఇలా ఓ అర గంటలో నాలుగైదు రకాల వంటలు తయారు చేస్తారు.కానీ ఈ ప్రెజర్ కుక్కర్లో వంటలు చేయడం ఏ మాత్రం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకే ప్రెజర్ కుక్కర్ ను ఏండ్ల తరబడి వినియోగించొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఓ మహిళ 20 ఏండ్లుగా ఒకే ప్రెజర్ కుక్కర్లో అన్నం వండుతుంది. ఆమె భర్త ఆ కుక్కర్లో వండిన అన్నం, ఇతర పదార్థాలను తిని లేట్ పాయి జనింగ్ గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.ముంబైకి చెందిన ఓ 50 ఏండ్ల వ్యక్తి.. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్ గబాలే.. బాధిత వ్యక్తిని పరిశీలించి షాక్ అయ్యాడు. అతని శరీరమంతా లెడ్ పాయిజనింగ్ అయిందని వైద్య పరీక్షల్లో తేలింది. అతను మెమోరీ కోల్పోవడం,కాళ్లల్లో తీవ్రమైన నొప్పి, కడుపు నొప్పి రావడం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇదంతా లెడ్ కెమికల్ టాక్సిసిటీ వల్ల జరుగుతుందని డాక్టర్ తెలిపారు.బాధిత రోగిని పరిశీలించి, వైద్య పరీక్షలు చేసినప్పుడు అన్ని రిపోర్ట్స్ సాధారణంగా ఉన్నాయి. కానీ హెవీ మెటల్ స్క్రీనింగ్లో అతను లెడ్ పాయిజనింగ్కు గురైనట్లు నిర్ధారణ అయింది. లెడ్ స్థాయిలు డెసిలీటర్కు 22 మైక్రోగ్రాముల చొప్పున అతని శరీరంలో ఉన్నాయి. ఇది దీర్ఘకాలిక లెడ్ పాయిజనింగ్కు దారి తీసిందని డాక్టర్ గబాలే పేర్కొన్నారు. లెడ్ పాయిజనింగ్ వల్ల శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. బ్రెయిన్, కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

మరి లెడ్ పాయిజనింగ్కు ఎలా గురయ్యాడంటే..?

రోగితో పాటు అతని భార్యను విచారించినప్పుడు లెడ్ పాయిజనింగ్కు గల కారణాలు బయటపడ్డాయని డాక్టర్ తెలిపారు. గత 20 ఏండ్ల నుంచి రోగి భార్య ప్రెజర్ కుక్కర్లోనే వంట చేస్తుందని తేలింది. పాత, పాడైన అల్యూమినియం కుక్కర్లలో సీసం ( Lead), అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోతాయని, తద్వారా లెడ్ పాయిజనింగ్కు గురవుతారని నిర్ధారించారు. దీంతో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి, మెదడు పని నెమ్మదిస్తుందన్నారు. రోగికి కీలేషన్ థెరపీ నిర్వహించామని, ప్రస్తుతం కోలుకుంటున్నాయని డాక్టర్ గబాలే పేర్కొన్నారు.

వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు.

వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ అసెంబ్లీ న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమములో జరుగుతున్నా వారహిదేవి నవరాత్రి మహోత్సవులో శుక్రవారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశ్రమ పిఠాధిపతి శ్రీశ్రీశ్రీ దేవగిరి మహారాజ్ ఆశీస్సులు తీసుకోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version