ఎడ్జ్‌బాస్టన్‌లో కీలక ఇన్నింగ్స్…

ఎడ్జ్‌బాస్టన్‌లో కీలక ఇన్నింగ్స్.. ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డులతో చెడుగుడు ఆడేసిన పానీపూరీ వాలా

India vs England 2nd Test: బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది.

India vs England 2nd Test: టెస్ట్ క్రికెట్ తొలి దశలో ఉన్న యశస్వి జైస్వాల్, రికార్డు సృష్టించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. అది కూడా 21 టెస్ట్ మ్యాచ్‌ల ద్వారా ఈ రికార్డులో చేరడం గమనార్హం. ఈ మ్యాచ్‌ల ద్వారా యశస్వి జైస్వాల్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొట్టడం విశేషం.
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ మొత్తం 115 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన యశస్వి, రెండవ ఇన్నింగ్స్‌లో 28 పరుగులకు ఒక వికెట్ ఇచ్చాడు. దీని ప్రకారం, మొత్తం 115 పరుగులు చేయడం ద్వారా, జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేశాడు.

 

 

దీంతో, యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన భారతీయుడిగా నిలిచాడు. గతంలో, ఈ రికార్డు టెస్ట్ స్పెషలిస్ట్ రాహుల్ ద్రవిడ్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.

 

 

రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా 25 టెస్ట్ మ్యాచ్‌ల్లో 40 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు సాధించారు. దీంతో టీమ్ ఇండియా తరపున అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌ల్లో, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు.ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఈ రికార్డును బద్దలు కొట్టడంలో విజయం సాధించాడు. టీం ఇండియా యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 2000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 21 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే తీసుకున్నాడు. ఈ 21 టెస్ట్ మ్యాచ్‌లలో 40 ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వి జైస్వాల్, భారతదేశం తరపున అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో, అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

 

 సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్ నోరెత్తకుండా చేశాడు…

 సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్ నోరెత్తకుండా చేశాడు…

 

యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన విలువ ఏంటో మరోమారు చూపించాడు. సంచలన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. వాళ్లు నోరెత్తకుండా చేశాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చెలరేగిపోయాడు. ఇండియా ఏ-ఇండియా మధ్య జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. 76 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 15 బౌండరీలు, 2 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 72 పరుగులు చేశాడు సర్ఫరాజ్. సెంచరీ తర్వాత కూడా అతడు ఔట్ కాలేదు. ఇతర బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ నాక్‌తో విమర్శకులతో పాటు సెలెక్టర్లకు సర్ఫరాజ్ ఇచ్చిపడేశాడని నెటిజన్స్ అంటున్నారు.

 

నోళ్లు మూయించాడు..

ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన టెస్టులో 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్ ఖాన్. ఇప్పుడు టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. దీంతో విమర్శకుల నోళ్లు మూయించాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 10 కిలోల బరువు తగ్గడమే గాక బ్యాట్‌తోనూ విధ్వంసం సృష్టిస్తున్నాడు.. ఇలాంటోడ్ని ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేయకుండా తప్పు చేశారని అంటున్నారు. దీనిపై సెలెక్టర్లు పునరాలోచించుకోవాలని చెబుతున్నారు.

అగార్కర్ ముందే..

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. సర్ఫరాజ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా హాజరయ్యాడు. అగార్కర్ ముందే బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయాడు సర్ఫరాజ్. దీంతో అతడ్ని భారత జట్టులోకి తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌కు మీడియా, అభిమానులను అనుమతించలేదు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version